ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, అక్టోబర్ 2020, మంగళవారం

RUDRAM-INDIA'S FIRST INDIGENOUS ANTI-RADIATION MISSILE

 రుద్రం (యాంటీ రేడియేషన్ క్షిపణి)

RUDRAM (ANTI-RADIATION MISSILE)


  • 2020 అక్టోబర్ 9న ఒడిశాలోని బాలేశ్వర్ లో 'సుఖోయ్-30 ఎం కె ఐ' యుద్ధ విమానం నుంచి ఉదయం 10.30 గంటలకు "రుద్రం-1" అనే యాంటీ రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.

"రుద్రం-1" గురించి ... కొన్ని విశేషాలు :

  1. రుద్రం-1 అనే ఈ అస్త్రం .. శత్రు దేశపు రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ లను ధ్వంసం చేయగలదు.
  2. రుద్రం-1ను 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) రూపొందించింది.
  3. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి ఇదే.
  4. ధ్వని కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళుతుంది.
  5. 250 కిలోమీటర్ల దూరం పయనించగలదు.
  6. తాజా పరీక్షలో ఒడిశా తీరానికి చేరువలోని వీలర్ దీవిలో ఉన్న రేడియోధార్మిక లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.


  7. గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న యాంటీ రేడియోధార్మిక క్షిపణులను రూపొందించే సత్తా భారత్ కు ఉందని ఈ ప్రయోగం నిరూపించింది.
  8. రుద్రం-1 లో ఐఎన్ఎస్-జీపీఎస్ (INS-GPS) మార్గనిర్దేశక వ్యవస్థ ఉంది.
  9. తుది దశలో .. శత్రు లక్ష్యంపై విరుచుకుపడేందుకు 'ప్యాసివ్ హోమింగ్ హెడ్' (Passive-homing head) ఉంది.
  10. రాడార్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థల నుంచి వెలువడే రేడియేషన్ సంకేతాలను పట్టుకుని లక్ష్యాన్ని ఛేదిస్తుంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి