ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, అక్టోబర్ 2020, ఆదివారం

DISTRIBUTION OF RoFR PATTAS

 అటవీ హక్కు పత్రాల పంపిణీ 

(Distribution of Recognition of Forest Rights Pattas)


  • అడవి తల్లిని నమ్ముకుని అరకొర సంపాదనతో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుక ... పట్టా (RoFR ⇒ Recognition of Forest Rights).

కార్యక్రమం ప్రారంభం :

  • 2020 అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో, రాష్ట్ర జనాభాలో 6% ఉన్న గిరిజనులకు అటవీ భూములపై హక్కు కల్పించే (RoFR ⇒ Recognition of Forest Rights) పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్ (Virtual) విధానంలో ప్రారంభించారు.

కార్యక్రమం లక్ష్యం :

  • గిరిపుత్రులను సిరిపుత్రులుగా మార్చాలి అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'అటవీ హక్కు పత్రాల పంపిణీ' కార్యక్రమాన్ని చేపట్టింది.


కార్యక్రమం ప్రయోజనాలు :

  1. దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు సుమారు 3.12 లక్షల ఎకరాల అటవీ భూములకు హక్కు పత్రాలు (RoFR) పంపిణీ చేస్తారు. ఎక్కడా భూ వివాదాలకు తావులేకుండా డిజిటైజేషన్ ద్వారా సర్వే నిర్వహించి సరిహద్దులు, గట్లు ఏర్పాటు చేస్తారు.
  2. పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాల భూమిని కేటాయిస్తారు. భూమి కేటాయింపు పత్రాలు ఆ కుటుంబంలోని స్త్రీ పేరున జారీ చేస్తారు.
  3. ప్రభుత్వం ఇచ్చే పట్టాలు (RoFR) పొందిన గిరిజన రైతుల భూముల అభివృద్ధి, ఉద్యానవనాలు, తోటల పెంపకం, నీటి సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తారు.
  4. అర్హత కలిగిన ప్రతి గిరిజన రైతు కుటుంబానికి "వైఎస్సార్ రైతు భరోసా" కింద ఏటా రూ. 11,500 (ఖరీఫ్ పంట కాలంలో రూ. 7,500 మరియు రబీ పంట కాలంలో రూ. 4,000) పెట్టుబడి సాయం అందజేస్తారు.
  5. మొత్తమ్మీద గిరిజనులకు అటవీ హక్కు పత్రాల పంపిణీ చేపట్టడం ఇది నాలుగోసారి.
  6. 'అక్టోబర్' మాసాన్ని హక్కు పత్రాల పంపిణీ నెలగా ప్రభుత్వం ప్రకటించింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి