ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, ఏప్రిల్ 2021, శుక్రవారం

జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం (JAGANANNA YSR BADUGU VIKASAM IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం (ఎస్సీ మరియు ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020-23)
(JAGANANNA YSR BADUGU VIKASAM - Special Industrial Policy for SC and ST Entrepreneurs 2020-23)


  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే 'ఎస్సీ, ఎస్టీ' (SC & ST) లకు రూ. కోటి వరకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తెలిపారు. వారికోసం "జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం" (JAGANANNA YSR BADUGU VIKASAM) పేరిట ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని 2020 అక్టోబర్ 26న ప్రకటించారు.
  • ఈ ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020-23 వరకు అమల్లో ఉంటుంది.

మూల ధన రాయితీ (INVESTMENT SUBSIDY) :

  • తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే ఎవరికైనా 'స్థిర మూలధన పెట్టుబడి' (FCI) లో 45% .. గరిష్ఠంగా రూ. కోటి వరకు పెట్టుబడి రాయితీని ప్రభుత్వమే అందిస్తుంది. సేవా, రవాణా రంగాల యూనిట్లకు 45% .. గరిష్ఠంగా రూ. 75 లక్షల వరకు రాయితీ లభిస్తుంది.
  • సూక్ష్మ, చిన్న పరిశ్రమల పెట్టుబడికి తీసుకున్న రుణంపై 3 నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ ఇస్తారు. ఇది అయిదేళ్ల వరకు వర్తిస్తుంది.
  • సూక్ష్మ, చిన్న పరిశ్రమలు చెల్లించే 'ఎస్జీఎస్టీ' (SGST) పై పూర్తిగా, మధ్య తరహా పరిశ్రమలకు 75%, భారీ పరిశ్రమలకు 50% రాయితీ ఇస్తారు.
  • మొదటిసారి పరిశ్రమ ఏర్పాటు చేసే వారికి యంత్రాల కొనుగోలులో 25% 'సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్' (SEED CAPITAL ASSISTANCE) కింద అందజేస్తారు.

ప్రోత్సాహకాలు (INCENTIVES) :

  • తయారీ, రవాణా, కొన్ని ప్రత్యేక సేవా రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. పారిశ్రామిక వాడలు, భవిష్యత్తులో 'ఏపీఐఐసీ' (APIIC) ద్వారా జరిగే భూ కేటాయింపుల్లో 'ఎస్సీ' లకు 16.2%, 'ఎస్టీ' లకు 6% భూములను కేటాయిస్తారు.
  • ఔత్సాహిక 'ఎస్సీ, ఎస్టీ' పారిశ్రామికవేత్తలకు ప్రాజెక్ట్ నివేదికల తయారీలో సహకారం అందించటానికి 'డీఐసీ', 'ఏపీఐఐసీ' జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తారు.
  • పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి పారిశ్రామిక వాడల్లో కేటాయించే భూముల ధరలో 25% చెల్లిస్తే చాలు. మిగిలిన 75% పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తి మొదలైన తర్వాత ఎనిమిదేళ్లలో 8% వడ్డీతో చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు.
  • పారిశ్రామికవాడల్లో ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు భూముల కొనుగోలు ధరలో 50% రాయితీ.. గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు అనుమతి ఇస్తారు. భూముల స్థితి మార్పునకు వెచ్చించే ఖర్చులో 25% రాయితీ .. గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు అనుమతి ఇస్తారు.
  • వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి అయిదేళ్లపాటు విద్యుత్తు చార్జీల్లో యూనిట్ కు రూ. 1.50 వంతున రాయితీ ఇస్తారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి