ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, సెప్టెంబర్ 2020, బుధవారం

YSR JALAKALA

వైఎస్సార్ జలకళ (YSR JALAKALA)


  • రైతులు బోరు వెయ్యడానికి పెట్టే ఖర్చులతో అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా, వారి పొలాలకు జలసిరులను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుక ... "వైఎస్సార్ జలకళ" పథకం.

పథకం ప్రారంభం :

  • 2020 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) పథకాన్ని ప్రారంభించారు.



పథకం - విశేషాలు :

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 4 ఏళ్లలో సుమారు రూ. 2,340 కోట్ల వ్యయంతో చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో దాదాపు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించనున్నారు. బోర్లు తవ్వడమే కాకుండా ... వాటికి కేసింగ్ పైపులు కూడా ఏర్పాటు చేయిస్తారు. వాటికి ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తారు. మోటార్ల బిగింపునకు అదనంగా దాదాపు రూ. 1,600 కోట్లు వ్యయమవుతుంది. 
  2. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ అసెంబ్లీ నియోజకవర్గ అవసరాలకు గాను ఒక బోరు రిగ్గు ఏర్పాటు చేస్తారు. 144 గ్రామీణ, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాల్లో 163 బోరు యంత్రాలు ప్రారంభిస్తారు. 
  3. రైతులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ (www.ysrjalakala.ap.gov.in).ను ఏర్పాటు చేస్తారు.
  4. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోలేనివారు వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాలలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
  5. హైడ్రో జియోలాజికల్ / జియోఫిజికల్ సర్వే ద్వారా శాస్త్రీయ పద్ధతిలో బోరు బావి తవ్వే స్పాట్ ను ఎంపిక చేస్తారు.
  6. సర్వే ఖర్చు, బోరు వేసే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
  7. "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి రానున్నాయి.
  8. అవసరమైన ప్రతి రైతుకు ఉచితంగా ఒక బోరు వేస్తారు. ఒకవేళ ఆ బోరు ఫెయిలైతే మరొక బోరు వేస్తారు..

టోల్ ఫ్రీ :

  • "వైఎస్సార్ జలకళ" (YSR JALAKALA) పథకానికి సంబంధించిన సలహాలు, ఫిర్యాదుల కొరకు 1902 టోల్ ఫ్రీ నంబర్ లో సంప్రదించవలెను.   




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి