ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, సెప్టెంబర్ 2020, బుధవారం

YSR JALAKALA

వైఎస్సార్ జలకళ (YSR JALAKALA)


  • రైతులు బోరు వెయ్యడానికి పెట్టే ఖర్చులతో అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా, వారి పొలాలకు జలసిరులను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుక ... "వైఎస్సార్ జలకళ" పథకం.

పథకం ప్రారంభం :

  • 2020 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) పథకాన్ని ప్రారంభించారు.



పథకం - విశేషాలు :

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 4 ఏళ్లలో సుమారు రూ. 2,340 కోట్ల వ్యయంతో చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో దాదాపు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించనున్నారు. బోర్లు తవ్వడమే కాకుండా ... వాటికి కేసింగ్ పైపులు కూడా ఏర్పాటు చేయిస్తారు. వాటికి ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తారు. మోటార్ల బిగింపునకు అదనంగా దాదాపు రూ. 1,600 కోట్లు వ్యయమవుతుంది. 
  2. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ అసెంబ్లీ నియోజకవర్గ అవసరాలకు గాను ఒక బోరు రిగ్గు ఏర్పాటు చేస్తారు. 144 గ్రామీణ, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాల్లో 163 బోరు యంత్రాలు ప్రారంభిస్తారు. 
  3. రైతులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ (www.ysrjalakala.ap.gov.in).ను ఏర్పాటు చేస్తారు.
  4. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోలేనివారు వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాలలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
  5. హైడ్రో జియోలాజికల్ / జియోఫిజికల్ సర్వే ద్వారా శాస్త్రీయ పద్ధతిలో బోరు బావి తవ్వే స్పాట్ ను ఎంపిక చేస్తారు.
  6. సర్వే ఖర్చు, బోరు వేసే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
  7. "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి రానున్నాయి.
  8. అవసరమైన ప్రతి రైతుకు ఉచితంగా ఒక బోరు వేస్తారు. ఒకవేళ ఆ బోరు ఫెయిలైతే మరొక బోరు వేస్తారు..

టోల్ ఫ్రీ :

  • "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) పథకానికి సంబంధించిన సలహాలు, ఫిర్యాదుల కొరకు 1902 టోల్ ఫ్రీ నంబర్ లో సంప్రదించవలెను.   




ATAL BIMIT VYAKTI KALYAN YOJANA (ABVKY)

 అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ATAL BIMIT VYAKTI KALYAN YOJANA)


  • 'కరోనా' కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 'ఈ ఎస్ ఐ' (ESI ⇒ Employees' State Insurance) చందాదారులకు నిరుద్యోగ భృతి కల్పించడానికి కేంద్ర కార్మిక శాఖ 'అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన' (ABVKY) పథకాన్ని ప్రకటించింది.

పథకం కాలపరిమితి :

  • 2020 జూలై 1వ తేదీ నుండి 2021 జూన్ 30వ తేదీ వరకు ఈ పథకం (ABVKY) కొనసాగుతుంది.

పథకం - కొన్ని విశేషతలు :

  • చందాదారులకు జీతంలో 50% సొమ్మును భృతిగా చెల్లిస్తారు. గతంలో వేతనంలో 25% నిరుద్యోగ భృతి కింద లభించగా, ప్రస్తుతం దాన్ని 50 శాతానికి పెంచారు.
  • ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని 'ఈ ఎస్ ఐ' (ESI) కార్యాలయంలో సంప్రదించాలి.
  • స్వయంగా గానీ, ఆన్ లైన్ ద్వారా గానీ, పోస్ట్ లో గానీ నిరుద్యోగ భృతికి సంబంధించిన దరఖాస్తును పంపించవచ్చు.
  • దరఖాస్తుతో 'ఆధార్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, అఫిడవిట్' లను సమర్పించాలి.
  • ఇంతకుముందు సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునే వీలు కలిగించారు.
  • నిరుద్యోగ భృతి తాలూకూ సొమ్ము నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలోనే పడుతుంది. 



GK TEST-72

1. 'కొవిడ్-19' (COVID-19 ⇒ Corona Virus Disease-2019) వ్యాధి కారక వైరస్ ?
(ఎ) సార్స్ - కొవ్ - 1 (SARS CoV - 1)
(బి) సార్స్ - కొవ్ - 2 (SARS CoV - 2)
(సి) హెచ్ 1 ఎన్ 1 (H1N1)
(డి) హంటా వైరస్ (Hanta Virus)

2. 'కరోనా' వైరస్ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2020 సెప్టెంబర్ 23న నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలలో లోక్ సభ స్పీకర్ 'ఓం బిర్లా' ప్రకటన ప్రకారం "లోక్ సభ ఉత్పాదకత" ? 
(ఎ) 167%
(బి) 168%
(సి) 169%
(డి) 170%

3. కేంద్ర మంత్రి పదవిని నిర్వర్తిస్తూ 'కొవిడ్-19' వ్యాధితో మరణించిన "సురేష్ అంగడి" స్వరాష్ట్రం ? 
(ఎ) తమిళనాడు
(బి) కేరళ
(సి) కర్ణాటక
(డి) మహారాష్ట్ర



4. నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ ? 
(ఎ) శ్రీరామ్ వెదిరె
(బి) సుబ్రహ్మణ్యం శ్రీరామ్
(సి) చంద్రశేఖర్ అయ్యర్
(డి) విపిన్ నాయర్

5. మనదేశంలో 'ఫిట్ ఇండియా' (FIT INDIA) ఉద్యమం మొదలైన తేదీ ? 
(ఎ) 2018 సెప్టెంబర్ 24 
(బి) 2017 సెప్టెంబర్ 24 
(సి) 2020 సెప్టెంబర్ 24 
(డి) 2019 సెప్టెంబర్ 24

6. ప్రస్తుత 'కరోనా' నేపథ్యంలో ఆదాయం పడిపోయి ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఆర్ధిక వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం "ఆత్మ నిర్భర్ భారత్" ప్యాకేజీ కింద, ప్రస్తుతం బహిరంగ మార్కెట్ల నుంచి 'జీ ఎస్ డీ పీ' (GSDP) లో 3% వరకు రుణాలు తీసుకోవడానికి ఉన్న పరిమితిని ఎంత శాతానికి పెంచింది ?
(ఎ) 3.5%
(బి) 4.0%
(సి) 4.5% 
(డి) 5%



7. మనదేశంలో 'తొలి మహిళా రఫెల్ ఫైటర్ పైలట్' (First Woman Pilot to fly Rafale) గా చరిత్ర సృష్టించబోతున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ ?
(ఎ) అవని చతుర్వేది
(బి) శివాంగీ సింగ్
(సి) భావనా కాంత్
(డి) గుంజన్ సక్సేనా

8. విమానం లోపల (In-flight) మొబైల్ సేవలను మొదలు పెట్టిన తొలి భారత మొబైల్ సేవల కంపెనీ ? (టాటా గ్రూప్ నకు చెందిన 'నెల్కో' (NELCO) - అమెరికా తర్వాత ఈ సేవలందిస్తున్న భారత టెలికాం కంపెనీ కూడా ఇదే. అంతర్జాతీయంగా 22 మార్గాల్లో మొబైల్ సేవలు అందించడం కోసం ఈ కంపెనీ 'ఏరో మొబైల్' (AeroMobile) - యూకే తో భాగస్వామ్యం కుదుర్చుకుంది)  
(ఎ) రిలయన్స్ జియో
(బి) ఎయిర్ టెల్
(సి) వోడాఫోన్ ఐడియా
(డి) టాటా డొకోమో

9. 2020 సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చిన "జాతీయ వైద్య కమిషన్" (NMC ⇒ National Medical Council) చైర్మన్ ? (మనదేశంలోని వైద్య విద్యను ఇప్పటివరకూ పర్యవేక్షిస్తున్న 'భారత వైద్య మండలి' (MCI ⇒ Medical Council of India) స్థానంలో 'ఎన్ ఎం సీ' (NMC) అమల్లోకి వచ్చింది)
(ఎ) డాక్టర్ అరుణ వి. వాణీకర్
(బి) డాక్టర్ సురేష్ చంద్ర శర్మ
(సి) డాక్టర్ ఎం.కె.రమేష్
(డి) డాక్టర్ అచల్ గులాటి



10. 'కరోనా' వైరస్ వ్యాధి (COVID-19) కి ముక్కు ద్వారా ఇచ్చే సింగిల్ డోస్ టీకా తయారీ కోసం 'భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్' ఏ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది ? (ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, జపాన్, ఐరోపా దేశాలను మినహాయించి మిగిలిన దేశాల్లో ఈ టీకాను విక్రయించే హక్కులు 'భారత్ బయోటెక్' కు ఉంటాయి) 
(ఎ) జార్జియా టెక్ యూనివర్సిటీ
(బి) వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్
(సి) ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ 
(డి) క్వీన్ మేరీ యూనివర్సిటీ             

కీ (GK TEST-72 DATE : 2020 SEPTEMBER 30)
1) బి 2) ఎ 3) సి 4) ఎ 5) డి 6) డి 7) బి 8) ఎ 9) బి 10) బి 

All the best by www.gkbitsintelugu.blogspot.com 

GK TEST-71

1. 'వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం' లో భాగంగా అనుసంధానం చేయనున్న నదులు ? 
(ఎ) గోదావరి - కృష్ణా
(బి) గోదావరి - పెన్నా
(సి) గోదావరి - కావేరి
(డి) వంశధార - నాగావళి

2. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న వ్యవసాయ సంస్కరణల బిల్లులపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా   'భాజపా' (BJP) నేతృత్వంలోని 'జాతీయ ప్రజాస్వామ్య కూటమి' (NDA ⇒ National Democratic Alliance) నుంచి ఇటీవల వైదొలగిన పార్టీ ? 
(ఎ) తెదేపా
(బి) ఆర్ ఎల్ ఎస్ పీ
(సి) శిరోమణి అకాలీదళ్
(డి) శివసేన

3. మనదేశంలో వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే క్రమంలో ... ఆ అస్త్రాలకు లక్ష్యంగా ఉపయోగించే గగనతల వాహనం పేరు ? (ఈ వాహనాన్ని 'హీట్' (HEAT ⇒ High-speed Expendable Aerial Target) అని కూడా పిలుస్తారు. DRDO లోని 'ఏడీఈ' (ADE ⇒ Aeronautical Development Establishment) ఈ వాహనాన్ని రూపొందించింది) 
(ఎ) అభ్యాస్
(బి) టార్గెట్
(సి) గోల్
(డి) రేంజ్



4. 'యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్' (UGC) ప్రకటన ప్రకారం, 2020-21 విద్యాసంవత్సరానికి 'అండర్ గ్రాడ్యుయేట్, పీజీ' తొలి సంవత్సర తరగతులు ఏ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ? (కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం వారానికి ఆరు రోజులు పాఠాలు బోధిస్తారు) 
(ఎ) 2020 అక్టోబర్ 1
(బి) 2020 నవంబర్ 1
(సి) 2020 డిసెంబర్ 1
(డి) 2021 జనవరి 1

5. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే 'డీఎంఈ' (DME ⇒ Diabetic Macular Edema) వ్యాధికి చికిత్సలో వినియోగించే "ఆఫ్లిబెర్సెప్ట్" (AFLIBERCEPT) ఇంజెక్షన్ ను 'ఐలియా' (EYLEA) బ్రాండ్ పేరుతో మనదేశంలో విక్రయించే సంస్థ ? (రక్తంలో చక్కెర శాతం ఎక్కువైనప్పుడు కంటిలో రెటీనా వెనుక ఉండే 'క్యాపిల్లరీస్' (Capillaries) చిట్లిపోయి వాటి నుంచి ద్రవాలు స్రవిస్తాయి. ఆ ద్రవాలు రెటీనా వెనుక ముద్దగా ఉండిపోయి, కంటి చూపునకు అడ్డం పడుతుంది. దీనివల్ల కంటి చూపు తగ్గిపోతుంది. ఇటువంటి వారికి కంట్లో "ఆఫ్లిబెర్సెప్ట్" (AFLIBERCEPT) ఇంజెక్షన్ ఇచ్చినపుడు ద్రవాల లీకేజీని అరికట్టడమే కాకుండా కొత్త రక్తనాళాలు పెరగకుండా ఈ ఇంజెక్షన్ నియంత్రిస్తుంది) 
(ఎ) ర్యాన్ బ్యాక్సీ 
(బి) ల్యుపిన్ 
(సి) బేయర్ 
(డి) క్యాడిలా

6. 'టైమ్' (TIME) మ్యాగజైన్ రూపొందించిన 'ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులు' జాబితాలో స్థానం దక్కించుకున్న భారతీయులలో పిన్న వయస్కుడు ?
(ఎ) డా. రవీంద్ర గుప్తా
(బి) సుందర్ పిచాయ్
(సి) ఆయుష్మాన్ ఖురానా 
(డి) రణ్ వీర్ సింగ్



7. "ఆయుష్మాన్ భారత్" (PMJAY ⇒ Pradhan Mantri Jan Arogya Yojana) పథకం ప్రారంభ తేదీ ?
(ఎ) 2018 సెప్టెంబర్ 25
(బి) 2018 సెప్టెంబర్ 26
(సి) 2018 సెప్టెంబర్ 27
(డి) 2018 సెప్టెంబర్ 28
8. 'కరోనా' నివారణలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ 'రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి' (SDRF ⇒ State Disaster Response Force) నుంచి ఖర్చు చేసే మొత్తం పరిమితిని 35% నుంచి ఎంత శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ?
(ఎ) 40%
(బి) 45%
(సి) 50%
(డి) 55%

9. 'గ్రాండ్ ఓల్డ్ లేడీ' గా కూడా పిలుచుకునే యుద్ధ నౌక "విరాట్" (INS VIRAAT) ను భారత నౌకాదళం నుంచి ఎప్పుడు ఉపసంహరించారు ? (30 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న 'విరాట్' ను విడగొట్టి, తుక్కు కింద విక్రయించనున్నారు)
(ఎ) 2015 మార్చ్
(బి) 2016 మార్చ్
(సి) 2017 మార్చ్
(డి) 2018 మార్చ్



10. మనదేశంలో తొలిసారిగా "సీ ఆర్ ఐ ఎస్ పీ ఆర్" (CRISPR) సాంకేతికత ఆధారిత 'కొవిడ్-19' (COVID-19) పరీక్షా విధానాన్ని ప్రారంభించేందుకు 'డీసీజీఐ' (DCGI ⇒ Drug Controller General of India) నుంచి అనుమతులు పొందిన సంస్థ ? (ఇటువంటి పరీక్షా విధానం ప్రపంచంలోనే మొట్టమొదటిది)
(ఎ) అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్
(బి) జీఎంఆర్ గ్రూప్
(సి) బిర్లా గ్రూప్ 
(డి) టాటా గ్రూప్             

కీ (GK TEST-71 DATE : 2020 SEPTEMBER 30)
1) బి 2) సి 3) ఎ 4) ఎ 5) సి 6) సి 7) ఎ 8) సి 9) సి 10) డి 

All the best by www.gkbitsintelugu.blogspot.com 

28, సెప్టెంబర్ 2020, సోమవారం

GLOBAL DIAGNOSTIC KIT

 గ్లోబల్ డయాగ్నొస్టిక్ కిట్ (GLOBAL DIAGNOSTIC KIT)


  • 'కరోనా' వైరస్ ను గుర్తించే కిట్ ను 'భారతీయ విజ్ఞాన సంస్థ' (IISc ⇒ Indian Institute of Science) కి అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న "ఈక్విన్ బయోటెక్" (EQUINE BIOTECH) అనే అంకుర పరిశ్రమ (START-UP) అభివృద్ధి చేసింది.
  • పరీక్షను తేలికగా, చౌకగా, కచ్చితమైన ఫలితాలను రాబట్టేందుకు రూపొందించిన ఈ కిట్ కు "గ్లోబల్ డయాగ్నొస్టిక్ కిట్" (GLOBAL DIAGNOSTIC KIT) గా పేరు పెట్టారు.
  • పూర్తిగా దేశీయ సాంకేతికతతో రూపొందించిన ఈ ఉపకరణం 'రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్' (RT-PCR ⇒ Reverse Transcriptase - Polymerase Chain Reaction) విధానంలో పనిచేస్తుంది.
  • 'ఐ ఐ ఎస్ సీ' (IISc) లో జీవ రసాయన శాఖ ఆచార్యుడిగా పనిచేస్తున్న 'ఉత్పల్ టటు' ఈక్విన్ బయోటెక్ (EQUINE BIOTECH) ను స్థాపించారు.
  • 'కరోనా' బారినపడిన అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలతో గంటన్నరలోగా ఫలితాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. 



GK TEST-70

1. మనదేశంలో తొలిసారిగా 'రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం' (RRTS) తో ఆధునిక రైలును ఏ మార్గంలో నడపనున్నారు ? (2025 నాటికి ప్రారంభమయ్యే ఈ కారిడార్ దిల్లీలోని 'లోటస్ టెంపుల్' (Lotus Temple)ను ఆధారంగా చేసుకుని నమూనాను రూపొందించారు)
(ఎ) దిల్లీ - పానిపట్
(బి) దిల్లీ - గురుగ్రామ్ - షాజహాన్పూర్
(సి) నిమ్రానా - బేరోర్ అర్బన్ కాంప్లెక్స్
(డి) దిల్లీ - మీరఠ్

2. 2020 సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 'ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (సవరణ) ఆర్డినెన్సు-2020' ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆన్లైన్ లో 'రమ్మీ, పోకర్' వంటి జూద క్రీడలు ఆడిన వారికి విధించే జైలు శిక్ష ? (జూద క్రీడల నిర్వాహకులకు మొదటిసారైతే ఏడాది, రెండోసారి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు)
(ఎ) 3 నెలలు
(బి) 6 నెలలు
(సి) 9 నెలలు
(డి) 12 నెలలు

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన '2020-21 సంవత్సర నూతన మద్యం విధానం' ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మద్యం మాల్స్ పేరు ?
(ఎ) వాక్ ఇన్ షాప్స్ (Walk-in-Shops)
(బి) వాక్ ఇన్ మాల్స్ (Walk-in-Malls)
(సి) వాక్ ఇన్ బజార్స్ (Walk-in-Bazars)
(డి) వాక్ ఇన్ ట్రేడ్స్ (Walk-in-Trades)



4. బిహార్ రాష్ట్రంలో గల మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ?
(ఎ) 241
(బి) 242
(సి) 243
(డి) 244

5. 42 దేశాల్లో సర్వే నిర్వహించిన 'యువ్ గప్' (YouGov) సంస్థ ప్రకటన ప్రకారం 'ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన పురుషులు' జాబితాలో తొలి నాలుగు స్థానాలలో నిలిచిన వ్యక్తులు వరుసగా ... ?
(ఎ) బరాక్ ఒబామా, షి జిన్ పింగ్, బిల్ గేట్స్, నరేంద్ర మోదీ
(బి) బరాక్ ఒబామా, నరేంద్ర మోదీ, బిల్ గేట్స్, షి జిన్ పింగ్
(సి) బరాక్ ఒబామా, బిల్ గేట్స్, నరేంద్ర మోదీ, షి జిన్ పింగ్
(డి) బరాక్ ఒబామా, బిల్ గేట్స్, షి జిన్ పింగ్, నరేంద్ర మోదీ

6. ఏటీపీ ర్యాంకింగ్స్ (ATP Rankings) లో అత్యధిక వారాలపాటు (310 వారాలు) అగ్రస్థానంలో కొనసాగిన క్రీడాకారుడు ?
(ఎ) నొవాక్ జకోవిచ్
(బి) రోజర్ ఫెదరర్
(సి) రఫెల్ నాదల్
(డి) పీట్ సంప్రాస్



7. టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగి అనుకోకుండా లైన్ అంపైర్ ను గాయపర్చడంతో 'యుఎస్ ఓపెన్ - 2020' (US OPEN-2020) నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న టెన్నిస్ క్రీడాకారుడు ?
(ఎ) నొవాక్ జకోవిచ్
(బి) రోజర్ ఫెదరర్
(సి) రఫెల్ నాదల్
(డి) డొమినిక్ థీమ్

8. భారత మహిళా క్రికెట్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ ?
(ఎ) హేమలత కళ
(బి) నీతూ డేవిడ్
(సి) మిథు ముఖర్జీ
(డి) రేణు మార్గరెట్

9. ఈ సంవత్సరం జరిగిన మనదేశ గణతంత్ర దినోత్సవంలో భారత బలగాలను ముందుండి నడిపించి చరిత్ర సృష్టించిన మహిళ ?
(ఎ) శివాంగీ సింగ్
(బి) అవని చతుర్వేది
(సి) భావనా కాంత్
(డి) తానియా షెర్గిల్



10. భారతీయ రైల్వే పశ్చిమ బెంగాల్ లోని 'దుర్గాపూర్' నుంచి బండరాళ్ల రవాణా తొలి సరకును ఏ దేశానికి పంపుచున్నది ?
(ఎ) బంగ్లాదేశ్
(బి) భూటాన్
(సి) నేపాల్
(డి) మయన్మార్             

కీ (GK TEST-70 DATE : 2020 SEPTEMBER 28)
1) డి 2) బి 3) ఎ 4) సి 5) డి 6) బి 7) ఎ 8) బి 9) డి 10) ఎ 

All the best by www.gkbitsintelugu.blogspot.com 

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

GK TEST-69

1. రోమ్ లో జరుగుతున్న 'గోల్డెన్ గాలా అథ్లెటిక్ మీట్' లో పురుషుల పోల్ వాల్ట్ ఔట్ డోర్ పోటీల్లో రెండో ప్రయత్నంలో 6 మీటర్ల 15 సెంటీమీటర్లు ఎగిరి ... 1994లో ఉక్రెయిన్ స్టార్ 'సెర్గీ బుబ్కా' (SERGEY BUBKA) నెలకొల్పిన రికార్డ్ (6.14 మీటర్లు) ను "ఆర్మాండ్ డుప్లాంటిస్" (ARMAND DUPLANTIS) బద్దలు కొట్టాడు. ఆర్మాండ్ డుప్లాంటిస్ ఏ దేశం తరపున ఈ పోటీల్లో పాల్గొన్నాడు ? (ఇండోర్ ప్రపంచ రికార్డ్ (6.18 మీటర్లు) కూడా ఆర్మాండ్ డుప్లాంటిస్ పేరు మీదే ఉంది)
(ఎ) స్వీడన్
(బి) అమెరికా
(సి) రష్యా
(డి) నెదర్లాండ్స్

2. యూఏఈ (UAE ⇒ United Arab Emirates) లో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ లో 'కొవిడ్-19' మహమ్మారిపై యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తదితర యోధులకు ధన్యవాదాలు చెబుతూ "థ్యాంక్యూ కొవిడ్ వారియర్స్" (Thank You COVID Warriors) అనే సందేశంతో కూడిన జెర్సీ లను ధరిస్తున్న ఐపీఎల్ జట్టు ?
(ఎ) ముంబై ఇండియన్స్
(బి) చెన్నై సూపర్ కింగ్స్
(సి) దిల్లీ క్యాపిటల్స్
(డి) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

3. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో జరిగే కాన్పులకు 'ఆరోగ్య ఆసరా' కింద ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి అదనంగా ఎంత పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2020 సెప్టెంబర్ 18న ప్రకటించారు ? (ఈ పెంపు తర్వాత సాధారణ కాన్పులకు రూ. 5,000, సిజేరియన్ కు రూ. 3,000 అందజేస్తారు)
(ఎ) రూ. 1,000
(బి) రూ. 2,000
(సి) రూ. 3,000
(డి) రూ. 4,000



4. మహిళల టెన్నిస్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అమెరికా మాజీ దిగ్గజ క్రీడాకారిణి గౌరవ సూచకంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య 'ఫెడ్ కప్' (FED CUP) పేరును ఆ క్రీడాకారిణి పేరిట మార్చింది. పేరు మార్చిన తర్వాత 'ఫెడ్ కప్' (FED CUP) ను ఏ పేరుతో పిలవనున్నారు ? (ఒక మహిళ పేరుతో జరగబోతున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే)
(ఎ) మార్గరెట్ కోర్ట్ కప్
(బి) బిల్లీ జీన్ కింగ్ కప్
(సి) మార్టీనా నవ్రతిలోవా కప్
(డి) స్టెఫీగ్రాఫ్ కప్

5. 'వైఎస్సార్ చేయూత' (YSR CHEYUTHA) పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయసున్న 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ' మహిళలకు మొదటి విడతగా రూ. 18,750 చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించింది. ఈ మొత్తంతోపాటు రిటైల్ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునే ఒక్కో మహిళకు ఎంత మొత్తాన్ని రుణంగా అందేలా చూస్తారు ? (కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి కనీసం నెలకు రూ. 13,500 ఆదాయం వచ్చేలా ప్రణాళిక తయారు చేసారు)
(ఎ) రూ. 18,750
(బి) రూ. 37,500
(సి) రూ. 56,250
(డి) రూ. 75,000

6. 'కరోనా' వైరస్ వ్యాధి (COVID-19) కి 'రష్యా' ఆవిష్కరించిన "స్పుత్నిక్-వి" (SPUTNIK-V) టీకాను మన దేశానికి తీసుకురానున్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ? ('స్పుత్నిక్-వి' టీకాపై మనదేశంలో క్లినికల్ పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత పంపిణీ నిమిత్తం రష్యా దేశానికి చెందిన 'రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' (RDIF) తో ఈ ఔషధ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది)
(ఎ) సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(బి) డా. రెడ్డీస్ లేబొరేటరీస్
(సి) అరబిందో ఫార్మా లిమిటెడ్
(డి) దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్



7. 'ఐ ఆర్ డీ ఏ ఐ' (IRDAI ⇒ Insurance Regulatory and Development Authority of India) ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) సురేశ్ మాథుర్
(బి) గిరీశ్ కృష్ణమూర్తి
(సి) అజయ్ త్యాగి
(డి) సుభాష్ చంద్ర ఖుంతియా

8. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి 'కొవిడ్-19' బాధితులకు చికిత్సలో వినియోగిస్తున్న మందు ?
(ఎ) ఫావిపిరవిర్
(బి) రెమ్ డెసివిర్
(సి) రెవ్లీమిడ్
(డి) పటాడైన్

9. ఏ రాష్ట్రంలో "మెగా ఈ-లోక్ అదాలత్" ద్వారా ఒక్క రోజులో 1,15,000 కేసులను పరిష్కరించారు ? (2020 సెప్టెంబర్ 19న సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 'మెగా ఈ-లోక్ అదాలత్' ను ప్రారంభించారు. సుదూరంలో ఉన్నవారికీ 'ఈ-లోక్ అదాలత్' ద్వారా న్యాయం చేయగలిగే వీలు కలుగుతుంది)
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) కర్ణాటక
(డి) మహారాష్ట్ర



10. 'గ్రాండ్ ఓల్డ్ లేడీ' (Grand Old Lady) గా కూడా పిలుచుకునే యుద్ధ నౌక "విరాట్" (INS VIRAAT) ను భారత నౌకాదళం నుంచి ఎప్పుడు ఉపసంహరించారు ? (30 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న 'విరాట్' ను విడగొట్టి, తుక్కు కింద విక్రయించనున్నారు)
(ఎ) 2015 మార్చ్
(బి) 2016 మార్చ్
(సి) 2017 మార్చ్
(డి) 2018 మార్చ్       

కీ (GK TEST-69 DATE : 2020 SEPTEMBER 22)
1) ఎ 2) సి 3) బి 4) బి 5) సి 6) బి 7) డి 8) ఎ 9) సి 10) సి
All the best by www.gkbitsintelugu.blogspot.com 

20, సెప్టెంబర్ 2020, ఆదివారం

GK TEST-68

1. 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' (A PROMISED LAND) పుస్తక రచయిత ?
(ఎ) బరాక్ ఒబామా
(బి) మిషెల్ ఒబామా
(సి) డొనాల్డ్ జాన్ ట్రంప్
(డి) మెలానియా ట్రంప్

2. రక్షణ రంగంలో కొత్త పారిశ్రామిక లైసెన్సులు పొందే కంపెనీలకు 'ఆటోమేటిక్' (AUTOMATIC) మార్గంలో ఎంత శాతం వరకూ "విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి" (FDI ⇒ Foreign Direct Investment) ని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ? (ప్రస్తుత 'ఎఫ్ డీ ఐ' (FDI) విధానం ప్రకారం రక్షణ పరిశ్రమల్లో 100 శాతం 'ఎఫ్ డీ ఐ' (FDI) కి అనుమతి ఉంది. అయితే అందులో 'ఆటోమేటిక్' మార్గంలో 49 శాతం వరకే పెట్టుబడి పెట్టేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది)
(ఎ) 49%
(బి) 51%
(సి) 74%
(డి) 100%

3. 'కొవిడ్-19' (COVID-19 ⇒ Corona Virus Disease-2019) నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్ధిక వ్యవస్థ కుంటుపడి ఈ ఏడాది రూ. 2.35 లక్షల కోట్ల మేర 'జీఎస్టీ (GST) ఆదాయ నష్టం ఏర్పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 'జీఎస్టీ' వసూలు కాకపోవడంవల్ల ఏర్పడే నష్టం' మరియు 'విధి లిఖితమైన (ACT OF GOD) 'కరోనా' మహమ్మారి కారణంగా ఏర్పడిన నష్టం' వరుసగా ... ?
(ఎ) రూ. 99 వేల కోట్లు మరియు రూ. 1.36 లక్షల కోట్లు
(బి) రూ. 98 వేల కోట్లు మరియు రూ. 1.37 లక్షల కోట్లు
(సి) రూ. 97 వేల కోట్లు మరియు రూ. 1.38 లక్షల కోట్లు
(డి) రూ. 96 వేల కోట్లు మరియు రూ. 1.39 లక్షల కోట్లు



4. 'కరోనా' మహమ్మారి దెబ్బకు కుదేలై ఉపాధి లేక విలవిల్లాడుతున్న సన్న, చిన్నకారు రైతులు, రైతు కూలీల కుటుంబాలను ఆదుకునేందుకు 'మైక్రోసాఫ్ట్' (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి 'అనుపమ' ఏ జిల్లాకు రూ. 2 కోట్ల సాయాన్ని అందించారు ? (2020 సెప్టెంబర్ 13న 'ఏ ఎఫ్ ఎకాలజీ కేంద్రం'లో "అదనపు జీవనోపాధుల పథకం"ను అనుపమ అందించిన నిధులతో లాంఛనంగా ప్రారంభించారు)
(ఎ) అనంతపురం
(బి) చిత్తూరు
(సి) కడప
(డి) నెల్లూరు

5. 'తుపాకీ హక్కులు కొనసాగించాలి, వలసలపై నియంత్రణలు ఉండాలి' అని వాదించే అమెరికాకు చెందిన సంప్రదాయవాద రాజకీయ పార్టీ ? (ఈ పార్టీని 'జీఓపీ' (GOP ⇒ Grand Old Party) అని కూడా పిలుస్తారు)
(ఎ) రిపబ్లికన్ పార్టీ
(బి) డెమోక్రాటిక్ పార్టీ
(సి) లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ
(డి) లేబర్ పార్టీ

6. 'అమెరికా' ఎలెక్టోరల్ కాలేజీలో ఉండే మొత్తం ఎలెక్టార్ల సంఖ్య ?
(ఎ) 535
(బి) 536
(సి) 537
(డి) 538



7. 'కరోనా' నేపథ్యంలో ఆర్ధిక పొదుపు చర్యల్లో భాగంగా మనదేశ ఎంపీల జీత భత్యాల్లో ఎంత శాతం మేర కోత విధించనున్నారు ?
(ఎ) 25%
(బి) 30%
(సి) 35%
(డి) 40%

8. మనదేశ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ ను దక్కించుకున్న సంస్థ ? (ఈ సంస్థ దాఖలు చేసిన బిడ్ విలువ రూ. 861.90 కోట్లు)
(ఎ) ఎల్ & టీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్
(బి) టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్
(సి) షాపూర్జీ పల్లోంజీ & కో లిమిటెడ్
(డి) గామన్ ఇండియా లిమిటెడ్

9. మనదేశంలో ఏ తేదీ నాటికి 'కరోనా' కేసుల సంఖ్య మొత్తమ్మీద అర కోటి (50 లక్షలు) దాటింది ? (దేశంలో తొలి 'కరోనా' కేసు 2020 జనవరి 30న నమోదైంది)
(ఎ) 2020 సెప్టెంబర్ 14
(బి) 2020 సెప్టెంబర్ 15
(సి) 2020 సెప్టెంబర్ 16
(డి) 2020 సెప్టెంబర్ 17



10. 'సెబీ' (SEBI ⇒ Securities and Exchange Board of India) తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, 'మల్టీ క్యాప్' తరగతికి చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలు తప్పనిసరిగా ఎంత శాతం నిధులను 'మిడ్, స్మాల్ క్యాప్' తరగతికి చెందిన షేర్లలో మదుపు చేయాలి ?
(ఎ) 25%
(బి) 30%
(సి) 35%
(డి) 40%
     
కీ (GK TEST-68 DATE : 2020 SEPTEMBER 20)
1) ఎ 2) సి 3) సి 4) ఎ 5) ఎ 6) డి 7) బి 8) బి 9) సి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com 

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

GK TEST-67

1. వివిధ వెబ్ సైట్లు, సంస్థల ద్వారా భారత్ లో 10 వేల మందికి పైగా ప్రముఖులపై నిఘా పెట్టిన చైనా కు చెందిన 'డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ? (ఈ జాబితాలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, క్రికెటర్లు, సినీ తారలు మొదలగు వారు ఉన్నారు)
(ఎ) టెన్సెన్ట్
(బి) బైదు
(సి) ఝేన్ హువా
(డి) అలీబాబా

2. జీఎస్టీ (GST) బకాయిల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ఐచ్ఛికాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఐచ్ఛికాన్ని ఎంచుకుంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కలిగే రుణ సౌకర్యం ?
(ఎ) అన్ని రాష్ట్రాలకు కలిపి 'ఆర్బీఐ' (RBI) ఏర్పాటు చేసే 'ప్రత్యేక గవాక్షం' (SPECIAL WINDOW) ద్వారా రుణం తీసుకోవడం
(బి) అన్ని రాష్ట్రాలకు కలిపి 'ఆర్బీఐ' (RBI) ఏర్పాటు చేసే 'ఏక గవాక్షం' (SINGLE WINDOW) ద్వారా రుణం తీసుకోవడం
(సి) అన్ని రాష్ట్రాలకు కలిపి 'ఆర్బీఐ' (RBI) ఏర్పాటు చేసే 'ప్రత్యేకావసర వాహకం' (SPECIAL PURPOSE VEHICLE) ద్వారా రుణం తీసుకోవడం
(డి) బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడం

3. ఇటీవల విష ప్రయోగానికి గురై కోమాలోకి వెళ్లిన 'అలెక్సీ నావల్నీ' (ALEXEI NAVALNY) ఏదేశానికి చెందిన విపక్ష నేత ? (జర్మనీలో చికిత్సతో కోలుకుంటున్నారు)
(ఎ) ఇరాన్
(బి) ఇజ్రాయెల్
(సి) రష్యా
(డి) శ్రీలంక



4. వారెంట్లు, న్యాయస్థానం నుంచి ఆదేశాలు, ఎఫ్ ఐ ఆర్ వంటివేమీ లేకుండా నేరుగా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారాన్ని పోలీసులకు కల్పించే వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రం ? (దీనికోసం 'ప్రత్యేక భద్రతా దళం' (SSF) ను పోలీస్ శాఖలో ఏర్పాటు చేసారు. అరెస్ట్ చేయడానికి "తగిన ఆధారం" ఈ విభాగం (SSF) వద్ద ఉంటే చాలు. రుసుం చెల్లించి 'ఎస్ ఎస్ ఎఫ్' (SSF) సేవల్ని ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు కూడా ఉపయోగించుకోవచ్చు)
(ఎ) పశ్చిమ బెంగాల్
(బి) కేరళ
(సి) ఉత్తర్ ప్రదేశ్
(డి) దిల్లీ

5. విమానయాన నియంత్రణాధికార సంస్థలకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన "ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లు-2020" ప్రకారం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారికి ప్రస్తుతం విధిస్తున్న రూ. 10 లక్షల జరిమానాను ఎంత మొత్తానికి పెంచేందుకు వీలు కలుగుతుంది ?
(ఎ) రూ. 50 లక్షలు
(బి) రూ. కోటి
(సి) రూ. కోటిన్నర
(డి) రూ. 2 కోట్లు

6. ప్రస్తుత 'కొవిడ్' మహమ్మారి పరిస్థితుల్లో విరివిగా వాడుతున్న 'సామాజిక దూరం' (Social Distance) అన్న పదానికి బదులు "సురక్షిత దూరం" (Safe Distance) అని ఉపయోగిస్తే బాగుంటుందని సూచించిన ప్రముఖ వ్యక్తి ?
(ఎ) రామ్ నాథ్ కోవింద్
(బి) ఎం.వెంకయ్య నాయుడు
(సి) నరేంద్ర మోదీ
(డి) రాజ్ నాథ్ సింగ్



7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి పంట అత్యధికంగా పండించే జిల్లాలలో మొదటి నాలుగు స్థానాలలో ఉన్న జిల్లాలు వరుసగా .. ?
(ఎ) గుంటూరు, కర్నూలు, కృష్ణా, అనంతపురం
(బి) అనంతపురం, గుంటూరు, కర్నూలు, కృష్ణా 
(సి) కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం
(డి) కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం

8. 'జపాన్' దేశ నూతన ప్రధానిగా "యోషిహిదే సుగా" (YOSHIHIDE SUGA) ను ఆ దేశ పార్లమెంట్ 2020 సెప్టెంబర్ 16న ఎన్నుకొంది. యోషిహిదే సుగా జపాన్ లో ఇంతకుముందు నిర్వహించిన పదవి ? (సుగా తల్లిదండ్రులు 'స్ట్రాబెర్రీలు' సాగు చేసే రైతులు)
(ఎ) క్యాబినెట్ ముఖ్య కార్యదర్శి
(బి) జాతీయ భద్రతా సలహాదారు
(సి) విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి
(డి) రక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి

9. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగే రోజు ?
(ఎ) నవంబర్ లో మొదటి ఆదివారం తర్వాత వచ్చే సోమవారం
(బి) నవంబర్ లో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం
(సి) నవంబర్ లో మొదటి మంగళవారం తర్వాత వచ్చే బుధవారం
(డి) నవంబర్ లో మొదటి బుధవారం తర్వాత వచ్చే గురువారం



10. స్క్రామ్ జెట్ ఇంజిన్ (Scram Jet Engine) ను అమర్చిన "హైపర్ సోనిక్ టెక్నాలజీ ప్రయోగాత్మక రాకెట్' (HSTDV ⇒ Hyper Sonic Technology Demonstrator Vehicle) ను 'డీ ఆర్ డీ ఓ' (DRDO) విజయవంతంగా ప్రయోగించిన తేదీ ? (ఈ రాకెట్ 6 మాక్ ల హైపర్ సోనిక్ వేగాన్ని అందుకుంది. 1 మాక్ = గంటకు 767 మైళ్లు లేదా 1,236 కి.మీ. వేగంతో సమానం)
(ఎ) 2020 సెప్టెంబర్ 5
(బి) 2020 సెప్టెంబర్ 6
(సి) 2020 సెప్టెంబర్ 7
(డి) 2020 సెప్టెంబర్ 8

కీ (GK TEST-67 DATE : 2020 SEPTEMBER 18)
1) సి 2) ఎ 3) సి 4) సి 5) బి 6) బి 7) డి 8) ఎ 9) బి 10) సి  

All the best by www.gkbitsintelugu.blogspot.com 

YSR NETHANNA NESTHAM

వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం (YSR NETHANNA NESTHAM)


పథకం ప్రారంభం :

  • 2019 డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో "వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం" (YSR NETHANNA NESTHAM) పథకాన్ని ప్రారంభించారు.

పథకం ఉద్దేశ్యం :

  • 'చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి ... మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే' ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

పథకం ద్వారా కలిగే ప్రయోజనం :

  • మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 24,000 ఆర్ధిక సహాయం లభిస్తుంది.
  • దాదాపు 85 వేల చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది కలుగుతుంది.  

టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) :

  • 'వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం' (YSR NETHANNA NESTHAM) పథకానికి సంబంధించి .. 'సలహాలు, సూచనలు, ఫిర్యాదులు' కొరకు టోల్ ఫ్రీ నంబర్ "1902" లో సంప్రదించవచ్చు.



JAGANANNA AMMA VODI

జగనన్న అమ్మ ఒడి (JAGANANNA AMMA VODI)


పథకం ప్రారంభం :

  • 2020 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' చిత్తూరు లోని 'పీవీకేఎన్' డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో "జగనన్న అమ్మ ఒడి" పథకాన్ని ప్రారంభించారు.

పథకం వివరాలు :

  • పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ. 15,000 అందిస్తారు.
  • ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందజేస్తారు.
  • దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు తద్వారా దాదాపుగా 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి కలుగుతుంది.
  • ఈ పథకం అమలుకు రూ. 6,456 కోట్లు కేటాయించారు.



JAGANANNA VIDYA DEEVENA

 జగనన్న విద్యా దీవెన (JAGANANNA VIDYA DEEVENA)


  • పాలిటెక్నిక్, ఐటిఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విదార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "జగనన్న విద్యా దీవెన" పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (FEE REIMBURSEMENT) ను అందిస్తుంది.

పథకం లక్ష్యం :

  • పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' (YSR CONGRESS PARTY) ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ... ఈ "జగనన్న విద్యా దీవెన" (JAGANANNA VIDYA DEEVENA) పథకం.

పథకం ప్రారంభం :

  • 2020 ఏప్రిల్ 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 'జగనన్న విద్యా దీవెన" పథకాన్ని ప్రారంభించారు.


పథకానికి అర్హులు :

  • విద్యార్థుల కుటుంబ సభ్యుల మొత్తం వార్షికాదాయం రూ. 2,50,000 లోపు ఉండాలి.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులు అందరికీ కలిపి మొత్తమ్మీద 'పదెకరాల్లోపు మాగాణి లేదా 25 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు' ఉండాలి.
  • పారిశుధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని విద్యార్థులు.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులకు ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్నా ఫర్వాలేదు కానీ కారు ఉండకూడదు.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులకు పట్టణాల్లో స్థిరాస్తి ఉంటే, అది 1500 చదరపు అడుగులలోపు ఉండాలి.

గమనిక :

  • ఆదాయ పన్ను కట్టే కుటుంబ సభ్యులున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.

పథకం ప్రయోజనాలు మరియు వివరాలు :

  • 12 లక్షల మంది తల్లులకు తద్వారా వారి పిల్లలకు లబ్ది.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలసిన ఫీజులు బకాయిలు లేకుండా ఒకే ఆర్ధిక సంవత్సరంలో చెల్లింపు.
  • ఫీజు రీయింబర్స్ మెంట్ క్రింద మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా విడుదల.
  • గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లింపు.
  • వచ్చే విద్యా సంవత్సరం నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తం, త్రైమాసికానికొకసారి చొప్పున నాలుగు త్రైమాసికాల్లో తల్లుల ఖాతాల్లో జమ ...
  • నాలుగు విడతల ఫీజు తల్లులు చెల్లించడం వల్ల కాలేజీల్లో జవాబుదారీతనం ... కాలేజీల స్థితిగతులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ...
  • 2018-19, 2019-2020 సంవత్సరములకు సంబంధించి, ఏ రకం ఫీజులైనా, ఎంత మొత్తమైనా కాలేజీలకు ఒకవేళ ముందే కట్టి ఉంటే ... కాలేజీలు తల్లిదండ్రులకు తిరిగి ఆ మొత్తం చెల్లించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఆ కాలేజీలకు ఆయా మొత్తాలను చెల్లించింది. 
  • ఫీజు రీయింబర్స్ మెంట్ లో ఏ రకమైన ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1902 ను సంప్రదించగలరు.




MANA BADI 'NAADU-NEDU'

 మన బడి "నాడు - నేడు" (MANA BADI "NAADU - NEDU")


పథకం ఉద్దేశ్యం :

  • '45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 3287 ప్రభుత్వ హాస్టళ్ల రూపు రేఖలను మూడు దశలలో సమూలంగా మార్చడం' ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాలలో కనీసంగా ఏర్పాటు చేసే సదుపాయాలు :

  • విద్యార్థులకు రక్షిత త్రాగు నీరు
  • మరుగు దొడ్లు
  • ఫర్నిచర్, ప్రహరీ గోడలు
  • తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మత్తులు, ఫినిషింగ్
  • బ్లాక్ బోర్డ్స్
  • ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు


పథకం ద్వారా కలిగే అదనపు ప్రయోజనాలు :

  • ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రతి పాఠశాలలో 'ఇంగ్లీష్ ల్యాబ్' (ENGLISH LAB)లను ఏర్పాటు చేస్తారు.
  • పాఠశాలలు తెరిచే నాటికి 3 జతల యూనిఫామ్ లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, జత బూట్లు, సాక్స్, బెల్ట్, బ్యాగ్ లతో కూడిన కిట్ ను విద్యార్థులకు అందిస్తారు.
  • పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచడంతో పాటు టీచర్లకు అవసరమైన శిక్షణ, విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తారు.

బడ్జెట్ :

  • ఈ పథకం అమలుకు రూ. 14 వేల కోట్లు కేటాయించారు.



JAGANANNA VASATHI DEEVENA

జగనన్న వసతి దీవెన (JAGANANNA VASATHI DEEVENA)


  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విదార్థులకు వసతి మరియు భోజన ఖర్చుల కొరకు ప్రతి ఏటా రూ. 20,000 మొత్తాన్ని రెండు దఫాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "జగనన్న వసతి దీవెన" పథకం ద్వారా చెల్లిస్తుంది.
  • మొదటి దఫా రూ. 10,000 జనవరి - ఫిబ్రవరి నెలల మధ్య, రెండవ దఫా రూ. 10,000 జూలై - ఆగస్ట్ నెలల మధ్య చెల్లిస్తారు.
  • ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.

పథకం ప్రారంభం :

  • 2020 ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' విజయనగరంలో 'జగనన్న వసతి దీవెన" పథకాన్ని ప్రారంభించారు. 


పథకానికి అర్హులు :

  • విద్యార్థుల కుటుంబ సభ్యుల మొత్తం వార్షికాదాయం రూ. 2,50,000 లోపు ఉండాలి.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులు అందరికీ కలిపి మొత్తమ్మీద 'పదెకరాల్లోపు మాగాణి లేదా 25 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు' ఉండాలి.
  • పారిశుధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని విద్యార్థులు.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులకు ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్నా ఫర్వాలేదు కానీ కారు ఉండకూడదు.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులకు పట్టణాల్లో స్థిరాస్తి ఉంటే, అది 1500 చదరపు అడుగులలోపు ఉండాలి.

గమనిక :

  • ఆదాయ పన్ను కట్టే కుటుంబ సభ్యులున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.



16, సెప్టెంబర్ 2020, బుధవారం

GK TEST-66

1. 'యుఎస్ ఓపెన్' - 2020 (US OPEN - 2020) టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ? ('యుఎస్ ఓపెన్' ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయి కూడా ఓ ఆటగాడు విజేతగా నిలవడం 71 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1949లో గొంజాలెజ్ (Gonzalez) ఇలాగే టైటిల్ నెగ్గాడు)
(ఎ) డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)
(బి) డానియెల్ మెద్వేదేవ్ (రష్యా)
(సి) అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)
(డి) పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)

2. 'యుఎస్ ఓపెన్' - 2020 (US OPEN - 2020) టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ? (విజేత ఈ టోర్నీలో మ్యాచ్ కు ఒకటి చొప్పున అమెరికాలో జాతి వివక్ష కారణంగా మరణించినవారి పేర్లుండే ఏడు మాస్కులు ధరించి, తద్వారా జాతి వివక్ష గురించి అందరూ చర్చించుకునేలా చేసింది)
(ఎ) విక్టోరియా అజరెంక (బెలారస్)
(బి) జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)
(సి) సెరెనా విలియమ్స్ (అమెరికా)
(డి) నవోమి ఒసాకా (జపాన్)

3. మహిళా టెన్నిస్ లో ఆల్ టైమ్ అత్యధిక టైటిళ్ల (24) రికార్డ్ ప్రస్తుతం ఎవరి పేరుమీద కొనసాగుతోంది ?
(ఎ) స్టెఫీగ్రాఫ్
(బి) మార్గరెట్ కోర్ట్
(సి) సెరెనా విలియమ్స్ 
(డి) మార్టీనా నవ్రతిలోవా



4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఇసుకను ప్రకటించిన ధరలకు మించి అమ్మినా, అక్రమ రవాణా చేసినా (నల్ల బజారుకు తరలించినా), పరిమితికి మించి కలిగివున్నా, అనధికారికంగా అమ్మినా విధించే జరిమానా మరియు జైలు శిక్ష ?
(ఎ) రూ. 1,00,000 వరకు జరిమానా మరియు ఒక సంవత్సరం జైలు శిక్ష
(బి) రూ. 1,50,000 వరకు జరిమానా మరియు ఒకటిన్నర సంవత్సరాల జైలు శిక్ష
(సి) రూ. 2,00,000 వరకు జరిమానా మరియు రెండు సంవత్సరాల జైలు శిక్ష
(డి) రూ. 2,50,000 వరకు జరిమానా మరియు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఎన్ని ఇళ్లకు ఒక వాలంటీర్ (VOLUNTEER) ను నియమించడం జరిగింది ?
(ఎ) ప్రతి 50 ఇళ్లకు
(బి) 50 నుండి 100 ఇళ్లకు
(సి) ప్రతి 100 ఇళ్లకు
(డి) 50 నుండి 75 ఇళ్లకు

6. ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పూర్తి స్థాయి సేవలు ఏ తేదీ నుండి లభ్యం అవుతున్నాయి ?
(ఎ) 2019 అక్టోబర్ 2
(బి) 2020 జనవరి 1
(సి) 2020 జనవరి 26
(డి) 2020 ఫిబ్రవరి 1



7. అమెరికాలో 'టిక్ టాక్' (TikTok) కార్యకలాపాల కోసం టెక్నాలజీ భాగస్వామిగా ఎంపికైన సంస్థ ? ('టిక్ టాక్' మాతృ సంస్థ పేరు "బైట్ డాన్స్" (ByteDance))
(ఎ) మైక్రోసాఫ్ట్
(బి) ఒరాకిల్
(సి) గూగుల్
(డి) ఐబీఎం

8. 2020 సెప్టెంబర్ 14న జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో మూజువాణి ఓటింగ్ ద్వారా 'ఎన్డీయే' (NDA) అభ్యర్థిగా పోటీ చేసిన 'హరివంశ్ నారాయణ్ సింగ్' విపక్షాల తరపున బరిలో నిలిచిన 'మనోజ్ ఝా' పై విజయం సాధించారు. హరివంశ్ నారాయణ్ సింగ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ?
(ఎ) రాష్ట్రీయ జనతాదళ్ (RJD)
(బి) లోక్ జనశక్తి పార్టీ (LJP)
(సి) జనతాదళ్ యునైటెడ్ (JDU)
(డి) రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP)

9. అనేక అరుదైన దృశ్యాలతో కూడిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఏ తేదీన ప్రారంభమయ్యాయి ? ('కరోనా' నేపథ్యంలో రాజ్యసభ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, లోక్ సభ మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించనున్నారు)
(ఎ) 2020 సెప్టెంబర్ 11
(బి) 2020 సెప్టెంబర్ 12
(సి) 2020 సెప్టెంబర్ 13
(డి) 2020 సెప్టెంబర్ 14



10. రూ. 1,08,000 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన దేశంలోనే తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ?
(ఎ) ముంబయి - నాగ్ పూర్ (753 కి.మీ.)
(బి) ముంబయి - అహ్మదాబాద్ (508.17 కి.మీ.)
(సి) దిల్లీ - అమృత్ సర్ (459 కి.మీ.)
(డి) చెన్నై - మైసూరు (435 కి.మీ.)   

   
కీ (GK TEST-66 DATE : 2020 SEPTEMBER 16)
1) ఎ 2) డి 3) బి 4) సి 5) బి 6) సి 7) బి 8) సి 9) డి 10) బి
All the best by www.gkbitsintelugu.blogspot.com 

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

YSR ASARA

 "వైఎస్సార్ ఆసరా" పథకం ("YSR ASARA" SCHEME)


పథకం ప్రారంభం :

  • 2020 సెప్టెంబర్ 11 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ ఆసరా" పథకాన్ని మీట నొక్కి ప్రారంభించారు.

పథకం ఉద్దేశ్యం :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87 లక్షల మంది మహిళలకు వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా 4 వాయిదాల్లో మొత్తం రూ. 27,168 కోట్లు జమ చేయనున్నారు.
  • తొలి విడతగా 2020 సెప్టెంబర్ 11న రూ. 6,792 కోట్లు మహిళల పొదుపు సంఘాలకు ఆసరాగా వారి సంఘం ఖాతాల్లో జమ చేశారు.

పథకానికి అర్హులు :

  • 'ఎన్నికల నాటికి (2019 ఏప్రిల్ 11) వాణిజ్య, సహకార బ్యాంకులలో నిల్వ అప్పు ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు' ఈ పథకానికి అర్హులు.

లబ్ధిదారుల జాబితా :

  • 'సెర్ప్' (SERP ⇒ Society for Elimination of Rural Poverty), 'మెప్మా' (MEPMA ⇒ The Mission for Elimination of Poverty in Municipal Areas) వెబ్ సైట్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తారు.
  • ఒకవేళ అర్హత ఉండి పొరపాటున జాబితాలో పేరులేని సంఘాలుంటే, వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే పరిష్కరిస్తారు.


మహిళా సంక్షేమం, స్వావలంబన, సాధికారతల కోసం ... :

  • మహిళా సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాల (వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఆసరా ... మొదలగునవి) ద్వారా అందే డబ్బులు ఏవిధంగా ఉపయోగించుకోవాలనే దానిమీద ఎటువంటి షరతులూ లేవు.
  • మహిళలు వారి వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు, జీవనోపాధికి వాడుకోవచ్చు లేదా వ్యాపారాలకు ఉపయోగించుకోవచ్చు.
  • వ్యాపారాలకు ఉపయోగించుకుంటే ప్రభుత్వం ద్వారా మరింత ప్రోత్సాహం అందించి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు, వ్యాపారవేత్తలుగా మారి స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే P & G, ITC, HUL, AMUL, ALLANA లాంటి దిగ్గజ సంస్థలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది.
  • మహిళలకు ఇందుకు సంబంధించి ఏమైనా సలహాలు, సహకారం, సూచనలు కావాలంటే 'మెప్మా' (MEPMA), సెర్ప్ (SERP)' అధికారులను సంప్రదించవచ్చు.

టోల్ ఫ్రీ :

  • సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1902 లో సంప్రదించవచ్చు.



12, సెప్టెంబర్ 2020, శనివారం

GK TEST-65

1. 'పోషకాలతో కూడిన బలవర్ధక బియ్యం' పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) గా ఎంపిక చేశారు ? (ప్రజా పంపిణీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది)
(ఎ) శ్రీకాకుళం
(బి) విజయనగరం
(సి) విశాఖపట్నం
(డి) పశ్చిమగోదావరి

2. 'గామా-కొవిడ్-వ్యాక్' (Gam-Covid-Vac) పేరుతో తొలి బ్యాచ్ కొవిడ్-19 టీకాను 'రష్యా' ప్రభుత్వం ఆ దేశ పౌరుల కోసం ఏ తేదీన విడుదల చేసింది ? (మాస్కో లోని 'గమాలేయా ఎడిమాలజీ, మైక్రోబయాలజీ పరిశోధన సంస్థ' అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్-వి' టీకాను మూడోదశ ప్రయోగ పరీక్షలు పూర్తి కాకుండానే సాధారణ పౌరులకు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది)
(ఎ) 2020 సెప్టెంబర్ 8
(బి) 2020 సెప్టెంబర్ 9
(సి) 2020 సెప్టెంబర్ 10
(డి) 2020 సెప్టెంబర్ 11

3. మన దేశానికి సంబంధించి 'కొవిడ్-19' వ్యాక్సిన్ నిపుణుల గ్రూపునకు అధ్యక్షత వహిస్తున్నది ?
(ఎ) అమితాబ్ కాంత్
(బి) రాజీవ్ కుమార్
(సి) వీకే పాల్
(డి) సునీల్ అరోరా

4. మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న 'నాస్కామ్' (NASSCOM ⇒ National Association of Software and Service Companies) తొలి మహిళా అధ్యక్షురాలు ?
(ఎ) సంగీతా రెడ్డి
(బి) కిరణ్ మజుందార్ షా
(సి) దేవయాని ఘోష్
(డి) నీతా అంబాని



5. భారత్-చైనా సరిహద్దుల్లో తుపాకులు వాడకూడదనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా సైన్యం (PLA ⇒ People's Liberation Army) ఇటీవల తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపిన తేదీ ? (చివరిసారిగా 1975లో 'పీఎల్ఏ' (PLA) కు చెందిన కొంతమంది 'తులుంగ్ లా' వద్ద భారత్ ఆధీనంలోని భూభాగంలోకి చొరబడి అక్కడ గస్తీ కాస్తున్న అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాల్పులు జరిపి నలుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది)
(ఎ) 2020 సెప్టెంబర్ 4
(బి) 2020 సెప్టెంబర్ 5
(సి) 2020 సెప్టెంబర్ 6
(డి) 2020 సెప్టెంబర్ 7

6. 2020 సెప్టెంబర్ 8 న భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన "పత్రికా గేట్" (Patrika Gate) ఏ రాష్ట్రంలో ఉంది ? (ఈ సందర్భంగా 'పత్రికా గ్రూప్' చైర్మన్ గులాబ్ కొఠారి రచించిన 'సంవాద్ ఉపనిషత్' మరియు 'అక్షర యాత్ర' పుస్తకాలను కూడా ప్రధాని ఆవిష్కరించారు)
(ఎ) పంజాబ్
(బి) రాజస్థాన్
(సి) గుజరాత్
(డి) ఒడిశా

7. చేపల అమ్మకం, మార్కెటింగ్ పెంచే లక్ష్యంతో మత్స్యమిత్ర మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ (Revolving Fund) గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తం అందజేయనుంది ? (ఆర్నమెంటల్ ఫిషరీ, క్రాబ్ కల్చర్, ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలతో పాటు గత ఆర్ధిక సంవత్సరంలో ఆడిట్ పూర్తి చేసుకున్న సంఘాలకు ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు)
(ఎ) రూ. 2,00,000
(బి) రూ. 1,50,000
(సి) రూ. 1,00,000
(డి) రూ. 50,000

8. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ గా నియమితులైన వ్యక్తి ? (అతను మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు)
(ఎ) కె. విజయానంద్
(బి) సోమేశ్ కుమార్
(సి) సి. పార్థసారథి
(డి) వి. నాగిరెడ్డి

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు ? (అధ్యక్షునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' వ్యవహరిస్తున్నారు)
(ఎ) ఎంవీఎస్ నాగిరెడ్డి
(బి) బొత్స సత్యనారాయణ
(సి) పీవీ రమేష్
(డి) చిరంజీవి చౌదరి



10. ఫ్రాన్స్ (France) దేశం నుంచి కొనుగోలు చేసిన 'రఫేల్' యుద్ధ విమానాలు ఏ తేదీన మన వాయుసేనలో లాంఛనంగా ప్రవేశించాయి ? ('రఫేల్' అంటే గాలి దుమారం లేదా జ్వాలా విస్ఫోటం అని అర్థం)
(ఎ) 2020 సెప్టెంబర్ 9
(బి) 2020 సెప్టెంబర్ 10
(సి) 2020 సెప్టెంబర్ 11
(డి) 2020 సెప్టెంబర్ 12

            
కీ (GK TEST-65 DATE : 2020 SEPTEMBER 12)
1) బి 2) ఎ 3) సి 4) సి 5) డి 6) బి 7) డి 8) సి 9) ఎ 10) బి
All the best by www.gkbitsintelugu.blogspot.com 

10, సెప్టెంబర్ 2020, గురువారం

YSR SAMPOORNA POSHANA

"వైఎస్సార్ సంపూర్ణ పోషణ" మరియు "వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్" పథకాలు

(YSR SAMPOORNA POSHANA and YSR SAMPOORNA POSHANA PLUS)


  • అంగన్వాడీ (ANGANWADI)) కేంద్రాలలో నమోదైన గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు సంపూర్ణ పోషణ అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" మరియు "వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్" పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది.

పథకం ఉద్దేశ్యం :

  • "గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహారం లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించి సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దడం" ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.

పథకం ప్రారంభం :

  • 2020 సెప్టెంబర్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" మరియు "వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్" పథకాలను ప్రారంభించారు.

పథకం - కొన్ని విశేషతలు :

  1. 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఈ పథకాలను అమలు చేస్తారు.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 30,16,000 మందికి ఈ పథకాల వలన లబ్ది చేకూరుతుంది.
  3. ఈ పథకాల కోసం మొత్తమ్మీద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,864 కోట్లు ఖర్చు చేయనుంది.
  4. ప్రస్తుత సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ... రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు : 53%, తక్కువ బరువుతో జన్మిస్తున్న శిశువులు : 31.9%, బరువుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు : 17.2%, వయసుకు తగ్గ ఎత్తులేని బాలబాలికలు : 32%  ఉన్నారు. వీరందరికీ ఈ పథకాలవల్ల తప్పనిసరి ప్రయోజనం కలగనుంది.

I. వైఎస్సార్ సంపూర్ణ పోషణ (YSR SAMPOORNA POSHANA) :

  • 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' ద్వారా మైదాన ప్రాంతాలలోని 47,287 అంగన్వాడీల పరిధిలో 26,36,000 మంది లబ్ధిదారులకు రూ. 1,555.56 కోట్లతో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, నెలవారీ పౌష్ఠికాహారం పంపిణీ చేస్తారు.

గర్భవతులు మరియు బాలింతలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5,80,000 మంది గర్భవతులు మరియు బాలింతలకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.

  • రాగి పిండి : 1 కేజీ
  • బెల్లం : 250 గ్రాములు
  • వేరుశెనగ చిక్కి : 250 గ్రాములు
  • ఎండు ఖర్జూరం : 250 గ్రాములు
  • సజ్జ/జొన్న పిండి : 1 కేజీ
  • అటుకులు : 1 కేజీ

ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, కోడిగ్రుడ్డు, 200 మి.లీ. పాలతో మధ్యాహ్న భోజనం అందిస్తారు.

6-36 నెలల పిల్లలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13,50,000 మంది చిన్నారులకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.

  • బాలామృతం : 2.5 కేజీలు
  • కోడి గ్రుడ్లు : 25
  • పాలు : 2.5 లీటర్లు

36-72 నెలల పిల్లలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7,06,000 మంది పిల్లలకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.

  • ఉడికించిన శనగలు : ప్రతి రోజూ 20 గ్రాములు
  • కోడి గ్రుడ్డు ప్రతి రోజూ 1
  • పాలు ప్రతి రోజూ 100 మి.లీ.

ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయల సాంబారుతో మధ్యాహ్న భోజనం అందిస్తారు.

II. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ (YSR SAMPOORNA POSHANA PLUS) :

'వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్' ద్వారా 77 గిరిజన మండలాల్లోని 8,320 అంగన్వాడీల పరిధిలో 3,80,000 మంది లబ్ధిదారులకు రూ. 307.55 కోట్లతో ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం, నెలవారీ పౌష్ఠికాహారం పంపిణీ చేస్తారు.

గర్భవతులు మరియు బాలింతలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 66,000 మంది గర్భవతులు మరియు బాలింతలకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.

  • బెల్లం : 500 గ్రాములు
  • వేరుశెనగ చిక్కి : 500 గ్రాములు
  • ఎండు ఖర్జూరం : 500 గ్రాములు
  • సజ్జ/జొన్న పిండి : 500 గ్రాములు
  • మల్టీ గ్రైన్ ఆటా : 2 కేజీలు

ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, కోడిగ్రుడ్డు, 200 మి.లీ. పాలతో మధ్యాహ్న భోజనం అందిస్తారు.

6-36 నెలల పిల్లలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,64,000 మంది చిన్నారులకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్' పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.

  • బాలామృతం : 2.5 కేజీలు
  • కోడి గ్రుడ్లు : 30
  • పాలు : 6 లీటర్లు

36-72 నెలల పిల్లలకు ప్రతి నెలా అందించే పోషకాహారం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,50,000 మంది పిల్లలకు 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్  పథకం ద్వారా ప్రతి నెలా ఈ క్రింది పోషకాహారం అందించనున్నారు.

  • బాలామృతంతో చేసిన లడ్డు/కేక్ ప్రతి రోజూ 1 (50 గ్రాములు)
  • కోడి గ్రుడ్డు ప్రతి రోజూ 1
  • పాలు ప్రతి రోజూ 200 మి.లీ.

ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయల సాంబారుతో మధ్యాహ్న భోజనం అందిస్తారు.

ఒక్కొక్క లబ్దిదారునిపై ప్రభుత్వానికయ్యే ఖర్చు :

  • గిరిజన ప్రాంతాలలో గర్భవతులు, బాలింతలకు నెలకు 1100 రూపాయలు, 6-36 నెలల చిన్నారులకు 620 రూపాయలు, 36-72 నెలల పిల్లలకు 553 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
  • మైదాన ప్రాంతాలలో గర్భవతులు, బాలింతలకు నెలకు 850 రూపాయలు, 6-36 నెలల చిన్నారులకు 412 రూపాయలు, 36-72 నెలల పిల్లలకు 350 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

టోల్ ఫ్రీ నంబరు :

అంగన్వాడీ సేవలు, ఫిర్యాదులు, సలహాల కొరకు 14408 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చు.

    


9, సెప్టెంబర్ 2020, బుధవారం

GK TEST-64

1. రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ సెల్ ఆర్థరైటిస్ వ్యాధులు అదుపు చేయడానికి వినియోగించే ఔషధం 'టొసిలిజుమ్యాబ్' (TOCILIZUMAB) ను తయారు చేస్తున్న 'రోష్' (ROCHE) కంపెనీది ఏ దేశం ? (వాస్తవానికి ఈ సూది మందుకు 'అత్యవసర వినియోగ అనుమతి' మాత్రమే ఉంది. ఇంకా నిర్ధరణ కాని, ప్రయోగాల దశలో ఉన్న ఔషధం అయినా ఏమాత్రం వెనుకాడకుండా 'కొవిడ్-19' వ్యాధిగ్రస్తులకు (Covid-19 Patients) వినియోగిస్తున్నారు. దీనివల్ల దుష్ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు)
(ఎ) ఆస్ట్రేలియా
(బి) స్వీడన్
(సి) స్పెయిన్
(డి) స్విట్జర్లాండ్

2. కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యశాఖా మంత్రి పీయూష్ గోయల్ 2020 సెప్టెంబర్ 5న ప్రకటించిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019' (EODB-2019) ర్యాంకుల్లో తొలి నాలుగు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ? (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ప్రతి సంవత్సరం కొన్ని నిబంధనలు (RULES) ఆధారంగా ర్యాంకులను విడుదల చేస్తుంది)
(ఎ) ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్
(బి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్
(సి) ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ
(డి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్

3. మనదేశ పురోగతిలో ప్రధాన అవరోధంగా నిలుస్తున్న పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు 1982 నుంచి ఏటా ఏయే తేదీల మధ్య కేంద్ర ప్రభుత్వం 'జాతీయ పోషకాహార వారోత్సవాలు' ను నిర్వహిస్తోంది ?
(ఎ) సెప్టెంబర్ 1 - 7
(బి) సెప్టెంబర్ 8 - 14
(సి) సెప్టెంబర్ 15 - 21
(డి) సెప్టెంబర్ 22 - 28

4. భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి సంబంధించి హ్యాకింగ్ కు గురైన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతా ? (ఈ ఖాతాను 25 లక్షల మంది అనుసరిస్తున్నారు)
(ఎ) పేస్ బుక్
(బి) ట్విటర్
(సి) ఇన్స్టాగ్రామ్
(డి) టంబ్లర్

5. విద్వేష ప్రసంగాలు, సందేశాల తొలగింపు విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు  ఎదుర్కొంటున్న సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఫేస్ బుక్' (Facebook) ఏ భాజపా ఎమ్ ఎల్ ఏ (BJP MLA) సామాజిక ఖాతాపై నిషేధం విధించింది ?
(ఎ) హెచ్.రాజా (తమిళనాడు)
(బి) రవీందర్ రైనా (జమ్మూ కాశ్మీర్)
(సి) స్వామి అగ్నివేష్ (హరియాణ)
(డి) రాజా సింగ్ (తెలంగాణ)



6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఫిషరీస్ యూనివర్సిటీ' ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు ?
(ఎ) శ్రీకాకుళం
(బి) విశాఖపట్నం
(సి) తూర్పుగోదావరి
(డి) పశ్చిమగోదావరి

7. 'యునెస్కో' (UNESCO) ఏ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న "అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం"ను ప్రపంచమంతటా నిర్వహిస్తోంది ?
(ఎ) 1992
(బి) 1993
(సి) 1994
(డి) 1995

8. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం ? (గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు)
(ఎ) 875 అడుగులు
(బి) 880 అడుగులు
(సి) 885 అడుగులు
(డి) 890 అడుగులు

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 డిసెంబర్ 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువకులకు ప్రభుత్వం అందజేస్తున్న 9,260 వాహనాలపై ఎంత శాతం రాయితీ ఇవ్వనున్నారు ? (వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారు సమకూర్చుకోవాలి)
(ఎ) 20%
(బి) 40%
(సి) 60%
(డి) 80%

10. ఈ సంవత్సరం యూఏఈ లో జరగనున్న 'ఐపీల్' క్రికెట్ టోర్నీ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను గెలుచుకున్న సంస్థ ? (ఈ ఒప్పందం టోర్నీ జరిగే 4 నెలల 13 రోజులకు మాత్రమే వర్తిస్తుంది)
(ఎ) డ్రీమ్ 11
(బి) బైజూస్
(సి) వివో
(డి) అన్ అకాడమీ

                

కీ (GK TEST-64 DATE : 2020 SEPTEMBER 7)
1) డి 2) ఎ 3) ఎ 4) బి 5) డి 6) డి 7) సి 8) సి 9) సి 10) ఎ  
All the best by www.gkbitsintelugu.blogspot.com 

8, సెప్టెంబర్ 2020, మంగళవారం

YSR UCHITA VYAVASAYA VIDYUTTU PATHAKAM

 "వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు" పథకం


  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి ఏర్పాటు చేసిన పథకమే 'వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు' పథకం.
  • ఈ పథకం కింద రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్తు అందించేందుకు వారు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు నగదు బదిలీ ద్వారా దీనికోసం ఉద్దేశించిన ప్రత్యేక రైతు బ్యాంక్ ఖాతాలో వేస్తుంది. ఆ అకౌంట్ ద్వారా బిల్లుల మొత్తాన్ని విద్యుత్ సంస్థలకు రైతే చెల్లించడం జరుగుతుంది.

పథకం ముఖ్యోద్దేశం :

'రైతుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను హక్కుగా అందించడం' ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

పథకం ప్రారంభం :

  • కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఈ పథకాన్ని 2020 డిసెంబర్ నెల నుండి 'శ్రీకాకుళం' జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) గా అమలు చేస్తారు. ప్రాజెక్ట్ అమలులో చిన్న చిన్న సమస్యలేమైనా వస్తే పరిష్కరించి, 2021 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.

పథకం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు :

  1. ప్రభుత్వం నుండి ఎంత ధన సహాయం అందుతుందన్నది రైతుకి స్పష్టం అవుతుంది.
  2. ప్రభుత్వం నుండి అందుకున్న ధనం విద్యుత్ కంపెనీకి బిల్లు రూపంలో చెల్లించడం వల్ల రైతన్నకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ కంపెనీని అడిగే హక్కు వస్తుంది. విద్యుత్ కంపెనీలు రైతులకి జవాబుదారీగా నిలుస్తాయి.
  3. నెల నెలా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం, అదే డబ్బును బిల్లుల రూపేణా రైతులు విద్యుత్ కంపెనీలకు చెల్లించడం ద్వారా బకాయిలు అన్నవి విద్యుత్ కంపెనీలకు ఇక ఉండవు కాబట్టి అవి మెరుగైన సేవలు ఖచ్చితంగా అందించగలుగుతాయి.
  4. మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అవుతున్న విద్యుత్ నాణ్యత మెరుగుపడుతుంది.
  5. మీటర్లు ఏర్పాటు చేయటం వల్ల ఎవరెవరికి విద్యుత్ అందుతుందో, ఏ రైతుకు ఏ కారణంచేత విద్యుత్ అందడం లేదో వెంటనే తెలుస్తుంది. దీంతో విద్యుత్ అందని మోటార్లకు వెంటనే విద్యుత్ అందించే విధంగా చర్యలు చేపట్టి రైతులకు మేలు చేయవచ్చు.
  6. రైతు పేరిన తెరిచే ప్రత్యేక ఖాతా కేవలం విద్యుత్ కంపెనీకి చెల్లింపులు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నిధులు వ్యవసాయ విద్యుత్ కు నేరుగా చెల్లించేలా ఈ ఖాతా ఉంటుంది.
  7. ప్రభుత్వం నగదు బదిలీ ఆలస్యం చేసినప్పటికీ, రైతులకు విద్యుత్ సరఫరా ఎట్టి పరిస్థితులలోనూ ఆగదు. ఆమేరకు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
  8. ప్రస్తుతం ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో వారి పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ తెరిచి దాంట్లో బిల్లు మొత్తం జమ చేస్తారు. కౌలు రైతులు ప్రస్తుతం ఏవిధంగా సాగు చేస్తున్నారో అదేవిధంగా ఇకపై ఉచిత విద్యుత్ పొంది సాగు చేసుకోవచ్చు. వారికి ఎటువంటి అసౌకర్యం ఉండదు.


పథకానికి సంబంధించిన ఇతర విషయాలు :

  • మీటరు బిగించడానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
  • మీటరు మరమ్మత్తు ఖర్చులు పూర్తిగా విద్యుత్ కంపెనీలు భరిస్తాయి.
  • ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించరు.
  • అనధికార కనెక్షన్ లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అనధికార కనెక్షన్ లను గతంలో లాగానే, రూ. 1,200 ప్రతి కిలోవాట్ కి డెవలప్మెంట్ ఛార్జీ మరియు రూ. 40 ప్రతి హెచ్.పి (Horse Power) కి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత సర్వీస్ క్రమబద్ధీకరిస్తారు. క్రమబద్ధీకరణ తర్వాత సర్వీసులకు మీటర్లను కూడా గతంలో లాగానే ప్రభుత్వమే ఉచితంగా అమరుస్తుంది.
  • అదనపు లోడ్ కనెక్షన్ లను కూడా క్రమబద్ధీకరిస్తారు. అధిక లోడ్ ఉన్న రైతులకు కూడా ఉచిత విద్యుత్ వర్తిస్తుంది. అదనపు లోడ్ ఉన్నట్లయితే గతంలో ఉన్న రేట్ల ప్రకారమే రూ. 1,200 ప్రతి కిలోవాట్ కి డెవలప్మెంట్ ఛార్జీ మరియు రూ. 40 ప్రతి హెచ్.పి (Horse Power) కి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత అదనపు లోడు క్రమబద్ధీకరిస్తారు.
  • చాలా కనెక్షన్లు పూర్వపు భూయజమానుల పేర్లమీద ఉన్నాయి. అటువంటి కనెక్షన్లన్నీ ప్రస్తుత యజమానుల పేర్లమీదకి మారుస్తారు. పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం ఆధారంగా పేరు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ప్రస్తుత యజమానికి పేరు మార్పిడికి అవసరమైన రెండు పత్రాలు అందుబాటులో లేకపోతే, గ్రామ రెవిన్యూ అధికారి ధృవీకరించిన వాంగ్మూలం ఆధారంగా, వారి కోరిక మేరకు పేరు మార్చబడుతుంది.
  • పేర్ల మార్పు ప్రక్రియ కోసం కానీ, బ్యాంకు ఖాతాలు తెరవడానికి కానీ, రైతు ఎవరి దగ్గరకూ వెళ్లవలసిన అవసరం లేదు. విద్యుత్ కంపెనీ మరియు గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రైతు దగ్గరకి వచ్చి అవసరమైన మార్పు చేర్పులు చేస్తారు.
  • రైతులకు రానున్న 30 సంవత్సరాలు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందజేయడానికి 10,000 మెగావాట్ల 'సోలార్ పవర్ ప్రాజెక్ట్'ను ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చేపడుతోంది.

పథకం అమలులో సమస్యలుంటే ... :

  • విద్యుత్ సంస్థల టోల్ ఫ్రీ నంబర్ 1912 కి ఫోన్ చేసి ఫిర్యాదులు పరిష్కరించుకోవచ్చు.




6, సెప్టెంబర్ 2020, ఆదివారం

GK TEST-63

1. 'సావిత్రిబాయి పూలే'ను మనదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తించి, ఆమె జయంతి సందర్భంగా ఏటా ఏతేదీన "జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం"ను నిర్వహిస్తున్నారు ?
(ఎ) జనవరి 1
(బి) జనవరి 2
(సి) జనవరి 3
(డి) జనవరి 4

2. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నడుస్తున్న విద్యావిధానం ?
(ఎ) గురు కేంద్ర
(బి) శిశు కేంద్ర
(సి) విషయ కేంద్ర
(డి) సాంకేతిక కేంద్ర

3. వార్షిక ప్రపంచ ఓపెన్ ఆన్ లైన్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన భారత తొలి ఆటగాడు ?
(ఎ) ఇనియన్
(బి) సనన్
(సి) సెవియన్
(డి) నైజిక్

4. 1962లో చైనాతో యుద్ధం తర్వాత ఆదేశ జోరును కట్టడి చేయడానికి మనదేశం సిద్ధం చేసిన ఫోర్స్ ?
(ఎ) స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (SFF)
(బి) సశస్త్ర సీమా బల్ (SSB)
(సి) భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ దళం (ITBP)
(డి) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)

5. డేటా గోప్యత, జాతీయ భద్రత కారణాలరీత్యా చైనా మూలాలున్న 'పబ్ జీ' (PUBG) సహా 118 యాప్ లను భారత్ నిషేధించిన తేదీ ?
(ఎ) 2020 సెప్టెంబర్ 1
(బి) 2020 సెప్టెంబర్ 2
(సి) 2020 సెప్టెంబర్ 3
(డి) 2020 సెప్టెంబర్ 4



6. ప్రస్తుతం చైనా కబ్జాలో ఉన్న 'ఫింగర్ 4' (FINGER 4) పర్వతాలు పాంగాంగ్ సరస్సుకు ఏ తీరంలో ఉన్నాయి ?
(ఎ) తూర్పు
(బి) పశ్చిమ
(సి) ఉత్తర
(డి) దక్షిణ

7. 'ఇస్రో' (ISRO) వచ్చే ఏడాది చేపట్టే చంద్రయాన్-3 కోసం భారీ బండరాళ్లు, గుంతలు, గడ్డకట్టిన మట్టితో ఉండే చంద్రుని ఉపరితలాన్ని పోలిన కృత్రిమ నిర్మాణాన్ని (Artificial Moon Craters) కర్ణాటక రాష్ట్రంలోని చెళ్లకెరె ప్రాంతంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? (ఈ కృత్రిమ చంద్రుని ఉపరితల నిర్మాణం (Artificial Moon Craters) కోసం 'ఇస్రో' రూ. 24.2 లక్షలు ఖర్చు చేయనుంది)
(ఎ) సిద్దాపుర
(బి) ఉళ్లర్తి
(సి) నగరంగెరె
(డి) నన్నివళ

8. జపాన్ జాతీయ ఎన్నికల్లో 'షింజో అబే' మొత్తంగా ఎన్నిసార్లు విజయం సాధించారు ? (పెద్దప్రేగులో సమస్య  కారణంగా ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు 'షింజో అబే' ఇటీవల ప్రకటించారు. జపాన్ లో దీర్ఘకాలం ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా 'షింజో అబే' రికార్డ్ సృష్టించారు)
(ఎ) 2
(బి) 4
(సి) 6
(డి) 8

9. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని ఏ పంచాయతీ పరిధిలో 'ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ' (IALA - ఐలా) ఏర్పాటుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలుపుతూ 2020 ఆగస్ట్ 28న ఉత్తర్వులిచ్చింది ?
(ఎ) బాహుబలేంద్రునిగూడెం
(బి) గోపవరపుగూడెం
(సి) వెంకటనరసింహపురం
(డి) వీరపనేనిగూడెం

10. 'ద బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో' (BBB ⇒ The Banks Board Bureau) సిఫారసు ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తదుపరి చైర్మన్ ?
(ఎ) ఎస్.ఎస్.మల్లికార్జునరావు
(బి) మృత్యుంజయ్ మహాపాత్ర
(సి) ఆదిత్యపురి
(డి) దినేష్ కుమార్ ఖారా



       
కీ (GK TEST-63 DATE : 2020 SEPTEMBER 6)
1) సి 2) బి 3) ఎ 4) ఎ 5) బి 6) సి 7) బి 8) సి 9) డి 10) డి
All the best by www.gkbitsintelugu.blogspot.com