ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, డిసెంబర్ 2021, బుధవారం

జి.కె.టెస్ట్ : 76 GK TEST-76. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్లను రూ. 2,250 నుంచి ఎంతకు పెంచనున్నారు ?
(ఎ) రూ. 2,500 
(బి) రూ. 2,750  
(సి) రూ. 3,000  
(డి) రూ. 3,250 

2. ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు 2021 అక్టోబర్ 29న ప్రకటించిన భారత టెన్నిస్ దిగ్గజం 'లియాండర్ పేస్' (LIANDER PAES) ఏ రాజకీయ పార్టీలో చేరాడు ? [22 ఏళ్లకే 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో పురుషుల సింగిల్స్ లో కాంస్యం నెగ్గి ఒలింపిక్స్ టెన్నిస్ లో భారత్ కు పతకం అందించిన ఏకైక ఆటగాడిగా 'లియాండర్ పేస్' కొనసాగుతున్నాడు. 1992 నుంచి 2016 వరకు వరుసగా ఏడు ఒలింపిక్స్ ల్లో పాల్గొన్న తొలి టెన్నిస్ ప్లేయర్ గా, ఏకైక భారత్ అథ్లెట్ గా అతను నిలిచాడు]
LIANDER PAES
లియాండర్ పేస్

 
(ఎ) కాంగ్రెస్ 
(బి) తృణమూల్ కాంగ్రెస్ 
(సి) వై ఎస్ ఆర్ సి పి  
(డి) డీ ఎం కె 

3. 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గవర్నర్ గా 'శక్తికాంత దాస్' (SHAKTIKANTA DAS) పదవీకాలాన్ని భారత ప్రభుత్వం ఇంకా ఎన్ని సంవత్సరాలు పొడిగించింది ? [2018 డిసెంబర్ 11న ఆర్బీఐ 25వ గవర్నర్ (25th Governor of RBI) గా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీకాలం 2021 డిసెంబర్ లో ముగియనుంది]
SHAKTIKANTA DAS
శక్తికాంత దాస్

   
(ఎ) ఒక సంవత్సరం 
(బి) రెండు సంవత్సరాలు 
(సి) మూడు సంవత్సరాలు 
(డి) నాలుగు సంవత్సరాలు 

4. 'ఆర్బీఐ' (RBI) కి అత్యంత ఎక్కువకాలం (7 ఏళ్ల 197 రోజులు) గవర్నర్ గాఎవరు పని చేశారు ?
(ఎ) సర్ బెనగళ్ రామారావు 
(బి) బిమల్ జలాన్  
(సి) జేమ్స్ టేలర్ 
(డి) సి.డి. దేశ్ ముఖ్ 

5. 'జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్' (NCLAT) నూతన చైర్ పర్సన్ గా ఎవరిని నియమిస్తూ భారత ప్రభుత్వం 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది ? [4 ఏళ్లు కానీ, ఆయనకు 70 ఏళ్ల వయస్సు వచ్చేవరకు కానీ ఈ పదవిలో కొనసాగుతారు]   
(ఎ) జస్టిస్ అశోక్ భూషణ్    
(బి) జస్టిస్ రామలింగం సుధాకర్   
(సి) జస్టిస్ రాకేశ్ కుమార్ 
(డి) జస్టిస్ జాస్తి చలమేశ్వర్

6. 'ఉద్యోగుల భవిష్య నిధి' (EPF) చందాదారులకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పీ ఎఫ్ డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ ఇవ్వనున్నారు ?    
(ఎ) 8.35% 
(బి) 8.50% 
(సి) 8.65% 
(డి) 8.75% 

7. జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన 'ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక-2020' ప్రకారం .. భారతదేశంలో రోజు కూలీలు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది ? [ఆంధ్రప్రదేశ్ లో 2019తో పోలిస్తే 2020లో నిరుద్యోగుల ఆత్మహత్యలు 67.28 శాతం, రోజు కూలీల బలవన్మరణాలు 15.41 శాతం ఎక్కువయ్యాయి] 
(ఎ) 4 
(బి) 5 
(సి) 6 
(డి) 7 

8. 2021 ఏప్రిల్ 8న సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన జీవో నంబర్ ఎంత ? [2021 డిసెంబర్ 14న ఈ జీవోను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది]  
(ఎ) 33   
(బి) 34  
(సి) 35 
(డి) 36  

9. అస్సాం రాష్ట్రంలో గువాహటిలోని తేయాకు వేలం కేంద్రంలో 2021 డిసెంబర్ 14న 'మనోహరి గోల్డ్' తేయాకు కిలో ఎంత ధర పలికి చరిత్ర సృష్టించింది ? [భారతదేశంలో ఏ కేంద్రంలోనైనా, ఏ వేలంలోనైనా, ఏ సంవత్సరమైనా అత్యధిక ధర పలికిన తేయాకు ఇదే]
(ఎ) రూ. 99,998 
(బి) రూ. 99,999 
(సి) రూ. 99,997  
(డి) రూ. 99,996  

10. సినీ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన 'రాజ్ కపూర్-ది మాస్టర్ ఎట్ వర్క్' (Raj Kapoor : The Master At Work) పుస్తకాన్ని దిల్లీలో 2021 డిసెంబర్ 14న ఆవిష్కరించినది ?
(ఎ) రామ్ నాథ్ కోవింద్   
(బి) ఎం. వెంకయ్యనాయుడు 
(సి) నరేంద్ర మోదీ  
(డి) అమిత్ షా              

కీ (KEY) (GK TEST-76 YEAR : 2021)
1) ఎ 2) బి 3) సి 4) ఎ 5) ఎ 6) బి 7) సి 8) సి 9) బి 10) బి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

గ్రామీణ నిరుద్యోగ యువతకు 'సీడాప్' ద్వారా వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ∣ What Is SEEDAP ?

Welcome To GK Bits In Telugu Blog

"సీడాప్" (SEEDAP) అంటే ఏమిటి ?

ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకునేలా నిరుద్యోగులకు పలు కోర్సులను ఉచితంగా అందించే సంస్థ "సీడాప్". సీడాప్ అంటే 'సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్' (SEEDAP).

ప్రస్తుతం సీడాప్ (SEEDAP) చైర్మన్ గా 'శ్యాంప్రసాదరెడ్డి' వ్యవహరిస్తున్నారు.

సీడాప్ (SEEDAP) సంస్థ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా యువతకు తర్ఫీదు ఇస్తుంది.

సీడాప్ (SEEDAP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 180 ప్రైవేట్ ఏజెన్సీలు, 14 ప్రభుత్వరంగ సంస్థల ద్వారా వివిధ రకాల కోర్సులను నిర్వహిస్తున్నది.

పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐ.ఐ.టి., పాలిటెక్నిక్ పూర్తి చేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు 90 నుంచి 120 రోజుల వ్యవధి కోర్సుల్లో .. ఉచిత భోజనం, వసతితో పాటు ఏకరూప దుస్తులను కూడా అందిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగమేళా నిర్వహిస్తారు.

సీడాప్ (SEEDAP) లో ఉచిత శిక్షణకు ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ?

సెల్ ఫోన్ల ద్వారా సీడాప్ (SEEDAP) వెబ్ సైట్ (www.seedap.ap.gov.in) లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

సీడాప్ (SEEDAP) లో ఉచిత శిక్షణకు గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది.

ఒక్కో కోర్సులో ఒక్కో బ్యాచ్ కు 35 మందికి అవకాశం ఉంటుంది.

విశాఖపట్నం జిల్లాలో 13 శిక్షణ సంస్థలు సీడాప్ (SEEDAP) ద్వారా 15 కోర్సులను నిర్వహిస్తున్నారు.

సీడాప్ (SEEDAP) లక్ష్యం

2019-2023 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 మందికి ఉచిత శిక్షణ ఇచ్చి, వారిలో 70 శాతం మందికి ఉద్యోగాలను కల్పించాలని సీడాప్ (SEEDAP) లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రామీణ ప్రాంతాల్లో 'జాబ్ రిసోర్స్ పర్సన్' (JRP) లతో విస్తృతంగా ప్రచారం కల్పించి ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.

14, నవంబర్ 2021, ఆదివారం

జి.కె.టెస్ట్ : 77 GK TEST-77. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'జగనన్న సంపూర్ణ గృహ హక్కు' పథకంలో భాగంగా 'వన్ టైం సెటిల్మెంట్' (OTS) కింద రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఎవరికి అప్పగించారు ?
(ఎ) పంచాయతీ కార్యదర్శి 
(బి) వార్డు/గ్రామ పంచాయతీ కార్యదర్శి 
(సి) గ్రామ రెవిన్యూ అధికారి 
(డి) డిజిటల్ అసిస్టెంట్ 

2. భక్తులకు విశేష సేవలందిస్తున్న 'తిరుమల తిరుపతి దేవస్థానం' (తితిదే) నకు 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు దక్కింది. 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' ఏ దేశానికి చెందినది ?
(ఎ) ఇంగ్లాండ్ 
(బి) అమెరికా  
(సి) స్విట్జర్లాండ్  
(డి) ఆస్ట్రేలియా 

3. 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (సెకి) నుంచి ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ను మూడు విడతల్లో తీసుకోవడానికి అనుమతించాలంటూ డిస్కంలు చేసిన ప్రతిపాదన మేరకు త్రైపాక్షిక విద్యుత్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోవడానికి 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి' (ఏపీఈఆర్సీ) అనుమతించింది ? [ఈ ఒప్పందం కింద సెప్టెంబర్ 2024 నుంచి ప్రతి సంవత్సరం గరిష్ఠంగా 17వేల మిలియన్ యూనిట్ల వంతున 25 సంవత్సరాల వరకు 'సెకి' నుంచి విద్యుత్ తీసుకోవడానికి డిస్కంలకు వీలవుతుంది] 
(ఎ) 5000 మెగావాట్లు   
(బి) 6000 మెగావాట్లు 
(సి) 7000 మెగావాట్లు 
(డి) 8000 మెగావాట్లు 

4. 'ప్రపంచ మధుమేహ దినోత్సవం' ను ఏ తేదీన జరుపుతారు ?
(ఎ) నవంబర్ 11 
(బి) నవంబర్ 12 
(సి) నవంబర్ 13 
(డి) నవంబర్ 14 

5. 'భారతీయ గ్రంథాలయ దినోత్సవం' ను ఏ తేదీన జరుపుతారు ? [భారతీయ గ్రంథాలయాలకు విశేష సేవ చేసిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యులు 'ఎస్.ఆర్.రంగనాథన్' సేవలకు గుర్తింపుగా అతని జయంతిని 'భారతీయ గ్రంథాలయ దినోత్సవం' గా జరుపుతారు. గ్రంథాలయాల్లో పుస్తకాలను క్రమపద్ధతిలో పేర్చడానికి రంగనాథన్ ప్రతిపాదించిన 'ఎనలటికో-సింథటిక్ క్లాసిఫికేషన్' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది]    
(ఎ) ఆగస్ట్ 11    
(బి) ఆగస్ట్ 12   
(సి) ఆగస్ట్ 13  
(డి) ఆగస్ట్ 14

6. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే సంప్రదాయం భారత్ లో ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది ?   
(ఎ) 1958 
(బి) 1968 
(సి) 1978 
(డి) 1988 

7. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' ను అందుకున్న తొలి మహిళా క్రికెటర్ ? 
(ఎ) స్మృతి మంథాన  
(బి) మిథాలీ రాజ్ 
(సి) హర్మన్ ప్రీత్ కౌర్ 
(డి) జులన్ గోస్వామి 

8. గడచిన 580 ఏళ్లలో ఎన్నడూ లేనంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఏ తేదీన సంభవించనుంది ? [మొత్తం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు ఇది సాగుతుంది. చివరిసారిగా ఇంత సుదీర్ఘ చంద్రగ్రహణం 1440వ సంవత్సరంలో ఫిబ్రవరి 18న చోటుచేసుకుంది]
(ఎ) 2021 నవంబర్ 16   
(బి) 2021 నవంబర్ 17  
(సి) 2021 నవంబర్ 18 
(డి) 2021 నవంబర్ 19  

9. 'మన దేశానికి 1947లో లభించిన స్వాతంత్య్రం ఆంగ్లేయుల భిక్ష మాత్రమే. నిజమైన స్వాతంత్య్రం వచ్చింది 2014లోనే' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి ఎవరు ?
(ఎ) దీపికా పదుకొణె 
(బి) అలియాభట్ 
(సి) కంగనా రనౌత్ 
(డి) కరీనా కపూర్ 

10. దివాలా స్మృతిలోని సెక్షన్ 29(ఎ) ప్రకారం వ్యవస్థాపకులు రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించడానికి అనర్హులు. కానీ ఏ కేటగిరీలో వారు రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించవచ్చు ?
(ఎ) ఎంఎస్ఎంఈ 
(బి) గనుల తవ్వకం 
(సి) రసాయనాలు మరియు పెట్రో రసాయనాలు 
(డి) కుటీర పరిశ్రమ              

కీ (KEY) (GK TEST-77 YEAR : 2021)
1) బి 2) ఎ 3) సి 4) డి 5) బి 6) బి 7) బి 8) డి 9) సి 10) ఎ    

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

6, నవంబర్ 2021, శనివారం

జి.కె.టెస్ట్ : 75 GK TEST-75. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

1. నమ్మకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే బ్యాంకు సిబ్బందిని రక్షించడానికి వీలుగా ఎంత మొత్తం వరకు ఉన్న 'ఎన్ పి ఏ' (NON PERFORMING ASSETS) ఖాతాల కోసం ఏకరీతి సిబ్బంది జవాబుదారీ నిబంధనల్ని భారత ఆర్ధిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది ? [2022 ఏప్రిల్ 1 నుంచి నిరర్ధక ఆస్తులుగా మారే ఖాతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి]
(ఎ) రూ. 25 కోట్లు 
(బి) రూ. 50 కోట్లు 
(సి) రూ. 75 కోట్లు 
(డి) రూ. 100 కోట్లు 

2. 'అటల్ పెన్షన్ యోజన' (APY) పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ?
(ఎ) 2015 ఏప్రిల్ 1 
(బి) 2015 మే 1  
(సి) 2015 జూన్ 1  
(డి) 2015 జూలై 1 

3. జే ఎన్ టీ యూ కాకినాడ ఉపకులపతి (JNTUK-VC) గా 31 అక్టోబర్ 2021న బాధ్యతలు స్వీకరించినది ?   
(ఎ) ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి  
(బి) ఆచార్య కె.సి. రెడ్డి 
(సి) ఆచార్య జి.వి.ఆర్. ప్రసాదరాజు 
(డి) డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి 

4. భారతదేశ భద్రత కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'ప్రాజెక్ట్ 15బి' (Project 15B) పేరిట నిర్మించిన తొలినౌక భారత నౌకాదళంలో చేరిన తేదీ ? [పీ15బి పేరిట నాలుగు నౌకల నిర్మాణానికి మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ (ముంబయి) సంస్థ గతంలోనే ఆర్డర్లు దక్కించుకుంది. ఈ నౌక 163 మీటర్ల పొడవుతో 30 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు]
FIRST PROJECT 15B DESTROYER


(ఎ) 2021 అక్టోబర్ 25  
(బి) 2021 అక్టోబర్ 26 
(సి) 2021 అక్టోబర్ 27 
(డి) 2021 అక్టోబర్ 28 

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అవసరమైనవారు రీచ్ లు, డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకునేందుకు వీలుగా (Online Sand Booking in Andhra Pradesh) గనుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న 'జేపీ పవర్ వెంచర్స్' (JP POWER VENTURES) సంస్థ .. ఆన్లైన్ పోర్టల్ (www.andhrasand.com) ను ప్రారంభించిన తేదీ ? [ఇసుక బుకింగ్, ఆన్ లైన్ లో సమస్యలు తదితరాలపై సంప్రదించేందుకు 9700009944 ఫోన్ నంబర్ ను అందుబాటులోకి తెచ్చారు]    
(ఎ) 2021 నవంబర్ 1    
(బి) 2021 అక్టోబర్ 31   
(సి) 2021 అక్టోబర్ 30 
(డి) 2021 అక్టోబర్ 29

6. వచ్చే మూడు సంవత్సరాలలో జి-20 సదస్సులు (G20-SUMMITS) ఏయే దేశాల్లో జరగనున్నాయి ?   
(ఎ) 2022-ఇండోనేసియా, 2023-భారత్, 2024-బ్రెజిల్ 
(బి) 2022-భారత్, 2023-బ్రెజిల్, 2024-ఇండోనేసియా  
(సి) 2022-బ్రెజిల్, 2023-ఇండోనేసియా, 2024-భారత్ 
(డి) 2022-ఇటలీ, 2023-బ్రెజిల్, 2024-థాయిలాండ్ 

7. సుప్రసిద్ధ 'ట్రెవీ ఫౌంటైన్' (TREVI FOUNTAIN) ఏ నగరంలో ఉంది ? [ఈ ఫౌంటైన్ లోని నీళ్లలోకి భుజం మీదుగా నాణెం విసిరితే మళ్లీ ఈ ఫౌంటైన్ ఉన్న నగరానికి వెళ్తారని ప్రజల నమ్మకం] 
(ఎ) జకార్తా 
(బి) రోమ్  
(సి) పారిస్ 
(డి) ఆమ్ స్టర్ డామ్  

8. రెండు రోజులపాటు 'రోమ్' లో జరిగిన జి-20 సదస్సు 2021 అక్టోబర్ 31న ముగిసింది. జీవ వైవిధ్య ముప్పును ఏ సంవత్సరం నాటికి తిరోగమనం పట్టించే చర్యల్ని బలోపేతం చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు ? 
(ఎ) 2025   
(బి) 2030  
(సి) 2035 
(డి) 2040  

9. 2021 అక్టోబర్ 31న ప్రారంభమైన 'ఐరాస వాతావరణ సదస్సు' (COP26) కార్యక్రమానికి బ్రిటన్ లోని ఏ నగరం వేదికైంది ? [వాతావరణ సదస్సు లాంఛనంగా ప్రారంభమైనట్లు 'కాప్26' అధ్యక్షుడు, బ్రిటన్ మంత్రి 'అలోక్ శర్మ' ప్రకటించారు. 2021 నవంబర్ 12 వరకూ జరిగే ఈ సదస్సులో 200 దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొంటున్నారు]
(ఎ) బర్మింగ్ హామ్  
(బి) లండన్ 
(సి) బ్రిస్టల్  
(డి) గ్లాస్గో  

10. అంటార్కిటికాలో 100 కిలోమీటర్ల పొడవైన ఒక హిమానీనదానికి 'గ్లాస్గో గ్లేషియర్' (GLASGOW GLACIER) అని బ్రిటన్ లోని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేరు పెట్టారు ?
(ఎ) ఆక్స్ ఫర్డ్  
(బి) కేంబ్రిడ్జ్  
(సి) లీడ్స్ 
(డి) ఎడిన్ బర్గ్              

కీ (KEY) (GK TEST-75 YEAR : 2021)
1) బి 2) సి 3) సి 4) డి 5) బి 6) ఎ 7) బి 8) బి 9) డి 10) సి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

30, అక్టోబర్ 2021, శనివారం

జి.కె.టెస్ట్ : 74 GK TEST-74. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

1. 2022-25 మధ్య దేశంలోని ఎన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించి రూ. 20,782 కోట్లు రాబట్టుకోవాలని నిర్ణయించినట్లు 'నేషనల్ మానిటైజేషన్ పాలసీ' (NATIONAL MONITIZATION POLICY) లో భారత ప్రభుత్వం ప్రకటించింది ? [ప్రస్తుతం 'ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (AAI) చేతిలో 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు, 103 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి]
(ఎ) 5  
(బి) 15   
(సి) 25   
(డి) 35  

2. టెస్లా (Tesla, Inc.) కంపెనీ తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను చేరిన తేదీ ? [లక్ష కోట్ల డాలర్ల క్లబ్ లో ఇప్పటికే యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సౌదీ ఆరామ్ కో, ఆల్ఫాబెట్ లు ఉన్నాయి] 
(ఎ) 2021 అక్టోబర్ 25  
(బి) 2021 అక్టోబర్ 26   
(సి) 2021 అక్టోబర్ 27   
(డి) 2021 అక్టోబర్ 28  

3. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 'సార్థక్' (SARTHAK) అనే నౌక 'భారత తీర రక్షక దళం' (INDIAN COAST GUARD) లో చేరిన తేదీ ?
SARTHAK SHIP
సార్థక్

     
(ఎ) 2021 అక్టోబర్ 26   
(బి) 2021 అక్టోబర్ 27 
(సి) 2021 అక్టోబర్ 28 
(డి) 2021 అక్టోబర్ 29 

4. భారతదేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 'పెగాసస్ స్పైవేర్' (PEGASUS SPYWARE) వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖుల ఫోన్లపై నిఘా, వ్యక్తిగత గోప్యతకు భంగం తదితర ఆరోపణలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఎవరి పర్యవేక్షణలో ఈ కమిటీ పని చేస్తుంది ? [ఇజ్రాయెల్ కు చెందిన 'ఎన్ ఎస్ ఓ' (NSO) గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయనాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచినందున ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్.శర్మ, ప్రముఖ పాత్రికేయులు ఎన్. రామ్ తదితరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను విచారించిన ధర్మాసనం 2021 అక్టోబర్ 27న తన నిర్ణయాన్ని ప్రకటించింది]
(ఎ) జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ 
(బి) జస్టిస్ హిమాకోహ్లి  
(సి) జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 
(డి) జస్టిస్ సూర్యకాంత్ 

5. రాజమండ్రి నుంచి పాపికొండల వరకు పర్యాటక బోటు (TOURIST BOAT) లో వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత ? [7 నవంబర్ 2021 నుంచి బోటు యాత్ర (BOAT TRIP TO PAPIKONDALU) ప్రారంభమవుతుందని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి పత్రికాముఖంగా ప్రకటించారు]   
(ఎ) రూ. 750    
(బి) రూ. 1,250  
(సి) రూ. 1,750  
(డి) రూ. 2,250

6. భారత సైన్యం, వాయుసేన కలిసి జమ్మూ కాశ్మిర్ లోని 'బద్గాం' (BUDGAM) కు స్వేచ్ఛ కల్పించిన తేదీ ?    
(ఎ) 1947 అక్టోబర్ 26 
(బి) 1947 అక్టోబర్ 27 
(సి) 1947 అక్టోబర్ 28 
(డి) 1947 అక్టోబర్ 29 

7. 'డీ ఆర్ ఓ' (DRO) నేతృత్వంలోని 'డిస్ట్రిక్ట్ లెవెల్ కొవిడ్ డెత్ అసెర్టింగ్ కమిటీ' (District Level Covid Death Asserting Committee) నివేదించిన 14 రోజుల్లోగా నష్టపరిహారం కింద దరఖాస్తు చేసిన వారికి ఎంత మొత్తాన్ని పరిహారంగా అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ? [కరోనా వైరస్ సోకినట్లు తేలినప్పటినుంచి 30 రోజుల్లో సంభవించిన మరణాలను కొవిడ్ మరణాలుగానే పరిగణించాలని అధికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది] 
(ఎ) రూ. 50,000 
(బి) రూ. 1,00,000 
(సి) రూ. 1,50,000 
(డి) రూ. 2,00,000 

8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు, పింఛను కార్డుల దరఖాస్తుల్ని ఎన్ని రోజుల్లోగా పరిశీలించి అర్హులో కాదో నిర్ధారిస్తారు ? [ఇళ్ల పట్టాల దరఖాస్తుల్ని 90 రోజుల్లోగా పరిశీలించి అర్హులో కాదో నిర్ధారిస్తారు. కొత్తగా ఎంపిక చేసినవారికి ఏటా డిసెంబర్, జూన్ నెలల్లో పథకం మంజూరు చేసి నిధులు విడుదల చేస్తారు]
(ఎ) 7   
(బి) 14  
(సి) 21 
(డి) 28  

9. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ లలో 'ఎన్ ఆర్ ఐ' (NRI) కోటా కింద ఉన్న సీట్ల సంఖ్య ? [ఈ సీట్ల కోసం విద్యార్థులు వర్సిటీ వెబ్ సైట్ www.rgukt.in లో 2021 నవంబర్ 20లోగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయకున్నా ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులే]
(ఎ) 100 
(బి) 200 
(సి) 300  
(డి) 400  

10. '2021 ఆసియాన్ సదస్సు' (2021 ASEAN SUMMIT) కు నేతృత్వం వహించిన దేశం ? [18వ ఇండియా-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు]
(ఎ) ఇండోనేషియా 
(బి) థాయిలాండ్  
(సి) మయన్మార్ 
(డి) బ్రూనై              

కీ (KEY) (GK TEST-74 YEAR : 2021)
1) సి 2) ఎ 3) సి 4) ఎ 5) బి 6) బి 7) ఎ 8) సి 9) బి 10) డి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

8, జులై 2021, గురువారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-73

1. భారత దిగ్గజ స్ప్రింటర్ 'మిల్కాసింగ్' కు "ఫ్లయింగ్ సిఖ్" (FLYING SIKH) అనే బిరుదును ఇచ్చిన పాకిస్థాన్ అధ్యక్షుడు ? ['కరోనా' దుష్పరిణామాలతో 2021 జూన్ 18న 'మిల్కాసింగ్' (MILKHA SINGH) మరణించాడు. 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ లో పాల్గొన్న 'మిల్కాసింగ్' 400 మీటర్ల పరుగు పందెం ఫైనల్ లో 0.1 సెకను తేడాతో 'కాంస్య పతకం' ను కోల్పోయాడు] 
    

(ఎ) సికందర్ మీర్జా
(బి) అయూబ్ ఖాన్
(సి) మహమ్మద్ ఆఫ్జల్ చీమా 
(డి) ఫజ్ లుల్ ఖాదిర్ చౌధురి

2. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ద ఇండియా బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ ప్రమోషన్ స్కీమ్' (IBPS) కింద కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది ? [ఈ 'పథకం' (IBPS) కింద దేశంలోని రెండో, మూడో శ్రేణి పట్టణాల్లో పలు ఐటీ, బీపీఓ కంపెనీలను విస్తరించారని, ఈ పథకం కిందే ఆంధ్రప్రదేశ్ 12,234 కొత్త ఉద్యోగాలను ఇవ్వగలిగిందని .. 'ఎస్ టీ పీ ఐ' (STPI) 2021 జూన్ 19న వెల్లడించింది] 
  

(ఎ) 1   
(బి) 2    
(సి) 3    
(డి) 4   

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'చిత్తూరు, కడప' జిల్లాల్లో విస్తరించిన శ్రీవెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని 'పర్యావరణ సున్నిత మండలం' (ECO SENSITIVE ZONE) గా ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ ? [రెండు జిల్లాల్లో 525.97 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ సంరక్షణ కేంద్రంలో అరుదైన వృక్షజాతులు ఉండడం వలన మొత్తం 448 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 'పర్యావరణ సున్నిత మండలం' (ECO SENSITIVE ZONE) గా ప్రకటించారు. దీని పరిధిలోనే 'శ్రీవెంకటేశ్వర జాతీయ పార్కు' కూడా ఉంది]  
      

(ఎ) 2021 జూన్ 17    
(బి) 2021 జూన్ 18   
(సి) 2021 జూన్ 19   
(డి) 2021 జూన్ 20   

4. ప్రపంచంలోనే తొలిసారిగా .. లాండ్రీ డిటర్జెంట్ సీసాను కాగితంతో రూపొందించడానికి (PAPER BOTTLE) సిద్ధమవుతున్న ప్రముఖ 'ఎఫ్ ఎం సీ జీ' (FMCG) సంస్థ ? [ఈ నమూనాను 2022 ప్రారంభంలో 'బ్రెజిల్' లో విడుదల చేసే అవకాశం ఉంది]
 

(ఎ) గోద్రెజ్   
(బి) పతంజలి   
(సి) యూనీలీవర్   
(డి) నెస్లే   

5. 'కొవిడ్ సురక్ష' ప్రాజెక్ట్ (COVID SURAKSHA PROJECT) లో భాగంగా 'కొవిడ్' వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? [దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మరో 18 చోట్ల రాబోతున్నాయి] (సమాచార తేదీ : 2021 జూన్ 20)
    

(ఎ) విశాఖపట్నం      
(బి) కాకినాడ    
(సి) అమరావతి    
(డి) పులివెందుల  

6. 'కరోనా వ్యాక్సినేషన్' లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ (CORONA VACCINATION SPECIAL DRIVE) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేసి రికార్డు సృష్టించిన తేదీ ? [పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,64,308 మందికి, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 63,314 మందికి 'కరోనా' టీకాలు వేశారు] 
    

(ఎ) 2021 జూన్ 17    
(బి) 2021 జూన్ 18   
(సి) 2021 జూన్ 19   
(డి) 2021 జూన్ 20   

7. 'జమ్మూ-కశ్మిర్' (JAMMU-KASHMIR) నియోజకవర్గాల పునర్విభజనకు ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని గతేడాది నియమించారు ? 
  

(ఎ) జస్టిస్ జాస్తి చలమేశ్వర్   
(బి) జస్టిస్ ఆర్.పి.దేశాయ్    
(సి) జస్టిస్ రాకేశ్ కుమార్   
(డి) జస్టిస్ శ్రీకృష్ణ   

8. 2021 జూన్ 21న నిర్వహించిన 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' (INTERNATIONAL DAY OF YOGA) మొత్తమ్మీద ఎన్నో యోగా దినోత్సవం ? [ఈ ఏడాది "ఆరోగ్యం కోసం యోగా" అనేది ప్రధానాంశంగా ప్రకటించారు]
 

(ఎ) 6     
(బి) 7     
(సి) 8   
(డి) 9  

9. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ (INDIAN WOMEN'S CRICKET TEAM HEAD COACH) గా నియమితులైన టీమిండియా మాజీ క్రికెటర్ ? (సమాచార తేదీ : 2021 మే 13)  

(ఎ) అజయ్ రత్రా    
(బి) డబ్ల్యూ వీ రామన్   
(సి) రమేష్ పొవార్    
(డి) హేమలత    

10. ప్రభుత్వాసుపత్రిలో బెడ్లకు ప్రత్యామ్నాయంగా 'ఆక్సిజన్ పడకల ఆర్టీసీ బస్సులు' (OXYGEN ON WHEELS) ను ఏ నగరంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద 2021 మే 13న ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి ? ['జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు' పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఆర్టీసీ ఏసీ బస్సులలో ఈ పడకలను సిద్ధం చేశారు]    
   ' 

(ఎ) విజయవాడ    
(బి) రాజమహేంద్రవరం   
(సి) కాకినాడ   
(డి) విశాఖపట్నం                

కీ (KEY) (GK TEST-73 YEAR : 2021)
1) బి      2) ఎ      3) సి      4) సి      5) ఎ      6) డి      7) బి      8) బి      9) సి     10) బి     

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

15, జూన్ 2021, మంగళవారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-72

1. మొత్తం 700 MHz సామర్థ్యం గల స్పెక్ట్రమ్ లో రైల్వేల సిగ్నళ్లు, కమ్యూనికేషన్ల కోసం ఎంత స్పెక్ట్రమ్ ను కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి 2021 జూన్ 9న నిర్ణయం తీసుకుంది ? [ఇంతవరకు ఆప్టికల్ ఫైబర్ విధానం ద్వారా సిగ్నలింగ్, ఇతర వ్యవస్థలను నిర్వహిస్తుండగా .. ఇకపై అత్యంత వేగం గల రేడియో తరంగాల ద్వారా వీటిని నడుపుతారు. దీని వలన లైవ్ వీడియో ద్వారా రైలు కదలికలను గుర్తించడానికి వీలవుతుంది. ఇందుకు అయిదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తారు] (How much spectrum in 700 MHz band to Indian Railways ?)
    

(ఎ) 3 MHz   
(బి) 4 MHz   
(సి) 5 MHz   
(డి) 6 MHz   

2. తాజాగా ప్రకటించిన 'క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్ 2022' (QS WORLD UNIVERSITY RANKINGS 2022) లో భారతదేశానికి చెందిన ఎన్ని ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు వెయ్యిలోపు స్థానం దక్కించుకున్నాయి ? (TOP INDIAN INSTITUTES NAMES, RANKINGS IN 'QS WORLD UNIVERSITY RANKINGS 2022' REPORT)
  

(ఎ) 21  
(బి) 22   
(సి) 23   
(డి) 24  

3. కృష్ణా జలాలకు సంబంధించి .. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఏవిధంగా ఉండాలి' అనే విషయాలపై నిర్ణయం తీసుకోవాలని 'బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్' కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది ?
      

(ఎ) 86   
(బి) 87  
(సి) 88  
(డి) 89  

4. 2021-22 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి .. కేంద్ర ప్రభుత్వం 'వరి' (PADDY) పంటకు కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 1,868 నుంచి ఎంతకు పెంచింది ?
 

(ఎ) రూ. 1,910  
(బి) రూ. 1,920  
(సి) రూ. 1,930  
(డి) రూ. 1,940  

5. కరోనా వైరస్ పై 'సర్జికల్ స్ట్రైక్' (SURGICAL STRIKE) చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపిన కోర్టు ?
    

(ఎ) బాంబే హైకోర్టు     
(బి) మద్రాస్ హైకోర్టు   
(సి) తెలంగాణ హైకోర్టు   
(డి) దిల్లీ హైకోర్టు 

6. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (Election Commissioner of India) గా 2021 జూన్ 9న బాధ్యతలు స్వీకరించిన మాజీ ఐఏఎస్ అధికారి ?
    

(ఎ) అనూప్ చంద్ర పాండే  
(బి) దువ్వూరి సుబ్బారావు  
(సి) నీలం సాహ్ని  
(డి) ఐవైఆర్ కృష్ణారావు  

7. భారత వైమానిక దళం (IAF) కోసం మొట్టమొదటిసారిగా ఎంతమంది మహిళా అధికారులను యుద్ధ హెలికాఫ్టర్ల పైలట్ల శిక్షణకు భారత సైన్యం ఎంపిక చేసింది ? [ఈ మహిళా అధికారులు మహారాష్ట్రలోని 'నాసిక్' లో శిక్షణ తీసుకోనున్నారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది జూలైలో వారు విధుల్లో చేరనున్నారు]
  

(ఎ) 1  
(బి) 2  
(సి) 3  
(డి) 4  

8. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) 'జస్టిస్ ఎన్వీ రమణ' చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒకేసారి 24 నుంచి ఎంతకు పెరిగింది ? [దీనికి సంబంధించి సీజేఐ (CJI) 'జస్టిస్ ఎన్వీ రమణ' 2021 జూన్ 8న ఆమోదముద్ర వేశారు]
 

(ఎ) 40    
(బి) 41   
(సి) 42  
(డి) 43   

9. కేంద్ర ప్రభుత్వం "స్వామిత్వ" (SVAMITVA) పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తేదీ ? [ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2021 జూన్ 9న "స్వామిత్వ" (SVAMITVA) సర్వే ప్రారంభమైంది. రెవిన్యూ డివిజన్ కు ఒకటి చొప్పున 51 గ్రామాల్లో ఆస్తుల సర్వేను మొదలుపెట్టారు] 

(ఎ) 2020 జనవరి 1  
(బి) 2020 ఏప్రిల్ 24  
(సి) 2020 అక్టోబర్ 11   
(డి) 2020 డిసెంబర్ 10   

10. 'కొవిషీల్డ్' (COVISHIELD) టీకా మొదటి, రెండో డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుంచి ఎన్ని వారాలకు పొడిగిస్తూ 2021 మే 13న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ? ['నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్' సిఫార్సుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని 'కేంద్ర ఆరోగ్య శాఖ' తెలిపింది]
   ' 

(ఎ) 12-13 వారాలు   
(బి) 12-14 వారాలు  
(సి) 12-15 వారాలు  
(డి) 12-16 వారాలు               

కీ (KEY) (GK TEST-72 YEAR : 2021)
1) సి     2) బి     3) డి     4) డి     5) ఎ     6) ఎ     7) బి     8) సి     9) బి     10) డి    

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

11, జూన్ 2021, శుక్రవారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-71

1. సాగర గర్భంలో భారత నౌకాదళ పోరాట పటిమను మరింత శక్తిమంతం చేసేందుకు అధునాతన పరిజ్ఞానంతో 6 సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మించేందుకు ఉద్దేశించిన మెగా ప్రాజెక్ట్ (PROJECT 75 INDIA) ను 'రక్షణ కొనుగోళ్ల మండలి' (DAC) ఆమోదించిన తేదీ ? ['వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' (STRATEGIC PARTNERSHIP MODEL) కింద చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్ట్ (P-75 (INDIA) పూర్తికావడానికి 12 ఏళ్లు పడుతుంది]
INS KALVARI
SUBMARINE

  
(ఎ) 2021 జూన్ 1 
(బి) 2021 జూన్ 2  
(సి) 2021 జూన్ 3  
(డి) 2021 జూన్ 4 

2. 2021 జూన్ 4న ముగిసిన ఆర్బీఐ (RBI) 'పరపతి విధాన కమిటీ' (MPC) సమావేశంలో .. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2021-22) వృద్ధి రేటు అంచనాలను 10.5% నుంచి ఎంత శాతానికి తగ్గించారు ? [ద్రవ్యోల్బణ అంచనాలను 5.1 శాతంగా ఉండొచ్చని తెలియజేశారు] 
(ఎ) 10% 
(బి) 9.5%  
(సి) 9%  
(డి) 8.5% 

3. 'ఏపీ అమూల్ ప్రాజెక్ట్' (AP AMUL PROJECT) లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి'వర్చువల్ విధానంలో ప్రారంభించిన తేదీ ? ['ఏపీ అమూల్ ప్రాజెక్ట్' (AP AMUL PROJECT) ను ఈ ఏడాది 2,600 గ్రామాలకు, రెండేళ్లు పూర్తయ్యేలోపు దశలవారీగా 9,899 గ్రామాలకు విస్తరించనున్నారు. ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాల్లోని 722 గ్రామాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతోంది.    
(ఎ) 2021 జూన్ 4  
(బి) 2021 జూన్ 5 
(సి) 2021 జూన్ 6 
(డి) 2021 జూన్ 7 

4. 'ఇథనాల్ మిశ్రమ మార్గసూచి 2020-2025' (ETHANOL BLENDING ROAD MAP 2020-25) ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ఆవిష్కరించిన తేదీ ? [పెట్రోల్ లో 10 శాతం ఇథనాల్ ను 2022కి, 20 శాతం ఇథనాల్ ను కలిపి విక్రయించాలన్న లక్ష్యాన్ని 2030కి చేరుకోవాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను మిశ్రమం చేయాలన్న లక్ష్యాన్ని అయిదేళ్ల ముందుగానే అంటే 2025 కల్లా చేరుకుంటామని ప్రధాని అన్నారు] 
(ఎ) 2021 జూన్ 3 
(బి) 2021 జూన్ 4 
(సి) 2021 జూన్ 5 
(డి) 2021 జూన్ 6 

5. కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన 'పాఠశాల విద్య పనితీరు సూచిక 2019-20' (PERFORMANCE GRADING INDEX (PGI) 2019-20) ప్రకారం .. లెవెల్ 1లో ఒక్క రాష్ట్రమూ స్థానాన్ని దక్కించుకోలేదు. లెవెల్ 2లో గ్రేడ్ 1++ జాబితాలో 901-950 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినవి ? [కేంద్ర విద్యా శాఖ .. పాఠశాల విద్యా నాణ్యతలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనబరుస్తున్న పనితీరును పది లెవెల్స్ గా విభజించి వాటికి తొమ్మిది గ్రేడ్ లను ప్రకటించింది. లెవెల్-4లో 801-850 మార్కులతో గ్రేడ్-1 విభాగంలో ఆంధ్రప్రదేశ్, లెవెల్-5లో 751-800 మార్కులతో గ్రేడ్-2లో తెలంగాణ నిలిచాయి. పాఠశాల విద్యలో చేపట్టిన మార్పులను పరిగణనలోకి తీసుకుని 70 కొలమానాల ఆధారంగా పనితీరును అంచనా వేశారు]    
(ఎ) కేరళ, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, చండీగఢ్    
(బి) కేరళ, చండీగఢ్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, దిల్లీ   
(సి) లడఖ్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్  
(డి) పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్

6. కరోనా మూడో దశ ఉద్ధృతి చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో .. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' (COVAXIN) టీకా క్లినికల్ ట్రయల్స్ 18 ఏళ్లలోపు వారిపై ప్రారంభమైన తేదీ ? [మహారాష్ట్రలోని నాగ్ పుర్ లో మెడిట్రినా ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడు 'డాక్టర్ వసంత్ ఖాలాత్కర్' పర్యవేక్షణలో క్లినికల్ పరీక్షలు మొదలయ్యాయి]    
(ఎ) 2021 జూన్ 4 
(బి) 2021 జూన్ 5 
(సి) 2021 జూన్ 6 
(డి) 2021 జూన్ 7 

7. ప్రపంచంలోకెల్లా తొలిసారిగా 'నానో యూరియా' (NANO UREA) ద్రావణాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ? [ఒక్కో నానో యూరియా సీసా ధరను రూ. 240గా ఈ సంస్థ నిర్ణయించింది. సంప్రదాయ యూరియా బస్తాతో పోలిస్తే ఈ నానో యూరియా సీసా ధర 10 శాతం తక్కువగా ఉంటుంది]  
(ఎ) ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ 
(బి) నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 
(సి) కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 
(డి) రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 

8. క్రింది వాటిలో 'బిమ్ స్టెక్' (BIMSTEC) కూటమిలో లేని దేశం ? [సమాచార తేదీ : 2021 జూన్ 6]
BIMSTEC
బిమ్ స్టెక్ 

   

(ఎ) బంగ్లాదేశ్   
(బి) భూటాన్  
(సి) నేపాల్ 
(డి) చైనా  

9. భారతదేశంలో .. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది ? [రోజుకు 4 కోట్ల 12 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి విలువ ఏడాదికి దాదాపు రూ. 7 వేల కోట్లకు సమానం] (సమాచార తేదీ : 2021 జూన్ 4)
(ఎ) 1 
(బి) 2 
(సి) 3  
(డి) 4  

10. ఏ సంవత్సరం నాటికి ఆకలి సమస్యను అంతమొందించాలనేది 'ఐక్యరాజ్య సమితి' (UNO) సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒక భాగం ? [2021 జూన్ 7వ తేదీన మూడో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని "నేటి సురక్షిత ఆహారమే రేపటి ఆరోగ్యం" అనే నినాదంతో నిర్వహించారు] 
(ఎ) 2025 
(బి) 2030 
(సి) 2035 
(డి) 2040              

కీ (KEY) (GK TEST-71 YEAR : 2021)
1) డి    2) బి    3) ఎ    4) సి    5) డి    6) సి    7) ఎ    8) డి    9) డి    10) బి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

10, జూన్ 2021, గురువారం

పి-75 (ఇండియా) ∣ PROJECT-75 (INDIA) DETAILS IN TELUGU

జలాంతర్గామి 


హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో .. 2021 జూన్ 4న భారత రక్షణ మంత్రి 'రాజ్ నాథ్ సింగ్' అధ్యక్షతన సమావేశమైన 'రక్షణ కొనుగోళ్ల మండలి' (DAC) "పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] అనే మెగా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

"పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] ద్వారా అధునాతన పరిజ్ఞానంతో 6 సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మిస్తారు. శత్రువులకు ఆచూకీ దొరకని రీతిలో వీటిని 'స్టెల్త్' పరిజ్ఞానంతో (STEALTH TECHNOLOGY) రూపొందిస్తారు. "పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] కింద నిర్మించే ఆరు సబ్మెరైన్లకు (SIX SUBMARINES) అధునాతన 'ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్' (Air-Independent Propulsion) వ్యవస్థ ఉంటుంది. అందువల్ల అవి ఎక్కువసేపు నీటి అడుగున ఉండగలవు.

'వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' (STRATEGIC PARTNERSHIP MODEL) కింద ఈ జలాంతర్గాములను నిర్మిస్తారు. దేశీయ కంపెనీలు .. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని భారత్ లోనే అధునాతన ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయడం ఈ నమూనా ఉద్దేశ్యం. తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. 'వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' కింద చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ ఇదే ("పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)]). 'భారత్ లో తయారీ' (MAKE IN INDIA) కింద చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ సబ్ మెరైన్ల నిర్మాణం కోసం ప్రభుత్వ రంగంలోని 'మఙ్గావ్ డాక్స్ లిమిటెడ్' (MDL), ప్రైవేటు సంస్థ 'ఎల్ అండ్ టీ' (L&T) లకు టెండర్లు జారీ చేసేందుకు 'డీఏసీ' (DAC) ఆమోదం తెలిపింది.

"పి-75 (ఇండియా)" [PROJECT-75 (INDIA)] విలువ రూ. 43 వేల కోట్లు. ఈ జలాంతర్గాముల్లో అమర్చే ఆయుధ వ్యవస్థలను బట్టి అంతిమంగా ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి 12 ఏళ్లు పడుతుంది.

ప్రస్తుతం మనదేశం వద్ద 15 సంప్రదాయ జలాంతర్గాములు, 2 అణు జలాంతర్గాములు ఉన్నాయి.                  

4, జూన్ 2021, శుక్రవారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-70

1. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి 'జస్టిస్ అరుణ్ మిశ్ర' (JUSTICE ARUN MISHRA) జాతీయ మానవహక్కుల సంఘం (NHRC) కొత్త చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ ? [ఆయనతోపాటు ప్యానెల్ సభ్యులుగా జస్టిస్ ఎం.ఎం.కుమార్, రాజీవ్ జైన్ బాధ్యతలు చేపట్టారు. అయిదేళ్లపాటు లేదా 70 ఏళ్ల వయసు వచ్చేవరకు జస్టిస్ అరుణ్ మిశ్ర ఈ పదవిలో కొనసాగుతారు]
JUSTICE ARUN MISHRA
జస్టిస్ అరుణ్ మిశ్ర 

 
(ఎ) 2021 జూన్ 1 
(బి) 2021 జూన్ 2  
(సి) 2021 జూన్ 3  
(డి) 2021 జూన్ 4 

2. 'కరోనా' మహమ్మారిని తరిమికొట్టడంలో విజయం సాధించే గ్రామాలకు పారితోషికాన్ని అందించేందుకు "కరోనా ఫ్రీ విలేజ్" (CORONA FREE VILLAGE) పేరుతో పోటీని నిర్వహిస్తున్న రాష్ట్రం ? [ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. 50 లక్షలు, ద్వితీయ స్థానం పొందిన గ్రామానికి రూ. 25 లక్షలు, తృతీయ స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. 15 లక్షల నగదు అందజేస్తారు. విజేతను నిర్ణయించడానికి 22 అంశాలు ప్రాతిపదికగా ఉంటాయి] 

(ఎ) మహారాష్ట్ర 
(బి) ఆంధ్రప్రదేశ్  
(సి) కేరళ  
(డి) మధ్యప్రదేశ్ 

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రూ. 8 వేల కోట్లతో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాడేరు, పులివెందులలో ఇప్పటికే భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 14 వైద్య కళాశాలల భవనాలకు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన తేదీ ? [విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమహేంద్రవరం, పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోని వైద్య కళాశాలలకు సీఎం ఈ తేదీన శంకుస్థాపన చేశారు] 

(ఎ) 2021 మే 30  
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 1 
(డి) 2021 జూన్ 2 


4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కొవిడ్' రోగులకు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ (FRONTLINE WORKER) మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం ? [కేంద్ర సాయం పరిధిలోకి రానివారికి ఇది అందుతుంది. కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బందీ దీనికి అర్హులే]   

(ఎ) రూ. 5 లక్షలు 
(బి) రూ. 10 లక్షలు 
(సి) రూ. 15 లక్షలు 
(డి) రూ. 20 లక్షలు 

5. గత కొద్ది రోజులుగా ఏ రాష్ట్రంలో "ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్" (AFRICAN SWINE FEVER) తో భారీ సంఖ్యలో పందులు మృత్యువాత పడుతున్నాయి ? [2 నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచార తేదీ : 2021 జూన్ 2] 

(ఎ) మేఘాలయ   
(బి) మణిపూర్  
(సి) మిజోరం   
(డి) త్రిపుర 

6. 'జాతీయ ఆర్ధిక పరిశోధన మండలి' (NCAER) 2021 మే నెలలో విడుదల చేసిన "భూరికార్డులు, సేవల సూచీ-2021" (LAND RECORD AND SERVICES INDEX (N-LRSI) 2021) ప్రకారం ..  మొదటి అయిదు స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వరుసగా ... ? [ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి]

(ఎ) మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు 
(బి) పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా  
(సి) మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు 
(డి) ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర 


7. "భూరికార్డులు ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉన్నాయి ? రికార్డులు పొందే ప్రక్రియ సులభంగా ఉందా ? రికార్డులు పొందడంలో ప్రజలకు ఎలాంటి సహాయం అందుతోంది ?" ఈ అంశాల ఆధారంగా 'జాతీయ ఆర్ధిక పరిశోధన మండలి' (NCAER) 2021 మే నెలలో విడుదల చేసిన 'సౌలభ్య సూచీ' (EASE OF ACCESS INDEX) లో మొదటి అయిదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా ... ? [ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో, తెలంగాణ 15వ స్థానంలో ఉన్నాయి]   

(ఎ) కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, బిహార్  
(బి) బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ 
(సి) ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ 
(డి) ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బిహార్, ఉత్తర్ ప్రదేశ్  

8. మానసిక ఆందోళనను కారణంగా చూపుతూ 'ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2021' (2021 FRENCH OPEN) నుంచి అర్థంతరంగా వైదొలగిన జపాన్ స్టార్ క్రీడాకారిణి ? [2018 యూఎస్ ఓపెన్ నుంచి కుంగుబాటుతో బాధపటుతున్నట్లు ఈ క్రీడాకారిణి తెలిపింది. 23 ఏళ్ల వయసున్న ఈమె ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న టెన్నిస్ క్రీడాకారిణి]

  

(ఎ) ఆష్లే బార్టీ    
(బి) సెరెనా విలియమ్స్  
(సి) నవోమి ఒసాకా 
(డి) బెర్నార్దా పెరా   

9. 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (TET) ఉత్తీర్ణత ధ్రువపత్రం చెల్లుబాటును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి 'రమేష్ పోఖ్రియాల్' ప్రకటించిన తేదీ ? [ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఏడేళ్లపాటు టెట్ ఉత్తీర్ణత ధ్రువపత్రం చెల్లుబాటులో ఉంటుందని 2011 ఫిబ్రవరి 11న 'జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి' (NCTE) జారీ చేసిన ఆదేశాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది]

(ఎ) 2021 జూన్ 1 
(బి) 2021 జూన్ 2 
(సి) 2021 జూన్ 3  
(డి) 2021 జూన్ 4  

10. 2021 జూన్ 3న 'నీతి ఆయోగ్' (NITI AAYOG) ప్రకటించిన "సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక-2020" (SUSTAINABLE DEVELOPMENT GOALS INDEX-2020) లో ఎన్ని మార్కులతో గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్ లతో కలిసి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది ? [75 మార్కులతో 'కేరళ' తొలిస్థానంలోనూ, 74 మార్కులతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయి. 52 మార్కులతో 'బిహార్' చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో 'చండీగఢ్' 79 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది] 

(ఎ) 73 
(బి) 72 
(సి) 71 
(డి) 70              

కీ (KEY) (GK TEST-70 YEAR : 2021)
1) బి    2) ఎ    3) బి    4) ఎ    5) సి    6) ఎ    7) డి    8) సి    9) సి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

3, జూన్ 2021, గురువారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-69

1. అరుదైన మూడు ఖగోళ అద్భుతాలతో కూడిన "సూపర్ బ్లడ్ మూన్" (SUPER BLOOD MOON) నింగిలో చోటు చేసుకున్న తేదీ ? [చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్ .. ఒకే రోజులో వస్తే దాన్ని 'సూపర్ బ్లడ్ మూన్' (SUPER BLOOD MOON) అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియాలో ఇది పూర్తిగా, ఈశాన్య భారతంలో పాక్షికంగా కనిపించింది]
SUPER BLOOD MOON
సూపర్ బ్లడ్ మూన్

 
(ఎ) 2021 మే 25 
(బి) 2021 మే 26  
(సి) 2021 మే 27  
(డి) 2021 మే 28 

2. 'ఏపీఎస్ఆర్టీసీ' (APSRTC) ఎండీ, ప్రజా రవాణా విభాగం కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ? [రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్ గా ఉన్న ఆయనను 2021 మే 31న ప్రభుత్వం బదిలీ చేసింది]
CH DWARAKA TIRUMALARAO

  

(ఎ) ఆర్.పీ.ఠాకూర్ 
(బి) ఎన్. సంజయ్   
(సి) పీ.వీ.సునీల్ కుమార్  
(డి) సీ.హెచ్.ద్వారకా తిరుమలరావు 

3. ప్రపంచంలోనే తొలిసారిగా 'నానో యూరియా' (NANO UREA) ను 'భారత రైతుల ఎరువుల సహకార సంస్థ' (IFFCO) ప్రవేశపెట్టిన తేదీ ? [దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా .. ద్రవ రూపంలో ఉంటుంది. త్వరలోనే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా సీసా .. కనీసం ఒక బస్తా సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని 'ఇఫ్కో' (IFFCO) వెల్లడించింది]  

(ఎ) 2021 మే 30  
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 1 
(డి) 2021 జూన్ 2 



4. దేశవ్యాప్తంగా 'కొవిడ్' బారినపడి కోలుకుంటున్న వారిలో 'యాంటీబాడీల స్థాయి' (ANTIBODIES) పరీక్షించేందుకు దిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థతో కలిసి 'డీ ఆర్ డీ ఓ' (DRDO) రూపొందించిన పరీక్ష కిట్ "డిప్కోవాన్" (DIPCOVAN) ను మార్కెట్ లోకి విడుదల చేసిన తేదీ ? [ఈ కిట్ కేవలం రూ. 75కే అందుబాటులో ఉంటుందని, మనిషి శరీరంలో యాంటీబాడీలు ఏమేరకు ఉన్నాయో కచ్చితమైన ఫలితాన్నిస్తుందని 'డీ ఆర్ డీ ఓ' (DRDO) చైర్మన్ 'డాక్టర్ జి.సతీష్ రెడ్డి' వెల్లడించారు]     

(ఎ) 2021 మే 30  
(బి) 2021 మే 31 
(సి) 2021 జూన్ 1 
(డి) 2021 జూన్ 2 

5. భారత్ లో మొదట వెలుగు చూసిన కరోనా రకానికి 2021 మే 31న 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) ఖరారు చేసిన పేరు ? [సాంకేతికంగా బి.1.617 గా పిలిచే ఈ వైరస్ రకం .. అధికారికంగా 53 దేశాల్లో కనిపించిందని 'డబ్ల్యుహెచ్ఓ' తెలిపింది] 

(ఎ) ఆల్ఫా   
(బి) బీటా  
(సి) గామా  
(డి) డెల్టా వేరియంట్ 

6. ఏ సంవత్సరం నుంచి చైనాలో ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఉంది ? [ఇకనుంచి ఒక్కో జంట ముగ్గురేసి పిల్లలను కనేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అనుమతినిచ్చింది]

(ఎ) 2015 
(బి) 2016 
(సి) 2017 
(డి) 2018 



7. హైదరాబాద్ లోని కేంద్ర పరిశోధన సంస్థ 'సీసీఎంబీ' (CCMB) నూతన డైరెక్టర్ గా 2021 జూన్ 1న బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ ఇమ్యునాలజిస్ట్ ?   

(ఎ) డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి  
(బి) డాక్టర్ రాకేశ్ మిశ్రా 
(సి) ఆలాపన్ బందోపాధ్యాయ్  
(డి) డాక్టర్ గగన్ దీప్ కాంగ్ 

8. కరోనా సంక్షోభం కారణంగా గత ఆర్ధిక సంవత్సరం (2020-21) లో నమోదైన భారత 'జీడీపీ' (GDP) వృద్ధి రేటు ? [అధిక పన్ను వసూళ్ల కారణంగా ద్రవ్యలోటు 2020-21లో 'జీడీపీ' (GDP) లో 9.3 శాతానికి పరిమితమై రూ. 18,21,461 కోట్లుగా నమోదైంది]    

(ఎ) -5.3%  
(బి) -6.3%  
(సి) -7.3% 
(డి) -8.3%  

9. 2021 జూన్ 1 నుంచి మూడు నెలలపాటు 'కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు' (CBDT) చైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నది ?

(ఎ) జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర 
(బి) పీసీ మోదీ  
(సి) పీసీ పంత్   
(డి) హరికృష్ణ ద్వివేది  



10. 2021-22 సంవత్సరానికి 'భారతీయ పరిశ్రమల సమాఖ్య' (CII) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనది ?  

(ఎ) ఉదయ్ కోటక్ 
(బి) పవన్ ముంజాల్  
(సి) టీవీ నరేంద్రన్  
(డి) సంజీవ్ బజాజ్              

కీ (KEY) (GK TEST-69 YEAR : 2021)
1) బి    2) డి    3) బి    4) సి    5) డి    6) బి    7) ఎ    8) సి    9) ఎ    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

31, మే 2021, సోమవారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-68

1. 'అమెజాన్' (AMAZON) సంస్థ 'సీ ఈ ఓ' (CEO) బాధ్యతల నుంచి "జెఫ్ బెజోస్" (JEFF BEZOS) వైదొలిగే తేదీ ? [ఈ తేదీ నుంచి 'అమెజాన్' సంస్థ కొత్త 'సీ ఈ ఓ' (CEO) గా 'ఆండీ జాస్సీ' (ANDY JASSY) బాధ్యతలు చేపట్టనున్నారు. సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇదే తేదీన 'అమెజాన్' కార్పొరేట్ సంస్థగా మారింది]
JEFF BEZOS
జెఫ్ బెజోస్

  
(ఎ) 2021 జూలై 3 
(బి) 2021 జూలై 4  
(సి) 2021 జూలై 5  
(డి) 2021 జూలై 6 

2. ఒక్క డోసులో ఇచ్చే 'కరోనా' టీకా (SINGLE DOSE 'CORONA' VACCINE) ? [ఇది అందుబాటులోకి వస్తే భారతదేశంలో ఇచ్చే తొలి 'సింగిల్ డోసు టీకా' ఇదే అవుతుంది] 

(ఎ) కొవావ్యాక్స్  
(బి) స్పుత్నిక్ వి   
(సి) స్పుత్నిక్ లైట్  
(డి) కొవాగ్జిన్  

3. మహిళా టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు (24) గెలిచి, 'ఆల్ టైమ్ గ్రేట్' (ALL TIME GREAT IN WOMEN'S TENNIS HISTORY) గా భావించబడుతున్న క్రీడాకారిణి ? 

(ఎ) మార్గరెట్ కోర్ట్   
(బి) మార్టీనా నవ్రతిలోవా 
(సి) సెరెనా విలియమ్స్ 
(డి) స్టెఫీగ్రాఫ్  



4. నేపాల్ కు చెందిన 'టెన్సింగ్ నార్కే', న్యూజీలాండ్ దేశస్థుడు 'ఎడ్మండ్ హిల్లరీ' సంయుక్తంగా 'ఎవరెస్టు' (MOUNT EVEREST) శిఖరాన్ని అధిరోహించిన తేదీ ? [అందుకే ఈ తేదీని 'అంతర్జాతీయ ఎవరెస్టు దినోత్సవం' గా ప్రకటించారు]
EDMUND HILLARY AND TENZING NORGAY
ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే 

     

(ఎ) 1953 మే 28 
(బి) 1953 మే 29 
(సి) 1953 మే 30 
(డి) 1953 మే 31 

5. 'కరోనా' నియంత్రణ కోసం 'భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (DRDO) రూపొందించిన "2-డీజీ" (2-DG) మందు ఒక్కో పొట్లం ధరను ఎంతగా నిర్ణయించారు ? ['ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్' , డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ సంయుక్తంగా ఈ మందును ఉత్పత్తి చేస్తున్నాయి. పొడి రూపంలో వచ్చే ఈ మందును నీళ్లలో కలుపుకొని తాగడం ద్వారా వైరస్ ను నియంత్రించవచ్చని 'డీ ఆర్ డీ ఓ' (DRDO) ప్రకటించింది. మధ్యస్థాయి నుంచి తీవ్రమైన కరోనా లక్షణాలున్న రోగుల చికిత్స కోసం దీన్ని విక్రయించనున్నారు] 

(ఎ) రూ. 960   
(బి) రూ. 970  
(సి) రూ. 980  
(డి) రూ. 990 

6. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చి .. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో నివశిస్తున్న ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని 'కేంద్ర హోంశాఖ' నోటిఫికేషన్ (NOTIFICATION FOR INDIAN CITIZENSHIP APPLICATION) జారీ చేసిన తేదీ ? [ముస్లిమేతర మైనార్టీలుగా 'హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్ లు, పార్శీలు, క్రైస్తవులు' తదితరులను పేర్కొంది. పౌరసత్వ చట్టం-1955 కింద, 2009లో చేసిన చట్టంలోని నిబంధనల కింద ఈ నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది]  

(ఎ) 2021 మే 26 
(బి) 2021 మే 27 
(సి) 2021 మే 28 
(డి) 2021 మే 29 



7. 'కరోనా' కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినవారు, ఉన్న ఒక తల్లినో తండ్రినో పోగొట్టుకున్నవారు, చట్టపరమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన వారందరికీ "పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్" (PM CARES FOR CHILDREN) పథకం ద్వారా ప్రతి చిన్నారి 18 ఏళ్లకు చేరుకునే సమయానికి వారి పేరున రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మూలనిధిగా ఉపయోగిస్తామని ప్రధాని 'నరేంద్ర మోదీ' 2021 మే 29న ప్రకటించారు. అటువంటి పిల్లలు ఏ వయసుకు వచ్చిన తర్వాత రూ. 10 లక్షల నిధిని వ్యక్తిగత, వృత్తిగత అవసరాలకోసం తీసుకోవడానికి వీలు కల్పిస్తారు ?    

(ఎ) 18 సంవత్సరాలు 
(బి) 21 సంవత్సరాలు 
(సి) 23 సంవత్సరాలు 
(డి) 25 సంవత్సరాలు 

8. ఉద్యోగి మృతి చెందితే వర్తింపజేసే 'కార్మిక రాజ్య బీమా సంస్థ' (ESIC) పింఛను పథకం ప్రయోజనాన్ని 'కొవిడ్' తో మృతి చెందినా బాధిత కుటుంబాలకూ వర్తింపజేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరణించిన వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు దివంగత ఉద్యోగి రోజువారీ వేతనంలో సగటున ఎంత శాతానికి సమానమైన మొత్తాన్ని పింఛను కింద అందించనున్నారు ?   

(ఎ) 60%  
(బి) 70%  
(సి) 80% 
(డి) 90%  

9. ఎన్ఠీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఎన్ఠీఆర్ సాహిత్య పురస్కారం' ను పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య, సంచాలకుడు ? [ఈ పురస్కారాన్ని విద్యా శాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్' 2021 మే 29న 'ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం' (ANU) లో విజేతకు అందజేశారు]

(ఎ) బుడితి రాజశేఖర్ 
(బి) వాడ్రేపు చినవీరభద్రుడు 
(సి) ఆచార్య హేమచంద్రా రెడ్డి  
(డి) ధూళిపాళ్ల రామకృష్ణ  



10. 'కొవిడ్' నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎన్ని సాధికార కమిటీలను (EMPOWERMENT COMMITTEES FOR COVID CONTROL MEASURES) ఏర్పాటు చేసింది ? [ఒక్కో కమిటీలో కనిష్ఠంగా 9, గరిష్ఠంగా 12 మంది విభిన్న శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను సభ్యులుగా నియమించారు. (సమాచార తేదీ : 2021 మే 29)]  

(ఎ) 5 
(బి) 10 
(సి) 15 
(డి) 20              

కీ (KEY) (GK TEST-68 YEAR : 2021)
1) సి    2) సి    3) ఎ    4) బి    5) డి    6) సి    7) సి    8) డి    9) బి    10) బి  

UPDATES (నవీకరణలు) :

  • 2021 జూన్ 7 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్' 2021 మే 27న వెల్లడించారు.
  • 'కరోనా' ఉద్ధృతి, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా 'సీఎం' వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com