వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం (YSR NETHANNA NESTHAM)
పథకం ప్రారంభం :
- 2019 డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో "వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం" (YSR NETHANNA NESTHAM) పథకాన్ని ప్రారంభించారు.
పథకం ఉద్దేశ్యం :
- 'చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి ... మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే' ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
పథకం ద్వారా కలిగే ప్రయోజనం :
- మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 24,000 ఆర్ధిక సహాయం లభిస్తుంది.
- దాదాపు 85 వేల చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది కలుగుతుంది.
టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) :
- 'వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం' (YSR NETHANNA NESTHAM) పథకానికి సంబంధించి .. 'సలహాలు, సూచనలు, ఫిర్యాదులు' కొరకు టోల్ ఫ్రీ నంబర్ "1902" లో సంప్రదించవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి