"బోధ్ శిక్ష లోక్" యాప్
(BODH SHIKSHA LOK - APP)
- ఉపాధ్యాయుల్లో ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ స్వీయ ఆన్ లైన్ శిక్షణను నిర్వహిస్తోంది.
- 'కరోనా (కొవిడ్-19)' (COVID-19 (Corona Virus Disease-2019)) వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున ఉపాధ్యాయులకు ఈ శిక్షణ చేపట్టింది.
- వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచి ప్రభుత్వం 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమం లోకి మార్పు చేస్తున్నందున ఉపాధ్యాయుల్లో ఆంగ్ల అభ్యాసన మెలకువలను పెంచేందుకు దీన్ని తీసుకొచ్చారు.
- "బోధ్ శిక్ష లోక్" (BODH SHIKSHA LOK - APP) యాప్ ద్వారా స్వీయ శిక్షణను కొనసాగిస్తోంది.
- 2020 ఏప్రిల్ 24 వరకు ఈ శిక్షణ కొనసాగనుంది.
- ఈ "బోధ్ శిక్ష లోక్" (BODH SHIKSHA LOK - APP) యాప్ లో అభ్యాసన మెటీరియల్, వీడియోలతో పాటు ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి