ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

MANA BADI 'NAADU-NEDU'

 మన బడి "నాడు - నేడు" (MANA BADI "NAADU - NEDU")


పథకం ఉద్దేశ్యం :

  • '45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 3287 ప్రభుత్వ హాస్టళ్ల రూపు రేఖలను మూడు దశలలో సమూలంగా మార్చడం' ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాలలో కనీసంగా ఏర్పాటు చేసే సదుపాయాలు :

  • విద్యార్థులకు రక్షిత త్రాగు నీరు
  • మరుగు దొడ్లు
  • ఫర్నిచర్, ప్రహరీ గోడలు
  • తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మత్తులు, ఫినిషింగ్
  • బ్లాక్ బోర్డ్స్
  • ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు


పథకం ద్వారా కలిగే అదనపు ప్రయోజనాలు :

  • ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రతి పాఠశాలలో 'ఇంగ్లీష్ ల్యాబ్' (ENGLISH LAB)లను ఏర్పాటు చేస్తారు.
  • పాఠశాలలు తెరిచే నాటికి 3 జతల యూనిఫామ్ లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, జత బూట్లు, సాక్స్, బెల్ట్, బ్యాగ్ లతో కూడిన కిట్ ను విద్యార్థులకు అందిస్తారు.
  • పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచడంతో పాటు టీచర్లకు అవసరమైన శిక్షణ, విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తారు.

బడ్జెట్ :

  • ఈ పథకం అమలుకు రూ. 14 వేల కోట్లు కేటాయించారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి