ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, అక్టోబర్ 2020, మంగళవారం

SVAMITVA

స్వామిత్వ యోజన (యాజమాన్య ప్రణాళిక)

SVAMITVA (Survey of Village And Mapping with Improvised Technology in Village Areas)


పథకం ప్రారంభం :

  • 2020 అక్టోబర్ 11న 'గ్రామాల్లోని ఇళ్ల స్థలాలకు యాజమాన్య హక్కులను ఖరారు చేస్తూ రూపొందించిన కార్డులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన "స్వామిత్వ" (SVAMITVA ⇒ సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్)' కార్యక్రమాన్ని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' వీడియో సమావేశంలో ప్రారంభించారు.

పథకం - కొన్ని విశేషతలు :

  1. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి కచ్చితమైన ఆస్తి హక్కు పత్రాలను సృష్టించి లబ్ధిదారులకు అందించేందుకు ఉద్దేశించిన పథకమే "స్వామిత్వ" (SVAMITVA).
  2. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం.
  3. వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6.2 లక్షల (6,20,000) గ్రామాల్లోని ఆస్తులను సర్వే చేసి ఆస్తి హక్కు కార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  4. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 2020 ఏప్రిల్ 24న ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' 'స్వామిత్వ యోజన' (యాజమాన్య ప్రణాళిక) ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
  5. ఆరు నెలల్లో ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 1.32 లక్షల మంది (1,32,000) కి సంబంధించిన ఆస్తి హక్కు పత్రాలను తయారు చేసారు.
  6. డ్రోన్ సర్వే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామాల్లోని ఇళ్లను సర్వే చేసి ప్రజలకు రికార్డ్ ఆఫ్ రైట్స్ కార్డులు (Record of Rights Cards) మంజూరు చేస్తారు.


  7. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీ (NODAL AGENCY) గా వ్యవహరిస్తుంది.
  8. రాష్ట్రాల్లో రెవిన్యూ, ల్యాండ్ రికార్డ్ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖతో కలిపి ఈ రెండు విభాగాలు సర్వే పూర్తిచేస్తాయి.
  9. సర్వే ఆఫ్ ఇండియా (SURVEY OF INDIA) సంస్థ ఈ పథకం అమలులో సాంకేతిక భాగస్వామి (Technical Partner) గా వ్యవహరించనుంది.
  10. 2024 మార్చ్ నాటికి 6.2 లక్షల గ్రామాల ఆస్తులను సర్వే చేస్తారు.
  11. గ్రామాల ప్రణాళికను క్రమబద్ధీకరిస్తారు. పన్ను వసూళ్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి హక్కులపై స్పష్టతనిస్తారు.
  12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,950 గ్రామాలలో (2021-22 ⇒ 4,000 ; 2022-23 ⇒ 8,400 ; 2023-24 ⇒ 5,550) మరియు తెలంగాణ రాష్ట్రంలో 11,234 గ్రామాలలో (2023-24 ⇒ 11,234) 'స్వామిత్వ' (SVAMITVA) పథకాన్ని అమలు చేయనున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి