జగనన్న విద్యా దీవెన (JAGANANNA VIDYA DEEVENA)
- పాలిటెక్నిక్, ఐటిఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విదార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "జగనన్న విద్యా దీవెన" పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (FEE REIMBURSEMENT) ను అందిస్తుంది.
పథకం లక్ష్యం :
- పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' (YSR CONGRESS PARTY) ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ... ఈ "జగనన్న విద్యా దీవెన" (JAGANANNA VIDYA DEEVENA) పథకం.
పథకం ప్రారంభం :
- 2020 ఏప్రిల్ 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 'జగనన్న విద్యా దీవెన" పథకాన్ని ప్రారంభించారు.
పథకానికి అర్హులు :
- విద్యార్థుల కుటుంబ సభ్యుల మొత్తం వార్షికాదాయం రూ. 2,50,000 లోపు ఉండాలి.
- విద్యార్థుల కుటుంబ సభ్యులు అందరికీ కలిపి మొత్తమ్మీద 'పదెకరాల్లోపు మాగాణి లేదా 25 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు' ఉండాలి.
- పారిశుధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని విద్యార్థులు.
- విద్యార్థుల కుటుంబ సభ్యులకు ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్నా ఫర్వాలేదు కానీ కారు ఉండకూడదు.
- విద్యార్థుల కుటుంబ సభ్యులకు పట్టణాల్లో స్థిరాస్తి ఉంటే, అది 1500 చదరపు అడుగులలోపు ఉండాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి