రైతు ఉత్పత్తి సంఘం
FARMER PRODUCER ORGANIZATION (FPO)
- మూడు నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను రుజువు చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కనీసం 500 రైతు ఉత్పత్తి సంఘాలను (FPOs) 2021 మార్చ్ నెలాఖరుకల్లా ఏర్పాటు చేయాలని 'కేంద్ర వ్యవసాయ శాఖ' నిర్ణయించింది.
- 2024 ప్రథమార్ధం ముగిసేనాటికి దేశవ్యాప్తంగా 10,000 'ఎఫ్ పీ ఓ' (FPOs) లను దశలవారీగా ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
- ఈ పథకంలో భాగంగా ప్రతి సంఘానికి మూడేళ్లలో రూ. 18 లక్షలు ఇస్తారు.
- సంఘంలో సభ్యుడైన ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 చొప్పున అందజేస్తుంది.
- ఒక 'ఎఫ్ పీ ఓ' (FPO) కు గరిష్ఠంగా రూ. 15 లక్షలు కేటాయిస్తారు.
- ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు పొందడం కోసం ప్రతి 'ఎఫ్ పీ ఓ' (FPO) కు రూ. 2 కోట్ల వరకు రుణ హామీ సదుపాయాన్ని కల్పిస్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి