ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, జులై 2020, సోమవారం

GK TEST-55

1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు' (MSME⇒ MICRO, SMALL and MEDIUM ENTERPRISES) కు ప్రకటించిన రూ. 1,110 కోట్ల "రీస్టార్ట్" (ReSTART) ప్యాకేజీ లో భాగంగా, ప్రభుత్వ విభాగాల్లో వినియోగించే 360 రకాల వస్తువుల్లో ... ఎంత శాతం కచ్చితంగా (MSME) ల నుంచే కొనుగోలు చేయాలి ?
(ఎ) 25%
(బి) 30%
(సి) 35%
(డి) 40%

2. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీట నొక్కి ... 10,641 "వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు" (RBK ⇒ RAITU BHAROSA KENDRA) ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2020 మే 28
(బి) 2020 మే 29
(సి) 2020 మే 30
(డి) 2020 మే 31

3. మనదేశ ప్రస్తుత 'జాతీయ భద్రతా సలహాదారు' ?
(ఎ) సుభాష్ గార్గ్
(బి) జై శంకర్
(సి) జి.సతీష్ రెడ్డి
(డి) అజిత్ డోభాల్

4. 'జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు' (NABARD) నూతన చైర్మన్ గా 2020 మే 27 న బాధ్యతలు స్వీకరించిన తెలుగు వ్యక్తి ?
(ఎ) పుట్టా లక్ష్మీనారాయణ
(బి) చింతల గోవిందరాజులు
(సి) దువ్వూరి సుబ్బారావు
(డి) సర్రాజు రాయవరపు



5. భారత్ లోని "కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్" లను తమ దేశానికి చెందినవిగా చూపిస్తూ నూతన రాజకీయ చిత్రపటాన్ని రూపొందించిన మన పొరుగు దేశం ?
(ఎ) నేపాల్
(బి) భూటాన్
(సి) చైనా
(డి) మయన్మార్

6. 'ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్' పూర్తిస్థాయి సభ్యులకు నెలకు ఎంత వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? (నెలకు రూ. 40 వేల ఇంటి అద్దె కూడా ఇస్తారు. తాత్కాలిక సభ్యులు సమావేశాలకు హాజరైతే రూ. 5 వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు)
(ఎ) రూ 1.25 లక్షలు
(బి) రూ 1.50 లక్షలు
(సి) రూ 1.75 లక్షలు
(డి) రూ 2.00 లక్షలు

7. బియ్యం రేషను కార్డు కలిగిన వారికి ప్రత్యేకంగా ఆదాయ ధ్రువపత్రం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ?
(ఎ) 2020 జూలై 25
(బి) 2020 జూలై 24
(సి) 2020 జూలై 23
(డి) 2020 జూలై 22

8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కార్డు లేనివారు తీసుకొనే 'ఆదాయ ధ్రువపత్రం' కాలపరిమితి ఏడాది నుంచి ఎన్నేళ్ల వరకు పొడిగించారు ?
(ఎ) 2 సంవత్సరాలు
(బి) 3 సంవత్సరాలు
(సి) 4 సంవత్సరాలు
(డి) 5 సంవత్సరాలు

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, పాఠశాలలు పునః ప్రారంభం కానున్న తేదీ ?
(ఎ) 2020 ఆగస్టు 5
(బి) 2020 సెప్టెంబర్ 5
(సి) 2020 అక్టోబర్ 5
(డి) 2020 నవంబర్ 5



10. 'అయోధ్య' లో 2020 ఆగస్టు 5 న ప్రారంభం కానున్న రామమందిర నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనకు బీహార్ లోని 'గయా ధామ్' నుంచి తీసుకురానున్న వెండి ఇటుక బరువు ?
(ఎ) 1000 గ్రాములు
(బి) 1250 గ్రాములు
(సి) 1500 గ్రాములు
(డి) 1750 గ్రాములు


కీ (GK TEST-55 DATE : 2020 JULY 27)
1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) సి 7) ఎ 8) సి 9) బి 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com 

26, జులై 2020, ఆదివారం

ABOUT WWW.GKBITSINTELUGU.BLOGSPOT.COM

About www.gkbitsintelugu.blogspot.com

The blog "www.gkbitsintelugu.blogspot.com" contains the information about general knowledge and current affairs in the form of multiple choice bits in the local language "TELUGU". Apart from this, this blog readers also get the information about 'Abbreviations, Tollfree numbers, New words and Miscellaneous Items'.

This blog helps the persons who prepare for competitive examinations. They can check their preparation by practicising the GK TESTS which are appeared in "GK TESTS" label (menu) of this blog.

All the best. By
www.gkbitsintelugu.blogspot.com

GK TEST-54

1. పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలలో "నాడు-నేడు" కార్యక్రమం ద్వారా ఎన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం అధికారులను ఆదేశించారు ?
(ఎ) 5
(బి) 10
(సి) 15
(డి) 20

2. 2018 ఆసియా క్రీడల్లో (జకార్తా) 4 x 400 మీటర్ల మిక్స్డ్ (MIXED) రిలే పరుగులో భారత జట్టు సాధించిన రజత పతకం బంగారమైంది. ఈ క్రీడల్లో మొదట స్వర్ణం గెలిచిన బృందంలోని ఓ అథ్లెట్ (కెమి అడెకోయ) డోపింగ్ లో పట్టుబడడంతో రెండో స్థానంలో నిలిచిన భారత్ కు ఆ పసిడి పతకం దక్కింది. డోపింగ్ అథ్లెట్ ఉన్న ఆ బృందం ఏ దేశానికి చెందినది ? (మొత్తమ్మీద జకార్తా (2018) ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 20. ఇందులో ఎనిమిది స్వర్ణాలు, తొమ్మిది రజతాలు ఉన్నాయి)
(ఎ) సౌదీ అరేబియా
(బి) కువైట్
(సి) ఖతార్
(డి) బహ్రెయిన్

3. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విలువ ఉన్న 50 కంపెనీల జాబితాలో తొలి ఐదు స్థానాలలో ఉన్న కంపెనీలు వరుసగా ... ? (స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం రూపొందించిన ఈ జాబితాలో భారత దేశానికి చెందిన 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' (RIL) 48 వ స్థానంలో నిలిచింది)
(ఎ) ఆపిల్, మైక్రోసాఫ్ట్, సౌదీ అరాంకో, ఆల్ఫాబెట్, అమెజాన్
(బి) మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఆపిల్, సౌదీ అరాంకో
(సి) అమెజాన్, సౌదీ అరాంకో, ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్
(డి) సౌదీ అరాంకో, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్

4. రూ. 3,054 కోట్ల వ్యయంతో తలపెట్టిన నీటి సరఫరా ప్రాజెక్ట్ కు దిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 జూలై 23 న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ను ఏ రాష్ట్రంలో చేపడుతున్నారు ?
(ఎ) మేఘాలయ
(బి) మణిపూర్
(సి) మిజోరాం
(డి) త్రిపుర

5. "మంగళ్ యాన్" ఉపగ్రహాన్ని విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టడంద్వారా ఆ ఘనతను సాధించిన తొలి ఆసియా దేశంగా భారత్ అవతరించింది. ఈ ప్రయోగం జరిగిన సంవత్సరం ?
(ఎ) 2011
(బి) 2014
(సి) 2017
(డి) 2019



6. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం నడుస్తున్న కృష్ణా జల వివాదానికి సంబంధించిన తుది నివేదికను సమర్పించేందుకు 'కృష్ణా ట్రైబ్యునల్' కు 2021 ఆగస్టు వరకు సమయం ఇచ్చింది. దీంతో ఈ ట్రైబ్యునల్ కాలపరిమితి ఎన్నిసార్లు పొడిగించినట్లయింది ?
(ఎ) 5 సార్లు
(బి) 10 సార్లు
(సి) 15 సార్లు
(డి) 20 సార్లు

7. అంగారకుడి మీదకు చైనా తొలిసారిగా "తియాన్వేన్ - 1" అనే వ్యోమనౌక ను 'లాంగ్ మార్చ్ - 5' రాకెట్ ద్వారా 'ఆర్బిటర్, ల్యాండర్, రోవర్' లను విజయవంతంగా ప్రయోగించిన తేదీ ? (తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహం వద్దకు "ఆర్బిటర్, ల్యాండర్, రోవర్" లను పంపడం ఇదే మొదటిసారి)
(ఎ) 2020 జూలై 21
(బి) 2020 జూలై 22
(సి) 2020 జూలై 23
(డి) 2020 జూలై 24

8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని "అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్లు" కు రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ఎప్పుడు విడుదల చేశారు ?
(ఎ) 2020 మే 26
(బి) 2020 మే 27
(సి) 2020 మే 28
(డి) 2020 మే 29

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర "పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్' ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) జస్టిస్ కాంతారావు
(బి) జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్
(సి) జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ
(డి) జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి

10. భూటాన్ లోని 'డోక్లామ్' లో 73 రోజులపాటు భారత్, చైనాల మధ్య "సైనిక ప్రతిష్ఠంభన" జరిగిన సంవత్సరం ? (అయితే రాజకీయ, దౌత్య చర్చల ద్వారా ఈ వివాదం పరిష్కారమైంది)
(ఎ) 2014
(బి) 2015
(సి) 2016
(డి) 2017



కీ (GK TEST-54 DATE : 2020 JULY 26)
1) బి 2) డి 3) డి 4) బి 5) బి 6) సి 7) సి 8) ఎ 9) ఎ 10) డి

All the best by www.gkbitsintelugu.blogspot.com 

25, జులై 2020, శనివారం

GK TEST-53

1. మనదేశంలో 2020 అక్టోబర్ చివరి నాటికి మొత్తం 'కరోనా' (CORONA) కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుందని తన నేతృత్వాన చేపట్టిన అధ్యయనం ద్వారా పేర్కొన్న 'జాదవపూర్ యూనివర్సిటీ' ప్రొఫెసర్ ? (2020 మే 22 నాటికి మనదేశంలో నమోదైన మొత్తం 'కరోనా' (CORONA) కేసుల సంఖ్య : 1,18,447)
(ఎ) టి. హరినారాయణ
(బి) నందదులాల్ బైరాగీ
(సి) రేణు ఖాటోర్
(డి) ఎస్.ఎస్.వాసన్

2. ప్రస్తుతం చైనాలో ప్రత్యేక పాలనా వ్యవస్థగా ఉన్న "హాంకాంగ్" (HONG KONG) ఏ సంవత్సరంలో బ్రిటన్ నుంచి చైనా అధీనంలోకి వచ్చింది ?
(ఎ) 2007
(బి) 1987
(సి) 1967
(డి) 1997

3. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) కార్యనిర్వాహక మండలి చైర్మన్ గా భారతదేశ ఆరోగ్య శాఖా మంత్రి "హర్షవర్ధన్" ఏ రోజున బాధ్యతలు చేపట్టారు ?
(ఎ) 2020 మే 22
(బి) 2020 మే 23
(సి) 2020 మే 21
(డి) 2020 మే 24

4. 'కరోనా' (CORONA) లాక్ డౌన్ ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2020-21) లో "జీడీపీ" (GDP ⇒ GROSS DOMESTIC PRODUCT) ప్రతికూలంగా నమోదు కావొచ్చని 'ఆర్బీఐ' (RBI) తొలిసారిగా అధికారికంగా తన అంచనాలను ఏ రోజున వెలువరించింది ?
(ఎ) 2020 మే 20
(బి) 2020 మే 21
(సి) 2020 మే 22
(డి) 2020 మే 23



5. కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం మనదేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో తొలి అయిదు స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వరుసగా ... ? (ఆయా రాష్ట్రాల ఉత్పత్తి (శాతాలలో) వరుసగా : 19.1%, 18.2%, 13.2%, 8.3%, 5.9%)
(ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హరియాణా, పశ్చిమబెంగాల్
(బి) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్, హరియాణా
(సి) తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, హరియాణా
(డి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, హరియాణా

6. 2020 జూలై 22 న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని "గాజులపేట" వద్ద జరిగిన 71 వ వనమహోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' రెండు మొక్కలను కలిపి నాటారు. ఆ మొక్కల పేర్లు ?
(ఎ) నేరేడు, చింత
(బి) మర్రి, కానుగ
(సి) రావి, వేప
(డి) ఎర్రచందనం, వెదురు

7. "వ్యాపార సంస్థల సామాజిక బాధ్యత" (CSR ⇒ CORPORATE SOCIAL RESPONSIBILITY) ను మొట్టమొదటగా చట్టబద్ధం చేసిన దేశం ? ('హోవార్డ్ బౌర్' అనే అమెరికన్ ఆర్థికవేత్త మొదటిసారిగా 1953లో 'వ్యాపార సంస్థల సామాజిక బాధ్యత' అనే భావనను వెలుగులోకి తెచ్చారు)
(ఎ) భారత్
(బి) అమెరికా
(సి) ఫ్రాన్స్
(డి) బ్రిటన్

8. 1990-2015 సంవత్సరాల మధ్య వైద్యసేవల గతిరీతుల ప్రాతిపదికన జరిగిన అంతర్జాతీయ అధ్యయనంలో 'భారత్' ర్యాంక్ ? (ఈ అధ్యయనంలో చైనా : 48, శ్రీలంక : 71, బంగ్లాదేశ్ : 133 ర్యాంకులను సాధించాయి)
(ఎ) 155
(బి) 154
(సి) 153
(డి) 152



9. 'లోధా కమిటీ' సూచనల మేరకు రూపొందించిన "బీసీసీఐ" (BCCI) కొత్త రాజ్యాంగం ప్రకారం ఒక ఆఫీస్ బేరర్ (బీసీసీఐలో లేదా రాష్ట్ర సంఘంలో లేదా రెండింటిలో కలిపి) పర్యాయానికి మూడేళ్ల చొప్పున వరుసగా రెండు పర్యాయాలకు మించి పదవిలో ఉండడానికి వీల్లేదు. ఆరేళ్లు పదవిలో ఉన్న తర్వాత ఎన్నేళ్ల విరామం తప్పనిసరి ?
(ఎ) 1 సంవత్సరం
(బి) 2 సంవత్సరాలు
(సి) 3 సంవత్సరాలు
(డి) 4 సంవత్సరాలు

10. 'ఆరోగ్య ఆసరా' పథకం కింద ప్రసవం కాగానే మహిళలకు ఎంత మొత్తం చొప్పున సాయం అందించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2020 జూలై 23 న అధికారులను ఆదేశించారు ?
(ఎ) రూ. 1,000
(బి) రూ. 3,000
(సి) రూ. 5,000
(డి) రూ. 7,000     


కీ (GK TEST-53 DATE : 2020 JULY 25)
1) బి 2) డి 3) ఎ 4) సి 5) బి 6) సి 7) ఎ 8) బి 9) సి 10) సి

All the best by www.gkbitsintelugu.blogspot.com

23, జులై 2020, గురువారం

GK TEST-52

1. "జగమంతా వనం ... ఆరోగ్యంతో మనం" అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జూలై 22 న నిర్వహించిన వన మహోత్సవం ఎన్నవది ?
(ఎ) 71
(బి) 72
(సి) 73
(డి) 74

2. మనదేశంలో పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెయిరీ రంగ అభివృద్ధిపై 'ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య', అమూల్ (AMUL) సంస్థల మధ్య రాష్ట్ర సీఎం సమక్షంలో ఒప్పందం కుదిరిన తేదీ ?
(ఎ) 2020 జూలై 20
(బి) 2020 జూలై 21
(సి) 2020 జూలై 22
(డి) 2020 జూలై 23

4. ఏ తేదీని "అంతర్జాతీయ చెస్ దినోత్సవం" గా ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రకటించింది ? (1924 వ సంవత్సరంలో 'అంతర్జాతీయ చెస్ సమాఖ్య' (FIDE) ఏర్పడింది. 'ఫిడే' (FIDE) ఆవిర్భావ తేదీని 'అంతర్జాతీయ చెస్ దినోత్సవం' గా ఐరాస 2019 లో ప్రకటించింది)
(ఎ) జూలై 20
(బి) జూలై 21
(సి) జూలై 22
(డి) జూలై 23



5. భారతదేశం గర్వించే గణిత శాస్త్రవేత్త, హ్యూమన్ కంప్యూటర్ గా పేరుగాంచిన శకుంతలాదేవి జీవితకథతో తీసిన "శకుంతలాదేవి" చిత్రంలో కీలక పాత్రధారి ?
(ఎ) రాధికా ఆప్టే
(బి) కీర్తి సురేష్
(సి) ప్రియమణి
(డి) విద్యాబాలన్

6. మనదేశంలో 'కరోనా' చికిత్స కోసం 'సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు' ప్రవేశపెట్టిన "కరోనా కవచ్" (CORONA KAVACH) బీమా పాలసీ ఏ తేదీ నుండి అందుబాటులోకి వచ్చింది ? (కనీసం రూ. 50 వేల నుంచి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకూ ఈ పాలసీ ని తీసుకోవచ్చు)
(ఎ) 2020 జూన్ 10
(బి) 2020 జూలై 10
(సి) 2020 ఏప్రిల్ 10
(డి) 2020 మే 10

7. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో దిగ్గజ నేతగా వెలుగొందిన "లాల్జీ టాండన్" 2020 జూలై 21 న అనారోగ్యంతో కన్నుమూశారు. అతను మరణించే ముందు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసారు ?
(ఎ) మధ్యప్రదేశ్
(బి) రాజస్థాన్
(సి) ఉత్తరప్రదేశ్
(డి) హిమాచల్ ప్రదేశ్

8. కడప లో 'వైఎస్సార్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో దివ్యాంగులైన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న పాఠశాల పేరు ?
(ఎ) స్పూర్థి
(బి) భారతి
(సి) సరస్వతి
(డి) విజేత

9. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు ప్రస్తుతమున్న 'జిల్లా విద్యాధికారి' (DEO ⇒ DISTRICT EDUCATION OFFICER) పోస్టుల స్థాయిని ఏ స్థాయికి పెంచుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి 'ఆదిమూలపు సురేష్' తెలిపారు ?
(ఎ) సంయుక్త సంచాలకులు
(బి) సంచాలకులు
(సి) ప్రాంతీయ సంచాలకులు
(డి) జిల్లా విద్యా సంచాలకులు

10. 'వినియోగదారుల హక్కుల చట్టం - 1986' స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన "వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం - 2019" (THE CONSUMER PROTECTION ACT, 2019) ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది ?
(ఎ) 2020 జూలై 20
(బి) 2020 జూలై 21
(సి) 2020 జూలై 22
(డి) 2020 జూలై 23 


కీ (GK TEST-52 DATE : 2020 JULY 23)
1) ఎ 2) డి 3) బి 4) ఎ 5) డి 6) బి 7) ఎ 8) డి 9) ఎ 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com