ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, మార్చి 2022, గురువారం

'డీమ్యాట్' (DEMAT) అకౌంట్ ఓపెన్ చేయబడును

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC of India) త్వరలో పబ్లిక్ ఇష్యూ (IPO = Initial Public Offering) కి సిద్ధమవుతోంది. అంటే ఎల్ ఐ సి (LIC) తన సంస్థలో కొన్ని షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా పబ్లిక్ కి ఆఫర్ చేస్తుంది. పబ్లిక్ కి ఆఫర్ చేసే షేర్లలో 10% వాటాను ప్రత్యేకంగా ఎల్ ఐ సి పాలసీదారులకు రిజర్వ్ చేసింది. ఈ షేర్లను ప్రత్యక్షంగా గానీ (లేదా) లాటరి ద్వారా గానీ కేటాయిస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో పాల్గొనాలి అనుకునేవారు తప్పనిసరిగా తమ పేరుమీద ఒక 'డీమ్యాట్' (DEMAT) అకౌంట్ ని కలిగి ఉండాలి.

ఏదైనా పబ్లిక్ ఇష్యూలో షేర్లను కొనాలన్నా, ఆ తర్వాత వాటిని అమ్మాలన్నా 'డీమ్యాట్' (DEMAT) అకౌంట్ తప్పనిసరి. ఆర్ధిక సెక్యూరిటీలను (ఉదా : ఈక్విటీలు (షేర్లు), డెరివేటివ్స్, కమొడిటీస్ .. మొదలగునవి) ఒక ఎలక్ట్రానిక్ ఫామ్ లో నిర్వహించబడే అకౌంట్ ను 'డీమ్యాట్' (DEMAT) అకౌంట్ అని అంటారు.

పబ్లిక్ ఇష్యూ ద్వారా జారీ చేయబడే ఒక్కో ఎల్ ఐ సి షేర్ విలువ రూ. 2,000 నుంచి రూ. 3,000 కు మధ్యన ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పూర్తి వివరాలకు క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. 

9963309837 (లేదా) 9908216775 (A. శ్రీనివాసరావు)    

3, ఫిబ్రవరి 2022, గురువారం

జి.కె.టెస్ట్-12 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-12 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU


1వ ప్రశ్న : ఐక్యరాజ్య సమితి (UNO) కి చెందిన 'ప్రపంచ వాతావరణ సంస్థ' (WMO) తెలిపిన వివరాల ప్రకారం .. ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపు ఎక్కడ సంభవించింది ?

జవాబు : అమెరికా

2020 ఏప్రిల్ 29న అమెరికాలో కనిపించిన 'మెరుపు' ఇంతవరకు అతి పొడవైనదిగా 'డబ్ల్యుఎంఓ' తేల్చింది. ఈ మెరుపు పొడవు దాదాపు 770 కి.మీ. లు. అమెరికా దక్షిణ ప్రాంతంలోని మిసిసిపి, లూసియానా, టెక్సాస్ ల మీదుగా ఈ మెరుపు మెరిసినట్లు డబ్ల్యుఎంఓ తెలిపింది.

అంతకుముందు అతి పొడవైన మెరుపు బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలో కనిపించింది. 2018 అక్టోబర్ 31న అది 709 కి.మీ.ల మేర విస్తరించింది.

అత్యంత ఎక్కువ సమయం మెరిసిన మెరుపు కూడా 2020లోనే కనిపించినట్లు డబ్ల్యుఎంఓ తెలిపింది. ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనా మీదుగా జూన్ 18న 17.102 సెకన్ల పాటు (0.002 సెకన్లు అటు ఇటుగా) ఈ మెరుపు మెరిసింది.

2వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి ప్రయాణ టికెట్, ప్రత్యేక దర్శనం బుక్ చేసుకున్న వారికి .. తిరుమల కొండ పైకి వెళ్లి తిరిగి వచ్చే టిక్కెట్లను కూడా (Online booking for Tirumala travel on APSRTC buses) ఏ తేదీ నుంచి జారీ చేయనున్నారు ?

జవాబు : 2022 ఫిబ్రవరి 3

ఈ టిక్కెట్లకు ఆన్లైన్ లోనే అదనంగా రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.

3వ ప్రశ్న : సివిల్ సర్వీసెస్-2022 నోటిఫికేషన్ (Civil Services-2022 Notification) ఎప్పుడు విడుదలయ్యింది ?

జవాబు : 2022 ఫిబ్రవరి 2

గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య పెరిగింది. ప్రస్తుత నోటిఫికేషన్ లో మొత్తం 861 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. 

2020లో 796, 2021లో 712 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2019లో మాత్రం 896 ఖాళీలను భర్తీ చేశారు.

 సివిల్ సర్వీసెస్-2022 ప్రాథమిక పరీక్ష జూన్ 5న జరగనుంది. దరఖాస్తు గడువు 2022 ఫిబ్రవరి 22 వరకు ఉంది.

4వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'అమరావతి' ని తమ రాజధానిగా ఏ తేదీన ప్రకటించింది ?

జవాబు : 2015 ఏప్రిల్ 23

5వ ప్రశ్న : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా ఏ నగరంలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల (Pre-paid Electricity Meters) ను ఏర్పాటు చేశారు ?

జవాబు : విశాఖపట్నం

విశాఖపట్నం సర్కిల్ కార్యాలయంలోని జోన్-1 పరిధిలో వంద గృహ, వాణిజ్య విద్యుత్తు (95 సింగిల్ ఫేజ్, 5 త్రీ ఫేజ్) కనెక్షన్లకు ఈ మీటర్లను అనుసంధానం చేశారు. 

6వ ప్రశ్న : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏ సంస్థ భారత సైన్యం కోసం 'కొంకర్స్-ఎం' యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను సరఫరా చేయనుంది ?

జవాబు : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

దీనికి సంబంధించిన ఒప్పందంపై 'బీడీఎల్' భారత సైన్యంతో 2022 ఫిబ్రవరి 2న సంతకాలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 3,131.82 కోట్లు. మూడేళ్లలో ఈ క్షిపణులను సరఫరా చేయాల్సి ఉంటుంది.

'కొంకర్స్-ఎం' యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను రష్యాకు చెందిన 'ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్' (OEM) కంపెనీతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుని మనదేశంలో ఉత్పత్తి చేస్తున్నట్లు బీడీఎల్ సిఎండి 'సిద్ధార్థ మిశ్రా' వివరించారు. శత్రువుకు చెందిన యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేయగల సత్తా ఈ క్షిపణులకు (ATGM) ఉంది. 'బీఎంపీ-2' ట్యాంక్ లాంచర్ లేదా భూమి మీద నుంచి ఈ క్షిపణులను ప్రయోగించవచ్చు. కేవలం 19 సెకన్ల వ్యవధిలోనే నాలుగు వేల మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. పూర్తిగా దేశీయంగా తయారైన విడిభాగాలతో వీటిని మనదేశంలో బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది.

7వ ప్రశ్న : ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే ఐపీల్ వేలంలో పాల్గొనే తుది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి ?

జవాబు : మనోజ్ తివారి

గతంలో టీంఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించిన 36 ఏళ్ల మనోజ్ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి రానున్నాడు.

గతేడాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి మమతా బెనర్జీ మంత్రివర్గంలో క్రీడల శాఖ బాధ్యతలు చూస్తున్నాడు.

8వ ప్రశ్న : 2021 సంవత్సరానికి ఐసీసీ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డును ఎవరు గెలుచుకున్నారు ?

జవాబు : డరిల్ మిచెల్ (న్యూజిలాండ్)

 ఇంగ్లాండ్ తో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి, తేలిగ్గా వచ్చే ఓ సింగిల్ ను తీయడానికి నిరాకరించినందుకు అతడు ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.

కివీస్ ఇన్నింగ్స్ లో నీషమ్ బంతిని కొట్టి సింగిల్ తీయాలనుకున్నాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న మిచెల్ పరుగు తీయడానికి నిరాకరించాడు. బంతిని పట్టుకోవాలనుకున్న రషీద్ కు తాను అడ్డుగా వచ్చానని భావించడమే అందుకు కారణం. 

9వ ప్రశ్న : 24 ఏళ్ల తర్వాత తొలిసారి ఏ దేశ క్రికెట్ జట్టు 'అండర్-19 ప్రపంచకప్' ఫైనల్ చేరింది ?

జవాబు : ఇంగ్లాండ్

ఉత్కంఠగా సాగిన సెమీస్ లో ఆ జట్టు డక్ వర్త్ లూయిస్ పధ్ధతి ప్రకారం 15 పరుగుల తేడాతో ఆఫ్గానిస్థాన్ పై గెలిచింది. 

10వ ప్రశ్న : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్ల కొత్త మార్కెట్ విలువలు (రిజిస్ట్రేషన్) ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ?  

జవాబు : 2022 ఫిబ్రవరి 1

తెలంగాణ రాష్ట్రంలో కనీస పెరుగుదల వ్యవసాయ భూముల విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, ఫ్లాట్ల విలువ 25 శాతంగా ఉంది.

హైదరాబాద్ బంజారాహిల్స్ లో చదరపు గజానికి రూ. 1,14,100 గా నిర్ణయించారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక ధర.

26, జనవరి 2022, బుధవారం

జి.కె.టెస్ట్-11 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-11 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. మానవ మెదడులో కంప్యూటర్ చిప్ ను చొప్పించేందుకు ఏ సంవత్సరంలో 'న్యూరాలింక్' (NEURALINK) అనే అంకుర సంస్థను ఎలన్ మస్క్ ఏర్పాటు చేశారు ? ['బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ పేస్' (BCI) సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు ఈ సంస్థ చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్ళు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుంది]

(ఎ) 2015

(బి) 2016

(సి) 2017

(డి) 2018


2. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి 'సుభాష్ చంద్ర బోస్' జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో దాని హాలోగ్రామ్ విగ్రహాన్ని డిజిటల్ రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ తేదీన ఆవిష్కరించారు ?

(ఎ) 2022 జనవరి 20

(బి) 2022 జనవరి 21

(సి) 2022 జనవరి 22

(డి) 2022 జనవరి 23


3. కొవిడ్ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రంలో ఏ తేదీ నుంచి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ చేస్తున్నారు ? [ఉచిత దర్శనం, రూ. 150 చెల్లించి శీఘ్ర దర్శనం, రూ. 300 చెల్లించి అతిశీఘ్ర దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను www.srisailadevasthanam.org ద్వారా పొందవచ్చు. భక్తులు తమ కొవిడ్ వాక్సినేషన్ ధ్రువపత్రాన్ని ఆన్లైన్ లో పొందుపరచాల్సి ఉంటుంది]

(ఎ) 2022 జనవరి 23

(బి) 2022 జనవరి 24

(సి) 2022 జనవరి 25

(డి) 2022 జనవరి 26


4. అంటార్కిటికాలో వాతావరణ మార్పుల్ని పరిశీలించేందుకు 'అంటార్కిటికా ఎక్స్ పిడిషన్-2022' (ANTARCTIC EXPEDITION-2022) పేరిట నిర్వహిస్తున్న యాత్రకు ఎంపికైన 'అభిషేక్ సొబ్బన' ఏ జిల్లాకు చెందినవాడు ? [అతనితోపాటు 45 దేశాలకు చెందిన 150 మందికి పైగా ఈ యాత్రలో పాల్గొననున్నారు. '2041 ఫౌండేషన్' వ్యవస్థాపకుడు రాబర్ట్ స్వాన్ 'ది లీడర్షిప్ ఆన్ ది ఎడ్జ్' కార్యక్రమంలో భాగంగా అంటార్కిటికా ఎక్స్ పిడిషన్ ను ఏటా నిర్వహిస్తున్నారు. 2022 మార్చ్ 17 నుంచి 28వ తేదీ మధ్య ఈ యాత్ర జరుగుతుంది]

(ఎ) వైఎస్సార్ కడప 

(బి) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

(సి) తూర్పుగోదావరి

(డి) విశాఖపట్నం


5. భారతదేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తి (India's 'Tallest Man') గా పేరొందిన 'ధర్మేంద్ర ప్రతాప్ సింగ్' ఏ రాజకీయ పార్టీలో చేరారు ? [ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు 8.1 అడుగులు]

(ఎ) కాంగ్రెస్

(బి) బీజేపీ

(సి) సమాజ్ వాదీ పార్టీ

(డి) బహుజన్ సమాజ్ పార్టీ 


6. కొవిడ్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో వ్యాపిస్తుందో తెలిపేది ? [ఇది 1 కంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లుగా పరిగణిస్తారు]

(ఎ) పీ-వాల్యూ

(బి) క్యూ-వాల్యూ

(సి) ఆర్-వాల్యూ 

(డి) ఎస్-వాల్యూ 


7. నేతాజీ రీసెర్చ్ బ్యూరో 2022 సంవత్సరానికి నేతాజీ పురస్కారాన్ని (NETAJI AWARD 2022) ఎవరికి ప్రదానం చేసింది ?

(ఎ) షింజో అబే

(బి) జో బైడెన్

(సి) వ్లాదిమిర్ పుతిన్

(డి) బరాక్ ఒబామా


8. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ 'బచేంద్రిపాల్' సారథ్యంలో 50 ఏళ్లు పైబడిన పదిమంది మహిళల జట్టుతో అరుణాచల్ ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా చేపట్టనున్న సుదీర్ఘ యాత్ర ఏ తేదీన ప్రారంభం కానుంది ? [ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా 5 నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగుతుంది. 'టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్', కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 'ఫిట్ ఇండియా' (FIT INDIA) బ్యానరుపై ఈ యాత్రను నిర్వహిస్తున్నారు]

(ఎ) 2022 మార్చ్ 6

(బి) 2022 మార్చ్ 7

(సి) 2022 మార్చ్ 8

(డి) 2022 మార్చ్ 9


9. భారతదేశంలో ఏ తేదీన 'జాతీయ బాలికా దినోత్సవం' ను జరుపుతారు ? [భారతీయ సమాజంలో బాలికల విషయంలో నెలకొన్న దుర్విచక్షణ పట్ల అందరినీ చైతన్యవంతం చేసేందుకు 2008లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'జాతీయ బాలికా దినోత్సవం' (NATIONAL GIRL CHILD DAY) ను ప్రారంభించారు] 

(ఎ) 2022 జనవరి 21

(బి) 2022 జనవరి 22

(సి) 2022 జనవరి 23

(డి) 2022 జనవరి 24


10. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి (GDP Growth in 2022-23) ఎంత శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని 2021-22 ఆర్ధిక సర్వేలో అంచనా వేయనున్నారు ?

(ఎ) 7%

(బి) 8%

(సి) 9%

(డి) 10%


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-11 ; సంవత్సరం : 2022 (GK TEST-11 ; YEAR : 2022)

1) సి 2) డి 3) సి 4) బి 5) సి 6) సి 7) ఎ 8) సి 9) డి 10) సి    


E&OE. (Errors and Omissions Expected)

25, జనవరి 2022, మంగళవారం

జి.కె.టెస్ట్-10 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-10 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏయే తేదీలలో జరగనున్నాయి ? 

(ఎ) 2022 ఫిబ్రవరి 20 నుంచి 2022 మార్చ్ 2 వరకు 

(బి) 2022 ఫిబ్రవరి 21 నుంచి 2022 మార్చ్ 3 వరకు

(సి) 2022 ఫిబ్రవరి 22 నుంచి 2022 మార్చ్ 4 వరకు

(డి) 2022 ఫిబ్రవరి 23 నుంచి 2022 మార్చ్ 5 వరకు


2. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడి పేరేమిటి ? [ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఏటా 'డాక్టర్ జె.కె. త్రివేది జీవన సాఫల్య పురస్కారం' నిమిత్తం దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా ఉన్న మానసిక వైద్యుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి ఇతనిని ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరిలో భువనేశ్వర్ లో జరిగే జాతీయ సైకియాట్రిక్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డు అందజేస్తారు]

(ఎ) డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి

(బి) డాక్టర్ కూటికుప్పల సూర్యారావు

(సి) డాక్టర్ కర్రి రామారెడ్డి 

(డి) డాక్టర్ పి. ఉదయ్ కిరణ్


3. గణతంత్ర వేడుకల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 29న ఏర్పాటు చేసే 'బీటింగ్ రిట్రీట్' కార్యక్రమంలో మహాత్మా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ కీర్తన 'అబైడ్ విత్ మీ' ని తొలగించారు. ఏటా ఈ గేయంతోనే వేడుక ముగిసేది. ఈసారి మాత్రం 'సారే జహా సే అచ్చా' తో కార్యక్రమం సమాప్తమవుతుంది. 'అబైడ్ విత్ మీ' ని స్కాటిష్ ఆంగ్లికన్ కవి 'హెన్రీ ఫ్రాన్సిస్ లైట్' ఏ సంవత్సరంలో రచించారు ? [1950 నుంచి ఈ కీర్తన 'బీటింగ్ రిట్రీట్' లో భాగంగా ఉంటోంది]

(ఎ) 1846

(బి) 1847

(సి) 1848

(డి) 1849


4. ఏ దేశంలోని బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా పరమాణు స్థాయిలో ఒమిక్రాన్ యొక్క నిర్మాణ తీరుతెన్నులను ఆవిష్కరించారు ? [ఈ పరిశోధక బృందంలో భారత సంతతికి చెందిన 'శ్రీరాం సుబ్రహ్మణ్యం' కూడా ఉన్నారు ]

(ఎ) యూ ఎస్ ఏ

(బి) ఇంగ్లాండ్

(సి) ఆస్ట్రేలియా

(డి) కెనడా


5. 2022 జనవరి 22న భారత ప్రధాని నరేంద్ర మోదీ 'ఆకాంక్షిత జిల్లాల పథకం' పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ జిల్లాను కూడా ఒక ఉదాహరణగా ప్రధాని ప్రస్తావించారు ? [2018లో 112 వెనుకబడిన జిల్లాలతో ఆకాంక్షిత జిల్లాల పథకాన్ని ప్రారంభించారు]

(ఎ) విశాఖపట్నం

(బి) భద్రాద్రి కొత్తగూడెం

(సి) అనంతపురం

(డి) ఆదిలాబాద్


6. ఏ సంవత్సరంలో 'డోలో' పేరుతో 650 ఎంజీ డోసు పారాసెట్మాల్ టాబ్లెట్ ను బెంగళూరుకు చెందిన 'మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్' తీసుకొచ్చింది ? [ఈ ఫార్మా కంపెనీ విజయానికి ఈ డోసే ప్రధాన కారణం. అప్పటి వరకు మార్కెట్ లో పారాసెట్మాల్ 500 ఎంజీ మాత్రమే అందుబాటులో ఉండేది]

(ఎ) 1991

(బి) 1992

(సి) 1993

(డి) 1994


7. 2022 జనవరి 21న జరిగిన 'భారత పెట్రోలియం, శక్తి సంస్థ' (IIPE) మొదటి స్నాతకోత్సవానికి ఎవరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ?

(ఎ) రామ్ నాథ్ కోవింద్

(బి) ఎం.వెంకయ్య నాయుడు

(సి) నరేంద్ర మోదీ 

(డి) వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి


8. ఆస్ట్రేలియాలో 2022 అక్టోబర్ 22న ప్రారంభమయ్యే '2022 టీ20 క్రికెట్ ప్రపంచకప్' టోర్నీ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఢీకొనే జట్టేది ? [2022 నవంబర్ 9, 10 తేదీల్లో సెమీఫైనల్స్ (సిడ్నీ, అడిలైడ్), 13న ఫైనల్ (మెల్ బోర్న్) జరుగుతాయి]

(ఎ) న్యూజీలాండ్

(బి) ఇంగ్లాండ్ 

(సి) భారత్

(డి) దక్షిణాఫ్రికా


9. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ 'నవోమి ఒసాకా' (జపాన్) ను మూడో రౌండ్ లో ఓడించినది ? [ఈమె రెండో రౌండ్లో ఒలింపిక్ ఛాంపియన్ 'బెన్సిచ్' కు షాక్ ఇచ్చింది]  

(ఎ) అనిసిమోవా (అమెరికా)

(బి) అజరెంక (బెలారస్)

(సి) స్వితోలిన (ఉక్రెయిన్)

(డి) ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)


10. మలయాళ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'మరక్కార్' చిత్ర దర్శకుని పేరేమిటి ? [94వ ఆస్కార్ వేడుకల కోసం బరిలో నిలిచిన 276 చిత్రాలలో మనదేశం నుంచి 'మరక్కార్' మరియు 'జై భీమ్' కూడా ఉన్నాయి]

(ఎ) గోవిందన్ అరవిందన్

(బి) ప్రతాప్ పోతన్ 

(సి) ప్రియదర్శన్

(డి) రాజీవ్ కుమార్


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-10 ; సంవత్సరం : 2022 (GK TEST-10 ; YEAR : 2022)

1) సి 2) ఎ 3) బి 4) డి 5) బి 6) సి 7) బి 8) ఎ 9) ఎ 10) సి    


E&OE. (Errors and Omissions Expected)

19, జనవరి 2022, బుధవారం

జి.కె.టెస్ట్-9 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-9 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఏ తేదీలోగా ఉద్యోగాలు ఇవ్వనున్నారు ?

(ఎ) 2022 మే 31

(బి) 2022 జూన్ 30

(సి) 2022 జూలై 31

(డి) 2022 ఆగస్ట్ 31


2. 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష' పథకం (YSR JAGANANNA SASWATHA BHU HAKKU AND BHU RAKSHA PATHAKAM) లో భాగంగా తొలిదశ కింద 51 గ్రామాల్లో పూర్తి చేసిన భూముల రీ-సర్వే రికార్డులను ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రజలకు ఏ తేదీన అంకితం చేశారు ? [ఇందులో 37 గ్రామాల్లో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు]

(ఎ) 2022 జనవరి 15

(బి) 2022 జనవరి 16

(సి) 2022 జనవరి 17

(డి) 2022 జనవరి 18


3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఈ మార్కెట్ వేదిక ద్వారా పొలం నుంచే విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థను ఏర్పాటు చేస్తోంది ? [ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యాన నర్సరీల నమోదు చట్టం 2022 జనవరి 18 నుంచి అమల్లోకి వస్తుందని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది]

(ఎ) ఈ-క్రయ కార్పొరేషన్ 

(బి) ఈ-విక్రయ కార్పొరేషన్

(సి) ఈ-సేల్ కార్పొరేషన్

(డి) ఈ-మార్కెట్ కార్పొరేషన్


4. వీధులను వాహన కేంద్రాలుగానే కాకుండా ప్రజా కేంద్రాలుగా మార్చాలన్న '2006 నేషనల్ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ పాలసీ' (2006 NATIONAL URBAN TRANSPORT POLICY) ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2020లో శ్రీకారం చుట్టిన "స్త్రీట్స్ 4 పీపుల్ ఛాలెంజ్" (STREETS 4 PEOPLE CHALLENGE) పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయస్థాయిలో తొలి 11 స్థానాల్లో నిలిచిన నగరం ? [దేశంలోని 100 నగరాల మధ్య ఈ పోటీని నిర్వహించారు]

(ఎ) తిరుపతి

(బి) విజయవాడ

(సి) విశాఖపట్నం

(డి) కాకినాడ


5. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న దిల్లీ రాజ్ పథ్ లో జరిగే వేడుకల్లో మొత్తం ఎన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు మాత్రమే కవాతులో పాల్గొననున్నాయి ?

(ఎ) 10

(బి) 11

(సి) 12

(డి) 13


6. భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక 'ఐ ఎన్ ఎస్ రణ్ వీర్' (INS RANVIR) లో 2022 జనవరి 18 సాయంత్రం 4.30 గంటలకు జరిగిన పేలుడు ఘటనలో నేవీ కి చెందిన ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. రాజ్ పుత్ తరగతి డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో 'ఐ ఎన్ ఎస్ రణ్ వీర్' ఎన్నోది ?

(ఎ) 1

(బి) 2

(సి) 3

(డి) 4


7. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా 'భగవంత్ మాన్' (BHAGWANT MANN) ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరపున ఖరారు చేశారు ? 

(ఎ) పంజాబ్

(బి) ఉత్తర్ ప్రదేశ్

(సి) ఉత్తరాఖండ్

(డి) గోవా


8. ఐపీల్ కొత్త ఫ్రాంచైజీ 'లఖ్ నవూ' కు (IPL TEAM LUCKNOW CAPTAIN) ఏ ఆటగాడు సారథ్యం వహించనున్నాడు ?

(ఎ) కే ఎల్ రాహుల్

(బి) రిషబ్ పంత్ 

(సి) హార్దిక్ పాండ్య

(డి) మయాంక్ అగర్వాల్


9. ఫార్ములా వన్ కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే 'ఫార్ములా ఈ-రేస్' (FORMULA E-RACE) పోటీలకు కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారిగా అవకాశం దక్కించుకున్న నగరం ? [2022 నవంబర్ 22 నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఫార్ములా ఈ-రేస్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరగనున్నాయి. 'పినాకిల్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్' (THE PINNACLE OF ELECTRIC CAR RACING CHAMPIONSHIP) పేరుతో ఈ పోటీలు జరగనున్నాయి]

(ఎ) నయా రాయపూర్ 

(బి) ఇండోర్

(సి) హైదరాబాద్

(డి) బెంగళూరు


10. కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు ఇకపై రాత్రి ఎన్ని గంటల వరకు తెరిచే ఉంటాయి ? [కొవిడ్ మార్గదర్శకాలను పాటించేందుకు పని వేళలను పెంచినట్లు ఆయా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విక్రయాల ఖాతాల నిర్వహణకు ఈ సమయాన్ని పెంచినట్లు వెల్లడించారు]

(ఎ) 8

(బి) 9

(సి) 10

(డి) 11


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-9 ; సంవత్సరం : 2022 (GK TEST-9 ; YEAR : 2022)

1) బి 2) డి 3) బి 4) బి 5) సి 6) డి 7) ఎ 8) ఎ 9) సి 10) సి    


E&OE. (Errors and Omissions Expected)

9, జనవరి 2022, ఆదివారం

జి.కె.టెస్ట్-8 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-8 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. 2022 జనవరి 5న జరిగిన పంజాబ్ రాష్ట్ర పర్యటనలో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ని ఏ జిల్లాలో నిరసనకారులు దిగ్బంధించారు ? [ఈ పరిణామంతో ప్రధాని దిల్లీకి తిరుగు పయనమయ్యారు] 

(ఎ) ఫరీద్ కోట్

(బి) ఫతేగర్ సాహెబ్ 

(సి) ఫజిల్క 

(డి) ఫిరోజ్ పుర్ 


2. కొవిడ్ బారిన పడిన వారికి ఇంట్లో ఏకాంతంలో ఉండాల్సిన (HOME ISOLATION) కాల పరిమితిని భారత ప్రభుత్వం 10 రోజుల నుంచి ఎన్ని రోజులకు తగ్గించింది ? [ఈ సమయంలో వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే ఐసొలేషన్ ను ముగించవచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు]

(ఎ) 9

(బి) 8

(సి) 7

(డి) 6


3. భారతదేశంలో తొలి ఒమిక్రాన్ కారక మరణం ఏ రాష్ట్రంలో నమోదైంది ? [ఈ విషయాన్ని భారత ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది] (India's first Omicron-related Death)

(ఎ) రాజస్థాన్

(బి) మహారాష్ట్ర

(సి) కేరళ

(డి) గుజరాత్


4. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి ఏ తేదీ నుంచి కొవిడ్ టీకా ముందు జాగ్రత్త డోసు (COVID VACCINE THIRD DOSE) ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు నీతి ఆయోగ్ (NITI AAYOG) సభ్యుడు 'వీకే పాల్' తెలిపారు ?

(ఎ) 2022 జనవరి 8

(బి) 2022 జనవరి 9

(సి) 2022 జనవరి 10

(డి) 2022 జనవరి 11


5. ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన అధికారుల బృందం ఎయిర్ మార్షల్ 'మానవేంద్ర సింగ్' నేతృత్వంలో జరిపిన దర్యాప్తు ప్రకారం .. భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 12 మంది మృతి చెందిన వైమానికదళ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణం ? [తమిళనాడులోని కూనూర్ సమీపంలో 2021 డిసెంబర్ 8న రష్యా తయారీ ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కుప్పకూలింది] (IAF Helicopter Crashed in Tamilnadu)

(ఎ) ప్రతికూల వాతావరణం

(బి) సాంకేతిక లోపం

(సి) విద్రోహచర్య

(డి) అంతర్గత కుట్రలు


6. ఈ ఏడాది మొత్తం ఎంత మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు ? [వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు]

(ఎ) 76

(బి) 77

(సి) 78

(డి) 79


7. అమెరికా నౌకాదళ చరిత్రలో మొట్టమొదటిసారిగా అణు ఇంధనంతో నడిచే విమానవాహక నౌక (USS ABRAHAM LINCOLN) కు సారథిగా నియమితులైన మహిళగా 'కెప్టెన్ బావర్న్ ష్మిట్' (Capt. Amy Bauernschmidt) చరిత్ర సృష్టించారు. ఆమెకు మొత్తం ఎన్ని గంటలపాటు విమానాలు, హెలీకాఫ్టర్లను నడిపిన అనుభవం ఉంది ? [అబ్రహాం లింకన్ నౌక సమూహంలో అత్యాధునిక యుద్ధ విమానాలు, ఒక గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ నౌక, మూడు డిస్ట్రాయర్ నౌకలు ఉంటాయి. ఈ సమూహం ఇండో-పసిఫిక్ జలాలకు పయనమై వెళుతోంది]

(ఎ) 1,000

(బి) 2,000

(సి) 3,000

(డి) 4,000


8. 'భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం' (AAPI) 15వ అంతర్జాతీయ సదస్సు 2022 జనవరి 5న ఎక్కడ ప్రారంభమైంది ? ['ఆపీ' (AAPI) లో దాదాపు లక్ష మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు]

(ఎ) చెన్నై

(బి) విశాఖపట్నం

(సి) హైదరాబాద్

(డి) దిల్లీ 


9. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళల ఆర్ధిక సాయానికి ఉద్దేశించిన 'ఈబీసీ నేస్తం' (EBC NESTHAM) పథకం ప్రారంభ తేదీని 2022 జనవరి 9 నుంచి ఏ తేదీకి మార్చారు ? [ఈ పథకం కింద అర్హులైన ఒక్కో మహిళకు రూ. 15 వేలు ఇస్తారు. 'ఈబీసీ నేస్తం' (EBC NESTHAM) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రారంభించనున్నారు]   

(ఎ) 2022 జనవరి 10

(బి) 2022 జనవరి 11

(సి) 2022 జనవరి 12

(డి) 2022 జనవరి 13


10. 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2022' చేపట్టిన ఎన్నికల సంఘం 2022 జనవరి 5న ప్రచురించిన తుది జాబితా ప్రకారం .. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య ?

(ఎ) 4,06,36,279

(బి) 4,07,36,279

(సి) 4,08,36,279

(డి) 4,09,36,279


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-8 ; సంవత్సరం : 2022 (GK TEST-8 ; YEAR : 2022)

1) డి 2) సి 3) ఎ 4) సి 5) ఎ 6) బి 7) సి 8) సి 9) ఎ 10) బి    


E&OE. (Errors and Omissions Expected)

7, జనవరి 2022, శుక్రవారం

జి.కె.టెస్ట్-7 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-7 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

 

1. గంటలో 910 మందికి గోరింటాకు పెట్టి గిన్నిస్ రికార్డు సృష్టించిన 'ఆదిత్యా నితిన్' స్వరాష్ట్రమేది ? [గతంలో లండన్ కు చెందిన 'సామినా హుస్సేన్' గంటలో 600 మందికి మెహందీ డిజైన్లు వేసిన రికార్డుని ఆదిత్యా నితిన్ కేవలం 37 నిమిషాల్లోనే దాటేసింది] (Adithya Nitin's Home State)

ADITHYA NITIN
ఆదిత్యా నితిన్Image Source : www.shethepeople.tv

 

(ఎ) కేరళ

(బి) కర్ణాటక

(సి) గోవా

(డి) తమిళనాడు


2. రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్న 'సత్యపాల్ మాలిక్' (SATYAPAL MALIK) ప్రస్తుతం ఏ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు ?

(ఎ) మణిపూర్

(బి) మిజోరాం

(సి) మేఘాలయ

(డి) నాగాలాండ్


3. కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగులకు 'హామీతో కూడిన కెరీర్ పురోగతి' (ACP) పథకానికి సంబంధించిన ఉత్తర్వులు ఏ సంవత్సరంలో జారీ అయ్యాయి ? [12 ఏళ్ల సర్వీస్ తర్వాత కూడా పదోన్నతి లభించని వారికి తదుపరి గ్రేడ్ వేతనం ఇవ్వాలనేది 'ఏసీపీ' పథకం ఉద్దేశ్యం. 24 ఏళ్ల తర్వాత రెండోసారి ఇలాంటిది ఇవ్వాలి]

(ఎ) 1996

(బి) 1997

(సి) 1998

(డి) 1999


4. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తులను 'మైలార్డ్, యువరానర్' (MY LORD, YOUR HONOUR) అని న్యాయవాదులు సంబోధిస్తారని, ఇకపై దానికి బదులుగా 'సార్' అని పిలిస్తే సరిపోతుంది అనే చారిత్రాత్మక నిర్ణయం తీసున్న హైకోర్ట్ ?

(ఎ) ఆంద్రప్రదేశ్

(బి) ఒడిశా

(సి) పశ్చిమ బెంగాల్

(డి) ఉత్తర్ ప్రదేశ్


5. 'సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్' (CDSCO) తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం 'కొవాగ్జిన్' టీకా తయారైన తేదీ నుంచి ఎన్ని నెలల వరకు వినియోగించవచ్చు ? (COVAXIN VACCINE EXPIRY DATE) [ఇదే తరహాలో 'కోవిషీల్డ్' టీకా వినియోగం గడువును 6 నెలల నుంచి 9 నెలల వరకు 'సీ డీ ఎస్ సీ ఓ' (CDSCO) పెంచింది]

(ఎ) 6 నెలలు

(బి) 9 నెలలు

(సి) 12 నెలలు

(డి) 18 నెలలు


6. ఏ ప్రభుత్వరంగ సంస్థకు 'చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్' (CMD) గా 'అల్కా మిత్తల్' (ALKA MITTAL) నియమితులయ్యారు ? [ఈ సంస్థ సీఎండీ గా ఒక మహిళ పనిచేయనుండటం ఇదే ప్రథమం. ఆమె ఈ పదవిలో ఆరు నెలలు లేదా సాధారణ నియామకం జరిగేంత వరకు కొనసాగుతారు. 2021 మార్చ్ 31న శశి శంకర్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ సంస్థకు శాశ్వత సీఎండీ ని నియమించలేదు]

(ఎ) గైల్ (GAIL)

(బి) సెయిల్ (SAIL)

(సి) ఐ ఓ సీ ఎల్ (IOCL)

(డి) ఓ ఎన్ జీ సీ (ONGC)


7. ఇంటర్నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) అందుకు సంబంధించిన విధివిధానాలను ఏ తేదీన విడుదల చేసింది ? [ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఒక లావాదేవీకి రూ. 200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ. 2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫ్ లైన్ చెల్లింపులు కచ్చితంగా సంబంధిత వ్యక్తులు ప్రత్యక్షంగా (FACE TO FACE) చేయాలి] (Digital Payments Offline)

(ఎ) 2022 జనవరి 1

(బి) 2022 జనవరి 2

(సి) 2022 జనవరి 3

(డి) 2022 జనవరి 4


8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల బాలబాలికలకు ప్రారంభమైన తొలివిడత టీకా పంపిణీ ఈ నెల 7వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏ టీకాను వినియోగిస్తున్నారు ?

(ఎ) కొవాగ్జిన్

(బి) కొవిషీల్డ్ 

(సి) స్పుత్నిక్-వి

(డి) మోడెర్నా ఎం ఆర్ ఎన్ ఏ 


9. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కొవిడ్-19 చికిత్సకు పరిహారం ఇవ్వాలని 'బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ' (IRDAI) ఏ తేదీన ఆదేశాలిచ్చింది ? [కొవిడ్ చికిత్సకు ఉపయోగపడుతున్న ఆరోగ్య బీమా పాలసీలు 'ఒమిక్రాన్' (OMICRON) వ్యాధిగ్రస్తులకూ ఉపయోగపడతాయని 'ఐ ఆర్ డీ ఏ ఐ' (IRDAI) 2022 జనవరి 3న మార్గదర్శకాలు జారీ చేసింది]  

(ఎ) 2020 మార్చ్ 25

(బి) 2020 ఏప్రిల్ 1

(సి) 2020 జూలై 1

(డి) 2020 ఆగస్ట్ 16


10. ఏ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'అనిల్ చంద్ర పునేఠా' (ANIL CHANDRA PUNETHA) నియమితులయ్యారు ? [పదవీకాలం పూర్తయ్యే వరకు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు అతను ఈ పదవిలో కొనసాగుతారు] (Chief Information Commissioner)

(ఎ) హిమాచల్ ప్రదేశ్

(బి) ఉత్తరాఖండ్

(సి) పంజాబ్

(డి) రాజస్థాన్


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-7 ; సంవత్సరం : 2022 (GK TEST-7 ; YEAR : 2022)

1) ఎ 2) సి 3) డి 4) బి 5) సి 6) డి 7) సి 8) ఎ 9) బి 10) బి    


E&OE. (Errors and Omissions Expected)

జి.కె.టెస్ట్-6 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-6 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. 'గ్రామ పునర్నిర్మాణ సంస్థ' (VRO) ఆధ్వర్యంలో నిర్మించనున్న 'ప్రొఫెసర్ ఎంఏ విండీ న్యాయసేవా కేంద్రం' భవనానికి 2022 జనవరి 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి 'జస్టిస్ బట్టు దేవానంద్' (JUSTICE BATTU DEVANAND) శంకుస్థాపన చేశారు. ఈ న్యాయసేవా కేంద్రాన్ని గుంటూరు జిల్లాలో ఎక్కడ నిర్మించనున్నారు ?

(ఎ) మంగళగిరి

(బి) నంబూరు

(సి) పెదకాకాని

(డి) గుంటూరు


2. స్వాతంత్ర్య సమర యోధుడు 'అల్లూరి సీతారామరాజు' 125వ జయంతి ఉత్సవాలు ఎన్ని రోజుల వరకు కొనసాగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు ? [విశాఖపట్నం జిల్లా లంబసింగిలో రూ. 38 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు] (125th Birth Anniversary Celebrations of Sri Alluri Sitarama Raju)

(ఎ) 2022 జూలై 1 - 2023 జూలై 1 

(బి) 2022 జూలై 2 - 2023 జూలై 2

(సి) 2022 జూలై 3 - 2023 జూలై 3

(డి) 2022 జూలై 4 - 2023 జూలై 4


3. తమ విద్యుత్ వాహన కంపెనీకి సంబంధించిన 'ఆటో పైలట్ టీమ్' లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన 'అశోక్ ఎల్లుస్వామి' ని నియమించినట్లు టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ 'ఎలాన్ మస్క్' తాజాగా వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీని అశోక్ ఎల్లుస్వామి ఎక్కడ పూర్తి చేశారు ? (Indian-origin Ashok Elluswamy was the first employee of Elon Musk's electric vehicle company's Autopilot Team)

(ఎ) తిరువనంతపురం

(బి) చెన్నై

(సి) బాంబే 

(డి) కాన్పూర్


4. నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లేబొరేటరీ 70వ వార్షికోత్సవాలను 2022 జనవరి 2న కొచ్చిలో ప్రారంభించినది ? [Naval Physical and Oceanographic Laboratory] 

(ఎ) రామ్ నాథ్ కోవింద్

(బి) ఎం.వెంకయ్యనాయుడు

(సి) నరేంద్ర మోదీ 

(డి) ఓం బిర్లా


5. 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం' (Indian Institute of Management Visakhapatnam) రెండు సంవత్సరాల ఎంబీఏ (MBA) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవేశాల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ? [పూర్తి వివరాలకు www.iimv.ac.in/pgpex వెబ్ సైట్ ను సందర్శించగలరు]

(ఎ) 2022 మే 1

(బి) 2022 మే 2

(సి) 2022 మే 3

(డి) 2022 మే 4


6. భారతదేశంలోనే మూడో ఇథనాల్ పరిశ్రమను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని క్రిబ్కో చైర్మన్ 'చంద్రపాల్ సింగ్' అన్నారు ? (రైతులు పండించే వరి, మొక్కజొన్న పంటల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు) [Krishak Bharati Cooperative Limited (KRIBHCO)]

(ఎ) గుజరాత్

(బి) ఆంధ్రప్రదేశ్

(సి) తెలంగాణ

(డి) ఉత్తర్ ప్రదేశ్


7. అంతర్జాతీయ క్రికెట్ లో 10,000 పరుగుల మైలురాయిని దాటి భారతదేశంలోనే ఆ ఘనత సాధించిన మొదటి మహిళా క్రికెటర్ గా 'మిథాలీరాజ్' (MITHALI RAJ) చరిత్ర సృష్టించింది. ఈ విషయానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఆమెది ఎన్నో స్థానం ?

(ఎ) 1

(బి) 2

(సి) 3

(డి) 4


8. భారత గణతంత్ర వేడుకల సందర్భంగా 'ఎంఐజీ-21 బైసన్ ఫైటర్' విమానాన్ని నడిపి తన సత్తా చూపి .. మొదటి మహిళా ఫైటర్ పైలట్ గా నిలిచినది ? [ఈమె భారత వైమానిక దళంలో విమానం ద్వారా యుద్ధంలో పాల్గొనే అర్హత సాధించింది. ఈ అమ్మాయి రాజస్థాన్ ఎయిర్ బేస్ లో సేవలందిస్తోంది]

(ఎ) అవని చతుర్వేది

(బి) మోహనా సింగ్

(సి) భావనా కాంత్ 

(డి) ప్రియా రమణి


9. భారత జాతీయ భద్రత ఉప సలహాదారుగా ఎవరిని నియమించారు ? [Deputy National Security Advisor] 

(ఎ) డాక్టర్ జి.సతీష్ రెడ్డి 

(బి) ప్రదీప్ కుమార్ రావత్

(సి) అజయ్ భూషణ్ పాండే

(డి) విక్రమ్ మిశ్రి 


10. 2021వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకం (YSR VAHANA MITRA SCHEME) అమల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా ? [ఈ జిల్లాలో మొత్తం 35,413 మంది లబ్ధిదారులకు రూ. 35.41 కోట్ల ఆర్ధిక సాయం అందించారు]

(ఎ) వైఎస్సార్ కడప

(బి) గుంటూరు

(సి) కృష్ణా 

(డి) విశాఖపట్నం


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-6 ; సంవత్సరం : 2022 (GK TEST-6 ; YEAR : 2022)

1) సి 2) డి 3) బి 4) బి 5) బి 6) సి 7) బి 8) సి 9) డి 10) డి


E&OE. (Errors and Omissions Expected)

5, జనవరి 2022, బుధవారం

జి.కె.టెస్ట్-5 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-5 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహణ బాధ్యత ఏ ఐఐటీ చేపట్టింది (JEE ADVANCED 2022-23) ?

(ఎ) ఐఐటీ-ఖరగ్ పూర్  

(బి) ఐఐటీ-బాంబే 

(సి) ఐఐటీ-మద్రాస్

(డి) ఐఐటీ-కాన్పూర్


2. 'పొగాకు నమలడం' ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 (FSS ACT) లోని సెక్షన్ 3(1)(జె) లో పేర్కొన్న 'ఆహరం' అనే నిర్వచనం కిందికి రాదని తేల్చిచెప్పిన హైకోర్టు ?

(ఎ) ఆంధ్రప్రదేశ్

(బి) తెలంగాణ

(సి) మహారాష్ట్ర

(డి) ఒడిషా 


3. 32వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని (BOOK FESTIVAL AT VIJAYAWADA) రాజ్ భవన్ నుంచి వెబినార్ విధానంలో గవర్నర్ 'బిశ్వభూషణ్ హరిచందన్' 2022 జనవరి 1న ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవ ప్రాంగణానికి ఏ పేరు పెట్టారు ? [ఈ పుస్తక మహోత్సవంలో 210 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అన్ని స్టాళ్లలో కలిపి 7 లక్షల నుంచి 10 లక్షల పుస్తకాలు కొలువుదీరాయి. ప్రదర్శనలో ఉంచిన ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీ ఇస్తున్నారు]

(ఎ) డాక్టర్ యలపర్తి నాయుడమ్మ

(బి) కాళీపట్నం రామారావు

(సి) నవోదయ రామ్మోహనరావు 

(డి) సిరివెన్నెల సీతారామశాస్త్రి 


4. భారతదేశంలో గతంలో జరిగిన ప్రధాన తొక్కిసలాటల్లో .. 2005 జనవరి 25న అత్యధికంగా 340 మంది ఎక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించారు ? [2022 జనవరి 1న జమ్ము లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయంలో రెండు యువజన బృందాల మధ్య మొదలైన చిన్న వాగ్వాదం .. చివరకు తొక్కిసలాటకు దారితీసి 12 నిండు ప్రాణాలను బలితీసుకుంది]

(ఎ) దతియా జిల్లా, మధ్యప్రదేశ్  

(బి) బిలాస్ పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్

(సి) జోధ్ పూర్, రాజస్థాన్

(డి) సతారా జిల్లా, మహారాష్ట్ర


5. ఎలాన్ మస్క్ (ELON MUSK) తీసుకురానున్న టెస్లా మొబైల్ స్మార్ట్ ఫోన్ పేరేమిటి ? [ఈ స్మార్ట్ ఫోన్ లో 'స్టార్ లింక్' టెక్నాలజీని పొందుపరచనున్నారు. ఈ ఫోన్ తీసుకుని అంతరిక్షంలోకి .. మార్స్ కు సైతం వెళ్లినా, అక్కడి నుంచి భూమి మీద ఉన్న వారితో మాట్లాడొచ్చన్నమాట. ఈ ఫోన్ ను సౌర శక్తితో ఛార్జ్ చేయొచ్చు]

(ఎ) తురాయ

(బి) ఇరిడియమ్ 

(సి) పై

(డి) మార్స్


6. భారతదేశంలో జీఎస్టీ వసూళ్లు 2021 డిసెంబర్ లో 13 శాతం పెరిగి ఎంతగా నమోదయ్యాయి ? [2020 డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.15 లక్షల కోట్లుగా ఉన్నాయి]

(ఎ) రూ. 1.09 లక్షల కోట్లు

(బి) రూ. 1.19 లక్షల కోట్లు

(సి) రూ. 1.29 లక్షల కోట్లు

(డి) రూ. 1.39 లక్షల కోట్లు


7. 2022 జనవరి 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' ఎన్నో విడత కింద రైతుల ఖాతాల్లోకి రూ. 20,900 కోట్లు బదిలీ చేశారు ? (PRADHAN MANTRI KISAN SAMMAN NIDHI)

(ఎ) 7

(బి) 8

(సి) 9

(డి) 10


8. ఏసంవత్సరం నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?

(ఎ) 2060

(బి) 2070

(సి) 2080

(డి) 2090


9. చారిత్రక కోరేగావ్ భీమా యుద్ధ (KOREGAON BHIMA BATTLE) 204వ వార్షికోత్సవాలు జరిగిన తేదీ ? [ఈ సందర్బంగా మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న 'జయ్ స్తంభ్' సైనిక స్మారకం వద్ద నివాళులు అర్పించేందుకు 4 లక్షలకు పైగా జనం పోటెత్తారు]   

(ఎ) 2022 జనవరి 1

(బి) 2022 జనవరి 2

(సి) 2022 జనవరి 3

(డి) 2022 జనవరి 4


10. అణు కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకోరాదన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్, పాక్ లు 1988లో కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ? [భారత్, పాకిస్థాన్ లు 2022 జనవరి 1న తమ అణు కేంద్రాల జాబితాలను ఇచ్చి పుచ్చుకున్నాయి] (Non-nuclear aggression agreement between India and Pakistan)

(ఎ) 1988

(బి) 1989

(సి) 1990

(డి) 1991


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-5 ; సంవత్సరం : 2022 (GK TEST-5 ; YEAR : 2022)

1) బి 2) ఎ 3) సి 4) డి 5) సి 6) సి 7) డి 8) బి 9) ఎ 10) డి   


E&OE. (Errors and Omissions Expected)

4, జనవరి 2022, మంగళవారం

జి.కె.టెస్ట్-4 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-4 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. హరిత హైడ్రోజన్ తో విద్యుత్తును ఉత్పత్తి చేసే పైలట్ ప్రాజెక్ట్ ను భారతదేశంలోనే తొలిసారిగా ఎన్టీపీసీ (NTPC) ఎక్కడ నిర్మిస్తోంది ? [50 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న స్టాండలోన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత హరిత హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బెంగళూరుకు చెందిన 'బ్లూమ్ ఎనర్జీ ఇండియా' సంస్థకు అప్పగించారు]

(ఎ) కోర్బా

(బి) విశాఖపట్నం

(సి) రామగుండం

(డి) దుర్గాపూర్


2. ప్రకృతి సేద్య విధానంపై పాఠ్య ప్రణాళిక రూపొందించేందుకు 'ప్రవీణ్ రావు' అధ్యక్షతన ఏడుగురితో కూడిన కమిటీని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) నియమించింది. ప్రవీణ్ రావు ఏ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా వ్యవహరిస్తున్నారు ?

(ఎ) ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ

(బి) ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం

(సి) శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం

(డి) డా. వైస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం


3. అంకుర దశలో ఉండగానే ఎంత టర్నోవర్ వ్యాపారం చేసిన వారిని వ్యాపార పరిభాషలో 'యూనికార్న్ ఎంట్రపెన్యూర్స్' (UNICORN ENTREPRENEURS) అంటారు ?

(ఎ) రూ. 7,500 కోట్లు

(బి) రూ. 8,500 కోట్లు

(సి) రూ. 9,500 కోట్లు

(డి) రూ. 6,500 కోట్లు


4. భారత మీడియా, వినోద పరిశ్రమ ఏ సంవత్సరానికల్లా 10-12 శాతం వార్షిక వృద్ధితో 55-70 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.1-5.25 లక్షల కోట్లు) స్థాయికి చేరే అవకాశం ఉందని సీఐఐ-బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (CII-BOSTON CONSULTING GROUP) సంయుక్త నివేదిక అంచనా వేసింది ? ['బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ ఫర్ ది న్యూ డికేడ్ : వే ఫార్వార్డ్ ఫర్ ఇండియన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ' పేరిట ఈ నివేదికను వెలువరించారు]

(ఎ) 2025

(బి) 2030

(సి) 2035

(డి) 2040


5. కొవిడ్ ఒమిక్రాన్ అనిశ్చితుల నేపథ్యంలో .. బ్యాంకుల్లో కేవైసీ నవీకరణకు గడువును ఆర్బీఐ ఏ తేదీ వరకు పొడిగించింది (LAST DATE FOR KYC UPDATE IN BANKS) ?

(ఎ) 2022 జనవరి 31

(బి) 2022 ఫిబ్రవరి 28

(సి) 2022 మార్చ్ 31

(డి) 2022 ఏప్రిల్ 30


6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న 'సోమ శంకర ప్రసాద్' ను ఏ బ్యాంక్ కు మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా నియమించారు ?

(ఎ) పంజాబ్ నేషనల్ బ్యాంక్

(బి) ఇండియన్ బ్యాంక్

(సి) కెనరా బ్యాంక్

(డి) యూకో బ్యాంక్


7. జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదార్లు వార్షిక రిటర్న్ (ANNUAL RETURN BY GST PAYERS) గా ఏ ఫార్మ్ ను సమర్పిస్తారు ? [రూ. 2 కోట్లకు మించి టర్నోవర్ ఉన్న వ్యాపారులు జీ ఎస్ టీ ఆర్ - 9 ను సమర్పించడం తప్పనిసరి. రూ. 5 కోట్లకు మించి టర్నోవర్ ఉంటే జీ ఎస్ టీ ఆర్ - 9సి సమర్పించాల్సి ఉంటుంది]

(ఎ) జీ ఎస్ టీ ఆర్ - 1

(బి) జీ ఎస్ టీ ఆర్ - 3బి

(సి) జీ ఎస్ టీ ఆర్ - 9

(డి) జీ ఎస్ టీ ఆర్ - 9సి


8. భారత క్రికెట్ జట్టు (TEAM INDIA) 2021వ సంవత్సరంలో మొత్తం ఎన్ని టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించింది ? [2021వ సంవత్సరంలో భారత బౌలర్లు ప్రత్యర్థులను 200 స్కోర్ లోపు 12 సార్లు ఆల్ అవుట్ చేశారు. ఓ క్యాలెండర్ ఏడాదిలో ఇంగ్లాండ్ (1978లో 13 సార్లు) మాత్రమే భారత్ కన్నా ఎక్కువ సార్లు ప్రత్యర్థులను రెండొందల లోపు ఆల్ అవుట్ చేసింది]  

(ఎ) 7

(బి) 8

(సి) 9

(డి) 10


9. సామాజిక భద్రత పింఛన్లను రూ. 2,250 నుంచి రూ. 2,500కు పెంచే కార్యక్రమాన్ని 2022 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' గుంటూరు జిల్లాలో ఎక్కడి నుండి శ్రీకారం చుట్టారు (YSR PENSION KANUKA) ? 

(ఎ) పొన్నూరు

(బి) చిలకలూరిపేట

(సి) నరసరావుపేట

(డి) ప్రత్తిపాడు


10. 1 నుంచి 9 తరగతులకు ఏ తేదీని చివరి పనిదినం గా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ (LAST WORKING DAY IN ANDHRA PRADESH SCHOOLS) ప్రకటించింది ? [పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 (SUMMATIVE-1) పరీక్షలను 2022 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు నిర్వహించనున్నారు. ఫార్మాటివ్-3, 4 (FORMATIVE-3, 4) పరీక్షలను ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో నిర్వహిస్తారు. సమ్మేటివ్-2 పరీక్ష ఏప్రిల్ లో ఉంటుంది]

(ఎ) 2022 ఏప్రిల్ 24

(బి) 2022 ఏప్రిల్ 30

(సి) 2022 మే 7

(డి) 2022 మే 14


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-4 ; సంవత్సరం : 2022 (GK TEST-4 ; YEAR : 2022)

1) బి 2) బి 3) ఎ 4) బి 5) సి 6) డి 7) సి 8) బి 9) డి 10) బి  

3, జనవరి 2022, సోమవారం

జి.కె.టెస్ట్-3 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-3 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. అధునాతన రఫేల్ యుద్ధ విమానాలను భారత్ సమకూర్చుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ 25 బహుళ ప్రయోజన జె-10సి ఫైటర్ జెట్ (J-10C FIGHTER JET) లను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది ? [2022 మార్చ్ 23న జరిగే పాకిస్థాన్ జాతీయ దినోత్సవంలో ఈ ఫైటర్ జెట్ లను తొలిసారి ప్రదర్శించనున్నారు]

(ఎ) చైనా

(బి) అమెరికా

(సి) రష్యా

(డి) ఫ్రాన్స్


2. 2021 డిసెంబర్ 26న రాయ్ పుర్ (ఛత్తీస్ గఢ్ రాష్ట్రం) లో జరిగిన ధర్మసంసద్ సభలో భారత జాతిపిత మహాత్మా గాంధీని దూషించిన 'కాళీచరణ్ మహారాజ్' (KALI CHARAN MAHARAJ) ఏ రాష్ట్రానికి చెందినవాడు ? [కాళీచరణ్ మహారాజ్ ను 2021 డిసెంబర్ 30న మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో ఛత్తీస్ గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు]

(ఎ) మధ్యప్రదేశ్

(బి) మహారాష్ట్ర

(సి) ఛత్తీస్ గఢ్

(డి) రాజస్థాన్


3. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 'ఝాన్సీ' రైల్వే స్టేషన్ (JHANSI RAILWAY STATION) పేరును "వీరాంగణ లక్ష్మీబాయి" రైల్వే స్టేషన్ గా మార్పు చేసింది. దీనికి సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేఖ రాసింది ? [ఉత్తర్ ప్రదేశ్ (UTTAR PRADESH) ప్రభుత్వం ఇప్పటికే మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరును 'దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్' గా, ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును 'అయోధ్య జంక్షన్' గా మార్చింది. అలాగే ఫైజాబాద్, అలహాబాద్ జిల్లాల పేర్లను 'అయోధ్య, ప్రయాగ్ రాజ్' లుగా మార్పు చేసింది]

(ఎ) 2021 నవంబర్ 21

(బి) 2021 నవంబర్ 22

(సి) 2021 నవంబర్ 23

(డి) 2021 నవంబర్ 24


4. అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లు పెడుతున్నట్లు చైనా తాజాగా ప్రకటించింది. ఇంతకముందు ఇదేవిధంగా ఏ సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాలకు తమ అధికారిక పేర్లను చైనా పెట్టింది ? [ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ (ARUNACHAL PRADESH) ను తమ భూభాగమని చైనా చాలా సంవత్సరాలుగా వాదిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని 'జన్ గ్నాన్' అని చైనీస్ పేరుతో పిలుస్తోంది]

(ఎ) 2013

(బి) 2015

(సి) 2017

(డి) 2019


5. ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) నాన్ ఏసీ బస్సుల్లో ఆర్టీసీయేతర వెబ్ సైట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై 2022 జనవరి 1 నుంచి ఎంత శాతం జీఎస్టీ విధించనున్నారు ? [ఆర్టీసీ వెబ్ సైట్, బుకింగ్ కౌంటర్లు, ఏజెంట్ల వద్ద టిక్కెట్లు తీసుకుంటే ఈ జీఎస్టీ వర్తించదు]

(ఎ) 5%

(బి) 12%

(సి) 18%

(డి) 20%


6. ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యుడు 'గోరటి వెంకన్న' (GORETI VENKANNA) కు 2021వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ (SAHITYA AKADEMI) పురస్కారం లభించింది. అతను రచించిన ఏ కవితా సంకలనానికి ఈ పురస్కారం లభించింది ? [దేశవ్యాప్తంగా 20 భాషల్లో వెలువడిన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర సాహిత్య పురస్కారం కింద రూ. లక్ష, తామ్ర పత్రం ప్రదానం చేస్తారు]

(ఎ) నీటి మనసు

(బి) వల్లంకి తాళం

(సి) సహృదయ సాహిత్య విమర్శ వైవిధ్యం

(డి) కొండపొలం


7. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ కు తగుళ్ల గోపాల్ రచించిన కవితా సంకలనం 'దండకడియం' ఎంపికైంది. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ కు ఎంపికైన వారికి అందించే నగదు బహుమతి ఎంత ? [తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం లోని 'కలకొండ' అనే గ్రామం తగుళ్ల గోపాల్ యొక్క స్వగ్రామం]

(ఎ) రూ. 50,000

(బి) రూ. 1,00,000

(సి) రూ. 1,50,000

(డి) రూ. 2,00,000


8. కేంద్ర సాహిత్య బాల పురస్కారానికి దేవరాజు మహారాజు రచన 'నేను అంటే ఎవరు ?' (ఒక వైజ్ఞానిక వివరణ) ఎంపికైంది. దేవరాజు మహారాజు ఏ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ? [తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం లోని 'వడపర్తి' అనే గ్రామం దేవరాజు మహారాజు యొక్క స్వగ్రామం]

(ఎ) భౌతికశాస్త్రం

(బి) రసాయనశాస్త్రం

(సి) వృక్షశాస్త్రం

(డి) జంతుశాస్త్రం


9. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంత మందికి 'కీర్తి' పురస్కారాలను ప్రకటించింది ? [ఈ పురస్కారం కింద రూ. 5,116 నగదుతో పాటు పురస్కార పత్రాన్ని అందజేస్తారు]

(ఎ) 41

(బి) 42

(సి) 43

(డి) 44


10. కరోనా వైరస్ తో బడులు మూతపడిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం ప్రైవేటు పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ తరగతులు నిర్వహించాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'డిజిటల్ విద్యా నివేదిక' (INDIA DIGITAL REPORT) పేర్కొంది ?

(ఎ) 36%

(బి) 37%

(సి) 38%

(డి) 39%


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-3 ; సంవత్సరం : 2022 (GK TEST-3 ; YEAR : 2022)

1) ఎ 2) బి 3) డి 4) సి 5) ఎ 6) బి 7) ఎ 8) డి 9) డి 10) డి

 

 

    

2, జనవరి 2022, ఆదివారం

జి.కె.టెస్ట్-2 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-2 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. 2020వ సంవత్సరానికి సంబంధించి అనువాద విబాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2020 (SAHITYA AKADEMI AWARD-2020) ను అందుకున్న కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన సాహితీవేత్త ? [2021 డిసెంబర్ 30న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ 'చంద్రశేఖర కంబార' చేతుల మీదుగా ఆయన జ్ఞాపిక, పురస్కారం స్వీకరించారు. ప్రముఖ కన్నడ రచయిత 'శాంతినాధ్ దేశాయ్' రచించిన 'ఓం నమో' పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడంతో ఆ విభాగంలో తనకు గతంలో పురస్కారం ప్రకటించారు] 

(ఎ) రంగనాథ రామచంద్రరావు

(బి) అమ్మంగి వేణుగోపాల్

(సి) సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి

(డి) జి. శ్రీరామమూర్తి


2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 డిసెంబర్ 31 నాటికి నమోదైన మొత్తం 'ఒమిక్రాన్' (OMICRON) కేసుల సంఖ్య ?

(ఎ) 15

(బి) 16

(సి) 17

(డి) 18


3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15-18 ఏళ్ల మధ్యన ఉన్న బాలబాలికలకు 2022 జనవరి 3 నుంచి జనవరి 7 వరకు తొలి డోసు కింద ఏ కొవిడ్ టీకాను అందించనున్నారు ? [గ్రామ/వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ టీకా పంపిణీ జరుగుతుంది. 15-18 ఏళ్ల మధ్యన సుమారు 24 లక్షల మంది బాలబాలికలు ఉన్నారు]

(ఎ) కొవాగ్జిన్

(బి) కొవిషీల్డ్ 

(సి) స్పుత్నిక్-వి

(డి) జైకొవ్-డి


4. హైదరాబాద్ లోని సీసీఎంబీ (CCMB) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలోని ప్రభుత్వ సిద్దార్థ వైద్య కళాశాలలో 'జన్యుక్రమ నిర్ధారణ కేంద్రం' (GENOME SEQUENCING LAB) ను ఏర్పాటు చేశారు ? [ఒక్కో జీనోమ్ సీక్వెన్స్ పరీక్షకు రూ. 5,000 ఖర్చవుతుంది. మ్యుటేషన్ ప్రారంభంలో అది ఏ ఉత్పరివర్తనమో తెలుసుకునేందుకు ఈ పరీక్ష అవసరమవుతుంది]

(ఎ) విశాఖపట్నం

(బి) గుంటూరు

(సి) విజయవాడ

(డి) తిరుపతి


5. అమెరికాలో కొవిడ్ 'ఒమిక్రాన్' రకం వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో .. భారతదేశం ఆవిష్కరించిన 'కొవాగ్జిన్' టీకా (COVAXIN)కు అమెరికాలో సత్వరం అనుమతివ్వాలని 'అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ' (USFDA) కు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసిన మాజీ టెన్నిస్ దిగ్గజం ? [కొవాగ్జిన్ ను అమెరికా, కెనడా దేశాల్లో అందుబాటులోకి  తీసుకురావడం కోసం 'భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్' .. అమెరికాలోని ఆక్యుజెన్ ఇంక్ ., అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది]

(ఎ) పీట్ సంప్రాస్ 

(బి) బోరిస్ బెకర్ 

(సి) ఇవాన్ లెండిల్

(డి) జిమ్మీ కానర్స్


6. భారతదేశంలో రాజకీయ పార్టీలకు సమకూరే విరాళాల్లో పారదర్శకత కోసం తొలివిడత ఎన్నికల బాండ్ల (ELECTORAL BONDS) విక్రయం ఏయే తేదీల్లో జరిగింది ? [ఈ సంవత్సరం అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 19వ విడత ఎన్నికల బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు వీటిని 'భారతీయ స్టేట్ బ్యాంక్' (SBI) కు చెందిన 29 అధీకృత శాఖల్లో కొనుగోలు చేయవచ్చు. చివరిగా 18వ విడత బాండ్ల విక్రయం 2021 సెప్టెంబర్ 1-10 తేదీల్లో విక్రయించారు]

(ఎ) 2018 జనవరి 1-10

(బి) 2018 ఫిబ్రవరి 1-10

(సి) 2018 మార్చ్ 1-10

(డి) 2018 ఏప్రిల్ 1-10


7. భారతీయ రైల్వే బోర్డు నూతన చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి' (INDIAN RAILWAY BOARD NEW CHAIRMAN, CEO) గా ఎవరిని నియమించారు ? [2022 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు అతను ఈ పదవిలో కొనసాగనున్నారు. పదవీ విరమణ అనంతరం జూలై 1న పునఃనియమితులై 2022 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు]

(ఎ) వినయ్ కుమార్ త్రిపాఠి

(బి) గజానన్ మాల్యా

(సి) మనోజ్ జోషి

(డి) అలోక్ కన్సాల్ 


8. 'కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్' (KMRL) చేపట్టిన 'వాటర్ మెట్రో ప్రాజెక్ట్' (WATER METRO PROJECT) భారతదేశంలో ఎన్నోది ? [ఈ ప్రాజెక్ట్ లో భాగంగా బ్యాటరీతో నడిచే బోటును 'కే ఎం ఆర్ ఎల్' (KMRL) కు కొచ్చి షిప్ యార్డ్ అప్పగించింది. ప్రపంచంలోనే విద్యుత్తు బ్యాటరీతో నడిచే అతి పెద్దదైన ఈ బోటు గంటకు 10 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. వందమందితో ప్రయాణించే సామర్థ్యమున్న ఈ బోటు 15 నిముషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. బోటు ఛార్జింగ్ అయిపోతే దానంతటదే డీజిల్ ఆప్షన్ కు మారిపోతుంది]

(ఎ) మొదటిది

(బి) రెండోది

(సి) మూడోది

(డి) నాల్గోది


9. అమెరికా జనగణన విభాగం (UNITED STATES CENSUS BUREAU) అంచనా ప్రకారం 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా ఎంత ? [2021వ సంవత్సరంలో 74 మిలియన్లు (7 కోట్ల 40 లక్షలు) మేర పెరిగింది. జనాభా పెరుగుదల 0.9% గా నమోదయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 మంది జన్మిస్తున్నట్లు, ఇద్దరు మరణిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో ఏడాది కాలంలో 7.07 లక్షల మేర జనాభా పెరిగింది. అమెరికాలో ప్రతి తొమ్మిది సెకన్లకు ఒకరు జన్మిస్తున్నట్లు, 11 సెకన్లకు ఒకరు మరణిస్తున్నట్లు, 130 సెకన్లకు విదేశాల నుంచి ఒకరు వలస వస్తున్నట్లు అంచనా వేసింది] 

(ఎ) 7.4 బిలియన్లు (740 కోట్లు)

(బి) 7.6 బిలియన్లు (760 కోట్లు)

(సి) 7.8 బిలియన్లు (780 కోట్లు)

(డి) 7.2 బిలియన్లు (720 కోట్లు)


10. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా సెంచూరియన్ (సూపర్ స్పోర్ట్ పార్క్) లో 2021 డిసెంబర్ 30న ముగిసిన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఎన్ని పరుగుల తేడాతో విజయం సాధించింది ? [సెంచూరియన్ లో టెస్ట్ మ్యాచ్ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా భారత్ ఘనత సాధించింది.

(ఎ) 110

(బి) 111

(సి) 112

(డి) 113


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-2 ; సంవత్సరం : 2022 (GK TEST-2 ; YEAR : 2022)

1) ఎ 2) సి 3) ఎ 4) సి 5) డి 6) సి 7) ఎ 8) ఎ 9) సి 10) డి    

జి.కె.టెస్ట్-1 సంవత్సరం : 2022 ∣ GK TEST-1 YEAR : 2022 GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS

WELCOME TO GK BITS IN TELUGU

1. 2021 డిసెంబర్ 31న వర్షం అంతరాయం కలిగించిన ఫైనల్లో భారత్ 'డక్ వర్త్ లూయిస్ పధ్ధతి' (DLS) ప్రకారం 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి "అండర్-19 ఆసియా కప్" (U-19 ASIA CUP) ను గెలుచుకుంది. భారత్ అండర్-19 ఆసియా కప్ ను గెలవడం ఇది ఎన్నో సారి ? [మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు చేసింది. అనంతరం 102 పరుగులకు కుదించిన లక్ష్యాన్ని యువ టీమ్ ఇండియా 21.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి అందుకుంది]

(ఎ) 6

(బి) 7

(సి) 8

(డి) 9


2. 2022 జనవరి 19న దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ (INDIA Vs SOUTH AFRICA) లో భారత జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించేదెవరు ? [బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు]

(ఎ) విరాట్ కోహ్లి

(బి) రోహిత్ శర్మ

(సి) కేఎల్ రాహుల్

(డి) శిఖర్ ధావన్


3. 3డీ ఎఫెక్ట్, సిల్వర్ కోటింగ్ తో ప్రత్యేకంగా రూపొందించిన 6 పేజీల తితిదే (3D EFFCT, SILVER COATING TTD CALENDARS-2022) ఒక్కో క్యాలెండర్ ధర ఎంత ? [స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను రూపొందించారు]

(ఎ) రూ. 400

(బి) రూ. 450

(సి) రూ. 500

(డి) రూ. 550


4. తితిదే ఐటీ సలహాదారు (TTD IT ADVISOR) గా 2021 డిసెంబర్ 31న నియమితులైన 'అమర్ నాగారం' ఏ సంస్థకు సీఈఓ (CEO) గా ఉన్నారు ?

(ఎ) మింత్రా

(బి) మీషో

(సి) అజియో

(డి) మోజో


5. విప్లవ రచయితల సంఘం (విరసం) 28వ మహాసభలు 2022 జనవరి 8, 9వ తేదీల్లో ఎక్కడ జరగనున్నాయి ?

(ఎ) రణస్థలం

(బి) రంపచోడవరం

(సి) విజయవాడ

(డి) నెల్లూరు


6. విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంచేందుకు బాలవాటిక (ఒకటో తరగతికి సన్నద్ధత) నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎన్ని రోజులపాటు పఠన ప్రచారం నిర్వహించాలని సమగ్రశిక్ష అభియాన్ ఆదేశాలు జారీ చేసింది ? [జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో 2022 జనవరి 6న ప్రచారాన్ని ప్రారంభిస్తారు. చిన్నప్పటి నుంచే పఠనాసక్తిని పెంచేందుకు, స్వతంత్ర పాఠకులుగా, జీవితకాల అభ్యాసకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది]

(ఎ) 50

(బి) 75

(సి) 100

(డి) 125


7. విశాఖపట్నం 'హిందుస్థాన్ షిప్ యార్డ్' లో నిర్మించిన 'బొలార్డ్ టగ్' ను 2021 డిసెంబర్ 31న భారత నౌకాదళానికి అప్పగించారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థలో ఇది ఎన్నో నిర్మాణం ? [వరుస ఆర్డర్లలో మూడోదిగా 50 టన్నుల సామర్థ్యం గల 'బీటీ (బొలార్డ్ టగ్) - బాల్ రాజ్' (50 TON BOLLARD PULL TUG (BALRAJ)) కు ఇటీవల సీ ట్రయల్ నిర్వహించినట్లు సంస్థ సీఎండీ 'హేమంత్ ఖత్రీ' (HINDUSTAN SHIPYARD LIMITED CMD) పేర్కొన్నారు]

(ఎ) 197

(బి) 198

(సి) 199

(డి) 200


8. కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి 'నిర్మలా సీతారామన్' ఆధ్వర్యంలో 2021 డిసెంబర్ 31న నిర్వహించిన జీఎస్టీ మండలి సమావేశం (GST COUNCIL MEETING) ఎన్నోది ? [2022 జనవరి 1 నుండి జౌళిరంగం (వస్త్రాలు) పై  5% గా ఉన్న జీఎస్టీని 12% గా పెంచాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలు వ్యతిరేకించడంతో ఈ జీఎస్టీ మండలి సమావేశంలో ఆ ప్రతిపాదనను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పాదరక్షలపై మాత్రం ధరతో సంబంధం లేకుండా 2022 జనవరి 1 నుంచి అన్ని రకాల పాదరక్షలపై 12 శాతం జీఎస్టీ (GST ON FOOTWEAR) అమలవుతుంది. గతంలో రూ. 1,000 లోపు పాదరక్షలపై 5 శాతం జీఎస్టీ విధించేవారు]

(ఎ) 46

(బి) 47

(సి) 48

(డి) 49


9. బ్రిటన్ కు చెందిన సోడియమ్-అయాన్ బ్యాటరీల తయారీ సంస్థ 'ఫారాడియాన్' (FARADION LIMITED) ను రూ. 1,000 కోట్లతో (100 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు) కొనుగోలు చేసిన భారతీయ సంస్థ ?  

(ఎ) హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్

(బి) ఐటీసి లిమిటెడ్

(సి) ఆర్ ఐ ఎల్

(డి) అదానీ గ్రీన్ ఎనర్జీ


10. అరబిందో ఫార్మా నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరిని నియమించారు ? [ఇతను 2024 మే 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు]

(ఎ) బి. ఆదిరెడ్డి

(బి) ఎం. మదన్ మోహన్ రెడ్డి

(సి) పి. శరత్ చంద్రా రెడ్డి

(డి) కె. నిత్యానంద రెడ్డి


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-1 సంవత్సరం : 2022 (GK TEST-1 YEAR : 2022)

1) సి 2) సి 3) బి 4) ఎ 5) డి 6) సి 7) సి 8) ఎ 9) సి 10) డి