ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, ఆగస్టు 2020, సోమవారం

ECI GUIDELINES COVID-19 PANDEMIC

భారత ఎన్నికల సంఘం-మార్గదర్శకాలు-కొవిడ్-19 మహమ్మారి

(ELECTION COMMISSION of INDIA-GUIDELINES-COVID-19 PANDEMIC)


  • 'కరోనా' నేపథ్యంలో దేశంలో నిర్వహించే ఉప, సాధారణ ఎన్నికల కోసం 'కేంద్ర ఎన్నికల సంఘం' (ELECTION COMMISSION of INDIA) 2020 ఆగస్ట్ 21 న మార్గదర్శకాలు (Guidelines) జారీ చేసింది.
  • అభ్యర్థులు, ప్రచారంలో పాల్గొనే వ్యక్తులు, పోలింగ్ అధికారులు పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించింది.
  • 'కరోనా' నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి 2020 జూలై 29 న కేంద్ర హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాలు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలకు లోబడి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

పోటీ చేసే అభ్యర్థులు (CANDIDATES) :

  1. అభ్యర్థులు నామినేషన్ల కార్యక్రమానికి రెండుకి మించి వాహనాల్ని వినియోగించరాదు. ఇద్దరే హాజరు కావాలి.
  2. సెక్యూరిటీ డిపాజిట్ (Security deposit) ఆన్ లైన్ (Online) లో చెల్లించాలి.
  3. నామినేషన్ పత్రం, అఫిడవిట్ ను ఆన్ లైన్ (Online) లో భర్తీ చేసే ఐచ్చికాన్ని ఇచ్చారు. తర్వాత దాన్ని ప్రింటవుట్ (Printout) తీసుకుని నోటరీ (Notary) చేయించి రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించాలి.
  4. ఇంటింటి ప్రచారంలో అభ్యర్థి సహా ఐదుగురికి మించి పాల్గొనకూడదు.
  5. రోడ్ షోల్లో (Road Shows) భద్రతా సిబ్బంది వాహనం సహా 5 (FIVE) వాహనాలనే అనుమతిస్తారు. కొంత వ్యవధి తర్వాత మరో 5 వాహనాలు వెళ్లవచ్చు.

అధికారులు (OFFICERS) :

  1. జిల్లా అధికారులు ముందుగానే బహిరంగ సభల ప్రదేశాలను గుర్తించి వాటికి వేర్వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు (Separate Entrance and Exit ways) ఏర్పాటు చేయాలి.
  2. సభా ప్రాంగణాల్లో భౌతిక దూరం పాటించేలా సూచీలు ఏర్పాటు చేయాలి.
  3. ఎన్నికల ప్రక్రియలో అవసరమైన అన్నిచోట్లా 'మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్లు, చేతి తొడుగులు, ఫేస్ షీల్డ్ లు, పీపీఈ కిట్లు (Mask, Sanitizer, Thermal Scanners, Hand Gloves, Face Shields, PPE Kits) ఉపయోగించాలి.
  4. ఇదివరకు ఒక పోలింగ్ బూత్ (Polling Booth) కు గరిష్ఠంగా 1500 ఓటర్లను కేటాయించేవారు. ఇప్పుడు గరిష్ఠంగా 1000 మంది ఓటర్లకు ఒక్కో పోలింగ్ బూత్ (Polling Booth) ఉండేలా చూస్తారు.
  5. పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీన్ పరికరాలు అమర్చాలి.
  6. ఓటర్ల శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా ఉంటే వారికి టోకెన్లు (Tokens) జారీ చేసి పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటు వేసేందుకు అనుమతించాలి.


ఓటర్లు (VOTERS) :

  1. ఓటర్ రిజిస్టర్ (Voter Register) లో సంతకం చేసేందుకు, ఈవీఎం (EVM ⇒ Electronic Voting Machine) మీట నొక్కేందుకు గాను ఓటర్లందరికీ చేతి తొడుగులు అందజేస్తారు.
  2. 'కరోనా' ఉన్న ఓటర్లు, క్వారంటైన్ (QUARANTINE) లో ఉన్న వ్యక్తులను పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటింగ్ కు అనుమతిస్తారు. ఆ సమయంలో వైద్య అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.

పోస్టల్ బ్యాలెట్లు (POSTAL BALLOTS) :

  1. వయోధికులు, దివ్యాంగులతో పాటు 'కరోనా' సోకిన, సోకిందన్న అనుమానంతో క్వారంటైన్ (QUARANTINE) లో ఉన్న వ్యక్తులకూ 'పోస్టల్ బ్యాలెట్' (Postal Ballot) సదుపాయం కల్పించనున్నారు.
  2. 'పోస్టల్ బ్యాలెట్' (Postal Ballot) సదుపాయాన్ని కోరుతున్న వ్యక్తులు అభ్యర్ధన పత్రాన్ని నింపాల్సి ఉంటుంది.
  3. అధికారులు బ్యాలెట్ పత్రాన్ని ఓటర్లు ఉంటున్న చోటుకే తీసుకొస్తారు. ఓటు వేసే ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తారు.

నిబంధనల అమలుపై నిఘా :

  1. జిల్లాల్లో అధికారులు అన్నిచోట్లా 'కొవిడ్-19' (COVID-19) నియంత్రణ నిబంధనలు అమలు చేస్తున్నారా ? లేదా ? అని చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక 'నోడల్ హెల్త్ ఆఫీసర్' (Nodal Health Officer) ను నియమిస్తారు.
  2. 'రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ' (SDMA ⇒ State Disaster Management Authority) నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ మంది గుమికూడకుండా జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
  3. 'కొవిడ్-19' (COVID-19) నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై 'ప్రకృతి వైపరీత్య నియంత్రణ చట్టం-2005' లోని సెక్షన్ 51-60 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి.

లెక్కింపు కేంద్రాలు (COUNTING CENTRES) :

  1. ప్రతి చోటా సాధ్యమైనంత పెద్ద హాళ్లను ఉపయోగించుకోవాలి.
  2. ఒక్కో లెక్కింపు కేంద్రంలో 7 టేబుళ్లకు మించి ఏర్పాటు చేయకూడదు. ఎక్కువ అవసరమైతే అదనంగా హాళ్లను తీసుకొని, సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది.
  3. అన్ని హాళ్లు, రూముల్లోకి ప్రవేశించే వారిని థర్మల్ స్క్రీనింగ్ చేసి చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్, సబ్బు అందుబాటులో ఉంచాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి