ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, ఏప్రిల్ 2021, గురువారం

OSCAR WINNERS 2021 (93RD ACADEMY AWARDS) NAMES IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

ఆస్కార్ అవార్డు విజేతలు - 2021వ సంవత్సరం (93వ అకాడమీ అవార్డులు)
[OSCAR WINNERS 2021 (93RD ACADEMY AWARDS)]



పురస్కారాలు-విజేతలు-వివరాలు
వ. సం.    విభాగంవిజేత
1ఉత్తమ నటుడుఆంథోని హాప్కిన్స్ (ది ఫాదర్)
2ఉత్తమ సహాయ నటుడుడేనియల్ కలువోయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ)
3ఉత్తమ నటిఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ (నోమాడ్ ల్యాండ్) 
4ఉత్తమ సహాయ నటియు జంగ్ యున్ (మినారి)
5ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రంసోల్
6ఉత్తమ సినిమాటోగ్రఫీ ఎరిక్ (మాంక్)
7ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అన్ రోత్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
8ఉత్తమ దర్శకత్వంక్లోయూ జావ్ 
9ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) మై ఆక్టోపస్ టీచర్
10ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్)కొలెట్టే 
11ఉత్తమ ఎడిటింగ్మిక్కెల్ ఇ జి.నీల్సన్ (సౌండ్ ఆఫ్ మెటల్) 
12అంతర్జాతీయ ఉత్తమ చిత్రంఅనదర్ రౌండ్ (డెన్మార్క్)
13ఉత్తమ మేకప్ హెయిర్ స్టైలింగ్సెర్గియో లోపేజ్ రివేరా, మియా నీల్, జమికా విల్సన్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)  
14ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్)ట్రెంట్ రెజ్ నోర్, అట్టికస్ రోస్, జాన్ బటిస్టే (సోల్)  
15ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్)ఫైట్ ఫర్ యు (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ) 
16ఉత్తమ చిత్రంనోమాడ్ ల్యాండ్
17ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్డోనాల్డ్ గ్రాహం బర్ట్, జాన్ పాస్కల్ (మాంక్) 
18ఉత్తమ లఘు చిత్రం (యానిమేటెడ్)ఇఫ్ ఎనీథింగ్ హాపెన్స్ ఐ లవ్యూ
19ఉత్తమ లఘు చిత్రం (లైవ్ యాక్షన్)టు డిస్టెంట్ స్ట్రేంజర్స్
20ఉత్తమ సౌండ్సౌండ్ ఆఫ్ మెటల్
21ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్టెనెట్
22ఉత్తమ రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)క్రిస్టోఫర్ హాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్ (ది ఫాదర్)   
23ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్ ప్లే)ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ వుమన్)


ఇతర విశేషాలు

ఉత్తమ దర్శకురాలు (BEST DIRECTOR) :

  • 'ఉత్తమ దర్శకత్వం' విభాగంలో "క్లోయూ జావ్" (CHLOE ZHAO) అనే మహిళ ఎంపికైంది. ఆస్కార్ చరిత్రలో ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా మరియు ఆసియా నుంచి తొలిసారిగా ఈ అవార్డుని అందుకున్న మొదటి మహిళగా 'క్లోయూ జావ్' రికార్డు సృష్టించింది. 'క్లోయూ జావ్' తన మూడో సినిమా (NOMADLAND) కే ఈ ఘనతను సాధించింది.

ఉత్తమ నటి (BEST ACTRESS) :

  • 'నోమాడ్ ల్యాండ్' (NOMADLAND) చిత్రంలో నటించిన "ప్రాన్సెస్ మెక్ డోర్మండ్" (FRANCES MCDORMAND) ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇప్పటికే 1997లో 'ఫర్గో' లో నటనకు, 2018లో 'త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి' లో నటనకు 'ఉత్తమ నటి' గా అవార్డులు అందుకున్నారు.
  • ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో అమెరికా ఎదుర్కొన్న అతి పెద్ద నిరుద్యోగ విపత్తు .. దాని వల్ల జరిగిన పరిణామాల నేపథ్యంలో సంచార జీవితంపై 'నోమాడ్ ల్యాండ్' (NOMADLAND) తెరకెక్కింది. ఇలా 'ఫెర్న్' అనే మహిళ పాత్రలో సంచార జీవిగా చేసిన నటనకు 'ప్రాన్సెస్ మెక్ డోర్మండ్' ను ఆస్కార్ అవార్డు వరించింది.    

ఉత్తమ నటుడు (BEST ACTOR) :

  • 'ది ఫాదర్' (THE FATHER) చిత్రంలోని నటనకు "ఆంథోని హాప్కిన్స్" (ANTHONY HOPKINS) ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్నారు. ఈ చిత్రంలో మతిమరుపున్న వృద్ధుడిగా .. ఆయన నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఆయన వయసు 83 ఏళ్లు. దీంతో ఎక్కువ వయసులో ఈ అవార్డును గెలుచుకున్న నటుడిగా రికార్డు సృష్టించారు. ఈయన కన్నా ముందు 2012లో 82 ఏళ్ల వయసులో 'బిగినర్స్' చిత్రంలో నటించిన 'క్రిస్టోఫర్ ప్లమ్మర్' పేరిట ఈ రికార్డు ఉండేది. 'ఆంథోని హాప్కిన్స్' ఇంతకుముందు 1992లో 'సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్' చిత్రానికిగానూ అవార్డు గెలుచుకున్నారు.   

ఉత్తమ సహాయ నటి (BEST SUPPORTING ACTRESS) :

  • 'మినారి' (MINARI) లో అమ్మమ్మగా ప్రేక్షకుల హృదయాలను తడి చేసిన నటి "యు జంగ్ యున్" (YOUN YUH-JUNG) కు 'ఉత్తమ సహాయ నటి' విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ ఘనత సాధించిన రెండో ఆసియన్ నటిగా 'యు జంగ్ యున్' చరిత్ర సృష్టించింది. ఈమె కన్నా ముందు 'మియోషి ఉమెకి' అనే జపనీస్ నటి 'సయోనర' (1957) చిత్రానికి గానూ ఇదే విభాగానికి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఎక్కువ వయసులో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకున్న వారిలో 'యు జంగ్ యున్' మూడో స్థానంలో నిలిచారు. 73 ఏళ్లకు ఈమెను పురస్కారం వరించగా .. 'పెగ్గీ యాష్ క్రాఫ్ట్ (77), జోసెఫైన్ హల్ (74)' ఈమె కంటే ముందున్నారు.      

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (BEST COSTUME DESIGNER) :

  • 'మా రైనీస్ బ్లాక్ బాటమ్' (MA RAINEY'S BLACK BOTTOM) చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన "అన్ రోత్" (ANN ROTH) ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. 89 ఏళ్ల వయసులో ఆస్కార్ ను చేజిక్కించుకొని అత్యధిక వయస్సులో ఈ అవార్డును సొంతం చేసుకున్న మహిళగా చరిత్రకెక్కారు. ఈవిడే ఇంతకుముందు 'ది ఇంగ్లీష్ పేషెంట్' సినిమాకూ ఆస్కార్ అందుకున్నారు. 

ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్ ప్లే) (BEST ORIGINAL SCREEN PLAY) :

  • దాదాపు 13 ఏళ్ల తర్వాత 'ఒరిజినల్ స్క్రీన్ ప్లే' విభాగంలో మహిళకు ఆస్కార్ దక్కింది. 2007లో వచ్చిన 'జునో' చిత్రానికి గానూ 'డియాబ్లో క్లోడి' చివరిసారిగా అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. 'ప్రామిసింగ్ యంగ్ వుమన్' (PROMISING YOUNG WOMAN) చిత్రానికి గానూ "ఎమరాల్డ్ ఫెన్నెల్" (EMERALD FENNELL) అనే మహిళకు 'ఒరిజినల్ స్క్రీన్ ప్లే' విభాగంలో ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు లభించింది. 'ఎమరాల్డ్ ఫెన్నెల్' ఈ చిత్రానికి దర్శకురాలిగా కూడా వ్యవహరించారు.  

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రం (BEST ANIMATED FEATURE FILM) :

  • "సోల్" (SOUL) ఈ సంవత్సరం ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. 'పీట్ డాక్టర్' ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతో ఆయన దర్శకత్వం వహించిన మూడు సినిమాలు (సోల్, ఇన్ సైడ్ అవుట్, అప్) 'బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం' కేటగిరీలో ఆస్కార్ గెలుచుకున్నట్లైంది. జాజ్ సంగీతకారుడు కావాలనుకునే 'జో' అనే స్కూల్ టీచర్ జీవితం చుట్టూ తిరిగే ఈ చిత్రం సినీ అభిమానుల గుండెల్లో ప్రత్యేక ముద్ర వేసింది.
  • 2002లో 'యానిమేటెడ్ పిక్చర్' ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు "ఫిక్సర్" నిర్మాణ సంస్థ మొత్తం 11 సార్లు ఆస్కార్ గెలుచుకుంది.  


27, ఏప్రిల్ 2021, మంగళవారం

GK TEST-60 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో ఎన్ని అవార్డులు లభించాయి ? ["దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్ 2021" (మదింపు సంవత్సరం : 2019-20) [Deen Dayal Upadhyay Panchayat Sashaktikaran Puraskar 2021 (Appraisal Year 2019-20)] అవార్డులు జిల్లా స్థాయిలో 'గుంటూరు, కృష్ణా' ; మండల స్థాయిలో 'సదుం (చిత్తూరు జిల్లా), కాకినాడ గ్రామీణం (తూర్పుగోదావరి జిల్లా), విజయవాడ గ్రామీణం (కృష్ణా జిల్లా), పెనుగొండ (అనంతపురం జిల్లా)' ; పంచాయతీ స్థాయిలో 'రేణిమాకులపల్లి (చిత్తూరు జిల్లా), తాళ్లపాలెం, తడ కండ్రిగ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), కొండేపల్లి (ప్రకాశం జిల్లా), పెదలబుడు (విశాఖపట్నం జిల్లా), గుళ్లపల్లి (గుంటూరు జిల్లా), వర్కూర్ (కర్నూలు జిల్లా)' లకు అవార్డులు లభించాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ. 50 వేలు, మండల స్థాయి అవార్డుకు రూ. 25 వేలు, పంచాయతీ స్థాయి అవార్డులకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలను 'కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ' అందిస్తుంది]   

(ఎ) 17 
(బి) 18  
(సి) 19  
(డి) 20 

2. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో లభించిన అవార్డులలో "గ్రామాభివృద్ధి ప్రణాళికల తయారీ" విభాగంలో ఎంపికైన పంచాయతీ ? 

(ఎ) గుళ్లపల్లి (గుంటూరు జిల్లా) 
(బి) వర్కూర్ (కర్నూలు జిల్లా)  
(సి) జి.రాగంపేట (తూర్పు గోదావరి జిల్లా)   
(డి) పెదలబుడు (విశాఖపట్నం జిల్లా) 

3. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో లభించిన అవార్డులలో "ఈ-పంచాయతీ పురస్కారం" (e-panchayat Award) కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఎన్నో స్థానంలో నిలవడం ద్వారా అవార్డుకు ఎంపికైంది ? 

(ఎ) 1  
(బి) 2 
(సి) 3 
(డి) 4 



4. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో లభించిన అవార్డులలో "చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీ అవార్డు 2021" (Child-friendly Gram Panchayat Award-2021) కు ఎంపికైన పంచాయతీ ?    

(ఎ) పెనబర్తి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) 
(బి) గుళ్లపల్లి (గుంటూరు జిల్లా) 
(సి) పెదలబుడు (విశాఖపట్నం జిల్లా) 
(డి) వర్కూరు (కర్నూలు జిల్లా) 

5. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో లభించిన అవార్డులలో "నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం 2021" (Nanaji Deshmukh Rashtriya Gaurav Gram Sabha Puraskar 2021) ఏ పంచాయతీకి లభించినది ? 

(ఎ) అయ్యవారిపల్లి  (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా)   
(బి) కొత్త వెల్లంటి (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా)  
(సి) పాత వెల్లంటి (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా)  
(డి) సీతారామపురం (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా) 

6. పారిశుద్ధ్యం, ఇతర పరిస్థితుల మెరుగుకు ఉపకరిస్తుందంటూ .. బ్రిటిష్ ప్రభుత్వం 'చీరాల, పేరాల' పంచాయతీలను కలిపి 1920లో పురపాలక సంఘం (MUNICIPALITY) గా ప్రకటించి, పన్నులు భారీగా పెంచింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు 'దుగ్గిరాల గోపాలకృష్ణయ్య' గారి నేతృత్వంలో ఏ తేదీ నుంచి పుర బహిష్కరణ చేశారు ? [ఈ నిరసన "చీరాల-పేరాల ఉద్యమం" (CHIRALA-PERALA MOVEMENT) గా చరిత్రకెక్కింది] 

(ఎ) 1921 ఏప్రిల్ 23 
(బి) 1921 ఏప్రిల్ 24 
(సి) 1921 ఏప్రిల్ 25 
(డి) 1921 ఏప్రిల్ 26 



7. '29వ యుద్ వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం' (29TH YUDHVIR FOUNDATION MEMORIAL AWARD) ను పొందిన డాక్టర్ ? [ప్రసూతి వైద్యం, మహిళా సాధికారతకు కృషి చేస్తున్నందుకు ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 ఏప్రిల్ 30న జరిగే అంతర్జాల కార్యక్రమ వేదికగా ఉపరాష్ట్రపతి 'ఎం.వెంకయ్య నాయుడు' ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రశంసాపత్రం, రూ. లక్ష గౌరవ పారితోషికం అందజేస్తారు] 

(ఎ) డాక్టర్ మీనాక్షి రామచంద్రన్ 
(బి) డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్  
(సి) డాక్టర్ సునీత కుమారి 
(డి) డాక్టర్ ప్రభ అగర్వాల్ 

8. 'ఆర్చరీ ప్రపంచ కప్ ' తొలిదశ టోర్నీ (ARCHERY WORLD CUP STAGE 1) మహిళల రికర్వ్ విభాగంలో ఏ దేశ జట్టును ఓడించడం ద్వారా భారత్ 'స్వర్ణం' సాధించింది ? [ప్రపంచకప్ టోర్నీలో మహిళల రికర్వ్ విభాగంలో భారత జట్టుకు స్వర్ణం దక్కడం ఇది ఐదోసారి]    

(ఎ) మెక్సికో  
(బి) యూఎస్ఏ   
(సి) జర్మనీ 
(డి) కొలంబియా  

9. 'కొవిడ్-19' నివారణకు ఉద్దేశించిన "కొవిషీల్డ్" (COVISHIELD) టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ. 400 ధరకు సరఫరా చేస్తామని టీకా తయారీదారు 'సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' ప్రకటించింది. ఇదే టీకాను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర (ఒక్కో డోసుకు) ? 

(ఎ) రూ. 500   
(బి) రూ. 600  
(సి) రూ. 700  
(డి) రూ. 800  



10. 'కొవిడ్-19' నివారణకు ఉద్దేశించిన "కొవాగ్జిన్" (COVAXIN) టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ. 600 ధరకు సరఫరా చేస్తామని టీకా తయారీదారు 'భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్' సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల 2021 ఏప్రిల్ 24న పేర్కొన్నారు. ఇదే టీకాను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర (ఒక్కో డోసుకు) ? [కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ ధరలు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. 'కొవాగ్జిన్' (COVAXIN) టీకాను భారత ప్రభుత్వానికి ఒక డోసుకు రూ. 150 ధరకు అందిస్తున్నారు]    

(ఎ) రూ. 1,000 
(బి) రూ. 1,200 
(సి) రూ. 1,500 
(డి) రూ. 1,800              

కీ (KEY) (GK TEST-60 YEAR : 2021)
1) ఎ    2) సి    3) బి    4) ఎ    5) సి    6) సి    7) బి    8) ఎ    9) బి    10) బి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

25, ఏప్రిల్ 2021, ఆదివారం

GK TEST-59 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. ఐటీ పరిశ్రమ సంఘం 'నాస్ కామ్' (NASSCOM) 2021-22 సంవత్సరానికి చైర్ పర్సన్ గా నియమితులైన అసెంచర్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ? [నాస్ కామ్ 30 ఏళ్ల చరిత్రలో చైర్ పర్సన్ గా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. 2021-22 సంవత్సరానికి వైస్ చైర్ పర్సన్ గా 'టీసీఎస్' (TCS) ప్రెసిడెంట్, హెడ్ (బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్) 'కృష్ణన్ రామానుజమ్' నియమితులయ్యారు]      
(ఎ) రోష్నీ నాడార్ 
(బి) రేఖ మేనన్   
(సి) దేవయాని ఘోష్  
(డి) ఇంద్రప్రీత్ సాహ్నీ 

2. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మేనేజ్మెంట్ పరిశోధనా వర్సిటీలు, బిజినెస్ స్కూల్స్, సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చే 'ది ఎస్ సీ ఎం జర్నల్ లిస్ట్' (The SCM Journal List) ర్యాంకింగ్స్ లో మనదేశానికి సంబంధించిన ఆపరేషన్స్ మేనేజ్మెంట్ పరిశోధనల విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూల్స్ లలో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' (ISB) ఏ స్థానంలో నిలిచింది ? [ప్రపంచస్థాయి 100 సంస్థల్లో 'ఐ ఎస్ బీ' (ISB) 64వ రాంక్ లో నిలిచింది. గత ఐదేళ్ల (2015-20) కాలంలో ప్రముఖ పరిశోధన జర్నల్స్ లో సప్లై చైన్ మేనేజ్మెంట్ కు సంబంధించిన పరిశోధన పేపర్ల ప్రచురణలను పరిగణనలోకి తీసుకుని 'ది ఎస్ సీ ఎం జర్నల్ లిస్ట్' (The SCM Journal List) ర్యాంకులను ప్రకటిస్తుంది]    
(ఎ) 1 
(బి) 2  
(సి) 3  
(డి) 4 

3. కొత్తగా అప్పు కోసం దరఖాస్తు చేసుకునేవారిపై బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుగా క్రెడిట్ విజన్ న్యూ టు క్రెడిట్ (NTC) స్కోరు అందుబాటులోకి తెస్తున్నట్లు 'ట్రాన్స్ యూనియన్ సిబిల్' (TransUnion CIBIL) వెల్లడించింది. ఈ స్కోరు ఏ శ్రేణిలో ఉంటుంది ? [ఈ స్కోరు అత్యధిక విలువ ఉంటే తక్కువ రిస్క్ ఉన్నట్లు , స్వల్ప స్కోరు ఉంటే .. రుణగ్రహీత చెల్లింపు జరపలేకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడిస్తుంది. ఈ స్కోరు క్రెడిట్ సంస్థలు, బ్యాంకులు ఉపయోగించుకునేందుకు వీలుంటుంది] 
(ఎ) 1-100  
(బి) 101-200 
(సి) 201-300 
(డి) 301-500 



4. 'కొవాగ్జిన్' టీకా (COVAXIN VACCINE) మూడో దశ క్లినికల్ పరీక్షల రెండో మధ్యంతర పరిశీలన ఫలితాల ప్రకారం .. ఈ టీకా 'తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన కొవిడ్-19 వ్యాధి' పై ఎంత శాతం ప్రభావశీలత కనబరచినట్లు 'భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్' (BHARAT BIOTECH INTERNATIONAL) 2021 ఏప్రిల్ 21న పేర్కొంది ?  
(ఎ) 75% 
(బి) 76%  
(సి) 77% 
(డి) 78% 

5. తిరుమల వేంకటాచలాన్నే ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా 'తితిదే' (TTD) అధికారికంగా ప్రకటించిన తేదీ ? [చారిత్రక, వాంగ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారాలతో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు పండిత పరిషత్ చైర్మన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి 'మురళీధర శర్మ' స్పష్టం చేశారు]  
(ఎ) 2021 ఏప్రిల్ 20   
(బి) 2021 ఏప్రిల్ 21  
(సి) 2021 ఏప్రిల్ 22  
(డి) 2021 ఏప్రిల్ 23 

6. 'వాతావరణ విపత్తును నివారించడం ఎలా ?' (HOW TO AVOID A CLIMATE DISASTER) అనే పుస్తకాన్ని రచించినది ? [మానవాళి అనాలోచిత కార్యక్రమాలతో వాతావరణం ధ్వంసం అయిందని, వీటి దుష్ప్రభావాలతోనే 'కరోనా' వైరస్ వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్నాయని ఈ పుస్తంలో రచయిత పేర్కొన్నారు]
(ఎ) బిల్ గేట్స్ 
(బి) వారెన్ బఫెట్ 
(సి) గ్రెటా థన్ బర్గ్ 
(డి) జెఫ్ బెజోస్ 



7. 2021 ఏప్రిల్ 10 నుంచి 2021 ఏప్రిల్ 24 వరకు పోలాండ్ లో జరిగిన 'ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్' (2021 AIBA YOUTH WORLD BOXING CHAMPIONSHIP) లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ సాధించిన పతకాల వివరాలు ?   
(ఎ) 6 స్వర్ణాలు, 5 కాంస్యాలు 
(బి) 7 స్వర్ణాలు, 4 కాంస్యాలు 
(సి) 8 స్వర్ణాలు, 3 కాంస్యాలు 
(డి) 9 స్వర్ణాలు, 2 కాంస్యాలు 

8. ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకుగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 42 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ 23న వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ? [దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కోర్సులు చేసే ప్రతి విద్యార్థికీ సంస్థ 100 డాలర్ల బహుమతిని, కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ ను ఇస్తుంది]  
(ఎ) గూగుల్  
(బి) టీసీఎస్   
(సి) మైక్రోసాఫ్ట్ 
(డి) ఇన్ఫోసిస్  

9. భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా (48TH CHIEF JUSTICE OF INDIA) 2021 ఏప్రిల్ 24న రాష్ట్రపతి భవన్ లోని 'అశోకా హాలు' లో ప్రమాణ స్వీకారం చేసిన తెలుగు వ్యక్తి "జస్టిస్ నూతలపాటి వెంకటరమణ" .. సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా అతనికి ఉన్న అనుభవ కాలం ? [ఇతను కృష్ణా జిల్లా, వీరులపాడు మండలం, 'పొన్నవరం' గ్రామంలో 1957 ఆగస్ట్ 27న జన్మించారు. జస్టిస్ కోకా సుబ్బారావు అనంతరం 55 ఏళ్ల తర్వాత న్యాయవ్యవస్థలో అత్యున్నత బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తిగా కీర్తి గడించారు]
(ఎ) 5 సంవత్సరాల 66 రోజులు  
(బి) 6 సంవత్సరాల 66 రోజులు 
(సి) 7 సంవత్సరాల 66 రోజులు  
(డి) 8 సంవత్సరాల 66 రోజులు  



10. "కష్టకాలం దృఢమైన వ్యక్తులను తయారు చేస్తుంది. అలాంటి దృఢమైన వ్యక్తులు మంచి కాలాన్ని సృష్టించగలుగుతారు" అని మానవ పరిణామ క్రమాన్ని చెప్పిన రచయిత 'మైఖేల్ హాఫ్' ఏ దేశస్థుడు ?  
(ఎ) స్పెయిన్ 
(బి) పోర్చుగల్ 
(సి) ఫ్రాన్స్ 
(డి) అల్జీరియా              

కీ (KEY) (GK TEST-59 YEAR : 2021)
1) బి    2) ఎ    3) బి    4) డి    5) బి    6) ఎ    7) సి    8) సి    9) సి    10) ఎ  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

24, ఏప్రిల్ 2021, శనివారం

GK TEST-58 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. "అనుపమ పుంచిమంద"  (ANUPAMA PUNCHIMANDA) అనే మహిళ ప్రత్యేకత ? [40 ఏళ్ల అనుపమ బెంగళూరులో 'కరోనా' వ్యాధికి చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 18న తుది శ్వాస విడిచింది] 
(ఎ) భారత్ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ కబడ్డీ రిఫరీ 
(బి) భారత్ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ వాలీబాల్ రిఫరీ  
(సి) భారత్ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ క్రికెట్ రిఫరీ  
(డి) భారత్ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ హాకీ రిఫరీ 

2. 'తాష్కెంట్' (ఉజ్బేకిస్థాన్) లో జరిగిన "ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్' (ASIAN WEIGHTLIFTING CHAMPIONSHIP) లో మహిళల 49 కేజీల విభాగంలో క్లీన్ అండ్ జెర్క్ లో 119 కేజీలు ఎత్తి 'జియాంగ్' (చైనా, 118 కేజీలు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును 2021 ఏప్రిల్ 17న బద్దలు కొట్టిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ ?  
(ఎ) జిలీ దలా బెహరా   
(బి) స్నేహ సోరెన్   
(సి) మీరాబాయి చాను   
(డి) రాఖీ హల్దిర్ 

3. లంచం తీసుకుంటూ 'ఏసీబీ' (ACB) కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కేసుల్లో ప్రభుత్వోద్యోగులపై ఎన్ని రోజుల్లోగా విచారణ పూర్తిచేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ? [నిర్దేశిత కాలపరిమితిలోగా వాటిని అమలు చేయటంలో విఫలమైతే .. ఆ జాప్యానికి సంబంధిత శాఖాధికారులు, ఏసీబీ అధికారుల్ని బాధ్యుల్ని చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది]   
(ఎ) 30  
(బి) 50 
(సి) 100 
(డి) 120 



4. 2019-20 రబీలో రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ క్రింద రూ. 128.47 కోట్లు వారి బ్యాంక్ పొదుపు ఖాతాలకు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసిన తేదీ ?  
(ఎ) 2021 ఏప్రిల్ 20 
(బి) 2021 ఏప్రిల్ 21 
(సి) 2021 ఏప్రిల్ 22 
(డి) 2021 ఏప్రిల్ 23 

5. 'ఐసీసీ' (ICC) అవినీతి వ్యతిరేక నియమావళిని ఉల్లంఘించినందుకు ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన మాజీ క్రికెటర్ 'దిల్హర లొకుహెట్టిగె' ఏ దేశస్థుడు ? [అతడు సస్పెండ్ అయిన తేదీ (2019 ఏప్రిల్ 3) నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది]   
(ఎ) జింబాబ్వే    
(బి) వెస్టిండీస్  
(సి) శ్రీలంక  
(డి) కెన్యా 

6. కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి 'సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సెలెన్సీ' (Certificate of Excellency) పురస్కారాన్ని దక్కించుకున్న కర్నూలు జిల్లాకు చెందిన పోలీస్ స్టేషన్ ? [నేర నియంత్రణ, వేగవంతమైన దర్యాప్తు, ఎస్సీ, ఎస్టీలపై, మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి నమోదు చేసిన కేసులు తదితర అంశాల ఆధారంగా ఈ పోలీస్ స్టేషన్ ను పురస్కారానికి ఎంపిక చేశారు]  
(ఎ) పెద్దకడబూరు 
(బి) పాణ్యం  
(సి) రుద్రవరం 
(డి) పాములపాడు 



7. మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడానికి సంబంధించిన వెబ్ సైట్ (http://tafcop.dgtelecom.gov.in) ను రూపొందించి 2021 ఏప్రిల్ 19న ప్రారంభించిన టెలికాం విభాగం (DOT) ? [ఈ వెబ్ సైట్ లో మొబైల్ నంబరు .. దానికి వచ్చే ఓటీపీ (OTP) ని నమోదు చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరు మీద ఉన్న వాటిని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే .. టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది]  
(ఎ) విజయవాడ 
(బి) విశాఖపట్నం 
(సి) తిరుపతి 
(డి) అనంతపురం 

8. ఏ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ 'కరోనా టీకా' అందించే స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది ? [సగం వ్యాక్సిన్ నిల్వలను నేరుగా రాష్ట్రాలకు సరఫరా చేసే అధికారాన్ని వ్యాక్సిన్ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది]  
(ఎ) 2021 మే 1  
(బి) 2021 మే 2  
(సి) 2021 మే 3 
(డి) 2021 మే 4  

9. అంగారకుడిపై జీవం ఆనవాళ్లను పసిగట్టే లక్ష్యంతో పంపిన 'పర్సెవరెన్స్' రోవర్ (PERSEVERANCE ROVER) లో భాగంగా 'నాసా' ప్రయోగించిన హెలికాప్టర్ "ఇన్ జెన్యుటీ" (INGENUITY) 39 సెకన్ల పాటు తొలిసారి గగనయానం చేసిన తేదీ ? [అంగారకుడిపై నియంత్రిత పద్ధతిలో, స్వీయ శక్తితో ఒక హెలికాప్టర్ గగనయానం చేయడం ఇదే తొలిసారి. 1.8 కిలోల బరువున్న ఈ హెలికాప్టర్ ను 'నాసా' 8.5 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించారు. అరుణ గ్రహంపై 'ఇన్ జెన్యుటీ' 3 మీటర్ల ఎత్తు ఎగరడాన్ని .. 1903లో రైట్ సోదరులు తొలిసారి పుడమిపై ఆకాశయానం చేసిన చారిత్రక ఘట్టంతో నిపుణులు పోల్చారు]     
(ఎ) 2021 ఏప్రిల్ 16 
(బి) 2021 ఏప్రిల్ 17 
(సి) 2021 ఏప్రిల్ 18  
(డి) 2021 ఏప్రిల్ 19  



10. 'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' (MGNREGA) పనులకు హాజరయ్యే కూలీలకు 2020-21లో రూ. 237 గా ఉన్న కనీస వేతనాన్ని 2021-22లో ఎంతకు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది ? [కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస వేతనం 2021 ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది] 
(ఎ) రూ. 240 
(బి) రూ. 245 
(సి) రూ. 250 
(డి) రూ. 255              

కీ (KEY) (GK TEST-58 YEAR : 2021)
1) డి    2) సి    3) సి    4) ఎ    5) సి    6) ఎ    7) ఎ    8) ఎ    9) డి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

23, ఏప్రిల్ 2021, శుక్రవారం

2020TH YEAR GK, CURRENT AFFAIRS BITS AND GOVT. SCHEMES IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

స్పైరల్ బైండింగ్ బుక్ (SPIRAL BINDING BOOK)




స్పైరల్ బైండింగ్ బుక్ వివరాలు :

సబ్జెక్టు

జి.కె., కరెంట్ ఎఫైర్స్ బిట్స్, ప్రభుత్వ పథకాలు

సంవత్సరం

2020

పేజీలు

267 (67 A4 Sheets Front & Back)

ధర

రూ. 134 [పోస్టల్ (లేక) కొరియర్ చార్జీలు అదనం]

కాపీల కొరకు

"9963309837 (లేక) 9908216775" ఫోన్ నంబర్లలో సంప్రదించండి.


 

22, ఏప్రిల్ 2021, గురువారం

GK TEST-57 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. 'విదేశాల్లోని భారత పౌరులు' (OCI) గా నమోదు చేసుకోవడానికి సంబంధించి .. సరియైన సమాధానం ? 
(ఎ) భారత సంతతికి చెందిన విదేశీయులు 
(బి) భారత పౌరుల విదేశీ భాగస్వాములు  
(సి) విదేశాల్లోని భారత పౌరుల విదేశీ భాగస్వాములు  
(డి) పైవన్నీ 

2. 'నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881' (NEGOTIABLE INSTRUMENTS ACT 1881) లోని సెక్షన్ 25 ప్రకారం .. 'జీవిత బీమా సంస్థ' (LIC) కి ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం  ఏ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ?  
(ఎ) 2021 ఏప్రిల్ 12 
(బి) 2021 ఏప్రిల్ 13  
(సి) 2021 ఏప్రిల్ 14  
(డి) 2021 ఏప్రిల్ 15 

3. 'ఆధునిక భారతం అంబేద్కర్ చూపు', 'దళితుల చరిత్ర' గ్రంథాల రచయిత ? 
(ఎ) డాక్టర్ కత్తి పద్మారావు  
(బి) డాక్టర్ షేక్ మస్తాన్ 
(సి) డాక్టర్ చందు సుబ్బారావు 
(డి) నేలపూడి స్టాలిన్ బాబు 



4. కేంద్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ 17న విడుదల చేసిన 'పర్యావరణ ముప్పు సూచిక' లో పర్యావరణపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రం ఎన్నవ ర్యాంకులో నిలిచింది ? [ఈ సూచికలో 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రానికి 0.510 మార్కులు లభించాయి. అటవీ విస్తీర్ణం తక్కువ, నీటి ద్వారా సోకే జబ్బులు అధికం కావడం రాష్ట్రానికి ప్రతికూల అంశాలుగా నిలిచాయి]  
(ఎ) 15 
(బి) 16 
(సి) 17 
(డి) 18 

5. 'నాసా' (NASA) నిర్వహించిన 27వ హ్యూమన్ ఎక్సప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ (NASA Human Exploration Rover Challenge) పోటీల్లో ఒడిశాకు చెందిన 'నవోన్మేష్ ప్రసార్ స్టూడెంట్స్ ఆస్ట్రానమీ టీమ్' (నాప్సాట్) హైస్కూల్ విభాగంలో ఎన్నో స్థానంలో నిలిచింది ? [ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి అండర్-19 విభాగంలో 20 బృందాలు పాల్గొన్నాయి] 
(ఎ) 4   
(బి) 3  
(సి) 2  
(డి) 1 

6. ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక సరిహద్దులు ఏ తేదీ వరకు మార్చేందుకు వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? [జనగణన పూర్తయ్యేవరకు ఈ నిర్బంధం ఉంటుందని, ప్రస్తుతం 'కొవిడ్' నేపథ్యంలో జనగణన ఎప్పుడుంటుందో నిర్ణయించలేనందున సరిహద్దు మార్పు గడువును పొడిగించారు. గతంలో ఈ నిర్బంధంపై విధించిన గడువు 2021 మార్చ్ 31తో ముగిసింది] 
(ఎ) 2021 ఏప్రిల్ 30 
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 30 
(డి) 2021 జూలై 31 



7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో పాలకవర్గ మొదటి సమావేశం నిర్వహించిన ఎన్ని రోజుల్లోగా కోఆప్షన్ సభ్యుల (CO OPTION MEMBERS) ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్లకు ప్రభుత్వం సూచించింది ? [నగరపాలక సంస్థల్లో ఐదుగురు చొప్పున, పురపాలక, నగర పంచాయితీలలో ముగ్గురు చొప్పున సభ్యులను ఎన్నుకోవాలి. నగరపాలక సంస్థలో ఎన్నుకోవలసిన ఐదుగురిలో ఇద్దరు మైనారిటీలు, మరో ముగ్గురు పురపాలనపై అవగాహన కలిగిన మాజీ ప్రతినిధులు, విశ్రాంత అధికారులు, ఉద్యోగులై ఉండాలి. పురపాలక, నగర పంచాయతీల్లోని ముగ్గురిలో ఇద్దరు మైనారిటీలు, మరొకరు పురపాలనపై అవగాహన కలిగినవారై ఉండాలని పురపాలక శాఖ పేర్కొంది]  
(ఎ) 30 
(బి) 60 
(సి) 90 
(డి) 120 

8. కోఆప్షన్ సభ్యుల స్థానాలకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో ఓటరుగా ఉండడంతోపాటు ఎన్ని సంవత్సరాలకు తక్కువ కాకుండా వయసును కలిగి ఉండాలి ?   
(ఎ) 18  
(బి) 21  
(సి) 25 
(డి) 30  

9. హైదరాబాద్ సమీపంలోని 'పోచంపల్లి' గ్రామంలో "ఆచార్య వినోబాభావే" (ACHARYA VINOBA BHAVE) భూదాన ఉద్యమాన్ని (BHOODAN MOVEMENT) ప్రారంభించిన తేదీ ? [తన భూమిలోంచి 100 ఎకరాలను దానం చేయడానికి స్థానిక భూస్వామి 'వెదిరె రాంచంద్రారెడ్డి' ముందుకొచ్చారు. అప్పటికప్పుడు దానపత్రం రాసి వినోబాభావేకు అందించగా, భూమిలేని పేదలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ ఉద్యమం దేశవ్యాప్తమైంది] 
(ఎ) 1951 ఏప్రిల్ 15 
(బి) 1951 ఏప్రిల్ 16 
(సి) 1951 ఏప్రిల్ 17  
(డి) 1951 ఏప్రిల్ 18  



10. 'ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2021' (2021 F1 EMILIA ROMAGNA GRAND PRIX) టైటిల్ విజేత ?    
(ఎ) లూయిస్ హామిల్టన్ 
(బి) డానియెల్ రికార్డో 
(సి) లాండో నోరిస్ 
(డి) మాక్స్ వెర్ స్టాపెన్               

కీ (KEY) (GK TEST-57 YEAR : 2021)
1) డి    2) డి    3) ఎ    4) సి    5) బి    6) సి    7) బి    8) బి    9) డి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

21, ఏప్రిల్ 2021, బుధవారం

GK TEST-56 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. రుతుపవన వర్షపాతానికి సంబంధించి 'దీర్ఘకాలిక సగటు' (LPA) 96 శాతం నుంచి 104 శాతం మధ్య ఉంటే దాన్ని ఏమని లెక్కిస్తారు ? [ఈ ఏడాది దేశంలో రుతుపవన కాలమైన జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య 'దీర్ఘకాలిక సగటు' (LPA) వర్షపాతం 103 శాతం (5% అటు, ఇటుగా) ఉంటుందని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ 'స్కైమెట్' (SKYMET) తెలిపింది]  
(ఎ) సాధారణం 
(బి) అధికం  
(సి) అత్యధికం  
(డి) అల్పం 

2. సూయజ్ కాలువ (SUEZ CANAL) లో అడ్డంగా ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన కంటైనర్ రవాణా నౌక "ఎవర్ గివెన్" (EVER GIVEN) కు ఏ దేశ న్యాయస్థానం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ. 7,500 కోట్లు) భారీ జరిమానా విధించింది ? [దీనిని చెల్లించేందుకు యాజమాన్యం ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది. 2021 మార్చ్ 23న ఈ నౌక .. కాలువలో ఇరుక్కుపోయి ఆరు రోజుల తర్వాత కదిలింది] 
(ఎ) గ్రీస్ 
(బి) జోర్డాన్  
(సి) టర్కీ  
(డి) ఈజిప్ట్ 

3. బంగారు ఆభరణాలు, కళాఖండాలకు ఏ తేదీ నుంచి హాల్ మార్కింగ్ (HALLMARKED) నిబంధనలు తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ? [ఆ తేదీ నుంచి విక్రయదారులు 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలే విక్రయించాల్సి ఉంటుంది. ఆలోగా ఆభరణాల విక్రయదారులు 'బీఐఎస్' (BIS) దగ్గర నమోదు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించింది]  
(ఎ) 2021 మే 1  
(బి) 2021 జూన్ 1 
(సి) 2021 జూలై 1 
(డి) 2021 ఆగస్ట్ 1 



4. భారత్ కు చెందిన 'అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్' (APSEZ) ను తమ సస్టైనబిలిటీ సూచీ నుంచి 2021 ఏప్రిల్ 15 నుంచి తొలగించినట్లు తెలిపిన ప్రముఖ సూచీ ? [ఈ కంపెనీ వ్యాపారాలకు మియన్మార్ మిలిటరీతో సంబంధం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది]    
(ఎ) మూడీస్ 
(బి) ఫిచ్ 
(సి) ఎస్ & పీ 
(డి) నాస్ డాక్ 

5. పతనం అంచున ఉన్న 'సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థ' (MSME) లు 'ప్రి-ప్యాక్' పరిష్కార పథకం కింద ప్రభుత్వం నోటిఫై చేసిన నియమాలకు అనుగుణంగా ఎంత రుసుము చెల్లించి కొత్త దివాలా పరిష్కార పథకాన్ని ఎంచుకోవచ్చు ? [సాధారణ దివాలా స్మృతి కింద కంపెనీలు రూ. 25,000 చెల్లించాల్సి ఉండగా, దాన్ని 'ఎంఎస్ఎంఈ' లకు ప్రభుత్వం తగ్గించింది]    
(ఎ) రూ. 5,000   
(బి) రూ. 10,000  
(సి) రూ. 15,000  
(డి) రూ. 20,000 

6. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'భారత్ లో విద్యుత్తు వాహనాల తయారీ, త్వరితగత స్వీకారం' (FAME) పథకం రెండో దశ అమలులోకి వచ్చిన తేదీ ? [కేంద్ర ప్రభుత్వం 2011లో 'ఫేమ్' పథకానికి రూపకల్పన చేసి, మొదటి దశలో 2.8 లక్షల వాహనాలకు రూ. 359 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. రెండో దశలో రూ. 10 వేల కోట్లను కేటాయించారు]    
(ఎ) 2019 జనవరి 1 
(బి) 2019 ఏప్రిల్ 1 
(సి) 2019 జూలై 1 
(డి) 2019 అక్టోబర్ 1



7. 'ఐసీసీ' (ICC) అవినీతి నిరోధక నిబంధనల్లో అయిదింటిని ఉల్లంఘించినందుకు బౌలింగ్ దిగ్గజం "హీత్ స్ట్రీక్" (HEATH STREAK) పై 'ఐసీసీ' ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు 2021 ఏప్రిల్ 14న ప్రకటించింది. 'హీత్ స్ట్రీక్' ది ఏ దేశం ?  
(ఎ) ఇంగ్లాండ్ 
(బి) దక్షిణాఫ్రికా 
(సి) జింబాబ్వే 
(డి) ఆస్ట్రేలియా 

8. ఐసీసీ 2021 ఏప్రిల్ 14న ప్రకటించిన వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో ..  సుమారు మూడున్నరేళ్లపాటు (1258 రోజులు) అగ్రస్థానంలో కొనసాగిన 'విరాట్ కోహ్లీ' ని పాకిస్థాన్ కెప్టెన్ "బాబర్ అజామ్" వెనక్కి నెట్టి అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న ఎన్నో పాకిస్థాన్ బ్యాట్స్ మన్ గా 'బాబర్ అజామ్' రికార్డు సృష్టించాడు ?      
(ఎ) 1  
(బి) 2  
(సి) 3 
(డి) 4  

9. తొలి అంతర్జాతీయ వన్డేకు 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో 1971 నుంచి 2021 మధ్య దశాబ్దానికి ఒక్కరు చొప్పున ఐదుగురు అత్యుత్తమ ఆటగాళ్లను 'విజ్డెన్' (WISDEN) ఎంపిక చేసింది. దీనికి సంబంధించి సరియైన జతను గుర్తించండి ?

అత్యుత్తమ ఆటగాడుదశాబ్దం
(A) కపిల్ దేవ్(a) 1970-1980
(B) ముత్తయ్య మురళీధరన్(b) 1980-1990
(C) విరాట్ కోహ్లి (c) 1990-2000
(D) వివ్ రిచర్డ్స్(d) 2000-2010
(E) సచిన్ టెండూల్కర్(e) 2010-2020

(ఎ) (A) ⇒ (a), (B) ⇒ (b), (C) ⇒ (e), (D) ⇒ (d), (E) ⇒ (c) 
(బి) (A) ⇒ (b), (B) ⇒ (d), (C) ⇒ (e), (D) ⇒ (a), (E) ⇒ (c)
(సి) (A) ⇒ (a), (B) ⇒ (b), (C) ⇒ (e), (D) ⇒ (c), (E) ⇒ (d)
(డి) (A) ⇒ (b), (B) ⇒ (e), (C) ⇒ (d), (D) ⇒ (a), (E) ⇒ (c)  



10. 'విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021' (Wisden Cricketer of the year-2021) అవార్డుకు ఎంపికైన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ? [వరుసగా రెండో ఏడాది అతను ఈ అవార్డుకు ఎంపికయ్యాడు]   
(ఎ) ఇయాన్ మోర్గాన్ 
(బి) మొయిన్ అలీ 
(సి) బెన్ స్టోక్స్  
(డి) జొనాథన్ బెయిర్ స్టో               

కీ (KEY) (GK TEST-56 YEAR : 2021)
1) ఎ    2) డి    3) బి    4) సి    5) సి    6) బి    7) సి    8) డి    9) బి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

17, ఏప్రిల్ 2021, శనివారం

GK TEST-55 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. బెంగళూరుకు చెందిన శంకర క్యాన్సర్ ఆసుపత్రి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో 'ప్రపంచస్థాయి క్యాన్సర్ కేర్ ఆసుపత్రి' (బగ్చి-శంకర క్యాన్సర్ కేర్ ఆసుపత్రి) ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు ? [ఈ ఆసుపత్రి నిర్మాణానికి 'శుభ్రత్ బగ్చి' , ఆయన భార్య 'సుస్మిత బగ్చి' లు రూ. 340 కోట్లను విరాళంగా ప్రకటించారు. 2024 నాటికి ఇది ప్రారంభం కానుంది]   
(ఎ) ముంబయి  
(బి) బెంగళూరు  
(సి) భువనేశ్వర్  
(డి) బికనీర్ 

2. తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు ఎంత మొత్తం చొప్పున ఆర్ధిక సాయం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? 
(ఎ) రూ. 1,000 
(బి) రూ. 2,000  
(సి) రూ. 3,000  
(డి) రూ. 4,000 

3. 'అగస్టా జాతీయ ఛాంపియన్షిప్-2021' (AUGUSTA NATIONAL CHAMPIONSHIP-2021) లో విజేతగా నిలిచిన 29 ఏళ్ల గోల్ఫ్ క్రీడాకారుడు "హిడెకి మత్సుయామ' ది ఏ దేశం ? [ఆ దేశం తరపున తొలి పురుషుల మాస్టర్స్ ఛాంపియన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆసియాలో జన్మించి మాస్టర్స్ టైటిల్ నెగ్గిన మొదటి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు]  
(ఎ) చైనా  
(బి) జార్జియా  
(సి) జపాన్ 
(డి) మలేషియా 



4. భారత 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) గా "సుశీల్ చంద్ర" బాధ్యతలు స్వీకరించిన తేదీ ? [2019 ఫిబ్రవరి 14న 'సుశీల్ చంద్ర 'ఎన్నికల సంఘం' కమిషనర్' గా నియమితులయ్యారు. 'సీఈసీ' (CEC) గా 2022 మే 14 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం 'రాజీవ్ కుమార్' ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారు] 
(ఎ) 2021 ఏప్రిల్ 10 
(బి) 2021 ఏప్రిల్ 11 
(సి) 2021 ఏప్రిల్ 12 
(డి) 2021 ఏప్రిల్ 13 

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు అందిస్తున్న విశిష్ట సేవా పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2021 ఏప్రిల్ 12న కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఎక్కడ ప్రారంభించారు ? [వాలంటీర్లలో 2,18,000 మందికి 'సేవా మిత్ర' (నగదు : రూ. 10 వేలు), 4,000 మందికి 'సేవా రత్న' (నగదు : రూ. 20 వేలు), 875 మందికి 'సేవా వజ్ర' (నగదు : రూ. 30 వేలు) పురస్కారాలను ప్రకటించారు. నగదు పురస్కారంతో పాటు ధ్రువపత్రం, శాలువా, బ్యాడ్జి ఇచ్చి ప్రోత్సహిస్తారు] 
(ఎ) కానూరు   
(బి) యనమలకుదురు  
(సి) తాడిగడప  
(డి) పోరంకి 

6. 'సోవియట్ యూనియన్' వ్యోమగామి "యూరి గగారిన్" (YURI GAGARIN) అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించిన తేదీ ? ['వోస్తోక్-1' వ్యోమనౌకలో 108 నిమిషాల పాటు 'యూరి గగారిన్' యాత్ర సాగింది. ఈ క్రమంలో ఆయన ఒకసారి భూమిని చుట్టివచ్చారు. అతను అదే తేదీన 'సారాతోవ్' ప్రాంతంలో 'వోల్గా' నది పక్కన సురక్షితంగా భూమి మీదకు దిగారు. ఏడేళ్ల తర్వాత 1968 మార్చ్ 27న ఒక విమాన ప్రమాదంలో 'యూరి గగారిన్' చనిపోయారు]  
(ఎ) 1961 ఏప్రిల్ 12 
(బి) 1961 ఏప్రిల్ 13 
(సి) 1961 ఏప్రిల్ 14 
(డి) 1961 ఏప్రిల్ 15 



7. 1957 అక్టోబర్ 4న "స్పుత్నిక్" (SPUTNIK 1) రూపంలో ప్రపంచ తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన దేశం ?  
(ఎ) అమెరికా 
(బి) రష్యా 
(సి) సోవియట్ యూనియన్ 
(డి) ఫ్రాన్స్ 

8. 'కొవిడ్-19' వ్యాధి నిరోధానికి మన దేశంలో 'స్పుత్నిక్ వి' టీకా (SPUTNIK V VACCINE) కు 'డీ సీ జీ ఐ' (DCGI) అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చిన తేదీ ? [దీంతో మనదేశంలో మూడో టీకా అనుమతి పొందినట్లు అయింది. 'స్పుత్నిక్ వి' టీకాను ఆవిష్కరించిన 'ఆర్ డీ ఐ ఎఫ్' (RDIF) (రష్యా) తో మనదేశానికి చెందిన 'డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్' గత ఏడాది సెప్టెంబర్ లో ఒప్పందం కుదుర్చుకుంది. జలుబు (COMMON COLD) రావడానికి కారణమయ్యే రెండు అడెనోవైరస్ (AD26, AD5) లను, సార్స్-కోవ్-2 వైరస్ స్పైక్ ప్రోటీన్ తో కలిపి 'స్పుత్నిక్ వి' టీకా (SPUTNIK V VACCINE) ను తయారు చేశారు]     
(ఎ) 2021 ఏప్రిల్ 11   
(బి) 2021 ఏప్రిల్ 12  
(సి) 2021 ఏప్రిల్ 13 
(డి) 2021 ఏప్రిల్ 14  

9. విజయవాడ డివిజన్ (నూజివీడు రైల్వే స్టేషన్) నుంచి దిల్లీకి మామిడి ఎగుమతులతో తొలి కిసాన్ రైలు ప్రారంభమైన తేదీ ? [రైల్వే శాఖ సరకు రవాణాపై 50 శాతం రాయితీ ఇస్తుండడంతో వ్యాపారులు, రైతులు ఈ రైళ్లవైపే మొగ్గు చూపుతున్నారు]
(ఎ) 2021 ఏప్రిల్ 8 
(బి) 2021 ఏప్రిల్ 9 
(సి) 2021 ఏప్రిల్ 10  
(డి) 2021 ఏప్రిల్ 11  



10. భారతదేశ వ్యాప్తంగా 'కొవిడ్-19' నియంత్రణలో భాగంగా "టీకా ఉత్సవ్" (COVID VACCINATION DRIVE) ను నిర్వహించిన తేదీలు ? 
(ఎ) 2021 ఏప్రిల్ 10 నుండి 2021 ఏప్రిల్ 13 వరకు  
(బి) 2021 ఏప్రిల్ 11 నుండి 2021 ఏప్రిల్ 14 వరకు 
(సి) 2021 ఏప్రిల్ 12 నుండి 2021 ఏప్రిల్ 15 వరకు 
(డి) 2021 ఏప్రిల్ 13 నుండి 2021 ఏప్రిల్ 16 వరకు              

కీ (KEY) (GK TEST-55 YEAR : 2021)
1) సి    2) బి    3) సి    4) డి    5) డి    6) ఎ    7) సి    8) బి    9) డి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

15, ఏప్రిల్ 2021, గురువారం

NATIONAL EDUCATION POLICY 2020 - GOVERNMENT OF INDIA IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

జాతీయ విద్యా విధానం 2020 - భారత ప్రభుత్వం
(NATIONAL EDUCATION POLICY 2020 - GOVERNMENT OF INDIA)


  • "డాక్టర్ కె. కస్తూరి రంగన్ కమిటీ" (Dr. K.KASTURI RANGAN COMMITTEE) రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి 2020 జూలై 29న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
  • దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి.
  • ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు.
  • ఇకమీదట 'మానవ వనరుల అభివృద్ధి శాఖ' పేరును "విద్యాశాఖ" గా మార్చడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 

పూర్వాపరాలు :

  • జాతీయ విద్యా విధానాన్ని తొలుత 1968లో, తర్వాత 1986లో రూపొందించారు. దానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు. ఒక రకంగా 1986 జాతీయ విద్యా విధానమే 34 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. దాని స్థానంలో కొత్త విధానం రూపొందించడానికి 'నరేంద్ర మోదీ' ప్రభుత్వం 2016 మే 27న 'టీ ఎస్ ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ', 2019 మే 31న 'కె.కస్తూరిరంగన్ కమిటీ' లను ఏర్పాటు చేసింది. 'కె.కస్తూరిరంగన్ కమిటీ' నివేదికను ఇప్పుడు ఆమోదించింది.

సంస్కరణలు

కొత్తగా 3 కోట్ల సీట్లు :

  • 2035 నాటికి 'స్థూల నమోదు నిష్పత్తి' (GROSS ENROLLMENT RATIO) ని ఇప్పుడున్న 26.3% నుంచి 50% కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఉన్నత విద్యా సంస్థల్లో కొత్తగా 3 కోట్ల సీట్లు వస్తాయి.
  • అన్ని కోర్సుల్లో 'హోలిస్టిక్, మల్టీ డిసిప్లినరీ' విద్యా విధానాన్ని తీసుకొస్తారు. సబ్జెక్టులను సరళంగా మారుస్తారు.
  • 'యూజీ' (UG) కోర్సుల్లో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలు (MULTIPLE ENTRY / EXIT) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడున్న విధానంలో 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆరు సెమిస్టర్ల తర్వాత చదువుకోలేని పరిస్థితి వస్తే పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఒక ఏడాది తర్వాత విద్యార్థి మానేస్తే "సర్టిఫికెట్" (CERTIFICATE) ఇస్తారు. రెండేళ్ల తర్వాత మానేస్తే "అడ్వాన్స్ డిప్లొమా" (ADVANCE DIPLOMA), 3-4 ఏళ్ల తర్వాత "డిగ్రీ" (DEGREE) అందిస్తారు.
  • ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న వారికి మూడేళ్ల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్లాలనుకున్న వారికి నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి ఓ ఏడాది పీజీ కోర్సు ఉంటుంది. దాని తర్వాత ఎంఫిల్ చేయాల్సిన అవసరం లేకుండానే 'పీహెచ్డీ' (PhD) కి వెళ్లొచ్చు. మాస్టర్స్ తో కలిపి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అమలు చేస్తారు. ఎంఫిల్ ను తొలగిస్తారు.

నిధుల పెంపుతో చేయూత :

  • సాధ్యమైనంత త్వరగా 'జీడీపీ' లో 6% నిధులు విద్యారంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 4.4% నిధులు ఇస్తున్నాయి.
  • అమెరికాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఉన్నట్లుగా దేశంలో 'నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' ఏర్పాటు చేస్తారు. శాస్త్ర, సామాజిక శాస్త్రాల విభాగాల్లో చేపట్టే భారీ పరిశోధన కార్యక్రమాలకు దీని ద్వారా ఆర్ధిక చేయూత అందిస్తారు. పరిశోధన, నవ్యావిష్కరణలు, పేటెంటింగ్ లో ఈ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తారు.
  • విద్యా రంగాన్ని అంతర్జాతీయకరణ చేస్తారు. విదేశీ విద్యాసంస్థలు ఇక్కడ ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీ విద్యార్థులు భారత్ కు వచ్చి చదువుకొనేలా ప్రోత్సహిస్తారు.

తెలుగులోనూ ఇ-కంటెంట్ :

  • ఇప్పటి వరకు ఇంగ్లీష్, హిందీలకే పరిమితమైన ఈ-కంటెంట్ ను తెలుగుతోపాటు 8 భారతీయ భాషల్లో అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తారు.
  • అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తారు.
  • విద్యా రంగంలో సాంకేతిక వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడానికి ప్రైవేటు, ప్రభుత్వ, సాంకేతిక రంగాన్ని ఒకే వేదిక మీదకి తెస్తూ 'నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం' ఏర్పాటు చేస్తారు.

పాఠశాల విద్యా విధానంలో .. :

  • పూర్వ ప్రాథమిక విద్య (PRE-PRIMARY) ను సార్వత్రీకరిస్తారు. దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను 'ఎన్ సీ ఈ ఆర్ టీ' (NCERT) అభివృద్ధి చేస్తుంది. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఆటలు, కార్యకలాపాల ఆధారమైన సరళ పాఠ్యాంశాలను అమల్లోకి తెస్తారు.
  • 1 నుంచి 3 తరగతులు చదివే 6-9 ఏళ్ల విద్యార్థులు ప్రాథమికమైన అక్షరాలు, అంకెలు సరిగా గుర్తుపట్టి చదివేలా, లెక్కలు చేసేలా తీర్చిదిద్ధేందుకు ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక దశలో విద్యార్థులు నిర్దేశిత పాఠ్యాంశాలను సరిగా నేర్చుకొనేలా తీర్చిదిద్దడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం.
  • బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇప్పుడున్న 8, 10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు.
  • ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించనున్నారు. ఏటా ఒకసారి కాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులకు రెండు స్థాయులు ఉంటాయి. బట్టీ పట్టే సామర్థ్యాన్ని కాకుండా వారిలోని తెలివితేటలను పరీక్షించేలా వీటిని తీర్చిదిద్దుతారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేలా వాటిని నిర్వహిస్తారు.

పురోగతి నివేదికలూ మారిపోతాయి :

  • విద్యార్థుల పురోగతి నివేదిక (PROGRESS REPORT) లో మార్పులు తెస్తారు. ఇప్పటివరకు విద్యార్థి మార్కులతోపాటు, వారి ప్రవర్తన గురించి టీచర్లు రాసే అభిప్రాయాలు మాత్రమే అందులో ఉంటున్నాయి. ఇకమీదట విద్యార్థి స్వీయ అభిప్రాయంతోపాటు, వారి సహాధ్యాయి, టీచర్ల అభిప్రాయాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఏటా విద్యార్థులు నేర్చుకోవాల్సిన 'జీవన నైపుణ్యాలు' (LIFE SKILLS) గురించి తల్లిదండ్రులతో మాట్లాడి నివేదిక రూపొందిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయటికెళ్లే సమయానికి వారు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారన్నది దానిలో నిక్షిప్తం చేస్తారు.

ఏ భాషనూ బలవంతంగా రుద్దవద్దు :

  • త్రిభాషా సూత్రంతో సహా అన్ని స్థాయి తరగతుల్లో 'సంస్కృతం' ఉండేలా చూడాలని, దాన్ని ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలిపెట్టాలని కొత్త విధానం స్పష్టం చేసింది.
  • ఇతర భారతీయ ప్రాచీన భాషలను ఎంచుకునే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించాలని పేర్కొంది.
  • విద్యార్ధులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దొద్దని స్పష్టం చేసింది.
  • భారతీయ భాషలను విద్యార్థులు చాలా ఆనందంగా నేర్చుకునే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొంది.
  • పలు విదేశీ భాషలను నేర్చుకోవడానికీ వీలు కల్పించాలని సిఫార్సు చేసింది.
  • దేశవ్యాప్తంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను ప్రామాణీకరించాలని పేర్కొంది. బధిర పిల్లల కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో పాఠ్యాంశాలు అభివృద్ధి చేయాలంది.
  • భారతీయ భాషల సంరక్షణతోపాటు, వాటి వినియోగాన్ని పెంచి, వాటికి గతిశీలతను తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లు నూతన విద్యా విధానం పేర్కొంది.

10+2+3 బదులు 5+3+3+4 :

  • పాఠ్యక్రమాల నిర్మాణాన్ని పూర్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం 10+2+3 విధానం ఉంది. పదో తరగతి వరకు విద్యార్థులకు దశలవారీ పాఠ్యాంశాలు ఉంటాయి. ప్లస్ టూ కి వెళ్లిన వారికి ప్రత్యేక సబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ల పాఠ్యక్రమ విధానాన్ని తీసుకొస్తున్నారు.
  • ఇందులో 3 నుంచి 6 ఏళ్ల వరకు పిల్లలకు 'ప్లే స్కూల్' ఉంటుంది. వారికి 8 ఏళ్లు వచ్చేంతవరకూ ఆటలు, ఇతర కార్యకలాపాలు అనుభవ పూర్వకంగా నేర్చుకోవడం వంటివి ఉంటాయి.
  • 3 నుంచి 8 ఏళ్ల లోపు వారు 'ఫౌండేషన్ స్టేజీ'లో, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు 'ప్రిపరేటరీ స్కూలింగ్' లో, 11-14 ఏళ్ల వారు 'మిడిల్ స్కూల్' లో, 14-18 ఏళ్ల వారు 'సెకండరీ' స్థాయిలో ఉంటారు.
  • 6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు.
  • 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఏ కూర్పులోనైనా సబ్జెక్టులు తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఆహార తయారీ కోర్సులు కానీ, ఇతర వృత్తివిద్యాకోర్సులు కానీ ఎంచుకోవచ్చు.
  • విద్యాహక్కును 1 నుంచి 8వ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు విస్తరింపజేస్తారు.

డిజిటల్ లాకర్లలో పాత క్రెడిట్లు :

  • ఒకటి రెండు సంవత్సరాలు చదివిన తర్వాత విద్యార్థులు ఏదైనా కారణాలతో చదువు మానేసినా, మళ్లీ తనకు వీలైన సమయంలో దానిని కొనసాగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అప్పటివరకు ఆ విద్యార్థి చదివిన ఒకటి, రెండు సంవత్సరాలకు సంబంధించిన క్రెడిట్స్ .. డిజిటల్ లాకర్స్ (DIGITAL LOCKERS) లో భద్రంగా ఉంటాయి. విద్యార్థి మళ్లీ తొలి సంవత్సరం నుంచి చదవాల్సిన అవసరం లేదు. అప్పటివరకు తన డిజిటల్ లాకర్ లో ఉన్న క్రెడిట్స్ ను ఉపయోగించుకొని మిగిలిన సంవత్సరాలు పూర్తిచేయొచ్చు.

ప్రాథమిక స్థాయి నుంచే సైన్స్ పై ఆసక్తి :

  • సైన్స్, లెక్కలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే వారిని ప్రోత్సహిస్తారు.
  • 6వ తరగతి నుంచి విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తారు.
  • ప్రస్తుతం విద్యార్థులు సంగీతం, కళలు, ఆటలు, ఇతర ఆసక్తికర అంశాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల సైన్స్ పై ఆసక్తి, సమస్యలను పరిష్కరించే తత్త్వం, సంక్లిష్టమైన ఆలోచనా విధానంవారిలో తగ్గిపోతోంది. దీని దృష్ట్యా - ఇప్పుడున్న పాఠ్యాంశాలను అత్యవసర అంశాల వరకే పరిమితం చేసి మిగతా వాటిని తగ్గిస్తారు.
  • వృత్తి విద్యా కోర్సులను 6వ తరగతి నుంచే ప్రారంభిస్తారు. ఇందులో ఇంటర్న్షిప్ (INTERNSHIP) సైతం ఉంటుంది.

యూజీసీ, ఏఐసీటీఈ ఉండవు :

  • ప్రస్తుతం విద్యావ్యవస్థ నియంత్రణ కోసం 'యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి' వంటి వ్యవస్థలున్నాయి. వీటన్నింటినీ విలీనం చేసి మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
  • అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే నిబంధనలు అమలు చేస్తారు.

మున్ముందు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలంటే .. :

  • ఉపాధ్యాయ సామర్ధ్యాలపై 'జాతీయ నూతన విద్యా విధానం' లో ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధ్యాయుల నియామకాలను ఇకమీదట పారదర్శక-పటిష్ఠ పద్ధతిలో చేపడతారు. ఉదా :
  • బోధన పట్ల నిబద్ధత, తపన ఉన్నవారినే ఉపాధ్యాయులుగా నియమిస్తారు.
  • అకడమిక్ గా, బోధనాపరంగా, పరిశోధనపరంగా, ప్రజాసేవ పట్ల అంకితభావాలను కూడా పరీక్షించి తీసుకుంటారు.
  • వారి సామర్ధ్యాల్ని మదించిన తర్వాతే పదోన్నతులు ఉంటాయి.
  • ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రమాణాలను రూపొందిస్తారు.

మాతృ భాషకు, స్థానిక భాషకు ప్రోత్సాహం :

  • భారతీయ భాషలకు, మాతృభాషలకు 'జాతీయ నూతన విద్యా విధానం' పెద్దపీట వేస్తోంది.
  • కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష, భారతీయ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సలేషన్, ఇంటర్ప్రెటేషన్' (IITI), పాళి, పర్షియన్, ప్రాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి .. అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో వీటి విభాగాలు ఉండేలా చూస్తారు.
  • ఉన్నత విద్యలోని అనేక కోర్సులను మాతృభాషల్లో, స్థానిక భాషల్లో నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారు.

3, 5, 8 తరగతుల్లోనే పరీక్షలు :

  • 3, 5, 8 తరగతుల్లోనే స్కూల్ పరీక్షలుంటాయి. అవి కూడా నిర్దేశిత బోర్డు ద్వారా నిర్వహిస్తారు.
  • 10, 12 తరగతులకు యధావిధంగానే పరీక్షలుంటాయి గానీ .. వాటి తీరు మారుతుంది.
  • విద్యార్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా .. వారి జ్ఞానాన్ని, విశ్లేషణలను, ఇతరత్రా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం 'పరాఖ్' (విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, విశ్లేషించే సంస్థ) ను ఏర్పాటు చేస్తారు.
  • ఆరో తరగతి తర్వాతి నుంచే వృత్తి విద్యలను అందరికీ పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఏదైనా ఓ వృత్తి విద్యలో ప్రవేశం ఉంటుంది.

ఎంబీబీఎస్ చేస్తూ కోడింగూ .. :

  • ఇప్పటిదాకా వృత్తివిద్యా కోర్సులది పూర్తిగా ప్రత్యేక దారి.
  • సాంకేతిక విద్య, లా, వ్యవసాయ విద్య, వైద్యం, ఆరోగ్యం .. ఇలా వేటికవే విడివిడిగా కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఉన్నత విద్యలో భాగం చేసి .. 'మల్టీడిసిప్లినరీ' (MULTI-DISCIPLINARY) గా వెసులుబాటు కల్పిస్తారు. అంటే .. 'ఎంబీబీఎస్' (MBBS) చేస్తూనే కావాలంటే కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు.     


మార్పు ఇలా ...

మారేదిలా ..   ఇప్పటి వరకు ..ఇకముందు
బడిలో చేరాలంటే ..5 ఏళ్లు ఉండాలిమూడేళ్లు నిండితే చాలు
నిర్బంధ విద్య6-14 ఏళ్ల వరకు3-18 ఏళ్ల వరకు
మాధ్యమంనిబంధన లేదు5వ తరగతి వరకు మాతృభాషలో
వృత్తి విద్యఅమలులో లేదు6వ తరగతి నుంచి అమలు
సెమిస్టర్ విధానంఅమలులో లేదు9వ తరగతి నుంచి అమలు
ఇంటర్ విద్యఉన్నత విద్యలో భాగంపాఠశాల విద్యలో చేరిక


14, ఏప్రిల్ 2021, బుధవారం

UNION BUDGET (2021-22) - INDIA IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

 కేంద్ర బడ్జెట్ (2021-22) - భారత దేశం
[UNION BUDGET (2021-22)] - INDIA


  • 'ఆత్మనిర్భర్' (ATMANIRBHAR) పేరుతో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రూ. 34,83,236 కోట్లతో ఆత్మరక్షణాత్మక బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) 2021 ఫిబ్రవరి 1న లోక్ సభలో తొలిసారిగా 'డిజిటల్ పధ్ధతి' లో ప్రవేశపెట్టారు.
  • కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తన ట్రేడ్ మార్క్ 'బాహీ - ఖాతా' (BAHI KHATA) ను అనుసరించారు. గతంలో ఆర్ధిక మంత్రులు తెచ్చినట్లు బ్రీఫ్ కేస్ కాకుండా .. ఎర్రటి వస్త్రం చుట్టిన ఓ రిజిస్టరులో బడ్జెట్ దస్తావేజులతో పార్లమెంటుకు వచ్చారు.
  • సాధారణంగా 'కాటన్, కోటా డోరియా, ఇకత్' లాంటి చేనేత చీరలతో కనిపించే 'నిర్మలా సీతారామన్' .. ఈసారి పశ్చిమ బెంగాల్ ప్రజలు పవిత్రంగా భావించే "లాల్ పాడ్ సఫేద్" చీరను ధరించి బడ్జెట్ సెషన్ కు హాజరయ్యారు.    

ఆరు మూల స్తంభాలు (SIX PILLARS) :

  • 2021-22 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ముఖ్యంగా క్రింది ఆరు మూల స్తంభాలపై రూపొందాయి.

  1. ఆరోగ్యం - యోగక్షేమాలు (Health & Well-being)
  2. ఆర్ధిక రంగం - మౌలిక సదుపాయాలు (Physical & Financial Capital & Infrastructure)
  3. సమ్మిళిత వృద్ధి - ఆకాంక్షపూరిత భారత్ (Inclusive development for Aspirational India)
  4. మానవ వనరులు (Reinvigorating Human Capital)
  5. నవకల్పనలు - పరిశోధన - అభివృద్ధి (Innovation & R&D)
  6. కనిష్ఠ ప్రభుత్వం - గరిష్ఠ పాలన (Minimum Govt & Maximum Governance)

  • ప్రధానంగా కేటాయింపులను వీటికే పరిమితం చేశారు.

1. ఆరోగ్య రంగం :

  • కరోనా నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ 2021-22 తాజా బడ్జెట్ లో 'ఆరోగ్యానికి' పెద్ద పీట వేసింది.
  • ఆరోగ్యం - యోగక్షేమాలకు ఏకంగా రూ. 2,23,000 కోట్లు కేటాయించారు. ఇది 'జీడీపీ' లో 1.8 శాతానికి సమానం.
  • గత బడ్జెట్ తో పోలిస్తే ఈ మొత్తం 137 శాతం అధికం.

క్లుప్తంగా ...

రంగం   కేటాయింపులు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖరూ. 71,268 కోట్లు
కొవిడ్ టీకాలురూ. 35,000 కోట్లు
ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజనరూ. 64,180 కోట్లు
ఆయుష్ (ఆయుర్వేద, యునాని, హోమియో)రూ. 2,970.30 కోట్లు
ఆరోగ్య పరిశోధనల విభాగంరూ. 2,663 కోట్లు


ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన :

  • ఈ పథకం కోసం ఆరేళ్ల కాలానికిగాను రూ. 64,180 కోట్లు కేటాయించారు.
  • ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు .. ప్రస్తుతమున్న జాతీయ స్థాయి సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్ర ప్రాయోజిత పథకం దోహదపడనుంది.
  • కొత్తగా ప్రబలే వ్యాధులను గుర్తించి, చికిత్స అందించేందుకుగాను నూతన సంస్థలను ఏర్పాటు చేసేందుకూ ఈ పథకం కింద నిధులు కేటాయిస్తారు.
  • 'జాతీయ ఆరోగ్య మిషన్' కు అదనంగా ఈ పథకం అమలు కానుంది.

న్యూమోకోకల్ టీకా (PNEUMOCOCCAL VACCINE) :

  • ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన 'న్యూమోకోకల్ టీకా' పంపిణీని దేశమంతటా విస్తరించనున్నారు.
  • న్యూమోనియా, సెప్టికామియా, మెదడువాపు వంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నివారణకు ఈ టీకా ఉపయోగపడుతుంది.
  • కేంద్రం తాజా నిర్ణయం దేశంలో ఏటా 50 వేల మంది చిన్నారుల మరణాలను తప్పించేందుకు దోహదపడుతుంది.

