ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, మే 2020, మంగళవారం

MANA PAALANA - MEE SOOCHANA

మన పాలన - మీ సూచన

(MANA PAALANA - MEE SOOCHANA)


  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా 'ఏడాదిలో ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు' పై 2020 మే 25 నుంచి 2020 మే 29 వరకు "మన పాలన - మీ సూచన" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి విజయకుమార్ తెలిపారు.
  • ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్లాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
  • ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై నేరుగా లబ్దిదారులతోపాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • ప్రతీరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు సమీక్ష ఉంటుంది.
  • అనంతరం ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుని వాటిని క్రోడీకరించి లక్ష్యాలు రూపొందిస్తారు.

'మన పాలన - మీ సూచన' కార్యక్రమ వివరాలు :


తేదీకార్యక్రమం
2020 మే 25పరిపాలనా సంస్కరణలు, సంక్షేమం
2020 మే 26వ్యవసాయం, అనుబంధ రంగాలు
2020 మే 27విద్యారంగ సంస్కరణలు, పథకాలు
2020 మే 28పరిశ్రమలు, పెట్టుబడుల రంగం
2020 మే 29ఆరోగ్య రంగం, సంస్కరణలు, ఆరోగ్యశ్రీ




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి