ఆత్మ నిర్భర్ భారత్ - రెండో విడత
(ATMANIRBHAR BHARAT - 2ND TRANCHE)
- 'కరోనా' (CORONA) ను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం మన లక్ష్యం కావాలని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 మే 12 న "రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ" ని ప్రకటించారు. దీనిలో భాగంగా భారత ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2020 మే 14 న "ఆత్మ నిర్భర్ భారత్" - రెండో విడత (రూ. 3.16 లక్షల కోట్లు) ను ప్రకటించారు.
- ఆత్మ నిర్భర్ భారత్ పథకం రెండో విడతలో భాగంగా "వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని" దృష్టిలో పెట్టుకుని రూ. 3.16 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేయనున్నారు.
'ఆత్మ నిర్భర్ భారత్' - రెండో విడతలో మొత్తం 9 అంశాలు ఉన్నాయి :
| వ.సం | వివిధ రంగాల వివరాలు | అంశాలు |
| 1 | వలస కార్మికుల కోసం | 3 |
| 2 | ముద్రా-శిశు రుణాల కోసం | 1 |
| 3 | వీధి వ్యాపారుల కోసం | 1 |
| 4 | గృహ నిర్మాణం కోసం | 1 |
| 5 | ఉపాధి కల్పన కోసం | 1 |
| 6 | చిన్న, సన్నకారు రైతుల కోసం | 2 |
1. వలస కార్మికుల కోసం
- ప్రస్తుత కష్ట కాలంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను గమనించి వారికి తక్షణ ప్రయోజనం కలిగించే చర్యలను కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించారు.
- ప్రస్తుతం సొంతూళ్లకు నడిచిపోతున్న వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ వండిన భోజనం పెట్టాలని సూచించారు.
- రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF ⇒ The State Disaster Response Fund) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ. 11 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. ఆ నిధులను ఉపయోగించుకొని కార్మికులకు అన్నం పెట్టొచ్చని పేర్కొన్నారు.
(a) సొంతూర్లలో ఉపాధి హామీ :
- వలస కూలీలకు ఊళ్లలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు.
- రానున్న వర్షాకాలంలో ఈ పథకం కింద 'మొక్కలు, ఉద్యాన వనాల పెంపకం, పశుపాకల నిర్మాణం' లాంటి పనులు చేపడతారు.
(b) కార్డులు లేకున్నా ఉచిత రేషన్ :
- దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 8 కోట్ల మంది వలస కార్మికులకు వచ్చే రెండు నెలలపాటు ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం / గోధుమలు, రేషన్ కార్డుకు ఒక కేజీ చొప్పున పప్పు దినుసులు పూర్తి ఉచితంగా అందిస్తారు.
- ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఖర్చు పెట్టనుంది.
- కూలీలను గుర్తించి అమలు చేసే బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే.
- రేషన్ కార్డులు లేకపోయినా వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.
(c) ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు :
- రేషన్ కార్డులు లేని కారణంగా తిండి గింజలు అందుకోలేని దుస్థితిని పూర్తిగా మార్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- వచ్చే ఆగస్ట్ కల్లా "ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు" విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీనివల్ల దేశ వ్యాప్తంగా 67 కోట్ల మంది (83%) ప్రయోజనం పొందుతారు.
- రేషన్ కార్డుల్లోని సభ్యుల్లో కొంతమంది సొంత ఊళ్లలో, మరికొందరు వేరే ఊర్లలో ఉంటే ... ఆధార్ సంఖ్య ఆధారంగా ఎక్కడున్నవారు అక్కడ రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తారు.
- 2021 మార్చికల్లా దీన్ని నూరు శాతం అమల్లోకి తెస్తారు. అప్పటికల్లా అన్ని రాష్ట్రాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకోవాలి.
2. ముద్రా-శిశు రుణాల కోసం
- చిరు వ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి వారు తీసుకున్న ముద్రా-శిశు రుణాలపై వచ్చే 12 నెలలపాటు 2% వడ్డీ రాయితీ కల్పిస్తారు.
- దీనివల్ల లబ్ధిదారులకు రూ. 1,500 కోట్ల ప్రయోజనం కలుగుతుంది.
3. వీధి వ్యాపారుల కోసం
- దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ. 10 వేల చొప్పున రూ. 5,000 కోట్ల మేర రుణాలు ఇస్తారు.
- డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వారికి భవిష్యత్తులో రుణ పరిమితి పెరుగుతుంది.
4. గృహ నిర్మాణం కోసం
- వలస కార్మికులు, పట్టణ పేదలకు అందుబాటు అద్దెల్లో ఇళ్లను అందించేందుకు "ప్రధాన మంత్రి ఆవాస్ యోజన" (PMAY) కింద గృహ సముదాయాలను నిర్మించే పథకాన్ని అమలు చేస్తారు.
- ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని నిర్మిస్తారు.
- ప్రైవేటు సంస్థలు, స్థిరాస్థి వ్యాపారులు తమ సొంత స్థలాల్లో ప్రభుత్వ రాయితీలు ఉపయోగించుకుని ఇళ్లను నిర్మించి పేదలకు అద్దెలకు ఇవ్వొచ్చు.
- ఇందుకు సంబంధించి 'కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ' త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తుంది.
- ఇందులో ప్రభుత్వపరంగా పెట్టుబడి ఏమీ ఉండదు. ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తుంది.
5. ఉపాధి కల్పన కోసం
"కంపా" (CAMPA) నిధులతో గిరిజనులకు ఉపాధి :
6. చిన్న, సన్నకారు రైతుల కోసం
(a) రైతులకు అత్యవసర మూలధనం :
- చిన్న, సన్నకారు రైతులకు 'నాబార్డు' (NABARD) ద్వారా రూ. 30 వేల కోట్ల అత్యవసర మూలధన నిధి సమకూరుస్తారు.
- నాబార్డు ఇప్పటికే సమకూర్చిన రూ. 90 వేల కోట్లకు ఇది అదనం.
- ఈ మొత్తం ద్వారా రైతులకు గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందజేస్తారు.
- రబీలో 3 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది.
(b) మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు :
- 2.5 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పశుపాలకులకు 'కిసాన్ క్రెడిట్ కార్డులు' అందించి వడ్డీ రాయితీతో రూ. 2 లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తారు.
- గరిష్ఠంగా రూ. 3 లక్షల రుణం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది.
*********************************************************************************
కార్మికులందరికీ కనీస వేతనం :
- ఇప్పుడున్న 40 కార్మిక చట్టాలను ఒక్కటిగా చేసి "కార్మిక స్మృతి" (LABOUR CODE) రూపంలో తీసుకొస్తున్నందువల్ల ప్రతి కార్మికుడికీ 'కనీస వేతనం' అందుతుందని ఆర్ధిక మంత్రి తెలిపారు.
- ఇప్పటివరకు 30% శాతం మంది మాత్రమే కనీస వేతన చట్ట పరిధిలో ఉండగా, ఇకపై 100 శాతం మందికి కనీస వేతనం అందుతుంది.
- కనీస వేతనం విషయంలో ఉన్న ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి "జాతీయ జీవన ప్రమాణ వేతనం" (NATIONAL FLOOR WAGE) విధానం అమల్లోకి రానుంది.
- 10 మంది ఉద్యోగులున్న సంస్థలకూ 'ఈ ఎస్ ఐ' (ESI ⇒ Employees' State Insurance) సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
- ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న శాశ్వత ఉద్యోగికి కూడా 'గ్రాట్యుటీ' (GRATUITY) సౌకర్యం లభిస్తుంది.
మధ్య తరగతికి రాయితీ రుణం పథకం పొడిగింపు :
- ఇళ్ల కొనుగోలు నిమిత్తం రూ. 6 లక్షలు - రూ. 18 లక్షల వార్షిక ఆదాయం ఉన్న దిగువ మధ్య తరగతి వర్గాలకు 2017 మే నుంచి అమలు చేస్తున్న "రుణ అనుసంధాన రాయితీ పథకం" (CLSS ⇒ Credit Linked Subsidy Scheme) ను 2021 మార్చ్ వరకు పొడిగించారు.
- ఇంటి కోసం తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీలో 6.5 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. ఇందువల్ల 'ఈ ఎం ఐ' (EMI ⇒ Equated Monthly Installment) ల భారం తగ్గుతుంది.
- ఈ పథకం గత మార్చ్ 31తో ముగియగా, దీన్ని వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు పొడిగించారు.
- దీనివల్ల గృహ నిర్మాణరంగంలోకి రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం తెలిపింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి