ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, ఆగస్టు 2020, సోమవారం

ECI GUIDELINES COVID-19 PANDEMIC

భారత ఎన్నికల సంఘం-మార్గదర్శకాలు-కొవిడ్-19 మహమ్మారి

(ELECTION COMMISSION of INDIA-GUIDELINES-COVID-19 PANDEMIC)


  • 'కరోనా' నేపథ్యంలో దేశంలో నిర్వహించే ఉప, సాధారణ ఎన్నికల కోసం 'కేంద్ర ఎన్నికల సంఘం' (ELECTION COMMISSION of INDIA) 2020 ఆగస్ట్ 21 న మార్గదర్శకాలు (Guidelines) జారీ చేసింది.
  • అభ్యర్థులు, ప్రచారంలో పాల్గొనే వ్యక్తులు, పోలింగ్ అధికారులు పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించింది.
  • 'కరోనా' నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి 2020 జూలై 29 న కేంద్ర హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాలు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలకు లోబడి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

పోటీ చేసే అభ్యర్థులు (CANDIDATES) :

  1. అభ్యర్థులు నామినేషన్ల కార్యక్రమానికి రెండుకి మించి వాహనాల్ని వినియోగించరాదు. ఇద్దరే హాజరు కావాలి.
  2. సెక్యూరిటీ డిపాజిట్ (Security deposit) ఆన్ లైన్ (Online) లో చెల్లించాలి.
  3. నామినేషన్ పత్రం, అఫిడవిట్ ను ఆన్ లైన్ (Online) లో భర్తీ చేసే ఐచ్చికాన్ని ఇచ్చారు. తర్వాత దాన్ని ప్రింటవుట్ (Printout) తీసుకుని నోటరీ (Notary) చేయించి రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించాలి.
  4. ఇంటింటి ప్రచారంలో అభ్యర్థి సహా ఐదుగురికి మించి పాల్గొనకూడదు.
  5. రోడ్ షోల్లో (Road Shows) భద్రతా సిబ్బంది వాహనం సహా 5 (FIVE) వాహనాలనే అనుమతిస్తారు. కొంత వ్యవధి తర్వాత మరో 5 వాహనాలు వెళ్లవచ్చు.

అధికారులు (OFFICERS) :

  1. జిల్లా అధికారులు ముందుగానే బహిరంగ సభల ప్రదేశాలను గుర్తించి వాటికి వేర్వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు (Separate Entrance and Exit ways) ఏర్పాటు చేయాలి.
  2. సభా ప్రాంగణాల్లో భౌతిక దూరం పాటించేలా సూచీలు ఏర్పాటు చేయాలి.
  3. ఎన్నికల ప్రక్రియలో అవసరమైన అన్నిచోట్లా 'మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్లు, చేతి తొడుగులు, ఫేస్ షీల్డ్ లు, పీపీఈ కిట్లు (Mask, Sanitizer, Thermal Scanners, Hand Gloves, Face Shields, PPE Kits) ఉపయోగించాలి.
  4. ఇదివరకు ఒక పోలింగ్ బూత్ (Polling Booth) కు గరిష్ఠంగా 1500 ఓటర్లను కేటాయించేవారు. ఇప్పుడు గరిష్ఠంగా 1000 మంది ఓటర్లకు ఒక్కో పోలింగ్ బూత్ (Polling Booth) ఉండేలా చూస్తారు.
  5. పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీన్ పరికరాలు అమర్చాలి.
  6. ఓటర్ల శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా ఉంటే వారికి టోకెన్లు (Tokens) జారీ చేసి పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటు వేసేందుకు అనుమతించాలి.


ఓటర్లు (VOTERS) :

  1. ఓటర్ రిజిస్టర్ (Voter Register) లో సంతకం చేసేందుకు, ఈవీఎం (EVM ⇒ Electronic Voting Machine) మీట నొక్కేందుకు గాను ఓటర్లందరికీ చేతి తొడుగులు అందజేస్తారు.
  2. 'కరోనా' ఉన్న ఓటర్లు, క్వారంటైన్ (QUARANTINE) లో ఉన్న వ్యక్తులను పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటింగ్ కు అనుమతిస్తారు. ఆ సమయంలో వైద్య అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.

పోస్టల్ బ్యాలెట్లు (POSTAL BALLOTS) :

  1. వయోధికులు, దివ్యాంగులతో పాటు 'కరోనా' సోకిన, సోకిందన్న అనుమానంతో క్వారంటైన్ (QUARANTINE) లో ఉన్న వ్యక్తులకూ 'పోస్టల్ బ్యాలెట్' (Postal Ballot) సదుపాయం కల్పించనున్నారు.
  2. 'పోస్టల్ బ్యాలెట్' (Postal Ballot) సదుపాయాన్ని కోరుతున్న వ్యక్తులు అభ్యర్ధన పత్రాన్ని నింపాల్సి ఉంటుంది.
  3. అధికారులు బ్యాలెట్ పత్రాన్ని ఓటర్లు ఉంటున్న చోటుకే తీసుకొస్తారు. ఓటు వేసే ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తారు.

నిబంధనల అమలుపై నిఘా :

  1. జిల్లాల్లో అధికారులు అన్నిచోట్లా 'కొవిడ్-19' (COVID-19) నియంత్రణ నిబంధనలు అమలు చేస్తున్నారా ? లేదా ? అని చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక 'నోడల్ హెల్త్ ఆఫీసర్' (Nodal Health Officer) ను నియమిస్తారు.
  2. 'రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ' (SDMA ⇒ State Disaster Management Authority) నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ మంది గుమికూడకుండా జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
  3. 'కొవిడ్-19' (COVID-19) నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై 'ప్రకృతి వైపరీత్య నియంత్రణ చట్టం-2005' లోని సెక్షన్ 51-60 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి.

లెక్కింపు కేంద్రాలు (COUNTING CENTRES) :

  1. ప్రతి చోటా సాధ్యమైనంత పెద్ద హాళ్లను ఉపయోగించుకోవాలి.
  2. ఒక్కో లెక్కింపు కేంద్రంలో 7 టేబుళ్లకు మించి ఏర్పాటు చేయకూడదు. ఎక్కువ అవసరమైతే అదనంగా హాళ్లను తీసుకొని, సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది.
  3. అన్ని హాళ్లు, రూముల్లోకి ప్రవేశించే వారిని థర్మల్ స్క్రీనింగ్ చేసి చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్, సబ్బు అందుబాటులో ఉంచాలి.


30, ఆగస్టు 2020, ఆదివారం

GK TEST-61

1. జల విద్యుత్ కేంద్రాల్లో ప్రపంచంలోనే భారీ ప్రమాదం 2009 లో "సైనో షుషెన్స్ కయా" లో జరిగింది. ఈ జలవిద్యుత్తు కేంద్రం ఉన్న దేశం ? (ఈ ప్రమాదంలో 75 మంది ప్రాణాలు కోల్పోయారు)
(ఎ) జపాన్
(బి) చైనా
(సి) రష్యా
(డి) దక్షిణ కొరియా

2. దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాల రేటు 1.9 శాతం కాగా అది ఆంధ్రప్రదేశ్ లో ఏవిధంగా ఉంది ?
(ఎ) 0.7 %
(బి) 0.8%
(సి) 0.9%
(డి) 1.0%

3. మనదేశ క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం ఏ క్రీడాకారులకు 'అర్జున' అవార్డులను ఇవ్వడానికి నిరాకరించింది ? (ఈ క్రీడాకారులు ఇంతకుముందే రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలు పొందియున్నారు. అందువలన 'అర్జున' అవార్డులకు వీరి దరఖాస్తులను క్రీడా మంత్రిత్వ శాఖ తిరస్కరించడం జరిగింది)
(ఎ) రాణి రాంపాల్ (హాకీ), వినేస్ ఫొగాట్ (రెజ్లింగ్)
(బి) మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), తంగవేలు మరియప్పన్ (పారాలింపియన్)
(సి) ఉష (బాక్సింగ్), లఖా సింగ్ (బాక్సింగ్)
(డి) సాక్షి మలిక్ (రెజ్లింగ్), మీరాబాయ్ చాను (వెయిట్ లిఫ్టింగ్)

4. 2020 వ సంవత్సర జాతీయ క్రీడా పురస్కారాలలో ఎంతమందికి 'రాజీవ్ ఖేల్ రత్న' అవార్డులు ప్రకటించారు ?
(ఎ) 3
(బి) 5
(సి) 7
(డి) 9

5. కేంద్ర ప్రభుత్వం 2020 ఆగస్ట్ 21 న దేశవ్యాప్తంగా 47 మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక టీచర్ ? (ఈ టీచర్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం 'కాశీబుగ్గ' జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల (ZPHS) లో 'ఆంగ్లం' బోధిస్తుంటారు)
(ఎ) వుమ్మాజీ పద్మప్రియ
(బి) అసపాన మధుబాబు
(సి) గీతా కుమారి
(డి) సునీల్ కుమార్



6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొవిడ్ ఆసుపత్రుల సంఖ్యను 138 నుంచి ఎంతకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' వెల్లడించారు ?
(ఎ) 285
(బి) 286
(సి) 287
(డి) 288

7. కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ? (ECI New Commissioner) (అశోక్ లవాసా రాజీనామాతో 2020 ఆగస్ట్ 31 నుంచి ఖాళీ అయ్యే స్థానంలో ఇతను నియమింపబడ్డారు)
(ఎ) రాజీవ్ గౌబ
(బి) రాజీవ్ కుమార్
(సి) రాజీవ్ రాయ్ భట్నాగర్
(డి) రాజీవ్ త్రివేది

8. 'కరోనా' నేపథ్యంలో దేశంలో నిర్వహించే ఉప, సాధారణ ఎన్నికల కోసం 'కేంద్ర ఎన్నికల సంఘం' (ECI ⇒ ELECTION COMMISSION OF INDIA) జారీ చేసిన నూతన మార్గదర్శకాల (New Guidelines) ప్రకారం ... గరిష్ఠంగా ఎంతమంది ఓటర్లకు ఒక్కో పోలింగ్ బూత్ (Polling Booth) ఉండేలా చూస్తారు ?
(ఎ) 500
(బి) 1000
(సి) 1500
(డి) 2000

9. ఏ ఎగుమతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన శాఖకు 'ఎగుమతుల ప్రోత్సాహక అవార్డు 2020' (Export Promotion Award-2020) లభించింది ?
(ఎ) కొబ్బరి
(బి) మామిడి
(సి) జీడిమామిడి
(డి) అరటి

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన ప్రక్రియ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీకి సహకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘాలు ఎన్ని ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4

        
కీ (GK TEST-61 DATE : 2020 AUGUST 30)
1) సి 2) సి 3) డి 4) బి 5) బి 6) సి 7) బి 8) బి 9) డి 10) డి 


All the best by www.gkbitsintelugu.blogspot.com 

24, ఆగస్టు 2020, సోమవారం

YSR BIMA

 వైఎస్సార్ బీమా (YSR BIMA)

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు "వైఎస్సార్ బీమా" (YSR BIMA) పథకాన్ని అమలు చేయనున్నారు.
  2. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఈ పథకం (YSR BIMA) కింద ఆర్ధిక సహాయం అందుతుంది.
  3. 18 - 50 ఏళ్ల మధ్య వ్యక్తి సహజ మరణం పొందితే రూ. 2 లక్షలు, ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా రూ. 5 లక్షలు ఇస్తారు.
  4. 51 - 70 ఏళ్ల వయసు వ్యక్తి ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా రూ. 3 లక్షలు పరిహారం అందుతుంది.
  5. ఈ పథకం (YSR BIMA) పై ప్రభుత్వం రూ. 583.5 కోట్లు ఖర్చు చేస్తుంది.
  6. గతంలో కేంద్ర ప్రభుత్వం 'పీఎంజేజేవై' (PMJJY) పథకం కింద సగం మొత్తం (రూ.396 కోట్లు) అందజేసేది.
  7. కేంద్రం ఆ పథకాన్ని (PMJJY) రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో ఈ పథకాన్ని (YSR BIMA) అమలు చేయాలని నిర్ణయించింది.

23, ఆగస్టు 2020, ఆదివారం

PRIVACY POLICY

PRIVACY POLICY


  1. www.gkbitsintelugu.blogspot.com' is a blog contains the information related to 'General Knowledge and Current Affairs' which is much useful for the persons who prepare for the competitive exams.
  2. I (Akkireddy Srinivasa Rao) the author of this blog (www.gkbitsintelugu.blogspot.com) collect the data from different news papers and put them in the format of 'Multiple Choice Questions', which can be found in the label (menu) called "GK TESTS" in this blog (www.gkbitsintelugu.blogspot.com).
  3. I am publising this blog (www.gkbitsintelugu.blogspot.com) in the local language called "TELUGU".
  4. Some Errors & Omissions may be expected from this blog (www.gkbitsintelugu.blogspot.com). So, before going to take final decision about the content of this blog (www.gkbitsintelugu.blogspot.com), I request you to confirm once again the accuracy and quality of the content from other sources also as and much you can.
  5. I am publishing this blog (www.gkbitsintelugu.blogspot.com) for my own interest only. You can use this blog (www.gkbitsintelugu.blogspot.com) content for your personal purpose only i.e., for preparation of exams, for increasing the general knowledge and so on. But, you should not use this blog   (www.gkbitsintelugu.blogspot.com) content for commercial purpose i.e., publishing the same in your blog, website or any other places.
  6. I am not copying any content as it is for publishing this blog (www.gkbitsintelugu.blogspot.com) from any blog, website or any other places.
  7. Any legal issues about this blog (www.gkbitsintelugu.blogspot.com) come under 'VISAKHAPATNAM' jurisdiction only.
  8. I am publishing this blog (www.gkbitsintelugu.blogspot.com) for my purpose only. So, you can use this blog (www.gkbitsintelugu.blogspot.com) content if it is useful for you otherwise you can leave it.
  9. I am publishing this blog (www.gkbitsintelugu.blogspot.com) by using the platform called 'Blogger'  which is a 'Google' related company. So, Blogger, Google may send cookies to collect the information about you i.e., your name, your phone number, your email ID and so on. So, if you provide your information to 'Google, Blogger' means that you agree to the terms & conditions of them.
  10. You can find third party related links in this blog (www.gkbitsintelugu.blogspot.com) which bring you to other websites, blogs or any other pages. These also use some cookies or any other software to collect the information about you i.e., your name, your phone number, your email ID and so on. So, if you provide your information to them means that you agree to the terms & conditions of them.
  11. If you give your name, your phone number, your email ID or any other information related to you in the comment box or any other places of this blog (www.gkbitsintelugu.blogspot.com) means that you agree the terms & conditions (Privacy policy) of this blog (www.gkbitsintelugu.blogspot.com).
  12. I do not misuse your information (your name, your phone number, your email ID) wantedly which is being provided by you.
  13. Terms & Conditions (Privacy policy) of this blog (www.gkbitsintelugu.blogspot.com) may change from  ptime to time. So, you should check the privacy policy of this blog  (www.gkbitsintelugu.blogspot.com) regularly as and when you follow this blog (www.gkbitsintelugu.blogspot.com).  

GK TEST-60

1. 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించి చరిత్ర సృష్టించిన  మొట్టమొదటి అమెరికా టెక్ దిగ్గజ సంస్థ ?
(ఎ) గూగుల్
(బి) ఆపిల్
(సి) మైక్రోసాఫ్ట్
(డి) ఐబీఎం

2. రెండేళ్ల వరకూ నిల్వ ఉండే "ఫావిపిరవిర్" (FAVIPIRAVIR) ఔషధాన్ని 'అవిగన్' (AVIGAN) బ్రాండ్ పేరుతో మన దేశ మార్కెట్లోకి విడుదల చేసిన ప్రముఖ ఔషధ సంస్థ ? (ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి 'కొవిడ్-19' బాధితులకు ఈ ఔషధాన్ని (FAVIPIRAVIR) వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇతర కంపెనీల 'ఫావిపిరవిర్' ఔషధం గడువు మూడు నెలలు మాత్రమే)
(ఎ) డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్
(బి) సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
(సి) అరబిందో ఫార్మా లిమిటెడ్
(డి) లుపిన్ లిమిటెడ్

3. 2019-20 ఆర్ధిక సంవత్సరం ఆడిట్ ఖాతాలను ఖరారు చేయటం కోసం పదే పదే కోరినప్పటికీ తగిన సమాచారాన్ని అందించటం లేదని ఆరోపిస్తూ, చట్టబద్ధ ఆడిటర్ (STATUTORY AUDITOR) బాధ్యతల నుంచి ఇటీవల 'పీ డబ్ల్యూ సీ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఎల్ ఎల్ సీ' (PWC CHARTERED ACCOUNTANTS LLC) తప్పుకుంది. 'పీ డబ్ల్యూ సీ' (PWC ⇒ PRICEWATERHOUSECOOPERS) ఏ గ్రూపు సంస్థలపై ఈ ఆరోపణలు చేసింది ? (ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ' ఆధ్వర్యంలో పనిచేసే 'ఎన్ ఎఫ్ ఆర్ ఏ' (NFRA ⇒ National Financial Reporting Authority) దృష్టి సారించింది)
(ఎ) హిందూజా గ్రూప్
(బి) సహారా గ్రూప్
(సి) డీ ఎల్ ఎఫ్ గ్రూప్
(డి) జీవీకే గ్రూప్

4. సర్వేయర్ జనరల్ అఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం 'సర్వే ఆఫ్ ఇండియా' (SURVEY OF INDIA) రూపొందించిన భారత పొలిటికల్ మ్యాప్ (INDIA POLITICAL MAP) లో తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ?
(ఎ) అమరావతి
(బి) విశాఖపట్నం
(సి) కర్నూలు
(డి) అమరావతి, విశాఖపట్నం, కర్నూలు



5. 'కరోనా' వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఆయుర్వేద మూలికలతో ఔషధ గుణాలను పొదువుతూ, వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందించే చేనేత చీరలు తయారవుతున్న రాష్ట్రం ? (సుగంధ మూలికలను (యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, వాము, బిర్యాని ఆకు, వివిధ రకాల పుష్పాలు) 48 గంటల పాటు నీటిలో నానబెట్టి తయారు చేసిన రసాన్ని ఆవిరిగా మార్చి ప్రతి చీరకూ దశలవారీగా పట్టిస్తారు)
(ఎ) హిమాచల్ ప్రదేశ్
(బి) ఉత్తరప్రదేశ్
(సి) ఆంధ్రప్రదేశ్
(డి) మధ్యప్రదేశ్

6. లబ్ధిదారులు తినగలిగే, నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దకే సరఫరా చేసే కార్యక్రమాన్ని 'శ్రీకాకుళం' జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఏ తేదీ నుంచి అమలు  చేయనున్నారు ? (మట్టి, రాళ్లు లేకుండా, నూకలు 15 శాతానికి మించని సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ఇస్తారు)
(ఎ) 2020 అక్టోబర్ 1
(బి) 2020 నవంబర్ 1
(సి) 2020 డిసెంబర్ 1
(డి) 2021 జనవరి 1

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 'పంచాయతీరాజ్ శాఖ' లో ఎంపీడీఓ (MPDO ⇒ MANDAL PARISHAD DEVELOPMENT OFFICER) లుగా నియమితులైన వారికి పదోన్నతులకు వీలు కల్పించేందుకు కొత్తగా సృష్టిస్తున్న "డివిజినల్ డెవలప్ మెంట్ ఆఫీసర్" (DIVISIONAL DEVELOPMENT OFFICER) పోస్టులెన్ని ?
(ఎ) 51
(బి) 61
(సి) 71
(డి) 81

8. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం కాలపరిమితి ?
(ఎ) 2020-2021
(బి) 2020-2022
(సి) 2020-2023
(డి) 2020-2024

9. ఏ తేదీ నాటికి డ్వాక్రా (DWCRA) సంఘాల మహిళలు బ్యాంకులకు బకాయిపడ్డ రుణాల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఖాతాల్లో 4 విడతలుగా జమచేయనుంది ? (దీని ద్వారా 9,33,180 సంఘాలకు చెందిన సుమారు 90 లక్షల మంది సభ్యులకు రూ. 27,169 కోట్ల లబ్ది చేకూరుతుంది)
(ఎ) 2019 ఏప్రిల్ 10
(బి) 2019 ఏప్రిల్ 11
(సి) 2019 ఏప్రిల్ 12
(డి) 2019 ఏప్రిల్ 13



10. కడప జిల్లాలో 'ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్' (ELECTRONICS MANUFACTURING CLUSTER) ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
(ఎ) బుగ్గలాపల్లి
(బి) చింతకొమ్మదిన్నె
(సి) ఇప్పపెంట
(డి) కొప్పర్తి               

     
కీ (GK TEST-60 DATE : 2020 AUGUST 23)
1) బి 2) ఎ 3) డి 4) ఎ 5) డి 6) సి 7) ఎ 8) సి 9) బి 10) డి 
All the best by www.gkbitsintelugu.blogspot.com 

21, ఆగస్టు 2020, శుక్రవారం

NATIONAL RECRUITMENT AGENCY

జాతీయ నియామకాల సంస్థ 

(NATIONAL RECRUITMENT AGENCY)


  1. ఒకే దేశం - ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం "జాతీయ నియామకాల సంస్థ" (NATIONAL RECRUITMENT AGENCY ⇒ NRA) ని ఏర్పాటు చేయాలని 2020 ఆగస్ట్ 19 న ప్రధాని 'నరేంద్ర మోదీ' అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది.
  2. రైల్వే (RRB), బ్యాంకింగ్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కింద వేర్వేరుగా భర్తీ చేసే ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఈ ఏజెన్సీ (NRA) ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి 'జితేంద్రసింగ్' వెల్లడించారు. దశలవారీగా ఈ సంస్థలను పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు.
  3. స్వతంత్ర భారతదేశంలో ఇదో విప్లవాత్మక సంస్కరణ.
  4. ఎన్ ఆర్ ఎ (NRA) పరిధిలోకి కేంద్ర ప్రభుత్వంలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు.
  5. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున సుమారు వెయ్యి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నచోట ఒకటికి మించి నెలకొల్పుతారు. గ్రామీణ అభ్యర్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత జిల్లాలోనే పరీక్ష రాయడానికి వీలవుతుంది.
  6. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్ మూడేళ్లు చెల్లుబాటవుతుంది. స్కోర్ పెంచుకోవడానికి అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయొచ్చు. అత్యుత్తమ స్కోర్ నే పరిగణనలో తీసుకుంటారు.
  7. ప్రస్తుతం 12 భాషల్లో పరీక్ష జరుగుతుంది. తర్వాత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో ఉన్న భారతీయ భాషలన్నింటిలో నిర్వహిస్తారు.
  8. వేర్వేరు రుసుములతో అనేకసార్లు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
  9. ఆర్ ఆర్ బీ (RAILWAY RECRUITMENT BOARD), ఎస్ ఎస్ సి (STAFF SELECTION COMMISSION), ఐ బీ పీ ఎస్ (INSTITUTE of BANKING PERSONNEL SELECTION) కింద ఏటా 1.25 లక్షల గ్రూప్ - బి, సి ఉద్యోగాల ఖాళీలు ఏర్పడుతున్నాయి.
  10. వీటికి దాదాపు 3 కోట్ల మంది హాజరవుతుంటారు. ఖాళీల భర్తీకి 12-18 నెలల సమయం పట్టేది.
  11. నియామక పరీక్షల్లో ఒక అంచె తగ్గించడానికి ఈ మూడు సంస్థలకు (RRB, SSC, IBPS) కలిపి ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో స్కోర్ ఆధారంగా ఇవి తదుపరి పరీక్షలను వేర్వేరుగా నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు.
  12. ఎన్ ఆర్ ఏ (NRA) ను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేస్తారు. చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు. పాలకమండలిలో RRB, SSC, IBPS ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
  13. తొలి మూడేళ్లలో నిర్వహణకు రూ. 1,517.57 కోట్లు కేటాయిస్తారు.
  14. నూతన విధానం వల్ల తుది పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య 5 శాతానికి పరిమితం అవుతుంది.
  15. తొలిదశ పరీక్షను ఆన్లైన్ (ONLINE) లో నిర్వహిస్తారు. తక్షణం స్కోర్ లభిస్తుంది. దాని ఆధారంగా అభ్యర్థి ఈ మూడు బోర్డుల్లోని (RRB, SSC, IBPS) ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని, దానికి అవసరమైన తదుపరి దశ పరీక్ష రాయొచ్చు.
  16. ప్రస్తుతం ఈ ఏజెన్సీ (NRA) పరిధిని 3 నియామక బోర్డులకే (RRB, SSC, IBPS) వర్తింపజేస్తున్నారు. అంతా గాడిన పడుతున్నకొద్దీ కేంద్రంలోని 20 నియామక సంస్థలనూ దీని పరిధిలోకి తీసుకువస్తారు.
  17. అన్ని ప్రాథమిక పరీక్షలకూ ఒకే సిలబస్ ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు.
  18. ఉమ్మడి రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా అభ్యర్థులు తమకు సమీపంలోని కేంద్రాలను ఎంచుకోవచ్చు.
  19. ఒకే క్వశ్చన్ బ్యాంక్ (QUESTION BANK) ఉంటుంది. సురక్షితమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రీయంగా సర్వర్ ను నిర్వహిస్తారు.
  20. 117 ఆకాంక్షిత జిల్లాల నుంచి ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెంచడానికి ప్రత్యేక చేయూతనందిస్తారు. అక్కడి వారికి అవసరమైన సాయం చేయడానికి 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తారు. ఈ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలకు అవసరమైన వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 'వ్యయ సర్దుబాటు నిధి' ఇస్తుంది.
  21. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
  22. గరిష్ఠ వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా అభ్యర్థులు వీటిని రాయవచ్చు.
  23. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు.
  24. అభ్యర్థుల స్కోర్లు ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటాయి. వీటి ఆధారంగా అవి నియామకాలు చేపట్టవచ్చు.
  25. రెండో దశ పరీక్ష అవసరం లేకుండా మొదటి దశలోని స్కోర్, వైద్య పరీక్షల ఆధారంగానే నియామకాలు చేసుకుంటామని కొన్ని సంస్థలు సూచనప్రాయంగా చెప్పడం అభ్యర్థులకు మరింత ఊరటగా ప్రభుత్వం పేర్కొంది. 

19, ఆగస్టు 2020, బుధవారం

GK TEST-59

1. "వైఎస్సార్ చేయూత" (YSR CHEYUTHA) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2020 ఆగస్టు 10
(బి) 2020 ఆగస్టు 11
(సి) 2020 ఆగస్టు 12
(డి) 2020 ఆగస్టు 13

2. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే పురస్కారాలలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి "గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక" విభాగంలో పురస్కారం పొందిన గ్రామం ?
(ఎ) చెల్లూరు (తూర్పుగోదావరి జిల్లా)
(బి) బొండపల్లి (విజయనగరం జిల్లా)
(సి) మూలస్థానం (తూర్పుగోదావరి జిల్లా)
(డి) జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా)

3. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే పురస్కారాలలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి "సాధారణ విభాగం" లో జిల్లాస్థాయి పురస్కారం పొందిన జిల్లా ?
(ఎ) తూర్పుగోదావరి
(బి) విజయనగరం
(సి) పశ్చిమగోదావరి
(డి) కృష్ణా

4. చెక్కు లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు కొత్తగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" (RBI) తీసుకురానున్న పధ్ధతి ? (ఈ పద్ధతిని రూ. 50,000 పైన ఉండే అన్ని చెక్కులకు వర్తింపచేయనున్నారు)
(ఎ) మొబైల్ పే
(బి) పాజిటివ్ పే
(సి) ఫోన్ పే
(డి) ఫోటో పే

5. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే పురస్కారాలలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి "చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డ్" పొందిన గ్రామం ?
(ఎ) చెల్లూరు (తూర్పుగోదావరి జిల్లా)
(బి) బొండపల్లి (విజయనగరం జిల్లా)
(సి) మూలస్థానం (తూర్పుగోదావరి జిల్లా)
(డి) జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా)



6. 2020 ఆగష్టు 15 న అంతర్జాతీయ వన్డే క్రికెట్, టీ20లకు వీడ్కోలు పలికిన భారతీయ క్రికెటర్ 'మహేంద్ర సింగ్ ధోని' టీ20 క్రికెట్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ? (అన్ని ఐసీసీ ప్రధాన టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్ 'మహేంద్ర సింగ్ ధోని'. ఉదా : 2007 ⇒ టీ20 ప్రపంచకప్, 2011 ⇒ వన్డే ప్రపంచకప్, 2013 ⇒ ఛాంపియన్స్ ట్రోఫీ)
(ఎ) 56
(బి) 57
(సి) 58
(డి) 59

7. 2020 ఆగస్టు 15 న జరిగిన 74వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రసంగిస్తూ ... "దేశంలోని 173 సరిహద్దు జిల్లాల్లోని యువత కోసం లక్షమంది కేడెట్లను (ONE LAKH CADETS) తయారు చేయడం ద్వారా ఎన్సీసీ (NCC ⇒ NATIONAL CADET CORPS) ని విస్తరిస్తాం" అని తెలియజేసారు. ఈ లక్షమంది కేడెట్లలో బాలికల వాటా ?
(ఎ) నాలుగింట ఒక వంతు (1/4)
(బి) నాలుగింట రెండు వంతులు (2/4)
(సి) మూడింట ఒక వంతు (1/3)
(డి) మూడింట రెండు వంతులు (2/3)

8. వచ్చే వెయ్యి రోజుల్లో (3 ఏళ్లలో) మనదేశంలోని సుమారు ఎన్ని గ్రామాలకు 'ఓ ఎఫ్ సీ' (OFC ⇒ OPTICAL FIBER CABLE) వేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ?
(ఎ) 5 లక్షలు
(బి) 6 లక్షలు
(సి) 7 లక్షలు
(డి) 8 లక్షలు

9. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్థాయీసంఘం సభ్యత్వానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 192 మందిలో మొత్తం ఎంతమంది భారత్ కు మద్దతుగా నిలిచారు ?
(ఎ) 180
(బి) 182
(సి) 184
(డి) 186



10. కొవిడ్-19 (COVID-19) వ్యాధి నిర్ధారణ, చికిత్సకు సంబంధించి అందుబాటులో ఉన్న వసతులపై ప్రజలకు సమాచారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ? (COVID-19 Andhra Pradesh State Helpline Number)
(ఎ) 8297104104
(బి) 8247899530
(సి) 8333817955
(డి) 8331821499    
 
 
 కీ (GK TEST-59 DATE : 2020 AUGUST 19)
1) సి 2) బి 3) సి 4) బి 5) సి 6) ఎ 7) సి 8) బి 9) సి 10) ఎ
All the best by www.gkbitsintelugu.blogspot.com 

16, ఆగస్టు 2020, ఆదివారం

GK TEST-58

1. కొవిడ్-19 (COVID-19) మహమ్మారి నివారణకు మొట్టమొదటిసారిగా "స్పుత్నిక్-వి" (SPUTNIK-V) టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన దేశం ? (ఈ టీకా ను 2020 ఆగస్టు 11 న రిజిస్టర్ చేసారు. ఈ టీకా తో 2 సంవత్సరాల పాటు రక్షణ లభిస్తుంది)
(ఎ) అమెరికా
(బి) రష్యా
(సి) బ్రిటన్
(డి) భారత్

2. శ్రీలంక నూతన ప్రధాని ?
(ఎ) గొటబాయ రాజపక్స
(బి) మహింద రాజపక్స
(సి) బసిల్ రాజపక్స
(డి) మైత్రిపాల సిరిసేన

3. ఈ సంవత్సరంలో విడుదల చేసిన "ఫార్చూన్ గ్లోబల్ 500" (FORTUNE GLOBAL 500) జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరిన ఏకైక భారతీయ కంపెనీ 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' స్థానం ?
(ఎ) 93
(బి) 94
(సి) 95
(డి) 96

4. కేంద్ర గణాంక విభాగం తాజాగా విడుదల చేసిన '2018 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం గణాంకాలు' ప్రకారం 90%కి పైగా జననాలు, మరణాలు నమోదు చేస్తున్న రాష్ట్రాలు ? (ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి)
(ఎ) 6
(బి) 7
(సి) 8
(డి) 9

5. కేంద్ర గణాంక విభాగం తాజాగా విడుదల చేసిన '2018 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం గణాంకాలు' ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకంటే పురుషుల మరణాలు ఎంతశాతం అధికంగా ఉన్నాయి ?
(ఎ) 39%
(బి) 49%
(సి) 59%
(డి) 69%



6. పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహించడానికి సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ట్రాన్స్ కో కు చెల్లించాల్సిన పంపిణీ చార్జీలు మినహాయిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఏ తేదీలోగా ఏర్పాటు చేసిన 'సౌర, పవన, హైబ్రిడ్' సంస్థలు రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (RPO) పరిధిలో ఉన్నా, లేకున్నా ఈ మినహాయింపు వర్తిస్తుంది ?
(ఎ) 2021 జూన్ 30
(బి) 2022 జూన్ 30
(సి) 2023 జూన్ 30
(డి) 2024 జూన్ 30

7. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే 'ఇ-పంచాయత్ పురస్కార్' విభాగంలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4

8. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే పురస్కారాలలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి "నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం" పొందిన గ్రామం ?
(ఎ) చెల్లూరు (తూర్పుగోదావరి జిల్లా)
(బి) బొండపల్లి (విజయనగరం జిల్లా)
(సి) మూలస్థానం (తూర్పుగోదావరి జిల్లా)
(డి) కరప (తూర్పుగోదావరి జిల్లా)

9. 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన "దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాలు ?
(ఎ) 9
(బి) 10
(సి) 11
(డి) 12



10. భారత ఒలింపిక్స్ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన ఏకైక ప్లేయర్ ?
(ఎ) కరణం మల్లీశ్వరి
(బి) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
(సి) పీ.వీ.సింధు
(డి) అభినవ్ బింద్రా

       
కీ (GK TEST-58 DATE : 2020 AUGUST 16)
1) బి 2) బి 3) డి 4) డి 5) సి 6) సి 7) బి 8) ఎ 9) సి 10) డి
All the best by www.gkbitsintelugu.blogspot.com 

15, ఆగస్టు 2020, శనివారం

YSR CHEYUTHA

 వైఎస్సార్ చేయూత (YSR CHEYUTHA)

పథకం ప్రారంభం :

  • "వైఎస్సార్ చేయూత" పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2020 ఆగస్టు 12 న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

పథకం ప్రయోజనాలు :

  1. మహిళా సాధికారతే లక్ష్యంగా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ' పేద మహిళలకు (సుమారు 23 లక్షల మంది) ఏటా రూ. 18,750/- చొప్పున నాలుగేళ్లలో రూ. 75,000/- ఆర్ధిక సాయం.
  2. "వైఎస్సార్ చేయూత" పథకం ద్వారా పొందే డబ్బు వాడడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ. అంటే ఈ డబ్బులను జీవనోపాధి కార్యక్రమాలకు, చిన్న మధ్య తరహా వ్యాపారాలను నడుపుకోవడానికి లేదా మరే ఇతర అవసరానికైనా వినియోగించుకోవచ్చు.
  3. ప్రభుత్వం సూచించిన జీవనోపాధి పొందే మార్గాలపై ఈ డబ్బును వినియోగిస్తే, లబ్దిదారులైన మహిళల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు 'మార్కెటింగ్, సాంకేతికపరమైన సహకారాన్నీ, అదనపు బ్యాంకు రుణాలు" అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
  4. సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలు అందించేలా ఇప్పటికే 'అమూల్, ఐటీసీ, హెచ్ యూ ఎల్, పీ & జీ, రిలయన్స్' (AMUL, ITC, HUL, P & G, RELIANCE) లాంటి ప్రఖ్యాత,దిగ్గజ కంపెనీలతోపాటు బ్యాంకులతో కూడా ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనివల్ల లబ్దిదారులైన మహిళలకు వ్యాపార అవకాశాలు కలుగజేస్తారు.

12, ఆగస్టు 2020, బుధవారం

GK TEST-57

 

1. 2020 ఆగస్ట్ 8 న భారత 14వ "కాగ్" (CAG ⇒ COMPTROLLER and AUDITOR GENERAL) గా బాధ్యతలు స్వీకరించిన జమ్మూకశ్మీర్ తాజా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ? (ఆయన ఈ పదవిలో ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయస్సు వరకు కానీ ఉంటారు)
(ఎ) మనోజ్ సిన్హా
(బి) ఆర్.కే.మాథుర్
(సి) రంజన్ గొగోయ్
(డి) గిరీష్ చంద్ర ముర్ము

2. హలధారి బలరాముడి జయంతి అయిన 'హల షష్ఠి' ని పురస్కరించుకొని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' రూ. లక్ష కోట్లతో "వ్యవసాయ మౌలిక వసతుల నిధి" ని ప్రారంభించిన తేదీ ? (ఈ నిధితో రైతులు తమ ఊర్లోనే ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు. ఈ నిధి ద్వారా పొందే రుణాలపై 3% వడ్డీ రాయితీ లభిస్తుంది)
(ఎ) 2020 ఆగస్ట్ 10
(బి) 2020 ఆగస్ట్ 9
(సి) 2020 ఆగస్ట్ 8
(డి) 2020 ఆగస్ట్ 7

3. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే వినతుల్ని గడువులోగా పరిష్కరించేలా పర్యవేక్షించేందుకు "పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్" (PMU ⇒ PERSUASION and MONITORING UNIT) వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ సీఎం 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన తేదీ ? ('పీఎంయూ' (PMU) ద్వారా మొదట 4 సేవలపై పర్యవేక్షణ ఉంటుంది. అక్టోబరు నుంచి 543 సేవలను పర్యవేక్షిస్తారు)
(ఎ) 2020 ఆగష్టు 10
(బి) 2020 ఆగష్టు 11
(సి) 2020 ఆగష్టు 5
(డి) 2020 ఆగష్టు 1

4. ఫుల్ సెమిస్టర్ పద్ధతిలో 'బయాలజీ, ఇంజనీరింగ్' కలయికలా ఉండే "బయోమిమిక్రీ" (BIOMIMICRY) అనే కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న ఐఐటీ ? (ఈ కోర్సులో చేరాలనుకునే వాళ్లు 9176612393 నంబరులో లేదా shiva@thinkpaperclip.com ఈ మెయిల్ ఐడీలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు)
(ఎ) ఐఐటీ - ఖరగ్ పూర్
(బి) ఐఐటీ - బాంబే
(సి) ఐఐటీ - మద్రాస్
(డి) ఐఐటీ - కాన్పూర్



5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్తవ్యస్థంగా ఉన్న రెవెన్యూ రికార్డులను సరిచేయడానికి భూములను సర్వే చేయడానికి "కార్స్" (CORS ⇒ CONTINUALLY OPERATING REFERENCE STATION) సాంకేతికతతో ప్రయోగాత్మకంగా భూముల సర్వే నిర్వహించిన 'జగ్గయ్యపేట' మండలం ఏ జిల్లాలో ఉంది ?
(ఎ) కృష్ణా
(బి) గుంటూరు
(సి) తూర్పు గోదావరి
(డి) పశ్చిమ గోదావరి

6. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2014 మార్చి 28 న నియమించిన నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించినది ?
(ఎ) జస్టిస్ శ్రీ కృష్ణ
(బి) షీలా భిడే
(సి) జస్టిస్ ధర్మాధికారి
(డి) శివరామకృష్ణన్

7. 'పోలవరం' ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించిన తేదీ ?
(ఎ) 2014 ఏప్రిల్ 1
(బి) 2014 మే 1
(సి) 2014 జూన్ 1
(డి) 2014 జూలై 1

8. దిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ?
(ఎ) స్వాతి మలివాల్
(బి) యోగితా భయానా
(సి) లలిత టి. హెదావూ
(డి) రేఖా శర్మ

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 'మూడేళ్ల డిగ్రీ' లో ఉండే అప్రెంటిస్ షిప్ సమయం ? (అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలు 2020 అక్టోబరు 15 న తెరవనున్నారు)
(ఎ) 5 నెలలు
(బి) 10 నెలలు
(సి) 15 నెలలు
(డి) 20 నెలలు



10. ఏ సంవత్సరం నాటికి దశలవారీగా 101 రకాల ఆయుధాలు, పోరాట వ్యవస్థల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత రక్షణ శాఖ మంత్రి 'రాజ్ నాథ్ సింగ్' 2020 ఆగష్టు 9 న ప్రకటించారు ?
(ఎ) 2022
(బి) 2023
(సి) 2024
(డి) 2025

    
కీ (GK TEST-57 DATE : 2020 AUGUST 12)
1) డి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) ఎ 8) ఎ 9) బి 10) సి

All the best by www.gkbitsintelugu.blogspot.com 

4, ఆగస్టు 2020, మంగళవారం

SAHELI

సహేలి (SAHELI)

కార్యక్రమం ప్రారంభం :

  • "సహేలి" కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది.

కార్యక్రమం ఉద్దేశాలు :

  1. మహిళా సాధికారతతోపాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం.
  2. హస్తకళలు, బొమ్మలు, వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేసే మహిళలను 'అమెజాన్' (AMAZON) సంస్థ ద్వారా ప్రోత్సహించడం.
  3. రాష్ట్రంలో నెలకొల్పనున్న 30 నైపుణ్య కళాశాలల్లో ఒకచోట 'అమెజాన్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' (Amazon Centre of Excellence) ను ఏర్పాటుచేసి ఇక్కడ తయారయ్యే వస్తువులకు 'మార్కెటింగ్, శిక్షణ, ప్రోత్సాహం, అమ్మకాలు' వరకు బాసటగా నిలిచేలా చూడడం.

GK TEST-56

1. "ప్రవాసీ రోజ్ గార్" (PRAVASI ROJGAR) పోర్టల్ ద్వారా వలస కూలీలకు 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ప్రకటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ? (2020 జూలై 30 న తన 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు)
(ఎ) అక్షయ్ కుమార్
(బి) సోనూ సూద్
(సి) రణ్ బీర్ కపూర్
(డి) వివేక్ ఒబెరాయ్

2. అయోధ్యలో నిర్మితం కానున్న 'రామ మందిరం' ఆకృతిని ఏ శైలిలో రూపొందించారు ?
(ఎ) నాగర
(బి) ద్రావిడ
(సి) ఇండోనేషియన్
(డి) కళింగ

3. భారతదేశంలో 'కరోనా' తొలి కేసు కేరళలో నమోదైన తేదీ ?
(ఎ) 2020 జనవరి 25
(బి) 2020 జనవరి 30
(సి) 2020 ఫిబ్రవరి 5
(డి) 2020 ఫిబ్రవరి 10

4. "పోర్ట్ లూయిస్" లో నిర్మించిన మారిషస్ దేశ సుప్రీంకోర్ట్ భవనాన్ని ఆ దేశ ప్రధాని 'ప్రవింద్ కుమార్ జగన్నాధ్' తో కలిసి భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2020 జూలై 28
(బి) 2020 జూలై 29
(సి) 2020 జూలై 30
(డి) 2020 జూలై 31



5. రాష్ట్రాలకు వస్తు, సేవల పన్ను (GST ⇒ Goods and Services Tax) ఆదాయం తగ్గినా, పరిహారం చెల్లించాల్సిన 'చట్టబద్ధ బాధ్యత' కేంద్ర ప్రభుత్వానికి లేదని తెలియజేసిన భారత ప్రస్తుత 'అటార్నీ జనరల్' ?
(ఎ) కె.కె. వేణుగోపాల్
(బి) ముకుల్ రోహత్గీ
(సి) గులాం ఈ వాహనవతి
(డి) సోలీ సొరాబ్జీ

6. అమెరికా ఆర్ధిక వ్యవస్థ 'ఏప్రిల్-జూన్' (2020) త్రైమాసికంలో ఎంత శాతం వార్షిక రేటుతో క్షీణించింది ? (ఒక త్రైమాసికంలో ఇంత గణనీయంగా ఆర్ధిక వ్యవస్థ క్షీణించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి)
(ఎ) 31%
(బి) 32%
(సి) 33%
(డి) 34%

7. మహిళల టెన్నిస్ సింగిల్స్ ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి ?
(ఎ) ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)
(బి) నవోమీ ఒసాకా (జపాన్)
(సి) సిమోనా హలెప్ (రొమేనియా)
(డి) కరోలిన్ వొజనైక్ (డెన్మార్క్)

8. అంగారకుడి (అరుణ గ్రహం) గుట్టుమట్లు తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష సంస్థ "నాసా" (NASA) 2020 జూలై 30 న ప్రయోగించిన అత్యంత అధునాతనమైన 'రోవర్' పేరు ? (ఈ రోవర్ 2021 ఫిబ్రవరి 18 న అంగారక ఉపరితలంపై కాలుమోపుతుంది)
(ఎ) ఇన్ జెన్యూటీ
(బి) అట్లాస్ - 5
(సి) జెజెరో
(డి) పర్ సెవరెన్స్

9. 'పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ' ప్రస్తుత 'సీ ఈ ఓ' (CEO ⇒ Chief Executive Officer) ? (ప్రస్తుతం 'గోదావరి నదీ యాజమాన్య మండలి' చైర్మన్ గా ఉన్న ఇతను 'పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ' సీ ఈ ఓ గా మరో ఆరు నెలలు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు)
(ఎ) చంద్రశేఖర్ అయ్యర్
(బి) హరికేష్ మీనా
(సి) యూసీ సింగ్
(డి) అలీం బాషా

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యంకార్డు ను 'ఆదాయ ధ్రువపత్రం' గా గుర్తించాలని 2020 జూలై 25 న ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన రద్దు చేసుకుంది ? (బియ్యం కార్డు లేకుంటే 'ఆదాయ ధ్రువపత్రం' తీసుకోవాలని, అది నాలుగేళ్లపాటు మనుగడలో ఉంటుందనే ఉత్తర్వులు ఇకమీదట చెల్లుబాటు కావు. "స్వయంచాలిత" (AUTOMATIC) విధానంలో వీటిని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది)
(ఎ) 2020 జూలై 31
(బి) 2020 జూలై 30
(సి) 2020 జూలై 29
(డి) 2020 జూలై 28 



కీ (GK TEST-56 DATE : 2020 AUGUST 4)
1) బి 2) ఎ 3) బి 4) సి 5) ఎ 6) సి 7) ఎ 8) డి 9) ఎ 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com