2. వ్యవసాయ రంగం :

  • వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2021-22 కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు 5.63 శాతం మేర పెరిగి, రూ. 1,31,531 కోట్లకు చేరాయి. ఇందులో దాదాపు సగం నిధులను .. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'పీఎం-కిసాన్' (PM KISAN SAMMAN NIDHI) పథకానికి ప్రత్యేకించారు.
  • వ్యవసాయ మౌలిక వసతుల నిధి, సాగునీటి కార్యక్రమాలకు కేటాయింపులు పెంచారు.
  • పంట కోతల అనంతరం అవసరమయ్యే మౌలిక వసతులను సృష్టించేందుకు 'వ్యవసాయ మౌలిక వసతులు, అభివృద్ధి సెస్' (AIDC) ను విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రైతులకు రూ. 16.5 లక్షల కోట్ల రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (2020-21 లో అది రూ. 15 లక్షల కోట్లుగా ఉంది)
  • తమిళనాడులో బహుళ ప్రయోజన 'సీవీడ్ పార్కు' (SEAWEED PARK) ను ఏర్పాటు చేయనున్నారు.
  • వ్యవసాయ రంగానికి .. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాలు రూ. 1,24,519 కోట్లుగా ఉన్నాయి.
  • 2021-22లో వ్యవసాయ శాఖకు చేసిన కేటాయింపుల్లో 'వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగానికి' రూ. 1,23,017.57 కోట్లు కేటాయించారు.
  • వ్యవసాయ పరిశోధన, విద్యకు రూ. 8,513.62 కోట్లు ప్రత్యేకించారు.
  • 'పీఎం-కిసాన్' (PM KISAN SAMMAN NIDHI) కు రూ. 65 వేల కోట్లు దక్కాయి.
  • 'పీఎం-ఆశా' (PM-AASHA) పథకానికి 2020-21కి సంబంధించిన సవరించిన అంచనాలు రూ. 996 కోట్లుగా ఉండగా తాజాగా ఈ పద్దు కింద రూ. 1,500 కోట్లు కేటాయించారు.
  • 10వేల వ్యవసాయ ఉత్పత్తి సంస్థల ఏర్పాటు, ప్రోత్సాహానికి కేటాయింపులను రూ. 250 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు, వ్యవసాయ మౌలిక వసతుల నిధిని రూ. 208 కోట్ల నుంచి రూ. 900 కోట్లకు పెంచారు.
  • 'పీఎం-కే ఎస్ వై' (PM-KSY) కు 2020-21 సవరించిన అంచనాల్లో రూ. 2,563 కోట్ల నుంచి రూ. 4వేల కోట్లకు పెంచారు.
  • గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రూ. 30వేల కోట్ల నుంచి రూ. 40వేల కోట్లకు పెంచారు.
  • సూక్ష్మ సాగు నిధికి సంబంధించిన కార్పస్ ను ప్రస్తుతమున్న రూ. 5వేల కోట్ల నుంచి రెట్టింపు చేశారు.
  • వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులకు విలువ జోడింపు. వాటి ఎగుమతులకు అవకాశాన్ని పెంచేందుకు "ఆపరేషన్ గ్రీన్స్ స్కీం" (Operation Greens Scheme) ను 22 ఉత్పత్తులకు విస్తరించారు. ప్రస్తుతం అది 'టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు' (TOP) కు వర్తిస్తోంది.
  • 'ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్' (eNAM) లో 1.68 కోట్ల మంది రైతులు నమోదయ్యారు. ఈ వేదిక ద్వారా రూ. 1.14 లక్షల కోట్ల విలువైన సరకు వాణిజ్యం జరిగింది. మరో వెయ్యి మండీలను 'ఈనామ్' (eNAM) తో అనుసంధానించనున్నారు.
  • మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖకు కేటాయింపులను రూ. 3,918.31 కోట్ల నుంచి రూ. 4,820.82 కోట్లకు పెంచారు.
  • ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేటాయింపులు రూ. 1,247.42 కోట్ల నుంచి రూ. 1,308.66 కోట్లకు పెరిగాయి.
  • అన్నదాతల ఆదాయాన్ని రెండు రెట్లు చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా 5 వ్యవసాయ హబ్ లను ఏర్పాటు చేస్తారు.
  • రైతులకు రూ. 16,50,000 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు.
  • రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి దేశంలో 1,000 వ్యవసాయ మార్కెట్ల (మండీ) ను 'ఈ-నామ్' (eNam) తో అనుసంధానిస్తారు. 

3. విద్యా రంగం :

  • 'జాతీయ విద్యా విధానం' అమల్లో భాగంగా వ్యాయామోపాధ్యులు (PET), సంగీతం, కళలు, చిత్రలేఖనం తదితర ఉపాధ్యాయులను నియమించడంతోపాటు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని 15,000 పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తారు. అవి దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన పాఠశాలలకు 'మెంటార్' (MENTOR) గా వ్యవహరిస్తాయి.
  • దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక పాఠశాలలను ఎన్ జీ ఓ సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు.
  • ఉన్నత విద్యలో విదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూనే .. వాటిలో బహుళ డిగ్రీలు, గిరాకీ ఉన్న కోర్సులకు అనుమతులు ఇచ్చేందుకు, వాటి పర్యవేక్షణకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
  • 'జాతీయ పరిశోధన సంస్థ' (NRF) కార్యకలాపాలకు ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తారు.
  • గిరిజన విద్యార్థుల కోసం ఆయా వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా 750 'ఏకలవ్య గురుకుల పాఠశాలలు' ఏర్పాటు చేస్తారు.   

విద్యా శాఖకు ఇచ్చింది మొత్తం రూ. 93,224.31 కోట్లు

రంగం   కేటాయింపులు
పాఠశాల విద్యరూ. 54,873.66 కోట్లు
ఉన్నత విద్యరూ. 38,350.65 కోట్లు


  • విద్యా రంగ కేటాయింపుల్లో భాగంగా 'కేంద్రీయ విద్యాలయాలకు రూ. 6,800 కోట్లు, నవోదయ విద్యాలయాలకు రూ. 3,800 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ. 11,500 కోట్లు' కేటాయించారు.
  • ప్రపంచ స్థాయి విద్యాసంస్థలుగా మార్చాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా 10 ప్రభుత్వ శ్రేష్ఠతర విద్యాసంస్థలను ఎంపిక చేసి, వాటికి రూ. 1,710 కోట్లు ఖర్చు చేస్తారు.
  • కళాశాలలు, వర్సిటీల్లోని విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ. 207 కోట్లు ఖర్చు చేస్తారు.

4. రైల్వే బడ్జెట్ :

  • కేంద్ర ఆర్థికశాఖా మంత్రి 'నిర్మలా సీతారామన్' 2021 ఫిబ్రవరి 1న రూ. 1.10 లక్షల కోట్లతో "రైల్వే బడ్జెట్" (Railway Budget) ను ప్రవేశపెట్టారు. ఇందులో రూ. 1.07 లక్షల కోట్లు 'మూల ధన వ్యయం'. "జాతీయ రైల్వే ప్రణాళిక - 2030" (NATIONAL RAILWAY PLAN 2030) ను దృష్టిలో పెట్టుకుని ఈ కేటాయింపులు జరిపారు.
  • 'భారత్ లో తయారీ' (MADE IN INDIA) కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలకు రవాణా చార్జీలు భారీగా తగ్గించే లక్ష్యంతో 'సరకు రవాణా కారిడార్లు' (DFC) ఏర్పాటు చేస్తారు.
  • 2022 నాటికి తూర్పు, పశ్చిమ కారిడార్లు సిద్ధం కానున్నాయి. "సోనెనగర్ - గోమో" మధ్య 263 కిలోమీటర్ల తూర్పు కారిడార్ లో కొంతమేర ఈ ఏడాది పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతారు. అలాగే "గోమో - థాంకుని" మధ్య 274 కిలోమీటర్ల మేర మొదలు అవుతుంది.

"ఖరగ్ పుర్ - విజయవాడ, ఇటార్సి - విజయవాడ" సరకు రవాణా కారిడార్లు :

  • 'ఈస్ట్ కోస్ట్ కారిడార్' లో భాగంగా ఖరగ్ పుర్ నుంచి విజయవాడ, 'ఈస్ట్ వెస్ట్ కారిడార్' లో భాగంగా భుసవాల్ - ఖరగ్ పుర్ - థాంకుని, 'నార్త్ సౌత్ కారిడార్' లో భాగంగా ఇటార్సి నుంచి విజయవాడ వరకు సరకు రవాణా కారిడార్లు భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధం చేయనున్నారు.

బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ :

  • బ్రాడ్ గేజ్ మార్గం విద్యుదీకరణ ఈ ఏడాది చివరి నాటికి 72% మేరకు అంటే 46,000 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
  • గత ఏడాది అక్టోబర్ నాటికి 41,548 కిలోమీటర్ల మేర పూర్తయింది.
  • 2023 చివరినాటికి మొత్తం విద్యుదీకరణ పూర్తవుతుంది.

ప్రయాణికుల భద్రత :

  • ప్రయాణికుల భద్రత దృష్ట్యా 'ఎల్ హెచ్ బీ' (LHB) కోచ్ లను ప్రవేశపెట్టనున్నారు.
  • రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఆటోమేటిక్ గా గుర్తించే ఆధునిక సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెడతారు. దీనివల్ల మానవతప్పిదాల కారణంగా రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనే ప్రమాదాలు తప్పుతాయి.
  • పర్యాటక ప్రాంతాల్లో 'విస్టాడోమ్' (VISTADOME) కోచ్ లను ప్రవేశపెడతారు.

'నూతన భారతం - నూతన రైల్వే' విధానం :

  • ఈ విధానం కింద రైల్వే రంగంలో 150 ఆధునిక రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ 2021 మే నెల నాటికి పూర్తికానుంది.
  • 2021 జనవరి 8 నాటికి 'కిసాన్ రైళ్లు' 120 ట్రిప్పులు తిరిగి 34 వేల టన్నుల సరకులు రవాణా చేశాయి.
  • 'కరోనా' కారణంగా రైళ్ల సేవలను నిలిపి వేయడంతో టైమ్ టేబుల్ ఆధారంగా నడిచే ప్రత్యేక పార్శిల్ సేవల రైళ్లను నడిపారు. ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే ప్రథమం. దీనివల్ల కొరియర్, ఈ-బిజినెస్ సంస్థలు లబ్ది పొందాయి.
  • గూడ్సు రైళ్ల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న లైన్లు (DFC) పూర్తయితే వాటి వేగం గంటకు 76 కి.మీ వరకు ఉంటుంది.

5. పెట్టుబడుల ఉపసంహరణ :

  • వచ్చే ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1,75,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • గత ఆర్ధిక సంవత్సరం (2020-21) లో రూ. 2,10,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా కొవిడ్-19, ఇతర అవాంతరాలవల్ల ఆ లక్ష్యాన్ని రూ. 32,000 కోట్లకు కుదించారు. అందులో ఇప్పటివరకు రూ. 19,499 కోట్లే సమీకరించగలిగారు.
  • బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, బీఈఎంఎల్, పవన్ హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ .. తదితర ప్రభుత్వరంగ సంస్థలలో వాటా విక్రయాలను 2021-22 ఆర్ధిక సంవత్సరంలో చేపట్టనున్నారు.
  • ఐడీబీఐ (IDBI) బ్యాంకుతో పాటు రెండు ప్రభుత్వ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరిస్తారు.

ఎయిర్ ఇండియా విక్రయం :

  • ఎయిర్ ఇండియా (AIR INDIA) లో పెట్టుబడుల విక్రయాన్ని 2021-22లో పూర్తిచేయనున్నట్లు ఆర్ధిక మంత్రి వెల్లడించారు. దీనికోసం ఏర్పాటు చేసిన 'ప్రత్యేక సంస్థ' (SPV), ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు రూ. 2,268 కోట్లు కేటాయిస్తారు.

వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 'ఎల్ ఐ సీ' ఐపీవో :

  • ఎల్ ఐ సీ ఐపీవో కోసం చట్ట సవరణను పార్లమెంటు సమావేశాల్లో చేపడతారు.
  • ఎల్ ఐ సీ 'తొలి పబ్లిక్ ఇష్యూ' (IPO) 2021-22లో కార్యరూపం దాల్చనుంది.
  • ఎల్ ఐ సీ లో ప్రస్తుతం నూరుశాతం వాటా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం 10 శాతం వాటా విక్రయించే అవకాశం ఉంది.

6. ఇతర అంశాలు :


(a) వ్యక్తిగత ఆదాయ పన్ను :

  • వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లతో పాటు, సర్ ఛార్జి, సెస్సుల్లో ఈసారి ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు.
  • ప్రస్తుతం రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్ యూ ఎఫ్ (HUF) లు 25 శాతం, ఆపైన ఆదాయం ఉంటే 37 శాతం సర్ ఛార్జి చెల్లించాలి. దీనివల్ల రూ. 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులు గరిష్ఠంగా 42.74 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది.

ఆర్ధిక సంవత్సరం 2021-22 (మదింపు సంవత్సరం 2022-23) కు సంబంధించి వర్తించే శ్లాబులు ... (వివిధ సెక్షన్ల కింద మినహాయింపులను వాడుకున్నప్పుడు) 
ఆదాయం60 ఏళ్ల లోపు వారికి60-80 ఏళ్ల వారికి80 ఏళ్లు ఆపై వయసున్న వారికి
రూ. 2,50,000 వరకుపన్ను లేదుపన్ను లేదుపన్ను లేదు
రూ. 2,50,001-రూ. 3,00,0005%పన్ను లేదుపన్ను లేదు
రూ. 3,00,001-రూ. 5,00,0005%5%పన్ను లేదు
రూ. 5,00,001-రూ. 10,00,00020%20%20%
రూ. 10 లక్షల పైన30%30%30%



ఆర్ధిక సంవత్సరం 2021-22 (మదింపు సంవత్సరం 2022-23) కు సంబంధించి వర్తించే శ్లాబులు ...                             (వివిధ సెక్షన్ల కింద ఎలాంటి మినహాయింపులను వాడుకోనప్పుడు)
ఆదాయం   వర్తించే శ్లాబులు 
రూ. 2,50,000 వరకుపన్ను లేదు
రూ. 2,50,001-రూ. 5,00,000 వరకు5%
రూ. 5,00,001-రూ. 7,50,000 వరకు10%
రూ. 7,50,001-రూ. 10,00,000 వరకు15%
రూ. 10,00,001-రూ. 12,50,000 వరకు20%
రూ. 12,50,001-రూ. 15,00,000 వరకు25%
రూ. 15,00,001 ఆపైన30%

  

(b) బీమా రంగానికి విదేశీ ఊతం :

  • దేశీయ బీమా కంపెనీల్లో ప్రస్తుతం 49 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతి ఉంది. దీన్ని 74 శాతానికి పెంచుతున్నట్లు ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో ప్రకటించారు.
  • బీమా కంపెనీల్లోని బోర్డు సభ్యులు, కీలక ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులై ఉండాలని నిర్దేశించారు.
  • బీమా కంపెనీల లాభాల్లో నిర్దేశించిన శాతాన్ని 'జనరల్ రిజర్వు' కు మళ్లించాలని స్పష్టం చేశారు.
  • ప్రస్తుతం దేశంలో బీమా విస్తృతి జీడీపీ (GDP) లో 3.6 శాతమే. ప్రపంచ సగటు 7.13 శాతం.
  • సాధారణ బీమాలో బీమా విస్తృతి ప్రపంచ సగటు 2.88 శాతం కాగా .. మనదేశంలో 'జీడీపీ' లో 0.94 శాతంగా ఉంది.
  • ప్రస్తుతం ప్రైవేటు రంగంలో 23 జీవిత బీమా కంపెనీలు, 28 సాధారణ బీమా / ఆరోగ్య బీమా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వరంగంలో 'ఎల్ ఐ సీ' ఒక్కటే జీవిత బీమా సంస్థ. ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు 4 ఉన్నాయి.

(c) ప్రభుత్వరంగ బ్యాంకులకు మరో రూ. 20,000 కోట్లు :

  • నియంత్రణ సంస్థల నిబంధనలు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వరంగ బ్యాంకు (PSB) ల్లోకి 2021-22లో మరో రూ. 20,000 కోట్ల నిధుల్ని చొప్పించనున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు.

(d) 'దేశమే ముందు' సంకల్పానికి అష్టపది :

  • 2021-22 బడ్జెట్ కు ఎనిమిది ప్రాధాన్య రంగాలను గుర్తించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. 'దేశమే ముందు' అనే సంకల్పంలో ఇది భాగమని ప్రకటించారు. ఆయా రంగాలు :
    1. రైతుల ఆదాయం రెట్టింపు
    2. బలమైన మౌలిక సదుపాయాలు
    3. ఆరోగ్య భారత్
    4. సుపరిపాలన
    5. యువతకు అవకాశాలు
    6. అందరికీ విద్య
    7. సమ్మిళిత వృద్ధి
    8. ఆరోగ్య రంగం
  • అన్ని జిల్లాల్లో సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు. 202 జిల్లాల్లో క్లిష్టతర చికిత్స ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు.
  • ఆరోగ్య పరిరక్షణకు జాతీయస్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు.

(e) ఉజ్వల :

  • 'ఉజ్వల' (UJWALA) పథకం కింద మరో కోటి ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు.
  • వాహనాలకు 'సీ ఎన్ జీ' (CNG) సరఫరా చేస్తారు.
  • ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సదుపాయాన్ని మరో 100 జిల్లాలకు విస్తరిస్తారు.
  • 'గెయిల్, ఐఓసీ, హెచ్ పీ సీ ఎల్' పైపులైన్ల 'నగదీకరణకు అనుమతిస్తారు. అంటే వాటిని ఇతర కంపెనీల అవసరాలకూ వాడుకుని ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశం కల్పిస్తారు.

(f) ఇతర దేశాలకు రూ. 7,100 కోట్లు :

  • పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు రూ. 7,100 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో భూటాన్ కు రూ. 3,004 కోట్లు కేటాయించారు. ఇరాన్ లో 'చాబహార్' నౌకాశ్రయానికి రూ. 100 కోట్లు ఇచ్చారు.

(g) గిగ్ కార్మికులకు సామాజిక భద్రత :

  • ఊబర్, స్విగ్గీ లాంటి రవాణా, సరకు సరఫరా సంస్థల్లో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రత ప్రయోజనాలను విస్తరించనున్నారు. గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికులుగా పేర్కొంటున్న వీరి సమాచారాన్ని సేకరించి పోర్టల్ రూపొందించేందుకు ప్రతిపాదిస్తున్నారు. వారికి వైద్యం, ఆహారం, సులభతర రుణాలు, ఇతర ప్రయోజనాలను కల్పించనున్నారు.

(h) ఇతర అంశాలు :

  • రక్షణ రంగానికి రూ. 4,78,196 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ తో పోల్చితే ఇది 1.4 శాతం అధికం.
  • 'స్వచ్ఛ భారత్ - స్వాస్థ్య భారత్' కార్యక్రమానికి రూ. 1,90,000 కోట్లు కేటాయించారు.
  • మౌలిక సదుపాయాలపై రూ. 5,54,000 కోట్లు మూలధన వ్యయం చేయనున్నారు.
  • పట్టణ ప్రాంతాల కోసం ఐదేళ్లలో రూ. 2,87,000 కోట్లతో 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమాన్ని చేపడతారు.
  • తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన 'జల్ జీవన్ మిషన్' కు రూ. 50,000 కోట్లు కేటాయించారు.
  • జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని 'తాగునీరు, పారిశుద్ధ్య' విభాగానికి మొత్తం రూ. 60,030 కోట్లు కేటాయించారు.
  • రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు రూ. 1,18,101 కోట్లను కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజారవాణాను మెరుగుపరిచేందుకు రూ. 18,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో 20,000 బస్సులను అందుబాటులోకి తెస్తారు. 
  • పత్తి దిగుమతిపై 10% కస్టమ్స్ సుంకం విధించారు. ముడి పట్టు, పట్టు దారంపై ఉన్న సుంకాన్ని 10% నుంచి 15 శాతానికి పెంచారు.
  • పింఛను, డిపాజిట్లపై వడ్డీ పొందుతున్న 75 ఏళ్లు పైబడిన వృద్ధులు పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. బ్యాంకు ఖాతాల్లోనే వారి పన్ను మొత్తాన్ని మినహాయిస్తారు.
  • వచ్చే ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ప్రభుత్వం రూ. 12 లక్షల 5 వేల కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు.
  • ఈసారి బడ్జెట్ ను తొలిసారిగా కాగిత రహిత విధానంలో ప్రవేశపెట్టారు.
  • దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ. 1,500 కోట్ల పథకాన్ని ప్రతిపాదించారు.
  • ఇంజినీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో అప్రెంటిస్ చట్టాన్ని సవరించడంతోపాటు, జాతీయ అప్రెంటిస్షిప్ శిక్షణ పథకం పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. ఆయా వర్గాల యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ధేందుకు రూ. 3,000 కోట్లు కేటాయించారు.
  • జనగణన కోసం రూ. 3,726 కోట్లను కేటాయించారు. తొలిసారి జనగణను డిజిటల్ రూపంలో చేయనున్నారు.
  • దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల్లో 'ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య' (PPP) విధానంలో యాజమాన్య నిర్వహణ సేవలు అందించడం కోసం రూ. 2,000 కోట్లకు పైగా విలువ గల 7 ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వాణిజ్య నౌకలను ప్రోత్సహించేందుకు రానున్న ఐదేళ్లలో రూ. 1,624 కోట్ల రాయితీ ఇవ్వనున్నారు.
  • ఈ ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ఉపాధి హామీ పథకానికి రూ. 73,000 కోట్లను కేటాయించారు.
  • 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఆహారం, ఎరువులు, ఎల్ పీ జీ, కిరోసిన్ పై రాయితీ మొత్తాన్ని రూ. 3,36,439 కోట్లకు పరిమితం చేశారు.
  • అధిక వేతనం ఉన్న ఉద్యోగులు 'భవిష్య నిధి' (PF) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి ఈ బడ్జెట్ లో కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. దీని ప్రకారం .. ఇకపై రూ. 2,50,000 వరకు జమ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆపై జమ చేసే మొత్తానికి లభించే వడ్డీకి వర్తించే స్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. ఇది 2021 ఏప్రిల్ 1 నుంచి చేసే జమలకే వర్తిస్తుంది.
  • ఆర్ధిక ఇబ్బందులతో కునారిల్లుతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు నూతన జవసత్వాలు అందించడమే లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో రూ. 3 లక్షల 5 వేల కోట్లు వెచ్చించనున్నారు.
  • మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ. 24,435 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికంగా రూ. 20,105 కోట్లు 'సక్షం అంగన్వాడీ, మిషన్ పోషణ్ 2.0' కు కేటాయించారు.
  • ప్రస్తుతం 9.5 శాతానికి పెరిగిన ద్రవ్యలోటును 2025-26 నాటికి 4.5% కంటే దిగువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • రూ. 75,000 కోట్లతో 'అభివృద్ధి ఆర్ధిక సంస్థ' ను ఏర్పాటు చేస్తారు.
  • గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి రూ. 40,000 కోట్లు కేటాయించారు.
  • ఐదు ప్రధాన ఫిషింగ్ హబ్ ల అభివృద్ధికి ప్రకటించిన 'ఆపరేషన్ గ్రీన్' (OPERATION GREEN) పథకాన్ని మరో 22 పాడైపోయే వస్తువులకూ వర్తింపజేస్తారు.
  • అంతరిక్ష రంగానికి రూ. 13,949 కోట్లు కేటాయించారు. కొత్తగా ఏర్పాటయిన 'న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్' (NEW SPACE INDIA LIMITED) సంస్థకు రూ. 700 కోట్లు కేటాయించారు.
  • పర్యాటక రంగానికి రూ. 2,026 కోట్లు కేటాయించారు.
  • వలస కార్మికుల కోసం పట్టణాల్లో తక్కువ అద్దెకే ఇళ్లు నిర్మించేవారిని ప్రోత్సహిస్తారు. ఈ ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న రుణంపైనా రూ. 1,50,000 వడ్డీ రాయితీ ఉంది. ఇది 2022 మార్చ్ 31 వరకు అమల్లో ఉంటుంది.
  • మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే 'పీఎంఏవై' (PMAY) పథకాన్ని మరో ఏడాది పొడిగించారు. అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం ను మరో ఏడాది పొడిగించారు.
  • విదేశాల నుంచి ప్రవాస భారతీయులు తిరిగి వచ్చేసినపుడు ఆయా దేశాలతోపాటు ఇక్కడా ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సమస్యలకు దారి తీస్తుండడంతో 'వివాద పరిష్కార కమిటీ' ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
  • విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 'ఇంక్ కాట్రిడ్జ్, సెల్ ఫోన్ విడిభాగాలైన కెమెరా, కనెక్టర్లు, బ్యాక్ కవర్, ఛార్జర్లు' పై కస్టమ్స్ సుంకం పెంచనున్నారు.
  • దేశీయ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చి ప్రపంచస్థాయిలో  పోటీపడే వాతావరణం కల్పించేందుకు, ఉపాధి అవకాశాల మెరుగుకు .. దేశవ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో 7 మెగా టెక్స్ టైల్ పార్క్ ల ఏర్పాటుకు ప్రత్యేక పథకాన్ని (MITRA) ప్రకటించారు.
  • గతేడాది కిరోసిన్ పై రూ. 2,982 కోట్లు రాయితీ ఇవ్వగా .. ఈ ఏడాది ఏవిధమైన కేటాయింపులు చేయలేదు.
  • విమానాల లీజింగ్ కంపెనీలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు.