ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఏప్రిల్ 2021, మంగళవారం

YSR RYTHU BHAROSA KENDRAS (YSR RBKs) IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (YSR RYTHU BHAROSA KENDRAS)


  • 2020 మే 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు" (YSR RYTHU BHAROSA KENDRAS) ను ప్రారంభించారు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,641 'వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు' (YSR RYTHU BHAROSA KENDRAS) ను ఏర్పాటు చేస్తారు.

వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (YSR RYTHU BHAROSA KENDRAS) ద్వారా కలిగే ప్రయోజనాలు :

  1. నకిలీలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వంచే ధృవీకరించబడిన, కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తారు.
  2. భూసార పరీక్షలు, వ్యవసాయానికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు.
  3. గ్రామ స్థాయిలోనే వ్యవసాయ ధరలు, మార్కెట్ల వివరాలు, వాతావరణ సూచనలు తెలియజేస్తారు.
  4. ఈ-పంట నమోదుతో పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్ .. వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  5. రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో, ఈ కేంద్రాల (YSR RBKs) ద్వారా కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తారు.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి