ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, మార్చి 2021, గురువారం

ONE DISTRICT ONE FOCUS PRODUCE-GOVT. OF INDIA PROGRAMME

ఒక జిల్లా - ఒక ఉత్పత్తి : భారత ప్రభుత్వ కార్యక్రమం
(ONE DISTRICT ONE FOCUS PRODUCE : GOVT. OF INDIA PROGRAMME)


  • దేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో "ఒక జిల్లా - ఒక ఉత్పత్తి" పథకం పేరుతో అన్ని రాష్ట్రాల్లో కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
  • ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తోంది.
  • దేశవ్యాప్తంగా పంటల సాగును వర్గీకరించి డిమాండ్-సరఫరాల మధ్య సమతుల్యం పాటించాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఒక పంట సాగుపై దృష్టి సారించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా దేశంలోని 728 జిల్లాలను విభజించింది.
  • వ్యవసాయం, ఉద్యానం, పశుసంవర్ధకం, కోళ్ల పరిశ్రమ, పాలు, చేపలు, సముద్ర ఉత్పత్తుల వారీగా వీటిని వర్గీకరించింది.
  • అత్యధికంగా పండ్ల సాగుకు 226 జిల్లాలను, కూరగాయల పంటలకు 107, మసాలా దినుసుల సాగుకు 105 జిల్లాలను ఎంపిక చేసింది.
  • వరి సాగు కోసం 40 జిల్లాలను ఎంపిక చేసింది. ధాన్యాగారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క జిల్లానూ వరి సాగుకు కేటాయించలేదు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెండేసి జిల్లాలను మిర్చి, పసుపు, మామిడి పంటల కోసం ఎంపిక చేశారు. మిగతా జిల్లాలన్నింటిలోనూ ఒక్కో పంటకే ప్రాధాన్యం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఏ జిల్లాలో ఏ పంట ?'
వరుస సంఖ్యజిల్లాపంట
1అనంతపురంవేరుశెనగ
2చిత్తూరుటమాటా
3తూర్పు గోదావరికొబ్బరి
4గుంటూరుమిర్చి, పసుపు
5కడపఅరటి
6కృష్ణామామిడి
7కర్నూలుఉల్లి
8నెల్లూరునిమ్మ
9ప్రకాశంపసుపు, మిర్చి
10శ్రీకాకుళంజీడిపప్పు
11విశాఖపట్నంచెరకు
12విజయనగరంమామిడి
13పశ్చిమ గోదావరిఆక్వా



  • రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఈ జాబితాను ఖరారు చేసినట్లు 'కేంద్ర వ్యవసాయ శాఖ' 2021 ఫిబ్రవరి 27న పేర్కొంది.
  • కేంద్ర ప్రభుత్వ పథకాలతో మిళితం చేసి ఆయా జిల్లాల్లో ఆ పంటల సాగును ప్రోత్సహిస్తారు.
  • ఈ విధానంతో రైతులకు మేలు కలుగుతుందని, పంట ఉత్పత్తులకు తగిన విలువను జోడించి ఎగుమతులు పెంచుకోవడానికి వీలవుతుందని వ్యవసాయ శాఖ అభిప్రాయపడింది.
  • పంట విలువను పెంచడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచడమే ఈ విధానం లక్ష్యమని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రం (TELANGANA STATE) :

  • తెలంగాణ లోని 33 జిల్లాల్లో 12 పంటలపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
  • అత్యధికంగా 6 జిల్లాల్లో మిర్చి, 4 జిల్లాల్లో తినడానికి సిద్ధంగా ఉండే స్నాక్స్ (READY TO EAT SNACKS), మూడేసి జిల్లాల్లో సోయాబీన్, మామిడి, వరి, వేరుశెనగ, పాల ఆధారిత ఉత్పత్తులు, కూరగాయలు పండించాలని పేర్కొంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి