ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఏప్రిల్ 2021, బుధవారం

JAGANANNA JEEVA KRANTHI IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

జగనన్న జీవ క్రాంతి (JAGANANNA JEEVA KRANTHI)


  • 2020 డిసెంబర్ 10న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "జగనన్న జీవ క్రాంతి" (JAGANANNA JEEVA KRANTHI) పథకాన్ని ప్రారంభించారు.
  • మహిళలకు మెరుగైన జీవనోపాధి తద్వారా సుస్థిర ఆదాయం లక్ష్యంగా .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 1,869 కోట్ల వ్యయంతో 2,49,151 గొర్రెలు / మేకల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం 2020 డిసెంబర్ 10న శ్రీకారం చుట్టింది.
  • ఒక్కొక్క యూనిట్ లో 5-6 నెలల వయస్సు గల 14 గొర్రె పిల్లలు / మేక పిల్లలతో పాటు ఒక యవ్వనపు పొట్టేలు / మేకపోతు ను పంపిణీ చేస్తారు.
  • "జగనన్న జీవ క్రాంతి" (JAGANANNA JEEVA KRANTHI) పథకంలో మహిళలకు గొర్రెలు / మేకల కొనుగోలుతో పాటు, రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చులకు గాను 'వైఎస్సార్ చేయూత' (YSR CHEYUTHA) క్రింద యూనిట్ కు రూ. 75 వేలు ఆర్ధిక సాయం ఉచితంగా అందజేస్తారు.
  • గొర్రెలు / మేకల కొనుగోలులో మహిళలదే తుది నిర్ణయం.
  • "జగనన్న జీవ క్రాంతి" (JAGANANNA JEEVA KRANTHI) పథకం కింద గొర్రెలు / మేకల పెంపకం కొరకు 'సెర్ప్' (SERP) కు ఆప్షన్ ఇచ్చిన మహిళలకు, స్థానిక జాతులలో నచ్చిన గొర్రెలు / మేకలను, నచ్చిన ప్రాంతం నుండి కొనుగోలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.
  • సరైన గొర్రెలు / మేకలను ఎంపిక చేసుకొని సరైన ధరకు కొనుగోలు చేసే విషయంలో మహిళలకు .. ఇద్దరు పశు వైద్యులు, సెర్ప్, బ్యాంకు ప్రతినిధులు, సంబంధిత లబ్దిదారునితో కూడిన 'మండల స్థాయి కొనుగోలు కమిటీలు' లబ్ధిదారులకు మార్గ నిర్దేశం చేస్తాయి.
  • మహిళలు పెంచిన గొర్రెలు / మేకలను అమ్ముకోడానికి మార్కెటింగ్ సౌకర్యాలు పెంచి తద్వారా మంచి లాభాలు పొందే విధంగా 'అల్లానా ఫుడ్స్' తో ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.   

'జగనన్న జీవ క్రాంతి' పథకం అమలు చేసే కాల వ్యవధి 
మొదటి విడత (మార్చ్ 2021 వరకు) రెండవ విడత (2021 ఏప్రిల్ నుండి 2021 ఆగస్ట్ వరకు)మూడవ విడత (2021 సెప్టెంబర్ నుండి 2021 డిసెంబర్ వరకు)
20,000 యూనిట్లు1,30,000 యూనిట్లు99,151 యూనిట్లు


'వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు' (YSR RBKs) ద్వారా .. :

  1. నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య పరాన్నజీవుల నిర్మూలన, పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను జారీ చేస్తారు. 
  2. పశుసంవర్ధక సహాయకులు, పారా స్టాఫ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల ద్వారా వైద్య సేవలు అందిస్తారు.
  3. సమతుల్య దాణా, ఖనిజ లవణ మిశ్రమం సరఫరా చేస్తారు.
  4. "వైఎస్సార్ సన్న జీవాల నష్ట పరిహార పథకం" ను అమలు చేస్తారు.
  5. 'పశు కిసాన్ క్రెడిట్ కార్డు' లను జారీ చేస్తారు.
  6. గొర్రెలు / మేకల పెంపకందారులకు ఆధునిక పోషణ మరియు యాజమాన్య పద్ధతులపై 'పశు విజ్ఞాన బడి' ద్వారా శిక్షణ ఇస్తారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి