ఉన్నత స్థాయి కమిటీ (చైర్మన్ : నీరబ్ కుమార్ ప్రసాద్)
(HIGH POWER COMMITTEE) (Chairman : Neerab Kumar Prasad)
- విశాఖపట్నంలోని "ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" పరిశ్రమ నుంచి 'స్టైరీన్' గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "ఉన్నత స్థాయి కమిటీ" (HIGH POWER COMMITTEE) ని 'జీవో ఆర్ టి నంబర్ 803' ద్వారా 2020 మే 8 న నియమించింది.
- నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించవలసిన అంశాలు :
- గ్యాస్ లీకేజీ కి కారణాలేంటి ? కంపెనీ అన్ని రకాల నిర్వహణ పద్ధతులు పాటించిందా ... లేదా ? గ్రామాలపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందా ?
- లీక్ ఉదంతానికి 'ఎల్జీ పాలిమర్స్' నిర్లక్ష్యం కారణమని తేలితే ఆ సంస్థపై చేపట్టాల్సిన చర్యలు.
- భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పరిశ్రమలు చేపట్టాల్సిన చర్యలు, 'సేఫ్టీ ఆడిట్' (SAFETY AUDIT) లపై సిఫారసులు.
- ఈ అంశాలపై సమగ్ర అధ్యయనానికి అవసరమైతే ... జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు, సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.
ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు :
- నీరబ్ కుమార్ ప్రసాద్ - చైర్మన్ - రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- ఆర్.కరికాల్ వలెవన్ - సభ్యుడు - పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- వినయ్ చంద్ - సభ్యుడు - విశాఖపట్నం జిల్లా కలెక్టర్
- ఆర్.కె.మీనా - సభ్యుడు - విశాఖపట్నం పోలీస్ కమీషనర్
- వివేక్ యాదవ్ - మెంబర్ కన్వీనర్ - రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి